ఇల్లాలు
పొద్దు పొడిస్తే బ్రతుకంతా రణరంగమే కళ్ళు తెరిచి పద్మవ్యూహములో జొరపడి వీరంగం చేయడమే ఆమె విథి నిర్వహణ బరువులు బాధ్యతలు తెచ్చి పెట్టుకున్న బంధాలు విధాత రాసిన కర్మలు ఏ ఒక్కటి ఊపిరి పీల్చుకోనివ్వవు ఒక్క క్షణం. అందరూ పల్లకి ఎక్కి కూర్చుని బోయిలు ఎవరంటే భుజాలు తడుపుకుంటారు. జరిగిన తప్పులకు జవాబుదారిని చేస్తారు ఉరిమే చూపులతో ప్రశ్నిస్తారు. అందరికీ ఆదివారం సెలవు మరి ఆమెకి రోజు ఉండే ఒక క్షణం విరామానికి ఆరోజు సెలవు. ఎన్నెన్నో ప్రణాళికలు ఎన్నెన్నో పూజలు కనిపించని దేవుళ్ళు అందరికీ మ్రొక్కులు ఆమె కోరిక ఒక్కటే ఆ కుటుంబ క్షేమం ఇలా అలసి సొలసి ఆలోచనతో మస్తిష్కం వేడెక్కి రక్తం మరిగి మరిగి గుండె బెదిరి ఆ నిర్జీవమైన కళ్ళు తీరని బాధ్యతలను చూస్తూ ఆ క్షణంలో కూడా బాధ్యతను మరిచిపోని మహా ఇల్లాలు. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279