పోస్ట్‌లు

చిత్తూరు జిల్లా విహారయాత్ర

చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక సాంస్కృతిక, ప్రకృతి సౌందర్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడి విహారయాత్రకు అనేక ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ముఖ్యమైనవి: 🛕 ఆధ్యాత్మిక ప్రదేశాలు కాణిపాకం వినాయక ఆలయం : శ్రీకాళహస్తి దేవాలయం : గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం : తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం 🌿 ప్రకృతి అందాలు కైగల్ జలపాతం : కైలాసకోన జలపాతం : తలకోన : 🏞️ అడవులు మరియు అభయారణ్యాలు శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం : కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం : 🏰 చారిత్రాత్మక ప్రదేశాలు గుర్రంకొండ కోట : చంద్రగిరి కోట : 🏕️ విహారయాత్రలు తిరుపతి అనేది ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాలో ఉండే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు: తిరుపతి గురించి ముఖ్య విషయాలు: శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి గల హిందూ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం శ్రీ వేంకటేశ్వరుడికి (లార్డ్ వెంకటేశ్వర, అంటే వేంకటేశ్వర స్వామి) అంకితం. వేదక...

స్త్రీ

 స్త్రీ  పోరాటమే ఆమె ప్రాణవాయువు ప్రేమే ఆమె ఆభరణం ముళ్ల దారిలో నడిచినప్పటికీ స్వర్గపు సీమలో కలల పయనం ఆమెదే ఆమెను చూసి త్యాగం తలవంచుకుంది సహనం చేతులు జోడించి నమస్కరించింది స్వార్థం నిశ్శబ్దంగా నిలబడిపోయింది ఆ ఇంటి వెలుగు చూసి దీపం మురిసిపోయింది ఆమెను చూసి భూమాత "నా బిడ్డ" అని ముద్దు పెట్టుకుంది :  ప్రాణికోటి అంతటికి నేను, ఆ గూడుకి ఆమే ఊపిరి  అంటూ ఉప్పొంగిపోయాడు వాయువు నేను నిత్యం ప్రతి ఇంట్లో ఒక అతిధిని  అతిధి మర్యాదలో ఆమెకు  ఆమె సాటి అంటాడు అగ్ని  వేసవిలో పన్నీటి జల్లులా అనునిత్యం ప్రేమ జల్లు కురిపిస్తుంది  అంటాడు వర్షాలదేవుడు.  ఆకాశమంత విశాలమైన మనసు  ఆదరణలో ఆకాశమే హద్దు.  అంటుంది ఆకాశం. అందం లో నాతో పోటీ పడుతోంది  అంటాడు చందమామ. అవసరమైతే నాలాగే చమటలు పట్టిస్తుంది. అంటాడు వేసవి సూర్యుడు. ఆమెకు ఎవరూ లేరు సాటి  నా సృష్టి అంత గొప్పది అంటాడు  బ్రహ్మ. ఎవరు ఎన్ని చెప్పినా  కట్టుకున్న వాడు గుండె లోతుల్లోంచి  వచ్చిన మాటకు ఆమె ఉప్పొంగిపోతుంది. పరవశించిపోతుంది  అది ఆడజన్మంటే రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు...

ఆ ముగ్గురు

ఆ ముగ్గురు క్షణం తీరికలేని మనిషి జీవితానికి తలుపు తట్టి సహాయం అందించే అపర త్రిమూర్తులు. మూల్యం చెల్లించిన మరిచిపోలేని సహాయం. ఎండైనా వానైనా వరదైనా క్రమం తప్పకుండా ఆ సమయానికి గుమ్మం లో నుంచి పిలుపు పాల బుగ్గల పసివాడు మొదలు పండు ముదుసలి వరకు ఆ పిలుపు కోసమే ఎదురు చూపు. ఇంతకీ ఆ పిలుపు పిలిచేది ఎవరు ఇంకెవరు అపర గోపాలుడు మన పాలవాడు. లేచింది మొదలు కాఫీ చుక్క కోసం పడిగాపులు. ఆ చుక్కతోనే మొదలవుతాయి మన పరుగులు. ఆధునిక మహిళ ప్రతినిత్యం చేస్తోంది బ్రతుకుతో అష్టావధానం.పనిలో సహాయం లేనిదే నడవదు గృహిణి బ్రతుకు.ఆ మనిషిని చూడగానే గృహిణి కళ్ళల్లో కొండంత వెలుగు. విటమిన్లన్నీ గంపలో గుమ్మం దగ్గరికి తెచ్చి  అమ్మగారికి భారం తగ్గించేది కూరలమ్మి తాజా కూరలతో బలం పెంచే ఆరోగ్య ప్రదాయిని. సమయానికి తెచ్చి సమయం లేని ఆధునిక మహిళకి కొండంత సహాయం చేసేది ఆకుకూరల అమ్మాయి. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు          కాకినాడ 9491792279.