పోస్ట్‌లు

తలరాత

తలరాత ఉదయం నుంచి వర్షం భారీగా కురుస్తోంది. జనజీవనం అంతా  అస్తవ్యస్తo అయిపోయింది. రోడ్డుమీద ఒకరు కూడా  తిరగటం లేదు. ఉన్నట్టుండి వీధి గుమ్మo లోనుంచి అమ్మా  ఇంత అన్నం ఉంటే పెట్టండి చలిగా ఉంది ఒక పాత బట్ట   ఇవ్వండి అంటూ దీనంగా ఒక వృద్ధురాలి అరుపువినిపించింది.  ఇంత వర్షంలో ఎవరు అబ్బా అనుకుంటూ సీతమ్మ గారు వీధి  గుమ్మంలోకి తొంగి చూసారు. ఒక చేతిలో కర్ర మరొక  చేతిలోగిన్నె పట్టుకుని చిరిగిపోయిన బట్టలతో ఒక వృద్ధురాలు వణికిపోతూ గుమ్మంలో నిలబడి ఉంది. ఈవిడ ఎవరో  ఎరుగున్న మనిషి లాగే ఉంది. ఎక్కడో చూసినట్టుగా ఉంది అని  మనసులో అనుకుంటూసీతమ్మ గారు అమ్మ మీరు వెనక వేపుకు పాకలోకి రండి. బట్టలు మార్చుకుని అన్నం తిందురు గాని వర్షం లో ఎలా తింటారు. పైగా బాగా తడిసిపోయి ఉన్నారు అంటూ పెట్టలోంచి పాత చీర జాకెట్లు తీసి ఆ  వృద్ధురాలికి ఇచ్చింది. ఆ వృద్ధురాలు బట్టలు మార్చుకునేలాగా గిన్నెలో వేడి వేడి అన్నం పప్పు కూర మజ్జిగ తో భోజనం  అరిటాకు వేసి వడ్డించింది. పాపం ఎన్ని రోజులైందో ఆ ముసలిది  అన్నం తిని ఆకులో అన్నం అంతా ఖాళీ చేసేసి అమ్మా ప్రాణం  ...

ఆఖరి మాట

ఆఖరి మాట  ప్రపంచంలో ఏ ప్రాణికోటికి లేని అత్యంత అమూల్యమైన వరం మానవ జన్మకి దేవుడిచ్చాడు. తన మనసులోని భావాన్ని ఇతరులకు తెలియజేయడానికి అవకాశం కల్పించాడు. దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా పంచుకోవడానికి మాట అనే ఆయుధాన్ని ఇచ్చాడు.  మానవ శరీరంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నోరు అనే అవయవం ద్వారా వచ్చే మాటకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మాట ఇద్దరు మనుషుల మనసులను కలుపుతుంది. అలాగే బంధాలను విడదీస్తుంది. రోజు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. అన్నిటికీ వెనుక బలమైన ఆధారం ఉంటే అది నిజం అంటారు. కాకపోతే అబద్ధమే కదా మరి. మనిషి శాశ్వతం కాదు కానీ మాట మటుకు ఎప్పటికీ గుర్తుంటుంది. రోజు అనేక మందితో అనేక మాటలు మాట్లాడుతుంటాము. అది ఆ వ్యక్తితో అదే ఆఖరి మాటని మనకు తెలీదు. ఆఖరి మాట అనేది ఎప్పుడవుతుంది. ఆ వ్యక్తి ఈ లోకo నుండి శాశ్వతంగా వెళ్ళిపోయినప్పుడు వారితో ఆఖరిసారిగా మాట్లాడినదే ఆఖరి మాటవుతుంది. కానీ మనకు అది తెలియదు. చుట్టూ ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. కానీ ఒక వ్యక్తి తోటే తన మనసులోని భావాన్ని పంచుకోవడం ఆ సమయంలో ఆ వ్యక్తి మీద ప్రత్యేక అభిమానమే అని చెప్పొచ్చు. అప్పుడే ఏడు సంవత్సరాలు పూర్తయింది. కానీ ఆ వ్యక్తి ఆఖరి ...

అలసిన అరుగులు

పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అరుగులు ఉండేవి ఈ ఆధునిక యుగంలో అరుగులు కనుమరుగైపోయాయి కానీ మా తరం వారికి అవి మాత్రం హంస తూలికా తల్పాలు.   తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం లో గల మా నాన్న గారి ఇంట్లో మెట్లుకి ఇరుపక్కల ద్వారపాలకులులా రెండు అరుగులు దానిని ఆనుకుని ఒక మెట్టు ఎత్తులో ఎర్ర గచ్చు తో చేసిన వసారా ఉంది. సుమారు 70సంవత్సరాల క్రితం మా నాన్నగారు శ్రీ మధునాపంతుల వెంకట చలపతి రావు గారి చేత నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం. చారిత్రాత్మక కట్టడం అని ఎందుకు అంటున్నాను అంటే ఎంతో మంది ఈ అరుగుమీద పుట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉన్నత స్థాయికి తమ తమ రంగాల్లో చేరుకోవడం జరిగి . తొలి రోజుల్లో మా ఇంటి మెట్లకిఎడమ పక్కన ఉండే గదిలో దాన్ని కొట్టు గది అంటాం పంచాయతీ బోర్డు వారి ఆఫీస్ ఉండేది. మా పిన తాతగారు శ్రీ మధునాపంతుల కామ రాజు గారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా పని చేసేవారు. నిత్యం ఎంతో మంది ప్రజలు పంచాయతీ బోర్డు ఆఫీస్ కి వచ్చి అరుగు మీద కూర్చునే వారు . ఎప్పుడు రెండు అరుగులమీద తాటాకులతో చేసిన చాపలు ఉండేవి. మా తాతగారు కి సంఘ సేవ మీద ఎక్కువ మక్కువ ఉండడం మూలంగా ప్రజల సమస్యల్ని అ...