పోస్ట్‌లు

యువత ఏమిటి నీ బాధ్యత

అంశం : యువత ఏమిటి మీ బాధ్యత రచన : మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు, కాకినాడ ఉప్పొంగే వయసు — పొంగే పాలలాంటి మనసు, కావలసినంత గుండెబలం — దేవుడిచ్చిన కండబలం, ప్రతి యువతకి దేవుడిచ్చిన వరం! కళ్లుతెరిచి చూస్తే — మనసుపెట్టి ఆలోచిస్తే, బాధ్యతల అడ్రస్సు దొరుకుతుంది. సంఘంలోకి తొంగిచూస్తే — సమస్యల సుడిగుండం కనబడుతుంది. ఇంట గెలిచి — కన్నవారి కన్నీళ్లు తుడిచినపుడు, తొలి బాధ్యత నెరవేరినట్టే. మత్తుకి చిత్తుకాక — మమతారాగాలు పంచినపుడు, బాధ్యత గల యువతకి — జనాలు ఇస్తారు కితాబు. అన్నమో రామచంద్రాయని అలమటించే అభాగ్యులకు పట్టెడు అన్నం పెట్టినపుడు — డొక్కా సీతమ్మగారి వారసులవుతారు యువత. అన్యాయాన్ని ఎదిరించి — అక్రమాలను నిలదీసి, ప్రశ్నించే ధైర్యం అలవర్చుకుంటే — ప్రతి యువతి, యువకుడు బాధ్యత గల పౌరులే. ఆశయసాధన కోసం పాటుపడి, "ఆరోగ్యమే మహాభాగ్యం" అని నమ్మి — ముందుకు సాగిపోవడమే యువత బాధ్యత! జ్ఞానం పట్ల ఆసక్తి — సేవ పట్ల నిబద్ధత, ఇవే నిజమైన యువతకు గుణములు కావాలి. నువ్వు చదివింది నిన్ను మార్చకపోతే, అదే చదువు సమాజాన్ని మార్చగలదా? ఉద్యోగం పొందిన వెంటనే — బాధ్యతలు పూర్తయినట్టా? కాదయ్యా! అది ఒక్క నిధానం మాత్రమే,...

ఆషాడ గోరింట_ అరచేతిలో కళ_గుండెలో కల

ఆషాడ గోరింట – అరచేతిలో కళ, గుండెలో కల "చందమామ రావే జాబిల్లి రావే" అంటూ ఎంత పిలిచినా చందమామ కిందికి దిగడు. కానీ ఆషాఢం వచ్చిన వెంటనే ఆకాశం నుంచి చుక్కల్ని తీసుకుని అతివల అరచేతిలోకి దిగుతుంది — ఎర్రటి సూర్యుడిలా మెరిసే చందమామగా! తెల్లటి పాలసముద్రంలాంటి అరచేతిలో, చుక్కల మధ్య ఎర్రటి మెరుపుతో మెరిసే గోరింట అద్భుతమయిన దృశ్యాన్ని సృష్టిస్తుంది. చేతి వేళ్ళకు బుట్టల్ని చుట్టేసే ఆ గోరింటాకు ఒక శిల్పంలా ఉంటుంది. ఇది కేవలం అలంకారం కాదు – ఇది సంబరం. ఇది స్త్రీల ఆత్మానందానికి ప్రతీక. ఆషాడం వచ్చినదంటే ఏ వీధి చూసినా, ఏ ఇల్లు చూసినా, అతివల చేతులు, పాదాలు గోరింట అందంతో మెరిసిపోతాయి. చిన్నారి నుండి పెద్దదాకా – ప్రతి స్త్రీ గుండెల్లో గోరింటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గోరింట (హెన్నా/మెహందీ) భారతీయ స్త్రీల జీవన విధానంలో ఒక అంతర్భాగం. శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా అలంకరించే ఇది — శుభానికి, శృంగారానికి, ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది ఒక కలల రంగు, ఒక ఆశల ఆకారం. ఆషాడం వచ్చిందంటే పక్కింటి వాళ్ల దగ్గరపడి అయినా చేతులపై గోరింట వేయించుకుంటారు అతివలు. తమ ప్రేమను, బంధాన్ని, శుభాశయాన్ని గోరింట ...

వేద వ్యాసుడు

వేదవ్యాసుడు హిందూ ధర్మంలో అత్యంత మహత్తరమైన ఋషులలో ఒకడు. ఇతడి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. ఇతడు వేదాలను పునఃసంఖ్యాన చేసి నాలుగు వేదాలుగా విభజించాడని చెప్పబడుతుంది. అందువల్ల ఇతడిని వేదవ్యాసుడు అని పిలుస్తారు – అంటే "వేదాలను విభజించినవాడు" 🌼 జననం మరియు పరిచయం వేదవ్యాసుడు పరాశర మహర్షి మరియు సత్యవతిదేవి పుత్రుడు. అతను కృష్ణవర్ణుడు కావడంతో “కృష్ణ ద్వైపాయనుడు” అన్న పేరుపడింది. ద్వైపాయన అనే పేరు అతను ద్వీపంలో (నదిదీవిలో) జన్మించిన కారణంగా వచ్చింది. 🌿 వేదవ్యాసుడి ముఖ్యమైన కర్తవ్యాలు 1. వేద విభజన: అప్పటివరకు ఒక్కటిగా ఉన్న వేద జ్ఞానాన్ని నాలుగు వేదాలుగా – రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం – విభజించి, వాటిని విశిష్ట శిష్యులకు ఉపదేశించాడు. తద్వారా సాధారణ ప్రజలకు వేదజ్ఞానం అందుబాటులోకి వచ్చింది 2. మహాభారత రచన: అతనే మహాభారత రచయిత. ఇది జ్ఞాన సాంప్రదాయానికి మహత్తర గ్రంథం. "ఇది పురాణసారమయం", అందుకే దీనిని "పంచమ వేదం" అని కూడా అంటారు. ఇతడు వేదవ్యాసుడు గానీ, రచనను వినిపించినవాడు గణపతిదేవుడు. వ్యాసుడు పారాయణ చేస్తూ, గణపతి గమనించేవాడు. 3. పురాణాల రచన: వేదవ్యాసుడు 18 మహా...