పల్లె
ఎటు పోతుంది పల్లె గమనం.
మానవ శక్తి మీద లేదు నమ్మకం
యంత్ర శక్తి మీదే సదా ఆధారం.
మనిషినే నమ్మలేని సమాజం.
పల్లె అంతా పట్టణంలో కాపురం.
పట్టెడు అన్నం పెట్టే పంటపొలాలే
పరదాలు కట్టిన రెండు అంతస్తుల భవంతులు.
ఎక్కడుంటాయి పంట గింజలు.
ఎలా బతుకుతాయి పక్షి జాతులు.
గదులన్ని కంపెనీ సంచులతో బియ్యం.
గాదులన్నీ మాసిన బట్టల కంపు.
గుమ్మ పాలు తాగే రైతుకు బొమ్మ పాలే గతి.
పశువులు కొట్టాలన్ని పాత సామాన్లుకి ఆతిథ్యం.
మురికిపట్టిన లేగ దూడల మువ్వల గంటలు.
మాయమైన మైసూర్ ఎడ్లు పరుగులు.
తుమ్మ నాగళ్ళు చూరు కింద చేరే
నాగలి చెక్కే వీరన్న బతుకు గుడిమెట్ల పాలు.
వరి దుబ్బు పీకలన్ని యంత్రమే నరికే
కొడవలి కోత మరిచి పాత ఇనప ముక్కగా మారే.
చెవులు కుట్టే చలమయ్య చెన్నై పట్నం జేరే.
కుట్లు లేక చంటి దాని చెవులు బోసి పోయే.
గుడ్డ తడిపి కుట్టే దర్జీ గూడూరు పోయే
రెడీగా దొరికే madelu వుతుకులో వెలవెలపోయే
వృద్ధ దంపతుల గూడు వెల్లలేక మాసిపోయే.
ఎల్లలు దాటి వెళ్లలేక గూడులోనే గువ్వలు మగ్గిపోయే.
ఆదరణ ఆప్యాయతలకు పెట్టింది పేరు పల్లెటూరు.
పల్లె జనం నోరు మరచి చరవాణిలో పలకరించే.
గుడిగంటలు దూరమయ్యే సెల్లు గంటలుతో పల్లె అంత
మ్రోగే.
విస్తరి తో విందులు చతురోక్తుల సంతర్పణలు
కరోనాతో కలగా మిగిలిపోయే.
టమోటాల మాట మరిచి jomato మీట నొక్కే పల్లెటూర్లు.
కూడు పెట్టని కులవృత్తులు కుండ పెంకులమ్మే షాపింగ్ మాల్.
పచ్చగా ముగ్గిన పండ్లు తిని పదికాలాలాయే.
గడ్డి కావులు జనం మరిచిపోయే.
మందు తాగి కాయలన్నీ పచ్చగా బజార్లో కనిపించే.
గోలి సోడా శబ్దాలు గాలికి ఎగిరిపోయే
రంగురంగుల సోడా గుండె మంట పుట్టించే.
కాశీ మజిలీ కథలు చెప్పే బామ్మ
రామాయణం చెప్పే తాత
పొద్దస్తమాను దృశ్య శ్రవనానికి అతుక్కుపోయే.
ఎక్కడి నుంచి వస్తుంది మనవలికి మంచి బుద్ధి.
అరుగుల మీద జనం ఉంటేనే ఇంటికి అందం.
జనం తోటే రచ్చబండ కి మరింత అందం.
మరి జనం ఎక్కడికి పోయారు.
టీవీ సీరియల్ కి అతుక్కుపోయారు.
పల్లె పట్టు పావడ లాంటి పచ్చదనం వదిలి.
నాగరికత బొట్టును అలంకరించుకుoది.
బాపు గారు బతుకుంటే మచ్చుకు ఒక బొమ్మ వేయించుకుని ముందు తరాల వాళ్ళకి చూపించేవాళ్ళం.
మన పల్లెటూరు అందం గొప్పతనం.
అయినా నా ఊరు అంటే నాకు చాలా ఇష్టం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి