పోస్ట్‌లు

మగ మహా రాజు

మగమహారాజు  ఇది మహా నటుడు నటించిన సినీమా కాదు. పుణ్యలోకానికి దారి చూపించే మగమహారాజుల గాథ ఆ కుటుంబం అంతటికీ రాజే.  ఆ గుండెల్లోనే ఉంటుంది చెప్పుకోలేని వ్యధ. ఈ మహారాజుకు రాజ్యాలు ఉండవు తలపై కిరీటాలు ఉండవు వంశ గౌరవాల బరువులు తప్ప. కుటుంబ బాధ్యతలబరువులకి అనుబంధాల ఆప్యాయతలకి జవాబుదారి ఈ మహారాజే. ఉరుకుల పరుగుల జీవితం. విరామం లేని పని ఒత్తిడి అలసి సొలసి ఇంటికి చేరినా తీర్చుకోవాల్సిన బాధ్యతల భయాలు.   భగీరథ ప్రయత్నం చేయాలి ఒక బాధ్యత తీరాలంటే. బరువులు ఒక పక్కకు నెట్టాలంటే. మధ్యతరగతి జీవితాలు  బడ్జెట్ బండి మీద బతుకు నడపాల్సిందే బండికి బ్రేకులు వేయకపోతే బతుకంతా నవ్వుల పాలు దానికి కూడా మగ మహారాజే ఇవ్వాలి జవాబు కళ్లెం వదిలితే గుర్రం తప్పటడుగులు వేస్తుంది అందుకే రౌతు కొద్దీ గుర్రం. మౌనంగా ఉన్న పురుష పుంగవుని మదిలో ఎన్ని అగ్నిజ్వాలలో. కట్టుకున్న భార్యకు తెలియదు రక్తం పంచుకుని పుట్టిన పిల్లలకు తెలియదు. ఆ మర్మం అంతా బయటపడేది వైద్యుడు దగ్గరే. కలలా కరిగిపోతుంది వయస్సు ఏ క్షణంలో పిలుపు వస్తుందో ఎవరికి తెలుసు.  ఇదే తరతరాల మగ జాతి చరిత్ర.  మార్పులేని మహత్తర జాతి చరిత్ర.....

దుస్తులు

దుస్తులు "  పుట్టినప్పుడు బట్ట కట్టలేదు.  పోయేటప్పుడు అది నీ వెంట రాదు." అన్నాడు ఒక సినీ కవి. అంటే ఈ మధ్యకాలంలో తన శరీర  భాగాలని బహిర్గతం చేయకుండా కాపాడుకోవడానికి దుస్తులు  ధరిస్తాడు మానవుడు. ధరించే దుస్తులు మానవుడికి సరికొత్త  అందాన్ని ఆనందాన్ని తీసుకొస్తాయి. మన సమాజంలో దుస్తులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మనం ధరించే దుస్తులు చలి నుండి ఎండ నుండి మన శరీరాన్ని కాపాడు తాయి. రోజు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఒక రకమైన ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. ఇది ఆఫీస్ వారి నియమ నిబంధనలో డ్రెస్ కోడ్ ఉంటుంది. దుస్తులు ధరించిన ఉద్యోగులు పలానా ఆఫీస్ వారని ప్రజలకు తెలుస్తుంది. ఈ డ్రెస్ కోడ్ గనక పెట్టకపోతే నైట్ డ్రెస్ లతో కూడా ఆఫీసులకు వచ్చే ప్రమాదం ఉంది. పదిమంది తిరిగే ఆఫీసులో అది సభ్యతగా ఉండదు. అది ఆ మనిషి గౌరవం తగ్గిస్తుంది. ఆ కార్యాలయానికి చెడ్డ పేరు వస్తుంది.  అలాగే స్కూల్లోనూ కాలేజీలోనూ చదివే పిల్లలకు అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించాలని నియమ నిబంధనలు ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలందరూ ఒక్కటే ధనిక పేద తేడా ఏమీ లేదని చెప్పడమే. ఆదిమానవుడు కూడా ఆకుల తోటి లతలతోటి తన శరీరాన్ని కప్పుకు...

పరమాత్మ

పరమాత్ముడు  పప్పు రుబ్బే రుబ్బురోలు పరమాత్ముడిని తలచి షోడశోపచార ములు చేసి పూజలు చేసే ఒక పడతి. ఆ పడతి కి వెఱ్ఱి యని ప్రజలు తలచే పరమాత్ముడు ఎందైన కలడని పోతన చెప్పె. భవన స్తoభము నుండి నరసింహుడు అవతరించి ప్రహ్లాదుని రక్షించే. దశావతారములు ఎత్తి విష్ణువు భక్తులను రక్షించే. రహదారి పక్కన తాడిచెట్టుని అమ్మగా తలచి పసుపు కుంకుమలు పూసే మానవుడు. పుణ్యమని దలచి వే ప కి రావికి కల్యాణం జరిపించే. మూగ జీవిని వెంకటేశ్వరుడని తలచి అచ్చు వేసి రహదారిలోకి విడిచే . వానరం కనపడగానే వంగి వందనము చేసి హనుమగా తలిచే. దీనులలోనే కనబడింది దైవం మదర్ తెరిసా కి మానవసేవే మాధవసేవ అని నమ్మింది రామకృష్ణ పరమహంస. మనసుపెట్టి చూస్తే ప్రతి ప్రాణిలోనూ ఉంది దైవం. ఆ మనసు పేరే మానవత్వం. మనసు మెచ్చే పని చేయడమే మనిషి లక్షణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279