పోస్ట్‌లు

ఊర్మిళాదేవి

ఊర్మిళాదేవి ఒక్క పక్షి మరణం ఒక ఆదర్శప్రాయమైన సీతారాముల కథను లోకానికి తెలియజేయడానికి అవకాశం కల్పించింది. ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దాడు. సీతారాములే కాకుండా భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా లోకానికి ఆదర్శప్రాయులు ఎలా అయ్యారు అన్నది మనకి తెలియజేశాడు ఆ మహర్షి.  ఈ శ్రీరాముడు కథలో అన్ని పాత్రలు కూడా ఆదర్శ పాత్రలే. ఏకపత్నివృత్రుడుగా తండ్రి మాట జవదాటని వ్యక్తిగా శ్రీరామచంద్రుడు మనకి కనపడతాడు. భాతృ ప్రేమలో లక్ష్మణుడు భరతుడు లోకానికి ఆదర్శప్రాయలుగా కనిపిస్తారు. లోకంలో ఆదర్శవంతమైన భార్యగా సీతాదేవి నిలిచిపోయింది. రామ బంటుగా హనుమ, స్నేహితుడుగా సుగ్రీవుడు, సేవకుడుగా గుహూడు ఇలా ఎన్నో పాత్రలు జాతి గుండెలో చిరస్థాయిగా నిలబెట్టింది రామాయణం. అయితే మరొక్క పాత్ర లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి పాత్ర కూడా చెప్పుకోదగినది.  వాల్మీకి చేత రచించబడిన శ్రీమద్రామాయణంలో ఊర్మిళాదేవి గురించి చాలా తక్కువగా చెప్పినప్పటికీ ఆమె పాత్ర కూడా చాలా గొప్పదని చెప్పడంలో సందేహం లేదు.  ఊర్మిళాదేవి జనకమహారాజు తమ్ముడైన కుశ ధ్వజడు కుమార్తె. కుశధ్వజుడు విద్యానగరమును పరిపాలిస్తూ ఉ...

జై వీర హనుమాన్

జై వీర హనుమాన్. ఆంజనేయస్వామి సర్వమానవ ఆరాధ్య దైవం. రామ బంటుగా రామ భక్తుడిగా, అసాధ్యకార్యసాధకుడుగా, రాక్షస సంహారిగా మన మనసులో నిలిచిపోయిన దైవం.  భారతదేశంలో ఏ గ్రామం చూసిన ఏ రహదారి చూసిన స్వామి విగ్రహం లేని చోటు ఉండదు. దేవాలయంలో ఆంజనేయ స్వామిని చూసిన రహదారి పక్కనున్న విగ్రహాలు చూసిన ఒక రకమైన ఉత్తేజం ధైర్యం కలుగుతుంది. బహుశా ఆయన రూపం చూసి భయం తొలుగుతుంది. విశాలమైన వక్షస్థలం పొడవైన కాళ్లు చేతులు చేతిలో గధ వానర ముఖం వానరులకుండే ప్రత్యేకమైన అవయవం తోక కలిగి ఉంటారు స్వామి.  మానవ రూపంలో ఉండే ఈ దేవుడుకి వానర ముఖం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న అందరికీ కలుగు తుంది. ఆంజనేయ స్వామి తల్లి అంజనీ దేవి. ఆమె వానర వనిత. ఆంజనేయ స్వామి తల్లి అంజనీదేవి పూర్వ జన్మలో ఒక అప్సరస శాపం కారణంగా వానర కన్యగా పుడుతుంది. ఆమెకు కేసరితో వివాహం జరుగుతుంది. చాలా కాలo వరకు సంతానం కలగపోవడంతో శివుడుని పూజించి శివుడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది.   శివుడి యొక్క తేజమును వాయుదేవుడు పండు రూపంలో అంజనీ దేవికి ఇవ్వగా ఆ పండు తిన్న అంజనీ దేవికి ఆంజనేయ స్వామి జన్మిస్తాడు. అంజనీ దేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయ...

అనకాపల్లి జిల్లా విహార యాత్ర

అనకాపల్లి జిల్లా విహారయాత్ర – ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికతకు చేరువ విశాఖపట్నం జిల్లాలోనుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా, విహారయాత్రకారులకు దూరమైన స్వర్గధామంలా ఉంటుంది. ప్రకృతి అందాలు, పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలతో ఈ జిల్లా అనేక రుచులు, అనుభూతులు పంచుతుంది. 1. కొండకర్ల ఆవ సరస్సు –  అచ్యుతాపురం మండలంలోని ఈ సరస్సు, పక్షుల సంరక్షణ కేంద్రంగా పేరొందింది. సుదీర్ఘంగా విస్తరించిన నీటిమెట్టు, ఆకర్షణీయమైన హరిత పరిసరాలు, శాంతమైన వాతావరణం ఇది. వలస పక్షులు, బోటింగ్, ఫోటోగ్రఫీ కోసం సరైన ప్రదేశం. 2. బొజ్జన్నకొండ – బౌద్ధ చరిత్రను పలికించే శిల్పకళ శంకరం గ్రామంలో ఉన్న ఈ స్థలం బౌద్ధ సంస్కృతి కేంద్రమై ఉంది. రాతి గుహలు, చిన్న చిన్న స్తూపాలు, ప్రాచీన శిల్పాలు చరిత్రకూ, కళకూ మిళితమైన ఉదాహరణ. 3. శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం – భక్తి పరవశానికి చిరునామా గవరపాలెంలో ఉన్న ఈ ఆలయం, కొత్త అమావాస్యనాడు జరిగే ఉత్సవాల వల్ల ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఉగాది వేళ లక్షలాది మంది భక్తులు ఇక్కడకు చేరతారు. 4. ముత్యాలమ్మపాలెం, తంతాడి, పుడిమడక తీర ప్రాంతాలు కార్తీక పౌర్ణమి వేళ పుడిమడకలో జరిగే విశేష స్నానాలకి భక...