పోస్ట్‌లు

శంకర జయంతి

శంకర్ జయంతి  భారతీయ తత్త్వశాస్త్రంలో విలక్షణమైన కీర్తిని సంపాదించిన ఆది శంకరాచార్యులు జన్మించిన రోజును శంకర జయంతిగా ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు ఆయన జీవితం, సిద్ధాంతాలు, హిందూ ధర్మానికి చేసిన సేవలను స్మరించుకునే పవిత్ర సందర్భం. శంకరుడి జన్మస్థలం మరియు బాల్యం: ఆది శంకరులు క్రీ.శ. 8వ శతాబ్దంలో కేరళ రాష్ట్రంలోని కాలడీ అనే చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి శివగురు, తల్లి ఆర్యాంబ. బాల్యంలోనే ఆయన మేధా సామర్థ్యం, భక్తి భావం ప్రసిద్ధి పొందాయి. తల్లి కోరిక మేరకు సన్యాసాన్ని స్వీకరించారు. ఇది ఆ కాలంలో అసాధ్యమైన నిర్ణయం. కానీ ధర్మపరిరక్షణే ఆయన లక్ష్యమైంది. వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి సాక్షాత్తు శివుడే శంకరాచార్యులుగా పుట్టారని గ్రంథాలు చెబుతున్నాయి.  శంకరాచార్యుల వారు పుట్టేటప్పటికీ భారతదేశంలో బౌద్ధ మత ప్రభంజనం ఎక్కువగా ఉంది . వైదిక కర్మలు మూతపడ్డాయి. అటువంటి సందర్భంలో ఈ శంకరుల జననం జరిగింది. ఎనిమిది సంవత్సరముల వయసులోనే సన్యసించి సకల శాస్త్రాలను చదివి బిక్షాటన చేస్తూ జీవితం గడిపే శంకరులు ఒకసారి ఒక ఇంటి ముందుకి వెళ్లి బిక్ష అడుగుతాడు. ఆ ఇంట...

బరువు

కడుపు కోసమే కదా కడలంతా బరువు లాగేది బరువులు తోనే సమతుల్యంగా బతుకుబండి మోసేది  ఏ బరువు గతి తప్పిన యజమానికి చెల్లించాలి మూల్యo.  గమ్యం చేరే వరకు బరువులతోనే సాగుతోంది జీవి  ప్రయాణం.  ఆ బరువుల మోతల వెనుక గూడులో ఉన్నదో  బలమైన బాధ్యత. బాధ్యత అంటేనే బరువు బరువు అంటేనే బాధ్యత. ఇన్ని బరువులు మోసిన బక్కచిక్కి ఉంటోంది ఆ ప్రాణం. కారే చెమట ఎదురు గాలులతో మటుమాయం. మాడుతున్న డొక్క ,చుర్రుమనిపించే సూరీడు తల నుండి పాదాల వరకు రక్షణ లేని శరీరo. అయినా అలుపెరగకుండా సాగుతోందా పయనం తలపులన్నీ తలుపులు లేని గూడులో ఉన్న గువ్వల గమనం.  ఆ గువ్వల బువ్వ కోసమే ఆ బడుగు జీవి మథనం. ఎప్పుడు మారుతుందో బక్క జీవి దైనందిన జీవితం. ధనిక పేద అనే తేడా లేని సమ సమాజ నిర్మాణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు           కాకినాడ 9491792279

మాజీ కార్మికులు

మాజీ కార్మికులం. మనం కార్మికులం  జనం మర్చిపోయిన మాజీ కార్మికులo ఒకప్పుడు దేశ ప్రగతిలో  మనము భాగస్వామ్యులం  ప్రజా సేవలో మనం  అతి ముఖ్యమైన ఆర్థిక రంగం కార్మికులo. మారే ప్రభుత్వాల ఆశయాలకి  ఓట్ల కోసం తెచ్చే పథకాల అమలుకి  మనం బలి పశువులo. సబ్సిడీ రుణాలు సంతోషంగా ఇచ్చాం  వసూలు కి కాళ్లు అరిగేలా తిరిగాo  పెద్ద నోట్లను మడిచి లోపల పెట్టాం.   కరోనాకాలంలో కష్టమనిపించిన   బ్యాంకు తలుపులు తెరిచే ఉంచాo. దొంగల తో పాటు కరోనా కూడా  మన అతిధిలా వస్తే సేవ చేసి ప్రాణాలు కోల్పోయాం. వేల కోట్లు మాఫీ చేశాం  అవమానాలు ఎదుర్కొన్నాం  ఎదురు దెబ్బలు తిన్నాం  చేయని తప్పుకు చెప్పు దెబ్బలు తిన్నాం.  శిక్షలు అనుభవించాం.  అందరూ వైట్ కలర్ జాబ్ అంటారు  అది నైట్ వరకు సాగే బ్యాంకు జాబు లెక్కల లోనే పని వేళలు  లెక్కకు రాని వేళలు ఎన్నో   వారాంతపు సెలవులలో కూడా బ్యాంక్ వాకిట్లోనే.  భార్య పిల్లల ఎంజాయ్ మెంట్ నట్టింట్లోనే.    కరోనా వచ్చినా లాక్ డౌన్ పెట్టినా   మన కార్యాలయం ఎప్పుడు కళ కళే.   అంతా ...