పోస్ట్‌లు

శంకర జయంతి

శంకర్ జయంతి  భారతీయ తత్త్వశాస్త్రంలో విలక్షణమైన కీర్తిని సంపాదించిన ఆది శంకరాచార్యులు జన్మించిన రోజును శంకర జయంతిగా ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు ఆయన జీవితం, సిద్ధాంతాలు, హిందూ ధర్మానికి చేసిన సేవలను స్మరించుకునే పవిత్ర సందర్భం. శంకరుడి జన్మస్థలం మరియు బాల్యం: ఆది శంకరులు క్రీ.శ. 8వ శతాబ్దంలో కేరళ రాష్ట్రంలోని కాలడీ అనే చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి శివగురు, తల్లి ఆర్యాంబ. బాల్యంలోనే ఆయన మేధా సామర్థ్యం, భక్తి భావం ప్రసిద్ధి పొందాయి. తల్లి కోరిక మేరకు సన్యాసాన్ని స్వీకరించారు. ఇది ఆ కాలంలో అసాధ్యమైన నిర్ణయం. కానీ ధర్మపరిరక్షణే ఆయన లక్ష్యమైంది. వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి సాక్షాత్తు శివుడే శంకరాచార్యులుగా పుట్టారని గ్రంథాలు చెబుతున్నాయి.  శంకరాచార్యుల వారు పుట్టేటప్పటికీ భారతదేశంలో బౌద్ధ మత ప్రభంజనం ఎక్కువగా ఉంది . వైదిక కర్మలు మూతపడ్డాయి. అటువంటి సందర్భంలో ఈ శంకరుల జననం జరిగింది. ఎనిమిది సంవత్సరముల వయసులోనే సన్యసించి సకల శాస్త్రాలను చదివి బిక్షాటన చేస్తూ జీవితం గడిపే శంకరులు ఒకసారి ఒక ఇంటి ముందుకి వెళ్లి బిక్ష అడుగుతాడు. ఆ ఇంట...

బరువు

కడుపు కోసమే కదా కడలంతా బరువు లాగేది బరువులు తోనే సమతుల్యంగా బతుకుబండి మోసేది  ఏ బరువు గతి తప్పిన యజమానికి చెల్లించాలి మూల్యo.  గమ్యం చేరే వరకు బరువులతోనే సాగుతోంది జీవి  ప్రయాణం.  ఆ బరువుల మోతల వెనుక గూడులో ఉన్నదో  బలమైన బాధ్యత. బాధ్యత అంటేనే బరువు బరువు అంటేనే బాధ్యత. ఇన్ని బరువులు మోసిన బక్కచిక్కి ఉంటోంది ఆ ప్రాణం. కారే చెమట ఎదురు గాలులతో మటుమాయం. మాడుతున్న డొక్క ,చుర్రుమనిపించే సూరీడు తల నుండి పాదాల వరకు రక్షణ లేని శరీరo. అయినా అలుపెరగకుండా సాగుతోందా పయనం తలపులన్నీ తలుపులు లేని గూడులో ఉన్న గువ్వల గమనం.  ఆ గువ్వల బువ్వ కోసమే ఆ బడుగు జీవి మథనం. ఎప్పుడు మారుతుందో బక్క జీవి దైనందిన జీవితం. ధనిక పేద అనే తేడా లేని సమ సమాజ నిర్మాణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు           కాకినాడ 9491792279

ఆయుర్వేదం

నాడి తడిమి చూసి నలత చెప్పు కళ్ళలో కళ్ళు పెట్టి రక్త బలిమి చూడు రసాగ్రము రంగు చూసి రోగము సంగతి చెప్పు. ఆయుష్షును వృద్ధిచేసి ఆరోగ్య మిచ్చేది ఆయుర్వేదం రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279