అడవి తల్లి మనసు
అడవి తల్లి మనసు
" ఒరేయ్ సుధాకర్ ఈ వీకెండ్ కి మనం మారేడుమిల్లి అడవులకు పెడదాం రా! అది మా ఊరికి చాలా దగ్గర. కార్లో వెళ్ళిపోదాం. చూడ్డానికి చాలా బాగుంటుంది రా! చుట్టూ అందమైన పచ్చటి చెట్లు లోయలు అవి చూస్తుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా అక్కడ దొరికే బొంగు చికెన్ మరి ఎక్కడ దొరకదు. అంత రుచికరంగా ఉంటుంది అంటూ చెప్పుకుపోతున్న మహేష్ మాటలకి అడ్డు తగులుతూ అది అడవి అంటున్నావు మరి అడవుల్లో కారు ఎలా వెళుతుంది పైగా క్రూర జంతువులు ఉంటాయేమో! అని సందేహంగా అడిగాడు మహేష్.
"ఊరుకోరా అది అడవి ఏమిటి ? చూడడానికి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పెద్ద క్రూర మృగాలు అక్కడ ఏం కనిపించవు .
అవి ఎప్పుడు ఎవరికంట పడలేదు. అడవి మధ్యలో అందమైన తారు రోడ్లు వేసి విహార స్థలాల కింద ఎప్పుడో మార్చేశారు అంటూ చెప్పుకొస్తున్న మహేష్ మాటలకి సుధాకర్ కి చాలా బాధనిపించింది. మనిషి ఎంత స్వార్ధపరుడు. తన ఆహారం కోసం జంతువులను వేటాడి చంపేస్తున్నాడు. అపురూపమైన వృక్ష సంపదని అక్రమంగా రవాణా చేసి కోట్లు ఆర్జిస్తున్నాడు.
ఆ అడవిలో దొరికినది తింటూ కాలక్షేపం చేసే పులులు ,ఏనుగుల బలవంతంగా చంపేసి వాటి దంతాల్ని చర్మాల్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ అడవి మీద బతికేస్తున్నాడు. ఆడవంతా ఖాళీ అయిపోయింది . ఇది జాతీయ సంపద.
మనుషుల్ని చూసి జంతువులు భయపడే పరిస్థితి వచ్చేసింది. అసలు ఒకప్పుడు అడవి ఎలా ఉండేది. పుస్తకాల్లో చదువుతుంటే నే భయమేసేది.
పెద్ద పెద్ద పులులు, చిరుతపులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు , అడవి దున్నలు, రకరకాల పక్షులు, జింకలు,కుందేలు వంటి చిన్న చిన్న జంతువులతో అడవి కాకులు దూరని కారడివిలాగా ఉండేదని చదువుకున్నాము. అక్కడికి వెళ్లాలంటేనే చాలా భయమేసేదిట. అలాంటిది ఇప్పుడు సులువుగా విహారయాత్రలకు వెళ్లి వచ్చేస్తున్నారు మానవులు అనుకున్నాడు సుధాకర్. అడవి అంటే చెట్లతో దట్టంగా అల్లుకున్న ప్రదేశం. నాగరికత పెరిగే కొద్దీ అటవీ సంపద అడుగంటి పోయింది. అపురూప జంతుజాలం నశించిపోతోంది అని బాధపడుతూ ఇద్దరు అడవుల్లోకి ప్రవేశించారు ఒక సెలవు రోజు.
అప్పటికే చాలామంది విహారయాత్రికులు అడవిలో కనబడ్డారు సుధాకర్ కి. మెడలో కెమెరాలు వేసుకుని కనబడిన చెట్టు నీ, పుట్టని ,పక్షిని, పండుని ఫోటోలు తీసుకుని ఆనంద పడుతున్నారు .
క్రూర మృగాల అరుపులతో, పక్షుల కిలకిల రావములతో ఎప్పుడు సందడిగా కనిపించే అడవి నిశ్శబ్దంగా ఉంది. అక్కడకు వచ్చిన జనం అరుపులు ,గోలలు తప్పితే మరేమీ వినపడలేదు. అలా మధ్యాహ్నం వరకు అడవి అంతా తిరిగి అలసిపోయిన సుధాకర్ మహేష్ ఇద్దరు గెస్ట్ హౌస్ దగ్గరున్న క్యాంటీన్లో భోజనం చేద్దామని కూర్చున్నారు.
ఇంతలో ఒక వెయిటర్ వచ్చి రహస్యంగా" జింక మాంసం ఉంది కావాలా అని అడిగాడు? ఒక్కసారి బాధగా అనిపించింది సుధాకర్ కి. చెంగుచెంగున అడవిలో గంతులు వేస్తూ భయంతో కూడిన కళ్ళను అటు ఇటు తిప్పుతూ చూడ్డానికి ఎంతో అందంగా ఉండే ఆ జింక ఒక్కసారి కళ్ళ ముందు మెదిలింది. అడవుల్లో వ్యాపారం చేసుకుంటూ అడవి మీద బతుకుతూ ఆ జంతువులను నాశనం చేసే ఆ హోటల్ యజమానికేసి కోపంగా చూసి "నాకు బొంగు చికెన్ కూడా వద్దు అంటూ చెప్పడంతో "అదేమిటి సార్ ఇది ఇక్కడ స్పెషలు అని చెబుతున్న ఆ మాటలు వినిపించుకోకుండా నాలుగు ముద్దల పెరుగు అన్నం తినేసి బయటపడ్డారు సుధాకర్ ,మహేష్. ఆ వేటగాడు దెబ్బలకి బాధపడుతూ నేలకి ఒరిగే జింక కళ్ళు సుధాకర్ కి అలా కనబడుతూనే ఉన్నాయి.
అలా హోటల్ నుంచి బయలుదేరి గెస్ట్ హౌస్ లో పడుకున్న సుధాకర్ కి అలసిపోయి ఉండడం వలన మంచి నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఏవో కలలు.
అడవుల్లోని జంతువులన్నీ వరుసగా కన్నీళ్లు కారిస్తున్నట్లుగా ఆ కన్నీళ్లు వెనకున్న తన గాధను చెబుతున్నట్లుగా అనిపించింది సుధాకర్ కి . అయినా కలలో ఇవన్నీ నాకెందుకు కనిపిస్తున్నాయి ?. నేను ఉదయం నుంచి అడవి గురించి ,
అడవి జంతువుల గురించి బాధపడుతున్నాను కదా! నా దృష్టి అలా ఉంది కదా! అనుకున్నాడు సుధాకర్.
రాజుల కాలంలో మమ్మల్ని పెంచి పోషించేవారు వాళ్ల సైన్యంలో. రాజులు పోయేరు రాజరికలు పోయేయి. అప్పటినుంచి మేము అడవుల్లోనే ఉంటున్నాం. అడవి తల్లి మాకు చెట్టు, చామ, పండు, కాయ ఇచ్చి కడుపు నింపి పెద్దపెద్ద తటాకాలులో జలకలాడ్డానికి మంచి నీళ్లు తాగడానికి అవకాశం కల్పించింది. ఇది మా సొత్తు. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయి అడవులను నరికేస్తూ మాకు నిలువలు నీడ లేకుండా చేస్తూ మమ్మల్ని ఖూనీ చేస్తూ మా దంతాల మీద సొమ్ము సంపాదించుకుంటున్నారు. మమ్మల్ని నాశనం చేస్తున్నారు అంటూ కన్నీళ్లు కార్చింది ఏనుగు.
నేను క్రూర మృగాన్ని కానీ ఈ అడవుల్లో వేటాడి ఆహారం తినడానికి జింక కనపడటం లేదు. ఎందుకంటే మాకంటే ముందుగా వేట అంటే సరదా ఉన్నవాళ్లు వాటిని వేటాడేస్తున్నారు. నాకు ఆకలి తీరక గ్రామాల్లోకి పరిగెడుతున్నాను. ఆహారం దొరక్క అడవుల్లో ఉంటే మాటు వేసి చంపేసి చర్మాల మీద లక్షలు సంపాదించేస్తున్నారు అంటూ అంత బలంగా ఉండే పులి పిల్లిలా ఏడుస్తూ చెప్పింది.
నేను నా సాటి జంతువుకి ఆహారంగా మారడం అనాదిగా వస్తున్న ఆచారం. కానీ మానవులకు ఏం పోయేకాలం మమ్మల్ని వేటాడి మాంసం తింటూ చర్మం ,మా కొమ్ములు అందంగా ఇంట్లో అందంగా అలంకరించుకుంటున్నారు అని జింక చెప్తుంటే బక్క చిక్కిన సింహం నేను అడవికి రాజు అంటారు కానీ మా రాజులందరూ సర్కస్ కంపెనీలోకి మమ్మల్ని తీసుకెళ్లి పోతున్నారు. అక్కడ వేసిన మాంసం ముక్క కొరుకుతూ, కొరడా దెబ్బలు తింటూ బోనులో ఉంటూ వచ్చిన ప్రేక్షకుల్ని ఆనంద పరచడమే నా పని.
ఇంక నా తోటి జంతువైన చిరుత పులి చాలా తెలివైనది. ఎంతటి వేటగాడు ఎదురైనా చాకచక్యంగా తప్పించుకోగలదు అలాంటిది అది కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరకు లేదంటే, రహదారి మీద పరుగులు తీస్తోంది. అంత భయమేస్తుంది దానికి అడవుల్లో ఉండాలంటే. భయమే కాదు ఏమీ తినడానికి దొరకడం లేదు.
ఇంక మా నక్క బావ పరిస్థితి కూడా అలాగే ఉంది. అది జంతువులను మోసగిస్తుంది కానీ మనుషుల్ని చూస్తే పారిపోతుంది. ఈమధ్య అడవుల్లో చెట్లు కంటే మనుషులు ఎక్కువగా ఉన్నారు. అలాగే అడవి కుక్కలు వాటికి కూడా ప్రాణం భయమే.
అసలు అడవిలో అందమైన పక్షి నెమలి. వర్షం పడితే పురి విప్పి నాట్యం చేస్తుంది. అలాంటిది అది కూడా భయపడి పారిపోయింది. అడవిలో తుపాకీ గుళ్ళు శబ్దం వినిపిస్తే మాలాంటి భయంకర జంతువులే భయపడిపోతున్నాయి అలాంటిది ఆ పక్షి ఏముంటుంది.
నల్లగా ఉన్న ఆ వేళకు వచ్చి ఆ అన్నం ముద్ద కాస్త పట్టుకుపోకపోతే మనకి బెంగ భయం. అలాంటిది అడవుల్లోనూ లేవు. నగరాల్లోనూ లేవు కాకులు. ఏమైపోయాయో! ఎటో ఎగిరిపోయాయి. ఏం చేస్తాయి? పాపం గూళ్ళు పట్టుకోవడానికి అడవిలో చెట్లు లేవు.
ఆకాశంలో ఎక్కడినుంచి చూస్తుందో తెలియదు ఎలా చూస్తుందో తెలియదు నేల మీదనున్న కోడి పిల్లని మాంసం ముక్కని ఇట్టే తన్నుకు పోతుంది గ్రద్ద. అది కూడా కనపడటం లేదు.
ఆ కొ మ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఎగురుతూ ఉండి మాకు దైవ స్వరూపమైన కోతులు ఆహారం దొరక్క ఊళ్ళ మీద పడ్డాయి. తటాకాలు ఎండిపోయి జలచరాలు రోడ్డుమీద కనబడుతున్నాయి. తటకాల్లో జలచరాలు లేక కొంగలు ఎటో ఎగిరిపోయే యి. పావురాలు నగరాలకు పోయి అపార్ట్మెంట్లో గూళ్ళు కట్టుకున్నాయి. అసలు పిచిక జాతి నశించి పోయిందట అని నగరవాసులు చెప్పుకుంటున్నారట.
రామచిలుకలు అడవి తల్లిని వదిలేసి మానవులతో కలిసి మాటలను నేర్చుకుంటూ పంజరాల్లో ఉంటున్నాయి. వీధి వీధి తిరుగుతూ జాతకాలు చెబుతున్నాయి. అయినా తమ జాతకం అలా ఉందని ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాయి.
ఒకప్పుడు మనుషుల్లాగా ఉండే ఎలుగుబంట్లు జంతు ప్రదర్శనశాలలో సర్కస్లో కనబడుతున్నాయి కానీ అడవిలో మచ్చుకు కూడా లేవు
మాకు నిత్యం చల్లటి నీడనిస్తూ గాలిని పంచుతూ ఆహారాన్ని సమకూరుస్తూ పక్షి జాతికి గూడు నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తూ మా అడవితల్లిని నమ్ముకుని మాతోపాటు జీవించే ఈ చెట్టు కూడా వేటగాళ్ళకి కోట్లు సంపాదించి పెడుతుంటే జంతు జాతులన్నీ నశించి పోకుండా అభయారణ్యాలను ప్రభుత్వం పోషిస్తున్న ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నారు దొరలు అంటూ దీనంగా చెప్తున్న ఆ అడవి జంతువుల మాటలకి నిద్రలోనే ఏడుపు రాగా గబుక్కున మెలకువ వచ్చి టైం చూసుకునేటప్పటికీ సాయంకాలం ఐదు గంటలు అయింది
. గది బయటకు వచ్చి చూసేటప్పటికి ఎక్కడ ఏమీ కనపడలేదు. సుధాకర్ మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని క్యాంటీన్లో వేడివేడి టీ తాగుతుంటే క్యాంటీన్ మెట్లమీద ఒక ముసలాడు కనిపించాడు. నడవలేడనుకుంటాను పక్కనే చంకల కింద పెట్టుకునే కర్రలు రెండు కనబడ్డాయి.
సుధాకర్ వెంటనే జేబులో నుంచి పది రూపాయలు తీసి ఆ ముసలాయనకి ఇచ్చి రాత్రి ఏమైనా జంతువులు ఇక్కడికి వస్తాయా! ఇక్కడ బస చేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా! అని అడిగాడు సుధాకర్. ఇంకెక్కడి జంతువులండి వాటిని ఎప్పుడో మాలాంటి వాళ్ళం వేటాడేసాం. అవి ఎప్పుడో నశించిపోయాయి అడవి విడిచి పారిపోయేయి వాటిని వేటాడిన పాపమే నాకు ఈ శాపం అంటూ ఏడ్చాడు ముసలాయన.
అవును మూగ జీవాలని బాధ పెడితే అవి శపిస్తాయి. వాటి గూడును మనం నాశనం చేస్తే అవి తాత్కాలికంగా గూడుదాటి వెళ్లిపోయిన మన జీవితాల అంతు చూస్తాయి. మూగజీవాలు మాట్లాడక లేకపోవచ్చు కానీ వాటికి బాధ ,భయం కూడా ఉంటాయి. అదేం పైశాచిక ఆనందమో తెలీదు వేట అంటే చాలామందికి మక్కువ ఎక్కువ. వద్దు వాటి జోలికి వెళ్ళద్దు. వాటిని అలాగే స్వేచ్ఛగా అడవి తల్లి ఒడిలో ఆనందంగా పెరిగేలా చేద్దాం. పర్యావరణాన్ని కాపాడదాం. నేల తల్లిని సంరక్షిద్దాం అందుకు చేయూతనిద్దాం అనుకున్నాడు సుధాకర్ . అడవిలో తన కలిగిన అనుభవాలన్నీ మహేష్ తో పంచుకుని కారెక్కి నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
అడవి తల్లి మనసు
" ఒరేయ్ సుధాకర్ ఈ వీకెండ్ కి మనం మారేడుమిల్లి అడవులకు పెడదాం రా! అది మా ఊరికి చాలా దగ్గర. కార్లో వెళ్ళిపోదాం. చూడ్డానికి చాలా బాగుంటుంది రా! చుట్టూ అందమైన పచ్చటి చెట్లు లోయలు అవి చూస్తుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా అక్కడ దొరికే బొంగు చికెన్ మరి ఎక్కడ దొరకదు. అంత రుచికరంగా ఉంటుంది అంటూ చెప్పుకుపోతున్న మహేష్ మాటలకి అడ్డు తగులుతూ అది అడవి అంటున్నావు మరి అడవుల్లో కారు ఎలా వెళుతుంది పైగా క్రూర జంతువులు ఉంటాయేమో! అని సందేహంగా అడిగాడు మహేష్.
"ఊరుకోరా అది అడవి ఏమిటి ? చూడడానికి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పెద్ద క్రూర మృగాలు అక్కడ ఏం కనిపించవు .
అవి ఎప్పుడు ఎవరికంట పడలేదు. అడవి మధ్యలో అందమైన తారు రోడ్లు వేసి విహార స్థలాల కింద ఎప్పుడో మార్చేశారు అంటూ చెప్పుకొస్తున్న మహేష్ మాటలకి సుధాకర్ కి చాలా బాధనిపించింది. మనిషి ఎంత స్వార్ధపరుడు. తన ఆహారం కోసం జంతువులను వేటాడి చంపేస్తున్నాడు. అపురూపమైన వృక్ష సంపదని అక్రమంగా రవాణా చేసి కోట్లు ఆర్జిస్తున్నాడు.
ఆ అడవిలో దొరికినది తింటూ కాలక్షేపం చేసే పులులు ,ఏనుగుల బలవంతంగా చంపేసి వాటి దంతాల్ని చర్మాల్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ అడవి మీద బతికేస్తున్నాడు. ఆడవంతా ఖాళీ అయిపోయింది . ఇది జాతీయ సంపద.
మనుషుల్ని చూసి జంతువులు భయపడే పరిస్థితి వచ్చేసింది. అసలు ఒకప్పుడు అడవి ఎలా ఉండేది. పుస్తకాల్లో చదువుతుంటే నే భయమేసేది.
పెద్ద పెద్ద పులులు, చిరుతపులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు , అడవి దున్నలు, రకరకాల పక్షులు, జింకలు,కుందేలు వంటి చిన్న చిన్న జంతువులతో అడవి కాకులు దూరని కారడివిలాగా ఉండేదని చదువుకున్నాము. అక్కడికి వెళ్లాలంటేనే చాలా భయమేసేదిట. అలాంటిది ఇప్పుడు సులువుగా విహారయాత్రలకు వెళ్లి వచ్చేస్తున్నారు మానవులు అనుకున్నాడు సుధాకర్. అడవి అంటే చెట్లతో దట్టంగా అల్లుకున్న ప్రదేశం. నాగరికత పెరిగే కొద్దీ అటవీ సంపద అడుగంటి పోయింది. అపురూప జంతుజాలం నశించిపోతోంది అని బాధపడుతూ ఇద్దరు అడవుల్లోకి ప్రవేశించారు ఒక సెలవు రోజు.
అప్పటికే చాలామంది విహారయాత్రికులు అడవిలో కనబడ్డారు సుధాకర్ కి. మెడలో కెమెరాలు వేసుకుని కనబడిన చెట్టు నీ, పుట్టని ,పక్షిని, పండుని ఫోటోలు తీసుకుని ఆనంద పడుతున్నారు .
క్రూర మృగాల అరుపులతో, పక్షుల కిలకిల రావములతో ఎప్పుడు సందడిగా కనిపించే అడవి నిశ్శబ్దంగా ఉంది. అక్కడకు వచ్చిన జనం అరుపులు ,గోలలు తప్పితే మరేమీ వినపడలేదు. అలా మధ్యాహ్నం వరకు అడవి అంతా తిరిగి అలసిపోయిన సుధాకర్ మహేష్ ఇద్దరు గెస్ట్ హౌస్ దగ్గరున్న క్యాంటీన్లో భోజనం చేద్దామని కూర్చున్నారు.
ఇంతలో ఒక వెయిటర్ వచ్చి రహస్యంగా" జింక మాంసం ఉంది కావాలా అని అడిగాడు? ఒక్కసారి బాధగా అనిపించింది సుధాకర్ కి. చెంగుచెంగున అడవిలో గంతులు వేస్తూ భయంతో కూడిన కళ్ళను అటు ఇటు తిప్పుతూ చూడ్డానికి ఎంతో అందంగా ఉండే ఆ జింక ఒక్కసారి కళ్ళ ముందు మెదిలింది. అడవుల్లో వ్యాపారం చేసుకుంటూ అడవి మీద బతుకుతూ ఆ జంతువులను నాశనం చేసే ఆ హోటల్ యజమానికేసి కోపంగా చూసి "నాకు బొంగు చికెన్ కూడా వద్దు అంటూ చెప్పడంతో "అదేమిటి సార్ ఇది ఇక్కడ స్పెషలు అని చెబుతున్న ఆ మాటలు వినిపించుకోకుండా నాలుగు ముద్దల పెరుగు అన్నం తినేసి బయటపడ్డారు సుధాకర్ ,మహేష్. ఆ వేటగాడు దెబ్బలకి బాధపడుతూ నేలకి ఒరిగే జింక కళ్ళు సుధాకర్ కి అలా కనబడుతూనే ఉన్నాయి.
అలా హోటల్ నుంచి బయలుదేరి గెస్ట్ హౌస్ లో పడుకున్న సుధాకర్ కి అలసిపోయి ఉండడం వలన మంచి నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఏవో కలలు.
అడవుల్లోని జంతువులన్నీ వరుసగా కన్నీళ్లు కారిస్తున్నట్లుగా ఆ కన్నీళ్లు వెనకున్న తన గాధను చెబుతున్నట్లుగా అనిపించింది సుధాకర్ కి . అయినా కలలో ఇవన్నీ నాకెందుకు కనిపిస్తున్నాయి ?. నేను ఉదయం నుంచి అడవి గురించి ,
అడవి జంతువుల గురించి బాధపడుతున్నాను కదా! నా దృష్టి అలా ఉంది కదా! అనుకున్నాడు సుధాకర్.
రాజుల కాలంలో మమ్మల్ని పెంచి పోషించేవారు వాళ్ల సైన్యంలో. రాజులు పోయేరు రాజరికలు పోయేయి. అప్పటినుంచి మేము అడవుల్లోనే ఉంటున్నాం. అడవి తల్లి మాకు చెట్టు, చామ, పండు, కాయ ఇచ్చి కడుపు నింపి పెద్దపెద్ద తటాకాలులో జలకలాడ్డానికి మంచి నీళ్లు తాగడానికి అవకాశం కల్పించింది. ఇది మా సొత్తు. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయి అడవులను నరికేస్తూ మాకు నిలువలు నీడ లేకుండా చేస్తూ మమ్మల్ని ఖూనీ చేస్తూ మా దంతాల మీద సొమ్ము సంపాదించుకుంటున్నారు. మమ్మల్ని నాశనం చేస్తున్నారు అంటూ కన్నీళ్లు కార్చింది ఏనుగు.
నేను క్రూర మృగాన్ని కానీ ఈ అడవుల్లో వేటాడి ఆహారం తినడానికి జింక కనపడటం లేదు. ఎందుకంటే మాకంటే ముందుగా వేట అంటే సరదా ఉన్నవాళ్లు వాటిని వేటాడేస్తున్నారు. నాకు ఆకలి తీరక గ్రామాల్లోకి పరిగెడుతున్నాను. ఆహారం దొరక్క అడవుల్లో ఉంటే మాటు వేసి చంపేసి చర్మాల మీద లక్షలు సంపాదించేస్తున్నారు అంటూ అంత బలంగా ఉండే పులి పిల్లిలా ఏడుస్తూ చెప్పింది.
నేను నా సాటి జంతువుకి ఆహారంగా మారడం అనాదిగా వస్తున్న ఆచారం. కానీ మానవులకు ఏం పోయేకాలం మమ్మల్ని వేటాడి మాంసం తింటూ చర్మం ,మా కొమ్ములు అందంగా ఇంట్లో అందంగా అలంకరించుకుంటున్నారు అని జింక చెప్తుంటే బక్క చిక్కిన సింహం నేను అడవికి రాజు అంటారు కానీ మా రాజులందరూ సర్కస్ కంపెనీలోకి మమ్మల్ని తీసుకెళ్లి పోతున్నారు. అక్కడ వేసిన మాంసం ముక్క కొరుకుతూ, కొరడా దెబ్బలు తింటూ బోనులో ఉంటూ వచ్చిన ప్రేక్షకుల్ని ఆనంద పరచడమే నా పని.
ఇంక నా తోటి జంతువైన చిరుత పులి చాలా తెలివైనది. ఎంతటి వేటగాడు ఎదురైనా చాకచక్యంగా తప్పించుకోగలదు అలాంటిది అది కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరకు లేదంటే, రహదారి మీద పరుగులు తీస్తోంది. అంత భయమేస్తుంది దానికి అడవుల్లో ఉండాలంటే. భయమే కాదు ఏమీ తినడానికి దొరకడం లేదు.
ఇంక మా నక్క బావ పరిస్థితి కూడా అలాగే ఉంది. అది జంతువులను మోసగిస్తుంది కానీ మనుషుల్ని చూస్తే పారిపోతుంది. ఈమధ్య అడవుల్లో చెట్లు కంటే మనుషులు ఎక్కువగా ఉన్నారు. అలాగే అడవి కుక్కలు వాటికి కూడా ప్రాణం భయమే.
అసలు అడవిలో అందమైన పక్షి నెమలి. వర్షం పడితే పురి విప్పి నాట్యం చేస్తుంది. అలాంటిది అది కూడా భయపడి పారిపోయింది. అడవిలో తుపాకీ గుళ్ళు శబ్దం వినిపిస్తే మాలాంటి భయంకర జంతువులే భయపడిపోతున్నాయి అలాంటిది ఆ పక్షి ఏముంటుంది.
నల్లగా ఉన్న ఆ వేళకు వచ్చి ఆ అన్నం ముద్ద కాస్త పట్టుకుపోకపోతే మనకి బెంగ భయం. అలాంటిది అడవుల్లోనూ లేవు. నగరాల్లోనూ లేవు కాకులు. ఏమైపోయాయో! ఎటో ఎగిరిపోయాయి. ఏం చేస్తాయి? పాపం గూళ్ళు పట్టుకోవడానికి అడవిలో చెట్లు లేవు.
ఆకాశంలో ఎక్కడినుంచి చూస్తుందో తెలియదు ఎలా చూస్తుందో తెలియదు నేల మీదనున్న కోడి పిల్లని మాంసం ముక్కని ఇట్టే తన్నుకు పోతుంది గ్రద్ద. అది కూడా కనపడటం లేదు.
ఆ కొ మ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఎగురుతూ ఉండి మాకు దైవ స్వరూపమైన కోతులు ఆహారం దొరక్క ఊళ్ళ మీద పడ్డాయి. తటాకాలు ఎండిపోయి జలచరాలు రోడ్డుమీద కనబడుతున్నాయి. తటకాల్లో జలచరాలు లేక కొంగలు ఎటో ఎగిరిపోయే యి. పావురాలు నగరాలకు పోయి అపార్ట్మెంట్లో గూళ్ళు కట్టుకున్నాయి. అసలు పిచిక జాతి నశించి పోయిందట అని నగరవాసులు చెప్పుకుంటున్నారట.
రామచిలుకలు అడవి తల్లిని వదిలేసి మానవులతో కలిసి మాటలను నేర్చుకుంటూ పంజరాల్లో ఉంటున్నాయి. వీధి వీధి తిరుగుతూ జాతకాలు చెబుతున్నాయి. అయినా తమ జాతకం అలా ఉందని ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాయి.
ఒకప్పుడు మనుషుల్లాగా ఉండే ఎలుగుబంట్లు జంతు ప్రదర్శనశాలలో సర్కస్లో కనబడుతున్నాయి కానీ అడవిలో మచ్చుకు కూడా లేవు
మాకు నిత్యం చల్లటి నీడనిస్తూ గాలిని పంచుతూ ఆహారాన్ని సమకూరుస్తూ పక్షి జాతికి గూడు నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తూ మా అడవితల్లిని నమ్ముకుని మాతోపాటు జీవించే ఈ చెట్టు కూడా వేటగాళ్ళకి కోట్లు సంపాదించి పెడుతుంటే జంతు జాతులన్నీ నశించి పోకుండా అభయారణ్యాలను ప్రభుత్వం పోషిస్తున్న ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నారు దొరలు అంటూ దీనంగా చెప్తున్న ఆ అడవి జంతువుల మాటలకి నిద్రలోనే ఏడుపు రాగా గబుక్కున మెలకువ వచ్చి టైం చూసుకునేటప్పటికీ సాయంకాలం ఐదు గంటలు అయింది
. గది బయటకు వచ్చి చూసేటప్పటికి ఎక్కడ ఏమీ కనపడలేదు. సుధాకర్ మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని క్యాంటీన్లో వేడివేడి టీ తాగుతుంటే క్యాంటీన్ మెట్లమీద ఒక ముసలాడు కనిపించాడు. నడవలేడనుకుంటాను పక్కనే చంకల కింద పెట్టుకునే కర్రలు రెండు కనబడ్డాయి.
సుధాకర్ వెంటనే జేబులో నుంచి పది రూపాయలు తీసి ఆ ముసలాయనకి ఇచ్చి రాత్రి ఏమైనా జంతువులు ఇక్కడికి వస్తాయా! ఇక్కడ బస చేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా! అని అడిగాడు సుధాకర్. ఇంకెక్కడి జంతువులండి వాటిని ఎప్పుడో మాలాంటి వాళ్ళం వేటాడేసాం. అవి ఎప్పుడో నశించిపోయాయి అడవి విడిచి పారిపోయేయి వాటిని వేటాడిన పాపమే నాకు ఈ శాపం అంటూ ఏడ్చాడు ముసలాయన.
అవును మూగ జీవాలని బాధ పెడితే అవి శపిస్తాయి. వాటి గూడును మనం నాశనం చేస్తే అవి తాత్కాలికంగా గూడుదాటి వెళ్లిపోయిన మన జీవితాల అంతు చూస్తాయి. మూగజీవాలు మాట్లాడక లేకపోవచ్చు కానీ వాటికి బాధ ,భయం కూడా ఉంటాయి. అదేం పైశాచిక ఆనందమో తెలీదు వేట అంటే చాలామందికి మక్కువ ఎక్కువ. వద్దు వాటి జోలికి వెళ్ళద్దు. వాటిని అలాగే స్వేచ్ఛగా అడవి తల్లి ఒడిలో ఆనందంగా పెరిగేలా చేద్దాం. పర్యావరణాన్ని కాపాడదాం. నేల తల్లిని సంరక్షిద్దాం అందుకు చేయూతనిద్దాం అనుకున్నాడు సుధాకర్ . అడవిలో తన కలిగిన అనుభవాలన్నీ మహేష్ తో పంచుకుని కారెక్కి నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి