పోస్ట్‌లు

గురువు

ఆషాఢ శుద్ధ పౌర్ణమి – గురు పౌర్ణమి. వ్యాస మహర్షి జన్మదినం. ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు వ్యాస మహర్షిని పూజించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. నాలుగు వేదాలను లోకానికి అందజేసిన వారు వ్యాస మహర్షి. అష్టాదశ పురాణాలను ఆయనే రచించారు. మానవ జీవితం నడవడికకు ఇవే ప్రమాణాలు. అయితే నిత్య జీవితంలో, అంటే బాల్యం నుంచి అనేకమంది వ్యక్తులు మనకు మంచి మాటలు చెప్పి, మనల్ని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దేవారు ఉంటారు. వారందరూ కూడా మనకు గురువులే. మొట్టమొదటి గురువు తల్లి. మంచి చెడ్డలు నేర్పేది తల్లిదండ్రులు మాత్రమే. ప్రతి వ్యక్తి మీద తల్లి ప్రభావం చాలా ఎక్కువ. పిల్లలకు తల్లి దగ్గర చేరిక ఎక్కువగా ఉంటుంది. తండ్రి అంటే భయం. చిరు ప్రాయంలోనే తల్లి నీతి కథలు, రామాయణ మహాభారత కథలు చెబుతుంది. ఆ వయసులో తప్పుడు పనులు చేయకూడదని అర్థమవుతుంది. మనకు జ్ఞానం వచ్చే వరకు మన నడవడికను తీర్చిదిద్దేది తల్లే. ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను కూడా తల్లి దగ్గర నుంచే తెలుసుకుంటాము. కొంత వయసు వచ్చిన తర్వాత పాఠశాల చేరినప్పుడు ఓనమాలు దగ్గరుండి దిద్దించి, భవిష్యత్తుకు పునాది వేసేవారు ఉపాధ్యాయులు. అక్షరాన్ని కనుక మనం నేర్చుకోకపోతే, ఎవరు బ్రతుకు బ...

వ్యాసుడు

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌   🕉️ పరిచయం: వ్యాసుడు అనే పదానికి అర్థం "విభజించేవాడు" అని. ఆయన పేరు వేదవ్యాసుడు – ఎందుకంటే ఆయనే వేదాలను నాలుగు భాగాలుగా (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం) విభజించిన మహర్షి. ఇతడు భారతదేశ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యమైన ఋషులలో ఒకడు. ఇతడే మహాభారత రచయిత, 18 పురాణాల కర్త, భాగవత పురాణం వ్యాసకర్త కూడా 🌸 జన్మకథ వ్యాసుడు పరాశర మహర్షి కుమారుడు. ఒకసారి పరాశరుడు యాత్రలో గంగానదిలో పడవపై ప్రయాణిస్తున్నాడు. అక్కడ సత్యవతి అనే పడవతీసే యువతి ఉండేది. ఆమె వాసన దుర్గంధంగా ఉండేది, కానీ పరాశరుడు ఆమెను ఆశీర్వదించి పరిమళముతో కూడిన శుభరూపిణిగా మార్చాడు. తర్వాత ఆమెతో కలిసి, ద్వీపంలో ఆమెకో పుత్రుడు జన్మించాడు – అతడే వ్యాసుడు. ఎందుకంటే ఆయన ద్వీపంలో జన్మించాడు కనుక ఆయనను "కృష్ణ ద్వైపాయన" అని కూడా అంటారు – కృష్ణవర్ణుడు అయిన ద్వీపజ. వ్యాసుడు జన్మించిన వెంటనే పెద్దవాడయ్యాడు – తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇది మహర్షుల విశేష స్వభావం 📚 వ్యాసుడు చేసిన మహోన్నత కార్యాలు 1. వేదాల విభజన ప్రజలు వేదాలు నేర్చుకోవడం కష్టంగా మారినప...

దీపావళి సంబరాలు

సాయంకాలం ఆరు గంటలు అయింది. ఎక్కడి నుంచో బాణసంచా చప్పుడు వినబడు తోంది. అప్పుడే దీపావళి ప్రారంభమైపోయింది అనుకుంటూ ఇత్తడి పళ్లెంలో వెలిగించిన ప్రమిదలని ఒక్కొక్కటి ఆరుగు మీద పెడుతోంది రమ్య. దీపావళి నాడు అరుగులకు ప్రత్యేక అతిధులు ఈ దీపాలు.  ఈ దీపాలతోటే ఎంత కళ వచ్చింది ఇంటికి అనుకుంటూ గాలికి రెపరెపలాడుతున్న దీపాలను చూసి మనసు ఎక్కడకో పోయింది రమ్యకి. పక్క ఇంటి నుంచి పిల్లల దివిటీలు కొడుతున్న హడావుడి వినపడుతోంది. పిల్లలు చేతులు కాల్చుకుంటారని ఆ తల్లి నానా హైరానా పడిపోతో oది. ఎన్నో జాగ్రత్తలు చెబుతోంది. ఒక్కసారి అవన్నీ చూసి రమ్య మనసు చిన్నతనంలోకి పరుగులెట్టింది. " అమ్మా రమ్య పరికిణి కుచ్చిళ్ళు కొంచెం దగ్గరగా పెట్టుకో. దూరంగా ఉండి ప్రమిదల్లో నూనె పొయ్యి. నువ్వు మతాబులు కాల్చుకో. అన్నయ్య తారాజువ్వలు కాల్చుకుంటాడు. నీకు గె డ కర్రకి మతాబులు కట్టిస్తాను. కాకరపువ్వొత్తులు కూడా నువ్వే కాల్చుకో. ఇలా ఎన్నో జాగ్రత్తలు ప్రతి దీపావళికి అమ్మ చెబుతూనే ఉండే ది. ప్రతి దీపావళికి కొత్త బట్టలు కాకరపువ్వొత్తులు విష్ణు చక్రాలు భూచక్రాలు పాము బిళ్ళలు మతాబులు ఇవన్నీ నా వాటా.  అన్నయ్య కి తారాజువ్వలు టప...