పోస్ట్‌లు

నలుపు నాణ్యమే

నలుపు – నాణ్యమే మనిషి నయనాలు పసిగట్టి చూసేది రంగుల ప్రపంచం. ఆ రంగుల్లో నలుపు అంటే చాలామందికి భయం, తిరస్కార భావన కలిగించే ఒక నీడలా అనిపిస్తుంది. కానీ ఆ నలుపు అంత తేలికైనది కాదు. అది ఒక జీవిత దర్శనం, ఒక గంభీరమైన సందేశం. సప్తవర్ణాలు దేవుని సృష్టి. అందులో నలుపు కూడా ఒకటి. కానీ మిగిలిన రంగులకంటే నల్ల రంగుపై వ్యతిరేక భావన ఎక్కువ. ఎందుకంటే అది చీకటిని గుర్తు చేస్తుంది. కానీ అదే నలుపు చల్లని మేఘంగా మారి చినుకులుగా జలధారలు కురిపించగలదు. భూమిని పచ్చగా మార్చే మొదటి అంకురం నలుపే. విద్యా బోర్డు - నలుపే; జ్ఞానం - వెలుగు పాఠశాల బోర్డు నలుపే. కానీ దానిపై రాసే తెలుపు అక్షరాలే విద్యార్థుల జీవితానికి దారిదీపాలు. నల్ల బోర్డుపై తెల్ల అక్షరాలు స్పష్టంగా కనిపించడమే కాదు, వాటి ప్రాముఖ్యతను కూడా నలుపే అందిస్తుంది. అది శిక్షణకు మార్గదర్శి. ఆరోగ్యానికి, అందానికి కూడా నలుపు అవసరం నల్ల నేరేడు, నల్ల ముళ్లి వంటి పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తహీనతను నివారించడంలో వీటి పాత్ర ఎంతో గొప్పది. కళ్లకు మెరుపు ఇచ్చే నల్లటి కాటుక ఆత్మవిశ్వాసానికి చిహ్నం. బొట్టు, చుక్కలుగా పెళ్లికూతురి ముస్తాబులోనూ నలుపు కీలకం. భ...

పండుగ

అబ్బా ! మాకు మనుమలు పుట్టిన తర్వాత కూడా ఇంకా పండగలు ఏమిటి? మేము సంక్రాంతి పండుగకు రాముఅంటూ జానకమ్మ గారి పెద్ద కూతురు చిన్న కూతురు చెప్పిన సమాధానం విని వీడియో కాల్ లో జానకమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ "చూడండి నేను నాన్న ఉన్నంతవరకు ఈ పండుగలు ఆ తర్వాత ఎవరికి ఎవరో అంటూ జాలిగా పిల్లల వైపు చూసింది.   జానకమ్మ గారి పెద్దమ్మాయి రెండో అమ్మాయి పక్కనే ఉన్న భర్తల కేసి చూశారు. ఏం సమాధానం చెప్పాలని.  ఆడపిల్లలు మనవలని ఎత్తిన భర్తల అనుమతి లేకుండా ఏదీ చేయరు. భర్తలు మౌనంగా ఉండడం చూసి సరేనమ్మా వస్తామంటూ పెద్దమ్మాయి చిన్నది ఫోన్లు పెట్టేసారు. జానకమ్మ గారి పెద్దమ్మాయి రాగిణి రెండో అమ్మాయి రమ ఇద్దరు కూడా హైదరాబాదులోనే ఉంటున్నారు. ఇద్దరికీ ఇద్దరేసి ఆడపిల్లలు మనవరాళ్ళకి పెళ్లిళ్లు అయిపోయి ఇద్దరేసి పిల్లలు పుట్టారు.  ఆఖరి అమ్మాయి రజిని అమెరికాలో ఉంటుంది. "అమ్మ నేను తప్పకుండా వస్తాను అంటూ అమ్మకు సమాధానం చెప్పి సంతృప్తి పరిచింది. ఆ అమ్మాయికి పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది ఆ పిల్ల పాపం ఏడాదికోసారి వస్తుంది. అది కూడా సంక్రాంతి పండక్కి. ఇంకా పిల్లలు పుట్టలేదు. పిల్లలందరూ పండగలకు వస్తారుట...

బొమ్మ కావాలి

సాయంత్రం నాలుగు గంటలు అయింది. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ సందర్శకులతో సందడిగా ఉంది. ఆరోజు ఆదివారం. కొంతమందికి ఆటవిడుపు. మరి కొంతమందికి ఏరోజైనా ఒకటే. బ్రతుకు బండి నడవాలంటే మూడు వందల అరవై ఐదురోజులు ఆ తీరంలో బ్రతుకు సమరం సాగించవలసిందే. ఆ సాగర తీరంలో ఒక మూలగా దుప్పటి పరుచుకుని దాని నిండా బొమ్మలు పెట్టుకుని పక్కన చంటి బిడ్డను కూర్చోబెట్టుకుని బొమ్మల అమ్ముతోంది ఓ యువతి. అది ఆమె బ్రతుకు సమరం. ఉదయం పూట రహదారి పక్కన సాయంకాలం సాగర తీరం లో బొమ్మలు అమ్మడం ఆమె దినచర్య.  ఉదయమేఇంత ముంత కట్టుకుని షావుకారు దగ్గర బొమ్మలు  తెచ్చుకుని తట్టలో బొమ్మలు పెట్టుకుని ఒక చేత్తో బిడ్డను నడిపించుకుంటూ బ్రతుకు సమరం ప్రారంభిస్తుంది. సాయంకాలానికి షావుకారు ఇచ్చిన రోజు కూలీతో బ్రతుకు జీవనం సాగిస్తుంది. ఆమె పేరు నరసమ్మ. ఆమె పక్కనే కూర్చుని ఇసుకలో ఆడుకుంటున్న ఆ పోరడి పేరు రాజు. రాజు ఉదయం నుంచి ఒకటే ఏడుపు. బొమ్మలు కావాలని. పాపం చేతిలో ఎన్నో బొమ్మలు ఉన్న ఒక బొమ్మ కూడా ఆ పిల్లాడికి పిచ్చి ఆడించలేని ఆర్థిక పరిస్థితి ఆమెది. ఒక బొమ్మ ఖరీదుతో ఒకరోజు జీవితం నడిచిపోతుంది నరసమ్మ కి. అందుకే ఉదయం నుంచి ఏదో సాకు చెబుత...