పోస్ట్‌లు

పలకని మొబైల్

 పలకని మొబైల్ ఉదయం 10:00  గంటలు అయింది  అప్పుడే మార్కెట్లోని షాపులన్నీ తీస్తున్నారు. రోడ్డుమీద ఎక్కువగా జనం లేరు.   ఎప్పటిలాగే శంకరం తన మొబైల్ షాప్ తలుపు తీస్తున్నాడు. మొబైల్ అమ్మకాలతో పాటు రిపేర్లు కూడా చేస్తుంటాడు శంకరం షాప్ అంతా శుభ్రం చేసి సీట్లో కూర్చుని చుట్టూ పరికించి చూశాడు.  ఎక్కడ చూసిన మొబైల్ కనపడుతున్నాయి. మొబైల్ కూడా నిత్యవసర వస్తువుల తయారైంది.  రోజు రిపేర్ కోసం అని,  మొబైల్ లు కొత్తవి తీసుకోవడానికి జనం వచ్చి పోతుంటారు.  మార్కెట్లో కొత్త మోడల్ వచ్చిందంటే కొంతమంది  పాతవి అమ్మేస్తుంటారు.  నిత్యజీవితంలో మొబైల్ అవసరం ఎంత బాగా పెరిగిపోయింది అంటే  అది లేకుండా జీవితం గడపడం కష్టం అయిపోయింది.  మనిషిలా తోడుగా ఉంటుంది. కబుర్లు మోసుకొస్తుంది. మనసుకు ఆనందపరుస్తుంది. అలాంటిది మొబైల్ ఒక రోజు పని చేయకపోతే పిచ్చెక్కిపోతుంది. అలాగే ఉంది పరమేశ్వర రావు పరిస్థితి. అప్పుడే నెల రోజుల నుంచి మొబైల్ ఉలుకు పలుకు లేదు . అసలు రింగ్  రావట్లేదు.  ఏం పాడయిందో ఏమిటో! పోనీ రిపేర్ కి తీసుకెళ్దాం అంటే ఈ ఆశ్రమం నుంచి రిపేర్ షాప్ నాలుగు క...

రహస్యం

సాయంకాలం నాలుగు గంటలు అయ్యింది. కాకినాడలోని జన్మభూమి పార్క్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. పిల్లలు అరుపులు, కేకలు, గోలలు, ఈలలతో సందడిగా ఉంది. ఇంతలో ఒక యువ జంట అలా పార్కులో నడుచుకుంటూ వెళుతున్నారు. తెల్లగా, బొద్దుగా ఉన్న మూడేళ్ల వయస్సు ఉన్న కుర్రాడు ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ అబ్బాయిని చూడగానే ముచ్చటేసింది అమ్మాయికి. వెంటనే ఎత్తుకుని పక్కనే ఉన్న భర్త వైపు చూసింది. ఆ చూపులో ఉన్న అర్థం భర్త రాకేష్‌కు అర్థమైంది. ఆ చూపు రాకేష్‌కి ఏమీ కొత్త కాదు. పార్కుకి వెళ్లినప్పుడల్లా ఎవరో ఒకరు పిల్లవాడు కనపడడం, ఆ పిల్లవాడి వైపు భార్య రమ ఆశగా చూడడం, లేదంటే ఎత్తుకొని ముద్దాడడం, చివరకి రమ రాకేష్‌ వైపు ఆశగా చూడడం ప్రతిసారి జరుగుతున్నదే. రమ అలా చూసినప్పుడల్లా రాకేష్ గుండెల్లో గునపం గుచ్చినట్లు అవుతుంది. మనసు బాధపడుతుంది. ఇంతలో ఆ చంటి పిల్లాడు తల్లి వచ్చి పిల్లవాడిని తీసుకు వెళ్లిపోయింది. "అవును! మన పిల్లవాడు అయితే మన దగ్గరే ఉంటాడు" అనుకుని రమ నిట్టూర్చి, "ఇంటికి వెళదామా?" అంటూ భర్తను ఉద్దేశించి చెప్పింది. అంటే రమ బాధపడుతోందన్నమాట. చేసేదేమీ లేక ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయ...

గురువు

ఆషాఢ శుద్ధ పౌర్ణమి – గురు పౌర్ణమి. వ్యాస మహర్షి జన్మదినం. ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు వ్యాస మహర్షిని పూజించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. నాలుగు వేదాలను లోకానికి అందజేసిన వారు వ్యాస మహర్షి. అష్టాదశ పురాణాలను ఆయనే రచించారు. మానవ జీవితం నడవడికకు ఇవే ప్రమాణాలు. అయితే నిత్య జీవితంలో, అంటే బాల్యం నుంచి అనేకమంది వ్యక్తులు మనకు మంచి మాటలు చెప్పి, మనల్ని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దేవారు ఉంటారు. వారందరూ కూడా మనకు గురువులే. మొట్టమొదటి గురువు తల్లి. మంచి చెడ్డలు నేర్పేది తల్లిదండ్రులు మాత్రమే. ప్రతి వ్యక్తి మీద తల్లి ప్రభావం చాలా ఎక్కువ. పిల్లలకు తల్లి దగ్గర చేరిక ఎక్కువగా ఉంటుంది. తండ్రి అంటే భయం. చిరు ప్రాయంలోనే తల్లి నీతి కథలు, రామాయణ మహాభారత కథలు చెబుతుంది. ఆ వయసులో తప్పుడు పనులు చేయకూడదని అర్థమవుతుంది. మనకు జ్ఞానం వచ్చే వరకు మన నడవడికను తీర్చిదిద్దేది తల్లే. ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను కూడా తల్లి దగ్గర నుంచే తెలుసుకుంటాము. కొంత వయసు వచ్చిన తర్వాత పాఠశాల చేరినప్పుడు ఓనమాలు దగ్గరుండి దిద్దించి, భవిష్యత్తుకు పునాది వేసేవారు ఉపాధ్యాయులు. అక్షరాన్ని కనుక మనం నేర్చుకోకపోతే, ఎవరు బ్రతుకు బ...