పోస్ట్‌లు

నన్ను వదిలి ఉండగలవా

"నన్ను వదిలి ఉండగలవా! మనమందరం ఎలాగా బందీ అయిపోయాము. బందీ అయిపోయామంటున్నారు. దేనికో చెప్పకుండా సందేహం పెంచారు. సాధారణంగా బందీలు అనే మాట వ్యసనానికి సరిపోతుంది. నిజమే నాకు కూడా ఒక సందేహం .ఇది వ్యసనమా కాదా. అవునని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాదని చెప్పడానికి కారణాలు కూడా ఉన్నాయి.  ఎక్కడో జపాన్లో పుట్టి జగమంతా వ్యాపించింది. అది లేకపోతే మనకు జరుగుబాటు లేకుండా ఉంది. మనం అత్యధికంగా ప్రేమించే వస్తువుల్లో ఇది కూడా జేరిపోయింది. ఎక్కడో మూలగా నడవలో బల్ల మీద కూర్చుని సమాచారాన్ని మోసుకొచ్చే ఆ యంత్రాన్ని పడగొట్టేసి సాంకేతికంగా ఎదిగిపోయి చిన్న బొమ్మగా చేతిలో చేరిపోయి సమాచారాన్ని ఇట్టే మోసుకొస్తోంది, తీసుకుపోతోంది. సమాచారంతోపాటు మన సరదాలు కూడా తీరుస్తోంది. సమయం చెబుతోంది. పది పైసలు ఖర్చు లేకుండా మన ప్రతిబింబాలన్నీ క్షణాల్లో చూపిస్తోంది.  ఆ బుజ్జిముండ మీద మీకు ఎందుకు అంత కోపం? రోజు మీ బంధువుల స్నేహితుల పిల్లల క్షేమ సమాచారం తీసుకొస్తోంది కదా అని సమర్థించే వాళ్ళు ఇది వ్యసనం కాదని ఓటేశారు. ఇంకా అనేక కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇది లేకపోతే ఒక క్షణం విడిచి ఉండలేని పరిస్థితి. కనపడకపోతే ...

దుస్తులు

దుస్తులు "  పుట్టినప్పుడు బట్ట కట్టలేదు.  పోయేటప్పుడు అది నీ వెంట రాదు." అన్నాడు ఒక సినీ కవి. అంటే ఈ మధ్యకాలంలో తన శరీర  భాగాలని బహిర్గతం చేయకుండా కాపాడుకోవడానికి దుస్తులు  ధరిస్తాడు మానవుడు. ధరించే దుస్తులు మానవుడికి సరికొత్త  అందాన్ని ఆనందాన్ని తీసుకొస్తాయి. మన సమాజంలో దుస్తులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మనం ధరించే దుస్తులు చలి నుండి ఎండ నుండి మన శరీరాన్ని కాపాడు తాయి. రోజు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఒక రకమైన ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. ఇది ఆఫీస్ వారి నియమ నిబంధనలో డ్రెస్ కోడ్ ఉంటుంది. దుస్తులు ధరించిన ఉద్యోగులు పలానా ఆఫీస్ వారని ప్రజలకు తెలుస్తుంది. ఈ డ్రెస్ కోడ్ గనక పెట్టకపోతే నైట్ డ్రెస్ లతో కూడా ఆఫీసులకు వచ్చే ప్రమాదం ఉంది. పదిమంది తిరిగే ఆఫీసులో అది సభ్యతగా ఉండదు. అది ఆ మనిషి గౌరవం తగ్గిస్తుంది. ఆ కార్యాలయానికి చెడ్డ పేరు వస్తుంది.  అలాగే స్కూల్లోనూ కాలేజీలోనూ చదివే పిల్లలకు అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించాలని నియమ నిబంధనలు ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలందరూ ఒక్కటే ధనిక పేద తేడా ఏమీ లేదని చెప్పడమే. ఆదిమానవుడు కూడా ఆకుల తోటి లతలతోటి తన శరీరాన్ని కప్పుకు...

పరమాత్మ

పరమాత్ముడు  పప్పు రుబ్బే రుబ్బురోలు పరమాత్ముడిని తలచి షోడశోపచార ములు చేసి పూజలు చేసే ఒక పడతి. ఆ పడతి కి వెఱ్ఱి యని ప్రజలు తలచే పరమాత్ముడు ఎందైన కలడని పోతన చెప్పె. భవన స్తoభము నుండి నరసింహుడు అవతరించి ప్రహ్లాదుని రక్షించే. దశావతారములు ఎత్తి విష్ణువు భక్తులను రక్షించే. రహదారి పక్కన తాడిచెట్టుని అమ్మగా తలచి పసుపు కుంకుమలు పూసే మానవుడు. పుణ్యమని దలచి వే ప కి రావికి కల్యాణం జరిపించే. మూగ జీవిని వెంకటేశ్వరుడని తలచి అచ్చు వేసి రహదారిలోకి విడిచే . వానరం కనపడగానే వంగి వందనము చేసి హనుమగా తలిచే. దీనులలోనే కనబడింది దైవం మదర్ తెరిసా కి మానవసేవే మాధవసేవ అని నమ్మింది రామకృష్ణ పరమహంస. మనసుపెట్టి చూస్తే ప్రతి ప్రాణిలోనూ ఉంది దైవం. ఆ మనసు పేరే మానవత్వం. మనసు మెచ్చే పని చేయడమే మనిషి లక్షణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.           కాకినాడ 9491792279