పోస్ట్‌లు

మే, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

మగ మహారాజు

మగమహారాజు ఇది మహానటుడు నటించిన సినిమా కాదు. నూరేళ్లు జీవితం గడపాల్సిన ఒక మహావీరుడి గాధ. మగమహారాజు అంటే వంశమును నిలబెట్టే మహావీరుడు అందుకే గర్భవతులైన వారిని పండంటి మగ బిడ్డని కనాలని ఆశీర్వదిస్తారు. మగ పుట్టుకంటే అంత క్రేజీ. మగ పిల్లలందరూ తలపై కిరీటాలు పెట్టుకుని పుట్టరు. జన్మ ఎవరికైనా ఒకటే. అందరూ ఆ తల్లి గర్భం నుంచి పుడతారు. ఏమిటి మగ పిల్లల ప్రత్యేకత . పుత్రుడే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ అధికారం ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. మగపిల్లాడు పుట్టాడు అంటే అందరికళ్ళల్లోనూ సంతోషo. వంశాన్ని ఉద్ధరించే ఒక అంకురం పుట్టిందని ఆనందo పడిపోతారు. ప్రత్యేకంగా ప్రేమగా పెంచుకుంటారు. తల తాకట్టు పెట్టి ఉన్నత విద్యలు చదివిస్తారు. అదృష్టం బాగుంటే చదువుకు తగిన ఉద్యోగం. మంచి జీతం. దేవుడిచ్చిన, వంశానుగతంగా వచ్చిన రూపం. డబ్బు హోదా . కార్లు బంగ్లాలు సంపాదిస్తారు ఒక ఇంటి వాడిని చేయవల్సిన వయసు వస్తుంది.  ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఈ రోజుల్లో చాలా సులభo . కానీ ఒక జీవిత భాగస్వామి దొరకడం ప్రస్తుతం కష్టమైన పని . భగీరథుడు గంగాదేవిని భూమికి తీసుకురావడానికి ఎంతకాలం తపస్సు చేశాడో తెలియదు గానీ ఒక...

ఆడపిల్ల

ఆడపిల్ల  జీవితంలో కొన్ని అదృష్టాలు కొంతమందికే కలుగుతాయి. అటువంటి వాటిలో ఇంటిలో ఆడపిల్ల పుట్టడం. ఆడపిల్ల పుట్టిందంటే అందరూ భయపడతారు.దాన్ని పెంచి పెద్ద చేయడం ఒక బాధ్యతని,సంఘంలో గౌరవంగా మసిలే బుద్ధులు చెప్పడం మరొక బాధ్యతని,పెళ్లిళ్లు చేయాలని పేరంటాలు చేయాలని,అందుకే అది మన గుండెల మీద కుంపటి అనిఇలా రకరకాలుగా ఆడపిల్ల గురించి భయపడతారు. నిజానికి ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి రూపం. కళ్ళకు కాటుక పెట్టుకుని ,కాళ్లకు గజ్జెలు కట్టుకుని ,నుదుట తిలకం దిద్దుకుని, చేతులకు గాజులు ,పట్టుపరికిణి పట్టుకుని ఇల్లంతా కలయ తిరుగుతుంటే లక్ష్మీ స్వరూపమే కనపడుతుంది. అసలు ఆడపిల్ల పుడితేనే తండ్రికి బాధ్యత అంటే ఏమిటో తెలుస్తుంది. కన్యాదాన ఫలితంగా ముందు తరాలు తరిస్తాయి. ఆడపెళ్లి వారు అయితేనే అతిధిని ఎలా గౌరవించాలి అనే విషయం , ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే విషయం నేర్చుకుంటారు తల్లిదండ్రులు. అందుకనేమో పెళ్లి చూసి చూడు ఇల్లు కట్టు చూడు అనే సామెత వచ్చింది నిజానికి ఆడ మగ ఒక ప్రకృతి స్వరూపమైన తేడాయే కానీ ఈ రోజుల్లో ఇద్దరకి తేడా ఏమీ లేదు. ఇద్దరికీ విద్యాబుద్ధులు నేర్పించాలి. పెళ్లిళ్లు చేయాలి పేరంటాలు చేయాలి. ఇంకా పెద్ద ...

ప్రసాదం

ప్రసాదం  ఆ నవరాత్రులు కొందరి బ్రతుకుకి వెన్నెల రాత్రులు రెండు చేతులు చాచి అమ్మా ఆకలి అంటే గాని డొక్క లేవని ఆ బడుగు జీవులకి అవి నిజంగా పండగ రోజులే. ఊరువాడ తిరగక్కర్లేదు అమ్మ అయ్య అని పిలవక్కర్లేదు సందు చివర పచ్చటి పందిరిలో బొజ్జ గణపయ్య సన్నిధిలో బల్లమీద కాలక్షేపం చేస్తే మైక్ లో ఆహ్వానించి మరీ డొక్క నింపుతారు. ఉదయం సాయంకాలం గణపయ్యకి గరిక పూజలు. ప్రజలకి పాప భీతి పెరిగిపోతుంది. పూట పూటకి వెరైటీ నైవేద్యం. ఆ బడుగు జీవికి గుండెల్లో ఎక్కడలేని ధైర్యం. పండు వెన్నెల లాంటి కుడుములు పచ్చటి పసుపు లాంటి పులిహార అబ్బా ఎంత బాగుంది చక్ర పొంగలి కమ్మటి పెరుగు తో చేసిన దద్దోజనం అటుకులు బెల్లం రుచి చెప్పక్కర్లేదు కాలక్షేపం కోసం చేసిన బటానీలు కాదు బొజ్జ గణపయ్య కరుణ కోసం ఉడకబెట్టి పోపేసిన శనగలు. కొబ్బరి ముక్కలు పంచదార కోటయ్య కాజా  బందరు లడ్డు ఆత్రేయపురం పూతరేకులు మాడుగుల హల్వా అబ్బా స్వామి వారిదేమి అదృష్టం స్వామి వారిది కాదు మాలాంటి బడుగు జీవులిది. రోజు రాత్రి ఖాళీ కడుపుతో కాళ రాత్రి లా ఉండేది ఇప్పుడు ఈ నవరాత్రులు మాకు వెన్నెల రాత్రే. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

రాఖీ పండుగ

రాఖీ పండుగ  ఉదయం 9 గంటలయింది రామరాజు   ఆఫీస్ కి వెళ్లే హడావుడిలో బిజీబిజీగా ఉన్నాడు. రామరాజు మలక్ పేట్ లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నత ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఎప్పుడు ఆఫీసుకి 9 గంటలకే బయలుదేరుతాడు  ఏవండీ రేపు ఆఫీస్ కి రెండు గంటలు ఆలస్యంగా వస్తానని పరిమిషన్ తీసుకోండి అంటూ భార్య సరోజ వంటింట్లోంచి  గట్టిగా  అరిచింది. ఏమిటి విషయం అంటూ భార్యని ప్రశ్నించాడు  రామరాజు. రేపు రాఖీ పౌర్ణమి అండి. మీ చెల్లెలు రాఖీ కట్టడానికి వస్తానని నిన్ననే ఫోన్ చేసి చెప్పింది అంటూ సమాధానం ఇచ్చింది. రామరాజుకి  ఒక్కగానొక్క చెల్లెలు సుమతి కూడా అదే ఊర్లో వనస్థలిపురం లో  ఉంటుంది. ప్రతి ఏడాది రాఖీ పండక్కి తప్పకుండా ఇంటికి వచ్చి అన్నగారికి రాఖీ కట్టి వెళుతుంది. ఉత్త రోజుల్లో  మొబైల్లో పలకరించుకోవడం తప్ప రాకపోకలు ఉండవు. ఒకే సిటీలో ఉంటున్న ఎవరి పనులు , ఎవరి హడావుడి వారిది. ఉదయం లేచిన దగ్గర్నుంచి పరుగే. ఎవరిని ఏం అనడానికి లేదు . రామరాజు మాత్రం ప్రతి ఆదివారం చెల్లెలికి ఫోన్ చేసి క్షేమమాచారాలుతెలుసుకుంటాడు. ఇంటికి వెళ్లి పలకరించే  తీరుబడి ఇద్దరికీ ఉండదు. రామరా...

ఇంకేంటి కబుర్లు

ఇంకేంటి కబుర్లు  ఏ ఇద్దరు కలుసుకున్న వారి మధ్యలో ఉన్న మౌనాన్ని  పోగొట్టడానికి, దగ్గర చేయడానికి కబుర్లు ఒక ఆధారం. కబురు అంటే సమాచారం, సందేశం, వర్తమానం ,ఇలా చాలా రకాల అర్ధాలు ఉన్నాయి. ఎలా ఉన్నారు అంతా కులాసా యేనా అంటూ ప్రారంభమైన పలకరింపు అలా కబుర్లుకు దారితీస్తుంది. పక్కింటివాళ్ళతో గోడకి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ,రోడ్డుమీద ఎదురుపడితే, బజార్లో కనబడితే ,పార్కులు ,రచ్చబండలు ,పల్లెటూర్లో బావులు, చెరువులు,మున్సిపాలిటీ కుళాయిలు ఇప్పుడైతే ఫేస్బుక్లో వాట్సాప్ లో ఇన్స్టాగ్రాములు ఇవన్నీ కబుర్లు చెప్పుకోవడానికి స్థావరాలు. కొంతమంది చెవిలో చెప్తారు . కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ ఉంటే దెబ్బలు ఆడుకున్నట్టు ఉంటుంది. మైక్ లో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఇద్దరు మనుషులు కలుసుకుంటే తెలుసున్న సమాచారం చేర వేయకుండా ఉండలేరు. బాధలు చెప్పుకోకుండా ఉండలేరు కొంతమంది గొప్పలు చెప్పుకోకుండా ఉండలేరు. ఎదుటివారి పరిస్థితి గురించి అర్థం చేసుకోరు. అలా చెప్పుకుంటూ పోతుంటారు. ఒకే రకమైన అభిరుచి ఉన్న వాళ్ళని ఆ రంగానికి సంబంధించిన వార్త దగ్గర చేస్తుంది. స్నేహం పెంచుతుంది. సాధారణంగా యువత అంతా క్రికెట్ గురించి సినిమాలు ...

పెద్ద సమస్య

పెద్ద సమస్య అది నగరంలోని పెద్ద పేరు మోసిన కార్పొరేట్ ఆసుపత్రి లోని  ఎమర్జెన్సీ వార్డ్. పదో నంబరు బెడ్ చుట్టు డాక్టర్లు నర్సులు బెడ్ చుట్టూ చేరి తన తమ పనుల్లో హడావిడిగా ఉన్నారు. పేషంట్ బంధువులుమాటిమాటికీ ఆందోళనగా వార్డులోకి తొంగి చూస్తున్నారు.  ఇంతలో తెల్ల కోటు వేసుకొన్న పెద్ద డాక్టర్ గారు వార్డులోంచి బయటకు వచ్చి సీరియస్ గా తన గదిలోకి వెళ్ళిపోయారు. లోపల వార్డులో పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఎవరిని లోపలికి రానివ్వడం లేదు. డాక్టర్ గారు రూములోంచి నర్సు బయటకు వచ్చి పదో నంబరు బెడ్ రామారావు గారు తాలూకు ఎవరైనా ఉన్నారా అంటూ నాకేసి ప్రశ్నార్థకంగా చూసింది. అవునండి నేనే అంటూ ముందుకు వెళ్లాను. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు లోపలికి రండి అంటూ రూము తలుపులు తీసింది.నన్ను చూడగానే డాక్టర్ గారు వెరీ సారీ అంటూ సీట్లోంచి లేచి సిస్టర్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత బాడీని వీరికి అప్పగించండి అంటూ బయటకు వెళ్ళిపోయారు. ఒకసారి కాళ్ల కింద భూమి కదిలినట్లయ్యింది. దుఃఖం ఆగలేదు. అలాగే ఏడుస్తూ బల్ల మీద  కూర్చుండిపోయాను. నాన్న హార్ట్ ఎటాక్ తో ఆస్పత్రిలో చేరి మూడు గంటలకు కూడా కాలేద...

కోరిక

కోరిక అది రద్దీ ఎక్కువగా ఉండే రాజధానినగరంలోని ఒక వీధి లో  ఉండే హోటల్ ప్రాంగణం. సుమారుగా 80 సంవత్సరాల నుండి ఆ హోటల్ అదే వీధిలో ఉంది. భోజనం హోటల్స్ చాలా  ఉంటాయి. కానీ కస్టమర్ల్ని ఆదరించి ఆప్యాయంగా కొసరి  కొసరి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టే ఆ హోటల్ ఒక్కటే. అందుకే దూరప్రాంతాల నుండి వచ్చినవారు తప్పనిసరిగా ఈ  హోటల్ లో భోజనం చేసి వె డతారు. చక్కగా అరిటాకు వేసి వడ్డించి తెలుగువారి భోజనం పెట్టె ఏకై క భోజనశాల. కమ్మగా వేయించిన కందిపప్పు పప్పులోకి ఒక చిన్న పాత్రలో వేడివేడి నెయ్యి పనసపొట్టు కూర గుత్తి వంకాయ మజ్జిగ పులుసు గోంగూర పచ్చడి గడ్డ పెరుగు  ఆవకాయ దప్పుళo ఆకులో మెరిసిపోతూ ఆకాశంలోని హరి విల్లులా ఉంటాయి. ఆకు చూడగానే నోరూరిపోతుంది. నోట్లో పెట్టుకోగానే చేతులెత్తి మొక్కాకనిపిస్తుంది. అందుకే ఎక్కడ లేని రద్దీ. ఎప్పటిలాగే ఆరోజు కూడా హోటల్ ప్రాంగణం చాలా రద్దీగా  ఉంది. లంచ్ సమయం కావడంతో సీట్లు ఖాళీ లేక కస్టమర్లు  వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. వెయిటర్లు అటు ఇటు  బిజీబిజీగా తిరుగుతూ వచ్చిన కస్టమర్లకు ఏం కావాలో   చూస్తున్నారు. ఆ హోటల్ యజమాని ప్రతి...

ఎవరికి రుణం

ఎవరికి ఋణo ఉదయం పది గంటలు అయింది. తెల్లటి కారు ఆ వృద్ధుల ఆలయం ముందు ఆగింది. కారులోంచి  బ్యాగ్ పట్టుకుని ఒక యువకుడు ఒక వృద్ధురాలు దిగి తిన్నంగా రిసెప్షనిస్ట్ గదిలోకి తొంగి చూసారు. అప్పటికే రిసెప్షనిస్ట్ చుట్టూ చాలామంది గుమిగూడి ఉన్నారు. అమ్మా ఇక్కడ కూర్చుoదాము ఖాళీ అయ్యాక వెళ్ళవచ్చు అంటూ గది బయట ఉన్నబల్ల మీద కూర్చున్నారు తల్లి కొడుకు. కొంతసేపటికి జనమంతా బయటకు వచ్చేసారు. అమ్మ నేను వెళ్లి మాట్లాడ వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు అన్నాడుకొడుకు రఘు.ఆ తల్లి నుండి ఏమి స్పందన లేదు. ఎటో చూస్తూ ఉండిపోయింది. మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగపీలుస్తోంది.మొహం అంతా కందగడ్డలా ఉంది.  నాన్నగారి పోయిన తర్వాత అమ్మ బాగా బెంగపెట్టుకుంది ఆరోగ్యం కూడా సరిగా లేనట్టుగా ఉంది. నాన్న బతికున్న  ఉన్నన్నాళ్ళు ఆమెకు ఏ దిగులు లేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ఒంటరి అయిపోయింది. అమెరికా తీసుకెళ్దామంటే ఇద్దరు ఉద్యోగస్తులo. పిల్లలంతా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పెద్దవాళ్లకు అక్కడ తోచదు. ఒంటరిగా ఇంట్లో ఉండవలసి వస్తుంది.  చాలామంది భార్యలు లాగే తన భార్య కూడా అమ్మ చేత పనులు చేయిస్తుంది. అమ్మ నాన...

త్యాగమూర్తులు

త్యాగమూర్తులు వీరికి గుడులు గోపురాలు ఉండవు ఎగిరే మువ్వన్నెల జెండాలో అందరికీ మూడు రంగులే కనిపిస్తాయి. మనసుపెట్టి చూస్తే అమరవీరుల ఆశయాలు కనిపిస్తాయి. అసువులు బాసిన అమరవీరులందరి ఆశయాలకు గుర్తులుగా  ఎర్రకోట పై రెపరెపలాడుతోంది మూడు రంగుల జెండా . ఆ మహనీయుల అందరి ఆశయం ఒక్కటే. దేశాన్ని విదేశీ సంకెళ్ల నుండి విడిపించడమే. ఎవరికి నచ్చిన మార్గం వారు ఎంచుకొని పరాయి పాలన ఎదిరించి స్వాతంత్ర సమరయోధులుగా చరిత్రలో మిగిలిపోయారు.  ఈనాడు ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే ఆనాడు ఎందరో వీరుల ఊపిరి ఆగిపోయిమట్టిలో కలిసిపోయి మహనీయులుగా మిగిలిపోయారు. వారు స్వాతంత్ర ఫలముఅనుభవించలేదు. పదవుల కోసం ఆశపడలేదు. బ్రతికున్న రోజుల్లో కారాగార శిక్ష అనుభవించి ఉరికంబo ఎక్కి అసువులు బాసిన మహాత్ములు.  అహింసావాదంతో గాంధీజీ బ్రిటిష్ వారిని గడగడలాడిస్తే బంకించంద్ర చటర్జీ వందేమాతర గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతం రచించి జాతిని ఉత్తేజపరిచారు. దేశభక్తి ఉప్పొంగించారు. మరికొందరు ఆనాడు సమాజంలో ఉన్న సతీసహమగమనాన్ని బహు భార్యత్వాన్ని ఎదిరించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి రాజా రామ్మోహన్ రాయ్ గా ప్రజల గుండెల్లో...

ఆఖరి ఉత్తరం

ఆఖరి ఉత్తరం ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. పది రోజుల నుండి బంధువులతోటి పిల్లలతోటి కర్మకాండలతోటి హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో ఇల్లు బోసిగా ఉంది.  ముప్పై ఐదు సంవత్సరములు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టారు కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరు ఇ ళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఇక మిగిలింది లంక అంత కొంప భార్య పార్వతమ్మ. పిలిస్తే పలికే నాధుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.  కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు గాని కన్నతల్లి ఎలా బ్రతుకుతుందని ఆలోచన ఏ ఒక్కరికి లేదు. అమ్మ వెళ్లి వస్తాo అంటూ పిల్లలు వెళ్లిపోయారు . అంతా కలలా జరిగిపోయింది. భర్తకు భార్య భార్యకు భర్త ఒకరికొకరు తోడు. ఒకరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎవరు తోడు అనుకుంటూ కళ్ళనుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి. ఇంతలో పోస్ట్ అని కేక...

మన విశాఖ

మన విశాఖ ఉక్కు నగరo కాదు ఉర్రూతలు ఊగించే నగరం విశాలమైన నగరం మనోవికాసానికి సరియగు స్థలం. మన విశాఖ నగరం. విహారయాత్రలకు అనువైన స్థలం ఉక్కు లాంటి పట్టుదల సాగరం లాంటి మనసు నిత్యం అప్పన్న ఆశీర్వాదం  కలిమికి కనకమహాలక్ష్మి అండ సంపదలు ఇచ్చే సంపత్ వినాయకుడు విశాఖ వాసులకు అదే అదృష్టం సుందర నగరం మీదుగా జాతీయ రహదారి నడిరేయిలో కూడా నగరం చేర్చే సౌకర్యమే హాయి నాలుగు చక్రాల బండి ఉంటే సరే సరి షికారుకి సాగర తీరాలన్నీ రెఢీ సంపత్ వినాయకుడికి అభిషేకం చేసుకుని కనకమహాలక్ష్మి పూజ ముగించుకుని విహారయాత్ర విజయంగా జరగాలని యారాడ వైపు దారి తీద్దాo. ముచ్చటగా మూడు దిక్కుల కొండలు నాలుగోదిక్కు నీలి రoగు సముద్రం యారాడ సాగర తీర విహారం ప్రతి మనిషికి ఉత్సాహo ఆ సాగరానికి కొండలకి మధ్య అనుబంధం ఆటుపోటులు ఎన్ని వచ్చినా కొండకి కరగని ధైర్యం జలకాలాడే చేప పేరు ధరించి ఆ కొండ తీర్చుకుంది రుణం. కొండ ఎక్కించి నగరవాసులకు చూపుతోంది సాగరమంతా అదే డాల్ఫిన్ నోస్. ఆ సాగర తీరం ఋషులుగా మారుస్తుంది అలలన్నీ పాదాలకు తాకి మనసును అందలం ఎక్కిస్తుంది అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అది రుషులు లేని ఋషికొండ  వయస్సుతో నిమిత్తం లేదు పడి లేచే ...

పట్టాభిషేకం

శ్రీరామ పట్టాభిషేకం. అసుర సంహారం చేయడానికి దేవతల కోరిక మేరకు శ్రీమహావిష్ణువు దశరధ మహారాజుకు కొడుకుగా పుట్టి సకల శాస్త్రాలు విద్యలు నేర్చుకుని విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ చేసి జనక మహారాజు కొలువులో శివధనుర్భంగం చేసి సీతాదేవిని భార్యగా చేపట్టి అయోధ్య నగరానికి పట్టాభిషిక్తుడయ్యే సమయంలో పినతల్లి కోరిక మేరకు తండ్రి ఆజ్ఞ మేరకు నార చీరలు ధరించి అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు. అరణ్యంలో ఉండగా మాయావి రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొని వెళ్ళిపోతాడు. వానర వీరుడు సుగ్రీవుడు సైన్యం సహాయంతో సముద్రాన్ని దాటి లంక నగరాన్ని చేరుకుని రావణ సేనతోయుద్ధం చేస్తూ అనేకమంది రాక్షసులను సంహరిస్తాడు. చివరిగా రావణాసురుడు తోటి తలపడతాడు. ఇలా భీకరంగా జరిగిన రామ రావణ యుద్ధంలో దశకంఠుడు శ్రీరామచంద్రమూర్తి చేతులో ప్రాణాలు కోల్పోతాడు. సమస్త దేవతలు ఆనంద ఉత్సాహాలతో పుష్ప వర్షం కురిపించారు. రామచంద్ర మూర్తికి అభినందనలు ఆశీస్సులు అందజేశారు విభీషణుడిని లంకా రాజ్యానికి అధిపతిగా చేసి రామచంద్రుడు అయోధ్య నగరానికి బయలుదేరుతానని తగిన ఏర్పాట్లు చేయమని కోరుతాడు .   కాలినడకన అయోధ్యకు బయలుదేరడం చాలా శ్రమతో కూడుకున్న పని ...

నోము

నోము సాయంకాలం నాలుగు గంటలు అయింది. చీకటి పడిపోతుందని ఒకటే భయం. ప్రతిరోజు చీకటి పడుతుంది. చీకటి అంటే భయం కాదు. ఇంకా గిన్నెలో సగం పైగా ప్రసాదం ఉండిపోయింది వచ్చే వాళ్ళు ఎవరూ కనబడటం లేదు.  ఎలాగా ఇది దేవుడు పెట్టిన పరీక్ష కాబోలు అనుకుంటూ దేవుడికి అనేక దండాలు పెట్టుకుంటూ ఆ అగ్రహారంలో ప్రతి ఇంటికి ఇద్దరు మనుషులను పంపించి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారేమో అని లేదంటే ఇంట్లో ఉన్నవాళ్లు ప్రసాదం తినడానికి రాకుండా ఉండిపోయారేమో అని ఎంక్వయిరీ చేస్తూ ఎదురుచూస్తోంది సీతమ్మ. ఆ ఊరికి వచ్చే ఆఖరి బస్సు ఐదు గంటలకు వస్తుంది. ఆ బస్సులో ఎవరింటికైనా చుట్టాలు రాకపోతారా అని ఆశగా చూస్తోంది. సాధారణంగా స్త్రీలు ఎన్నో నోములు వ్రతాలు చేస్తుంటారు. ప్రతి నోము కి ఒక రకమైన నియమం ఉంటుంది. మరి సీతమ్మ గారు పట్టి న నోము పేరు చెప్పలేదు కదా. అదేనండి నంది కేశుడి నోము అన్నీ అయిపోయాయి కానీ ఒక్క సెనగలు మాత్రం మిగిలిపోయాయి సీతమ్మ గారికి. సూర్యాస్తమయం అయ్యే లోగా ఆ ప్రసాదం చెల్లిపోవాలి. ఇదివరకు ముందుగా వినాయకుడు పెట్టిన ఉండ్రాళ్ళు మధ్యాహ్నానికే చెల్లిపోయా యి.  కాలభైరవుడికి పెట్టిన గారెలు కూడా ఉదయం టిఫిన్ సమయానికి పిలిచి పెట్ట...

చిలిపి పనులు

చిలిపి పనులు అర్ధరాత్రి 12 గంటలు అయింది.  వీధి తలుపు ఎవరో కొడుతుండడంతో గాఢ నిద్రలో ఉన్న గోవిందరావుకి మెలకువ వచ్చింది. ఎవరబ్బా ఇంత అర్ధరాత్రి వేళ అనుకుంటూ తలుపు సందులో నుంచి బయటకు తొంగి చూసాడు. వీధిలో ఒక పదిమంది యువకులు  నిలబడి ఉన్నారు. "ఎవరండీ ఏం కావాలి అంటూ ప్రశ్నించాడు గోవిందరావు . 'చలపతి రావు గారు పంపించారండి ఎవరికో పురుడు వచ్చిందిట. ఇంగువ తీసుకురమ్మని పంపించారంటూ చెప్పారా యువకులు. వస్తున్నాను ఉండండి. కొట్టు తీస్తాను అంటూ పక్కనే ఉన్న కిరాణా కొట్టు గదిలోకి వచ్చి లైట్ వేసి డబ్బా గురించి వెతకడం మొదలెట్టాడు గోవిందరావు.  గోవిందరావు అంటే మా ఊర్లో ఉన్న ఏకైక కోమటి .కిరాణా కొట్టు వ్యాపారం అక్కడ లేని సరుకుంటూ ఉండదు. కానీ అన్ని హై రేట్లు. ఏ వేళ లేపిన సరుకు అప్పిస్తాడు. లేదు లేదంటూనే కిరాణా కొట్టు మీద ఆ ఊర్లో పది ఎకరాలు భూమి సంపాదించాడు. దానికి తోడు తాకట్టువాకట్టు వ్యాపారం కూడా ఉంది. అంతా వ్యవసాయదారులు. ఇంకేముంది వ్యవసాయం పనులు కోసం అప్పు తీసుకుని పంటలు రాగానే తీర్చేస్తుంటారు. పైగా ధాన్యo కొనుగోలు కూడా ఆయనే. మా ఊరుకి బ్యాంక్ లాంటివాడని చెప్పొచ్చు.  ఆయుర్వేదిక్ డాక్టర్...