పోస్ట్‌లు

సాయి

సాయి ఈ సృష్టి అంతా పరమేశ్వర ప్రసాదమే. అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనది మానవజన్మ. ఎందుకంటే అన్ని జీవులకీ ఇంద్రియాలు ఉంటాయి. కానీ మానవుడు మాత్రమే మాట్లాడగలడు. మాట మనిషికి దేవుడిచ్చిన వరం. నోరు ఆత్మీయంగా పలకరిస్తుంది; అవాకులు చవాకులు పలికిస్తుంది. అలాగే ఇంద్రియములన్నీ కూడా సక్రమంగా నడిస్తే ఏ బాధ ఉండదు. దారి తప్పితే మనిషి అధోగతిపాలవుతాడు. మనిషి తన నడవడికలో ఏది మంచి, ఏది చెడు తెలియజెప్పడానికి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు తోడ్పడతాయి. అలాగే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి భగవంతుడు అనేక అవతారాలు ఎత్తుతూ ప్రజలను రక్షిస్తూ వచ్చాడు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వంటి ఆధ్యాత్మిక గురువులు తమ బోధనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారు. మదర్ తెరిసా వంటి కరుణామూర్తి పేదలకు సేవ చేస్తూ ఆదర్శవంతంగా నిలిచారు. అలాగే హిందూ, ముస్లిం మతాలను రెండింటిని సమన్వయపరుస్తూ “అందరికీ ప్రభువు ఒక్కడే” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ భగవంతునిపై విశ్వాసం ఉంచాలని, శ్రద్ధతో ఏ పనైనా పూర్తి చేయాలని బోధించి ప్రజల చేత ఆరాధించబడుతున్న మహాయోగి, కరుణామూర్తి — షిరిడి సాయి బాబా వారు. --- శ్రద్ధ, సబూరి అనేవి ఆయన బోధనలో ముఖ్యమై...

ప్రసాదం

"అయ్యా, నేను రేపటి నుంచి ఐదు రోజులపాటు మన రాములోరి గుడి దగ్గరే ఉంటాను" అంటూ తండ్రితో చెప్పాడు పది సంవత్సరముల వయసున్న రాముడు. "ఏరా! ఎందుకు? నువ్వు గుడి దగ్గర కూర్చుంటే మనకు బువ్వ ఎవరు పెడతారు?" అంటూ ప్రశ్నించాడు తండ్రి పిచ్చయ్య. "మర్చిపోయావా ఏమిటి నాన్నా? మన రాములు వారి గుడిలో ఎల్లుండి శ్రీరామనవమి కదా! సీతారాముల కళ్యాణం చేస్తారుగా. ఆ రోజు నుంచి ఐదు రోజులు పాటు ఊరందరికీ సంతర్పణ చేస్తారు కదా. ప్రతి ఏటా చేస్తారుగా. మర్చిపోయావా ఏమిటి?" అంటూ చెప్పుకొచ్చాడు రాము. "మరి ఆ సందర్భంగా మనకి ఆకు వేసి భోజనం పెడతారా ఏమిటి?" అంటూ సందేహం వెలిబుచ్చాడు పిచ్చయ్య. "అవును నాన్న! ఇక్కడ కులమతభేదం లేకుండా వచ్చిన వాడిని తిరిగి పొమ్మనకుండా అందరికీ చక్కగా భోజనాలు పెడతారు. ప్రతి ఏట జరుగుతోంది కదా. అయినా నువ్వు ఎప్పుడూ చూడలేదా? నేనే నీకు భోజనం అడిగి తెచ్చి పెడతాను ప్రతి ఏడాదిలాగే," అంటూ తుర్రుమని వీధిలోకి పారిపోయాడు రాము. --- రాము పిచ్చయ్యకి ఒక్కగానొక్క కొడుకు. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం రిక్షా లాగి, పక్షవాతం వచ్చి ఈ మధ్యనే మంచం మీద పడ్డాడు పిచ్చయ్య. రాముని చదివించే స్తో...

భగినీ హస్త భోజనం

“తమ్ముడు, ఎల్లుండి తప్పకుండా భోజనానికి రా” అంటూ ఫోన్ చేసింది — ప్రతి సంవత్సరం లాగానే దీపావళి నాడు పక్క ఊర్లో ఉన్న మా అక్క. ఆరోజు భగినీ హస్త భోజనం. అందుకే మా అక్క ఆహ్వానం. ఉదయం లేచి ఫస్ట్ బస్సులో ఆ ఊరు బయలుదేరాను. మేమిద్దరం పుట్టి పెరిగింది అదే ఊరు. అక్క నా కంటే రెండేళ్లు పెద్దది. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుతూ, ఆడుతూ, పాడుతూ, కలిసిమెలిసి పదో తరగతి వరకు పెరిగాము. నేను ఇంటర్మీడియట్ చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్క పదవ తరగతి తోటే చదువు ఆపేసింది. మేనమామకు ఇచ్చి పెళ్లి చేసేశారు. ఆ ఊర్లోనే కాపురం. బావగారు ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి అయింది. అయినా ప్రతి ఏటా నన్ను భగినీ హస్త భోజనానికి పిలుస్తూనే ఉంటుంది. దాని పరిస్థితి చూసి ఏదైనా సహాయం చేద్దాం అంటే ఎంతో మొహమాటం. ఒక చిన్న మాట కూడా తన సంసారం గురించి చెప్పదు. తన లేనితనం గురించి అసలు చెప్పదు. బావగారు బాగా చూసుకుంటున్నారని అంటుంది. ఎప్పుడూ ఆ మూడు గదుల కొంపలోనే కాపురం. ఇంట్లో కుర్చీ కూడా ఉండదు కూర్చోడానికి. ఇద్దరు పిల్లలు చదువులు. ఎలా నెట్టుకొస్తుందో ఏమిటో! పెద్దయ్యాక ఎవరి జీవితాలు వాళ్ళవే. చిన్నప్పుడు ఎంత ...