పోస్ట్‌లు

పరంధామయ్య కథ

ఉదయం పన్నెండు గంటలు అయింది. “పోస్ట్…” అనే కేకతో వాలు కుర్చీలో పడుకుని కళ్ళు తెరిచిన పరంధామయ్యకి, పోస్ట్‌మాన్ ఒక శుభలేఖ అందించి వెళ్లాడు. “ఎవరిది అబ్బా ఈ శుభలేఖ?” కార్డు చూస్తే చాలా పెద్దదిగా ఉంది. బాగా డబ్బున్న వాళ్లది అయి ఉంటుంది, అని అనుకుంటూ శుభలేఖ తెరిచి చూశాడు. పూర్తిగా చదివేసరికి — “అబ్బో! రవికి ఇంత పెద్ద కూతురు ఉందా!” అని లోలోపల సంబరపడ్డాడు. అంతలో వంటింట్లో నుంచి శారద బయటికి వచ్చింది. “ఎవరిదండి ఆ శుభలేఖ?” అని అడిగింది. “మా మేనల్లుడు రవి కూతురు పెళ్లిట. శుభలేఖ పంపించాడు,” అన్నాడు పరంధామయ్య ఆనందంగా. “వెళ్లి వస్తే బాగుంటుందేమో,” అని కూడా అన్నాడు. శారద నిట్టూర్చింది. “ఏదో పై వాళ్లల్లాగా శుభలేఖ పంపించి ఊరుకున్నాడు. ఏనాడైనా మన ఇంటికి వచ్చాడా? ఎప్పుడైనా ఫోన్ చేశాడా? కనీసం పెళ్లి కుదిరిందని కూడా చెప్పలేదు. వాళ్ల అమ్మానాన్న ఉన్నంతకాలం బంధుత్వాలు బానే మెయింటైన్ చేశారు. ఆ తర్వాత మీ అక్క పిల్లలందరూ మేనమామను మర్చిపోయారు,” అంది నిష్టూరంగా. శారద మాటల్లో నిజం లేకపోలేదు అని పరంధామయ్యకి అనిపించింది. అయినా… రక్తసంబంధం కదా! ఇన్నాళ్లూ ఆ చేదు నిజాన్ని కడుపులోనే దాచుకున్నాడు. అంతలో గతం కళ్ల ముందుకు వచ...

కొంగు చాటు వీరుడు

 కొంగు చాటు వీరుడు ఆ స్వరం వినగానే అందరూ ఆ గదిలోకి పరిగెడతారు. ఏం జరిగిందో అని భయపడిపోతారు. సుశిక్షితులైన సైనికుల్లాగా ఎవరి బాధ్యతలు వాళ్ళు తీర్చడానికి సన్నద్ధమవుతారు.  అక్కడున్నవాడు కండలు తిరిగిన మొనగాడు కాదు. కోడి రామ్మూర్తి గారి శిష్యుడు అసలే కాదు. తీరా చూస్తే పాలకడలిపై శేషతల్పము మీద పడుకున్న శ్రీమహావిష్ణువు కూడా కాదు. నవ మాసాలు ఆ చిమ్మ చీకటిలో ఉండి మన లోకానికి వచ్చిన మహావీరుడు.  అమ్మ కడుపులో ఉన్నంతసేపు గిరగిర తిరుగుతూ అమ్మకు పెట్టిన దానిలో వాటా కోరుతూ చక్కిలి గింతలు పెడుతూ ఈ లోకంలోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటూ వచ్చేటప్పుడు అమ్మకు నొప్పి పుట్టించి భూమ్మీదకి వచ్చిన వెంటనే తన ఉనికిని చాటడానికి ఏడుస్తూ బంధువులందరికీ సంతోషాన్ని తెప్పించి నోరు తీపి చేసుకునేలా చేసే చంటి వీడు. వీడు రోజుకో సినిమా చూపిస్తాడు.  మన లోకానికి వచ్చిన మహావీరుడు అన్నారు. మరి వాడి వీరత్వం ఏమిటి ఈ లోకంలోకి రాడానికి వాడు చేసే ప్రయత్నమే వీరత్వం. వాడి తాహతకు అది ఎక్కువే. భూమి మీదకు వచ్చిన వెంటనే వాడు మనకు బంధువు అయిపోతాడు. మన అమ్మాయి అమ్మగా మారిపోతుంది.  పుట్టిన క్షణం నుంచి వాడు మనకు అతి...

నిశ్శబ్ద సేవ

ఆ నగరంలో ఆ కాలనీ ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఒకే సంస్థలో పనిచేసిన ఉద్యోగస్తులందరూ కలసి కట్టుకున్న అందమైన కాలనీ అది. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఒకేలా కనిపించే ఇళ్లు; వాటిలో నివసించే వాళ్లందరూ ఇప్పుడు వయసు మీద పడి పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులు. అయినా కలిసిమెలిసి కాపురం చేస్తూ, ఒక కుటుంబంలా జీవించే మనుషులు అక్కడ ఉంటారు. నగరంలో కాలనీలు చాలా ఉంటాయి. కానీ ఒకరి గురించి ఒకరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఈ నగరంలో, తెల్లవారితే చాలు—ఆ కాలనీలోని సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి మనసు విప్పి కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్‌కు వెళ్తారు. సామూహికంగా జరిగే పూజలు, పునస్కారాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. అవసరమైన వాళ్లకు సహాయం చేయడాన్ని తమ బాధ్యతగా భావిస్తారు. “మానవసేవే మాధవసేవ” అని నమ్మి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. గుండెల్లోనూ, గూడు లోనూ ఎన్నో దిగుళ్లు ఉన్నా, గుడిలోని దేవుణ్ని నమ్ముకుని ముందుకు సాగే అందమైన వయసు మళ్లిన వాళ్లు ఉన్న కాలనీ అది. ఆ కాలనీలో ప్రతి ఉదయం ముందుగా కనిపించే మనిషి ఒకడున్నాడు. ఆరడుగుల పొడుగు, తెల్లటి జుట్టు, నెత్తి మీద టోపీ, పెదవుల మీద చిరునవ్వు—రామారావు గారు కాలనీలో ...