పోస్ట్‌లు

మార్చి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

నా పెళ్ళి నా బాధ్యత

నా పెళ్లి -నా బాధ్యత " ఒరేయ్ రామకృష్ణ ఈ సంబంధమైన ఒప్పుకోరా. అప్పుడే ఉద్యోగంవచ్చి ఐదేళ్లయింది. ఇంకా ఏమిట్రా జుట్టు నె రిసిపోతోంది.గుప్పెడు పొట్ట కూడా వచ్చింది. ఏ పిల్ల నిన్ను చేసుకోవడానికి ముందుకు రాదు అంటూ రామకృష్ణ తల్లి రాజేశ్వరమ్మ గారు చేతిలో ఒక ఫోటో పట్టుకుని రామకృష్ణ కు చూపిస్తూ అడుగుతోంది. లేదమ్మా నా టార్గెట్ ఇంకా పూర్తికా లేదు అంటూ ఏ ఫోటోను చూడడం మానేశాడు. ఆ డబ్బు గొడవ నీకెందుకురా మీ నాన్న చూసుకుంటారు .లేదమ్మా నాన్న రిటైర్ అయిపోయి అంత డబ్బు ఖర్చు పెట్టడం అంటే మాటలు కాదు.  చూడమ్మా ఇదివరలో నేను చాలాసార్లు చెప్పాను. ఈ రోజుల్లో మగపిల్లాడి పెళ్లి చేయడం అంటే చాలా కష్టం. పూర్వకాలంలో అయితే కట్నాలు తీసుకునేవారు. ఆ కట్నాలతో మగ పిల్లల పెళ్లిళ్లు చేసేవారు.ఇప్పుడు అలా కాదు కాలం మారింది. కట్నాల ప్రసక్తి పోయింది. ఆడపిల్లలు కూడా మగ పిల్లలతో సమానంగా ఉద్యోగం చేస్తున్నారు. ఆడపిల్లలు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు. పైగా బాగా చదువుకున్న వాళ్ళు. ఒక రకం పెళ్ళికొడుకుల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇంకా కట్నం ఎవరు ఇస్తారు. మా పిల్ల బోల్డంత సంపాదిస్తోంది . ఇంకా కట్నం ఏమిటి అని అ...

కాలమా నీకు జోహార్లు

కాలమా నీకు జోహార్లు ఏ సమస్య లేకుండా సాఫీగా నడిచిపోతే జీవితం ఎందుకు అవుతుంది? జీవితమంటే సమస్యల పోరాటం. తెల్లారి లేస్తే ఏదో ఒక సమస్య. ఒక సమస్య సాఫీగా తీరిపోయిందనుకుంటే మళ్లీ ఏదో ఒకటి . ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలుసు. ఆ మార్పు మంచిదైతే చెప్పుకోవడానికి ఏముంది. చెడు జరిగింది కాబట్టే ఈ కథ   లంకంత కొంప ,నాలుగు తరాలకు సరిపడే డబ్బు ,భర్త పిల్లల డాక్టర్ , కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి అమెరికాలో స్థిరపడిపోయిన అమ్మాయి రమ , భాగ్యనగరంలో సొంత ఫ్లాట్ లో భార్యతో కాపురం ఉంటున్న కొడుకు అర్జున్. చేతిలో మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు సంగీత శాస్త్రంలో ప్రావీణ్యమే కాక పాక శాస్త్రం లో ప్రావీణ్యం. పేరులక్ష్మి రూపం మహాలక్ష్మి డాక్టర్ రామ శాస్త్రి గారికి ఇంటి ఇల్లాలు.మరి ఇంతకీ సమస్య ఏమిటి ?మూడు సంవత్సరాలుగా అనారోగ్యంగా ఉన్న డాక్టర్ రామశాస్త్రి గారు అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామానికి ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. పది రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఇంటి నిండా జనం ఉంటే కొంత ధైర్యం ఉండేది. పిల్లలు సెలవు లేదంటూ ఎవరు ప్రదేశాలకు వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ లంకoత...

మార్పు

మార్పు నాన్న ఈసారి మీరు తప్పకుండా నాతో పాటు రావాలి. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను మీరు దాటేస్తున్నారు. మా కొలీగ్ తల్లిదండ్రులందరూ వచ్చి ఆరేసి నెలలపాటు ఉంటారు. మీరేమో నా మాట వినరాయే. నాకు చాలా బాధగా ఉంది అంటూ అమెరికా కొడుకు సురేష్ మాటలు విని చూద్దాం లేరా అoటు గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్లిపోయారు చిరంజీవి గారు. సురేష్ కిఅమెరికాలో ఉద్యోగం వచ్చి ఆరు సంవత్సరాలు అయింది. సురేష్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి తండ్రి బాధ్యతలు పంచుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చాడు. చిరంజీవి గారికి నలుగురు మగపిల్లలు ఒక అమ్మాయి . చిరంజీవి గారి భార్య నాలుగు సంవత్సరాల క్రితమే చనిపోయింది. ముగ్గురు కొడుకులు భార్యలు మన వళ్ళతో ఆ ఊర్లోనే కాలక్షేపం చేస్తున్నాడు చిరంజీవి గారు. సురేష్ చదువు కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చి అన్నగారి కొడుక్కి గుండె ఆపరేషన్ చేయించి తండ్రి కోరిక ప్రకారం ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు కట్టించాడు. అయితే సురేష్ తనకంటూ ఒక పది పైసలు దాచుకోలేదు. పెళ్లి కూడా అయ్యింది .ఇద్దరు పిల్లలు. పాపం డబ్బంతా మనం వాడేస్తే ఎలాగా అనేది సురేష్ తండ్రి చిరంజీవి గారి ఆలోచన. చిరంజీవి గారు బ్రాహ్మణ కుటుంబానికి చ...

చౌర్యం

చౌర్యం   చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు స్నేహితుల పెన్సిళ్లు పెన్నులు నెమలి ఈకలు వారికి తెలియకుండా తెచ్చుకుంటే అమ్మ కోప్పడి దగ్గరుండి వాళ్ళింటికి తీసుకువెళ్లి సారీ చెప్పి తిరిగి ఇప్పించేసిది. ఎవరి దగ్గరైనా ఎవరి వస్తువైనా అడగకుండా తీసుకోకూడదని నాన్న జేబులో అయినా సరే తీయకూడదని అమ్మ చెప్పేది. రోడ్డుమీద నడిచేటప్పుడు 500 రూపాయల నోటు దొరికింది అమ్మకు పట్టుకు వెళ్లి ఇస్తే దగ్గర్లో ఉన్న దేవుడి గుడిలో వేసేయమనేది. అలా ఉండేది ఆ రోజుల్లో శిక్షణ. అనుమతి లేకుండా తీసుకుంటే వారిని దొంగ అంటారు. దొంగ చేసే పని దొంగతనం. శ్రీకృష్ణుడు వెన్న ముద్దలు దొంగలించాడు కదా మనం చేస్తే తప్పేంటి కొంతమంది వితండవాదన. శ్రీకృష్ణ భగవానుడు అవతార మూర్తి. దుష్టులను శిక్షించడానికి అవతారం ఎత్తిన విష్ణుమూర్తి. వెన్నను దొంగిలించి అందరి హృదయాలను దోచుకున్నాడు. హృదయం వెన్నముద్ద వలె తెల్లగా ఉండాలని బోధించాడు. మనం అవతార పురుషులం కాదు. అవకాశ పురుషులము. స్త్రీలు కూడా ఉన్నారు. అందరూ కాదు లెండి. అవకాశం కోసం  ఎదురుచూసి సులువుగా దోచుకునే వాళ్ళం. నమ్మించి గొంతు లోకి కోసేవాళ్ళం. కాలం మారిపోయింది. సాంకేతికత బాగా పెరిగి...

అతిధి మర్యాద

అతిథి మర్యాద. ************ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ   అతిధికి కూడా తల్లి తండ్రి గురువు తర్వాత స్థానం కల్పించి దేవుడితో సమానం అని చెప్పింది వేదం. అతిధి అంటే ఎవరు? ఆకస్మికంగా మన ఇంటికి వచ్చే బంధువు లేదా స్నేహితుడు ఎవరైనా సరే అతిధి అంటారు. తన రాకకు నియమితమైన తిధి లేనివాడు అతిధి. ఒక రాత్రి మాత్రం ఉండిపోవువాడు అని చెప్పింది గూగుల్ తల్లి. పాపం ఎంతో దూరం నుంచి మన మీద ప్రేమతో మనల్ని చూడ్డానికి వచ్చిన వారిని నవ్వుతూ పలకరించి లోపలికి ఆహ్వానించి ఆసనం చూపించి కుశల ప్రశ్నలు వేసి మంచినీళ్లు అందిస్తాం. ఇది ఎవరు నేర్పారు మనకి. ఎవరు నేర్పలేదు. మన పెద్ద వాళ్ళు చేసిన దాన్ని మనం అనుకరించిన విధానం. అంటే నిత్యకృత్యంలో మన పెద్దలు జీవించిన విధానం మనకు ఆదర్శం అన్నమాట. మనం అనుసరించవలసిన విధానం. అంటే మన ఇల్లే మనకి ఒక పాఠశాల. పాఠశాల అంటే పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు నేర్పేది కాదు. సంఘంలో ఒక గౌరవమైన జీవితం గడపడానికి కావలసిన సహాయం అందించే ఆలయం.  మన ఇల్లు. మన ఇంటిలోని ఆ తరం మనుషులు. ఒకసారి మనం కూడా అతిథిగా ఆ కాలానికి వెళ్ళిపోదాం పదండి. ఆ కాలంలో వేళ కాని వేళలో వచ్చిన చుట్టాన...

ముందు జాగ్రత్త

ముందు జాగ్రత్త  "ఒరేయ్ రెడ్డి ఉదయం లేచి పిఠాపురం పశువుల సంతకు వెళ్లాలి అoటు రామారెడ్డి తన కొడుకు శ్రీనివాసరెడ్డి తోటి మంచం మీద పడుకుంటూ చెప్పాడు. మనకు పశువులు ఎందుకు ?నాన్న పొలాలన్నీ అమ్మేశాముగా అంటూ కొడుకు ప్రశ్నించాడు. లేదు రేపు ఉదయం తప్పకుండా వెళ్లాలి. బస్సు మీద కాదు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోదాం అంటూ సమాధానం ఇచ్చాడు రామారెడ్డి. తండ్రి మనసులో ఉన్న మాట చెప్పలేదు ఎందుకో తెలియదు అయినా తండ్రి మాటంటే శ్రీనివాస రెడ్డికి చాలా గౌరవం. సరే నాన్న తెల్లవారుజామున బయలుదేరుదాం అంటూ ఇద్దరు మంచం మీద వాలేరు. రామారెడ్డి ఒకప్పుడు బాగా చదువుకున్న మోతుబరి రైతు. కాలక్రమేణా పంటలు సరిగా పండక పిల్లల పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి ఆస్తంతా ఖర్చు అయిపోయింది. రామారెడ్డి దైవభక్తిపరుడు. పూజలు పునస్కారాలు అంటే బాగా ఇష్టం.ఎప్పుడు గుళ్ళుతిరుగుతుంటాడు. ఆ సొంత ఊర్లోనే తన తాతలనాటి కొంపలోకొడుకు కోడలు భార్యతో కాలక్షేపం చేస్తున్నాడు.  పొలాలూ ఉన్న రోజుల్లో ఇంటి వెనక పశువుల పాకలో ఎప్పుడు పది ఆవులు ఉండేవి. ఎద్దుల తోటే వ్యవసాయం చేసేవాడు. ఆ పశువులని నిత్యం దైవంగా పూజించేవాడు. కాలం కలిసి రాక ఆస్తి అంతా పోయింది కానీ ...

నా స్నేహితుడు

నా స్నేహితుడు "నాన్న అలా కాదు ఈ సైడ్ బటన్ నొక్కాలి ఇక్కడ ఆన్ చేయాలి. చార్జర్ ఇలా పెట్టాలి మళ్లీ రీస్టార్ట్ చేయాలి. నెట్వర్క్ పనిచేయట్లేదు ఏమో మొబైల్ నెట్వర్క్ వాడుకో. ఫేస్బుక్ క్రియేట్ చేసాం వాట్సాప్ నెంబర్ ఇదే. యూట్యూబ్ ఉండనే ఉంది. సాంసంగ్ నోట్స్ డౌన్లోడ్ చేసాం. ఏమిటో కొత్త కొత్త మాటలు చెప్పుకుంటూ పోతున్నారు పిల్లలు నాన్న నీ మొబైల్ నెంబర్ మొదటి నెంబరు చివరి నెంబరు కూడానీలక్కీనంబరే.Youareluckyఅంటూఆనందపడిపోయారు ఇలా చకా చకా నాకు చెబుతూ నా పుట్టినరోజుకి ఆ బుల్లి ముండని నా చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. నాకు అంతా అయోమయంగా ఉంది. నేను అక్షరాల నేర్పిన పిల్లల దగ్గర శిష్యుడిలా మారిపోయి మొత్తానికి బ్రహ్మవిద్య నేర్చేసుకున్న. చుట్టాలు పక్కాలు పార్కులో స్నేహితులు, మార్కెట్లో కూరగాయల షాపులు , కిరాణా షాపులు , పాలవాళ్లు ,మెడికల్ షాపులు, డాక్టర్లు, రక్త పరీక్ష కేంద్రాలు పనిమనిషి ,చాకలి, మంగలి నంబర్లన్నీ డైరీ తీసి కాల్ లిస్టులో పెట్టేసుకున్న. ఆ లిస్టు చూస్తే పెళ్లి సామాన్లు లిస్టులా ఉంది కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు ఆస్తమాను దాన్ని చూస్తూ చేతిలో అటు ఇటు తిప్పుకుంటూ జేబులో...

దుస్తులు

దుస్తులు "  పుట్టినప్పుడు బట్ట కట్టలేదు.  పోయేటప్పుడు అది నీ వెంట రాదు." అన్నాడు ఒక సినీ కవి. అంటే ఈ మధ్యకాలంలో తన శరీర  భాగాలని బహిర్గతం చేయకుండా కాపాడుకోవడానికి దుస్తులు  ధరిస్తాడు మానవుడు. ధరించే దుస్తులు మానవుడికి సరికొత్త  అందాన్ని ఆనందాన్ని తీసుకొస్తాయి. మన సమాజంలో దుస్తులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మనం ధరించే దుస్తులు చలి నుండి ఎండ నుండి మన శరీరాన్ని కాపాడు తాయి. రోజు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఒక రకమైన ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. ఇది ఆఫీస్ వారి నియమ నిబంధనలో డ్రెస్ కోడ్ ఉంటుంది. దుస్తులు ధరించిన ఉద్యోగులు పలానా ఆఫీస్ వారని ప్రజలకు తెలుస్తుంది. ఈ డ్రెస్ కోడ్ గనక పెట్టకపోతే నైట్ డ్రెస్ లతో కూడా ఆఫీసులకు వచ్చే ప్రమాదం ఉంది. పదిమంది తిరిగే ఆఫీసులో అది సభ్యతగా ఉండదు. అది ఆ మనిషి గౌరవం తగ్గిస్తుంది. ఆ కార్యాలయానికి చెడ్డ పేరు వస్తుంది.  అలాగే స్కూల్లోనూ కాలేజీలోనూ చదివే పిల్లలకు అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించాలని నియమ నిబంధనలు ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం పిల్లలందరూ ఒక్కటే ధనిక పేద తేడా ఏమీ లేదని చెప్పడమే. ఆదిమానవుడు కూడా ఆకుల తోటి లతలతోటి తన శరీరాన్ని కప్పుకు...

నిజ స్వరూపం

నిజ స్వరూపం  సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. రామారావు గారు అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి స్నానం చేసి వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో భార్య టీ కప్పు చేత పట్టుకుని భర్తకు ఇచ్చి ఎదురుగుండా కుర్చీలో కూర్చుంది. ఏవండి ఇవాళ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి . మన రాధ ఎవర్నో ఇష్టపడిందట. అబ్బాయి మధు కూడా అదే ఆఫీసులో పని చేస్తున్నాడుట. ఇద్దరికీ మూడు సంవత్సరాల నుంచి పరిచయం. రాధ గురించి పూర్తి వివరాలు అతనికి తెలుసు. మధ్యలో ఆరోగ్యం బాగా లేకపోతే తనే హాస్పిటల్ తీసుకెళ్తుంటాడట. అబ్బాయి ఫోటో కూడా పంపించింది. అబ్బాయి కూడా మాట్లాడాడు. తనకి తండ్రి లేడని తల్లితో కలిసి ఉంటున్నాడని తన చెల్లెలికి పెళ్లి చేసి పంపించేసారని వివరాలు చెప్పాడు. ఇద్దరిదీ సమానమైన ఉద్యోగం. సమానమైన చదువు సమానమైన జీతం. ఈడు జోడు బాగానే ఉంది. కానీ వాళ్లు మన కులం కాదు ధైర్యంగా చెప్పాల్సిన మాటలు చెప్పేసింది రామారావు గారి భార్య లలిత. భార్య మాటలు విన్న తర్వాత రామారావు గారు ఆలోచనలలో పడ్డారు. తర్వాత భార్య చెప్పిన మాటలు తలకెక్కలేదు. రామారావు గారిది శుద్ధ చాందస భావాలు గల బ్రాహ్మణ కుటుంబo. రోజు గాయత్రి మంత్రం జపం చేస్తే గాని రామారావు గారు పచ్చి మంచిన...

గుఱ్ఱం బండి

గుర్రం బండి "అమ్మా రేవు దగ్గరికి బండి వెడుతోంది వస్తారా అంటూ చేతిలో చెర్నాకోలు పట్టుకొని తలకి తలపాగా చుట్టుకుని ఒంటిమీద బనియన్ తొడుక్కుని నిక్కర్ వేసుకుని ఒకమనిషిచాలామందికి తారసపడి ఉంటాడు. దూరంగా ఒక మూల గుర్రపు బండి కళ్ళకి గంతలు కట్టుకుని పచ్చగడ్డి తింటూ నిలబడి ఉన్న నాలుగు కాళ్ల జంతువు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇలాంటి దృశ్యాలు మన చిన్నతనంలో మనం చూసే ఉంటాము. ఆ రోజుల్లో అది అతి ముఖ్యమైన ప్రయాణ సాధనము. మానవుడు ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణించాలంటే ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు తక్కువగా ఉండేవి. ఒకటి సైకిలు ఎడ్ల బండి గుర్రపు బండి రిక్షా. కాలక్రమేణా సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత ఆటోలు బస్సులు కార్లు మోటార్ సైకిల్ వచ్చి ఈ గుర్రపు బండి రిక్షా ఎడ్ల బండి సైకిలు మరుగున పడిపోయాయి. అయితే ఇంకా కొన్ని ఊర్లలో గుర్రపు బండి సామాన్లు ఒకచోట నుండి ఇంకొక చోటకు చేరవేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ గుర్రపు బండిని జట్కా బండి అని కూడా పిలుస్తారు. జట్కా బండి అంటే గుర్రము చేత లాగబడే బండి అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో టాంగా అంటారు. ఈ బండి ఇంధనం అవసరం లేని బండి ఇరుసుతో నడిచే బండి.యజమాని చేతిలో కీలుబొమ్మగ...

పల్లెలు

పల్లెటూరు అందాలకు ఆలయం.  అనుబంధాలకు నిలయం.  రక్తసంబంధం లేకపోయినా ఆప్యాయంగా పిలుచుకునే ఆనంద కుటుంబం. సాయం అంటే ముందుకు అడుగు వేసే జనం సహాయం అంటే అందరికంటే ముందుండే మన ఊరే కరుణాసముద్రం. బాధ్యత అంటే బరువు అని తలచని అనుబంధం. చుట్టూ పరికిస్తే అనుక్షణం బాధ్యత గుర్తు చేయడం  ఓ వరం.  గంప కింద నుంచి కోడి కూతతో ఊరి మత్తు బహుదూరం.  ఇంకా ముసుగు తీయకపోతే జీవన పోరాటంలో తీరం వెతుక్కునే పక్షి వెక్కిరింపుతో పౌరుషం. గుడిలో నుంచి వినపడే సుప్రభాతం తెల్లవారింది అనడానికి సంకేతం. ఎర్రటి చూపులతో చుర్రుమనిపించే సూర్యకిరణం. అంబా అనే మూగజీవి అరుపు తన బిడ్డ ఆకలి తీర్చమని గుర్తు చేయడం పక్కన తడిమి చూస్తే వెక్కిరించిన మంచం.  వాకిట్లోంచి కళ్ళాపి జల్లుతున్న శబ్దం.  కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రహదారిపై సహచరుల జీవన ప్రయాణం.  అరుగు మీద చంటిగాడి చేతిలో పాఠ్యపుస్తకం. ఆ వేపుకు తిరిగి రెండు చేతులు జోడిస్తే బారెడు పొద్దెక్కిందని మనసులో ఓ భయం. పెరటిలోని వేపచెట్టు మూలనున్న దిగుడు బావి ఆరోగ్యానికి అభయం. వాకిట్లో కోడి పిల్లలకి ఆహారం వెతుకుతూ విహారం.  నక్కి నక్కి చూస్తున్న నల్ల పిల...

దసరా

దసరా  ఎప్పుడో మా పిల్లల్ని రోజు స్కూలుకు తీసుకువెళ్లే  రిక్షావాడు పదిహేను రోజుల క్రితం బజార్లో కనబడి నమస్కారం పెట్టి నవ్వుతూ చేతులు నలుపుకుంటూ కనిపించాడు. ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా పలకరించాను. దానికి సమాధానం లేదు. ఏమిటి సంగతి అని అడిగాను దసరా మామూలు అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. సుమారు ఇరవై సంవత్సరాల నుంచి నాకు వాడికి సంబంధం లేదు. దసరా మామూలు కోసం నమస్కారం పెట్టి పలకరించాడు. యాభై రూపాయల నోటు తీసి ఇచ్చి నవ్వుతూ వచ్చేసా. నేను నవ్వుకుంటూ వచ్చేసాను కానీ వాడి మొహం లో ఆనందం లేదు. అన్ని రేట్లు పెరిగిపోయాయి అయ్యగారు అంటూ అసహనంగా యాభై రూపాయల నోటు జేబులో పెట్టుకున్నాడు. సుమారు దసరాకి నెల రోజుల ముందు నుంచి రోజు ఇదే పరిస్థితి. ముఖ పరిచయం ఉన్న ప్రతి వాళ్లు గుడిలో కనబడిన బడిలో కనబడిన షాపింగ్ మాల్ లో కనబడిన హోటల్ లో ఎదురుపడిన చెయ్యి చాచి దసరా మామూలు కోసం నమస్కారం చేసి మామూలు వసూలు చేస్తున్నారు.  ఇంటిదగ్గర రోజు నిత్యం మనకి చాకిరి చేసే పని అమ్మాయి ,చెత్తబుట్ట వాడు మురికి కాలువలు శుభ్రం చేసేవాడు బట్టలు ఉతికే చాకలివాడు పిల్లల బడిలో పనిచేసే పనివారికి ఏడాది కోమారు అడిగితే ఆనందంగా ఇస...

ఆడజన్మ

ఆడజన్మ  సరోజ గారు ఎవరండీ మేడం గారు మిమ్మల్ని పిలుస్తున్నారంటూ డాక్టర్ గారి గదిలోంచి బయటికి వచ్చిన  నర్సు గట్టిగా పిలిచింది. నేనేనండి ఒక సుమారు 30 సంవత్సరముల వయస్సు గల యువతి చేతిలో ఒక ఫైల్ తో డాక్టర్ గారు గదిలోకి అడుగు పెట్టింది. అది ఒక ప్రసూతి ఆసుపత్రి. డాక్టర్ శ్వేత గైనకాలజిస్ట్ గా చాలా మంచి పేరుంది. వచ్చిన పేషెంట్లను చాలా మంచి హృదయంతో గౌరవంగా ట్రీట్మెంట్ ఇస్తుంది. పేషంట్ల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతుంది. పైగా నార్మల్ డెలివరీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే హాస్పటల్ ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. పురుడు అంటే పునర్జన్మంటారు. ఆడపిల్ల నెలతప్పిన రోజు దగ్గరనుంచి ఈ రోజుల్లో ప్రతి నెల డాక్టర్ చెకప్ కి తిరగడం స్కానింగ్లు తిరగడం తప్పనిసరి. రోజులు అలా ఉన్నాయి నమస్తే మేడం అంటూ రెండు చేతులు జోడించి డాక్టర్ గారికి నమస్కారం చేసింది సరోజ. చెప్పండి అంటూ డాక్టర్ గారు తలపైకి ఎత్తి చూశారు. నా పేరు సరోజ మాది పక్క ఊరు మా ఆయన ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా రు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మళ్లీ ఇప్పుడు నేను అంటూ చేతుల్లోని ఫైలు డాక్టర్ గారు చేతిలో పెట్టింది. డాక్టర్ గారు ...

శ్మశానవాటిక

శ్మశాన వాటిక నిత్యజీవితంలో మనం కొన్ని ప్రదేశాల పేర్లు తలచుకోడానికి ఇష్టపడం.ఆ పేరు వింటూనే ఏదో అపశకునంగా భావిస్తాం. ఉదాహరణకు రుద్రభూమి . దాన్నే స్మశానం అంటారు. కానీ ఊపిరి లేని వాళ్ళందరూ చివరికి చేరేది ఆచోటే. ఆ చోటుకు చేరుతామని తెలుసు కానీ మనం చేరే రోజు కానీ మనం చేరిన రోజు కానీమనకు తెలియదు. కానీ ఒక కవికి ఆ స్మశాన వాటిక కవితా వస్తువై అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. కవి ఎక్కడకైనా ప్రయాణిస్తాడు. పరకాయ ప్రవేశం చేసి రావలసిన వస్తువు రాబట్టుకుంటాడు. అటువంటి కవులలో చిరస్మరణీయుడు కీర్తిశేషులు గుర్రం జాషువా ఒకరు ఇంటిపేరు గుర్రం వారు . పేరులో ఏముంది పెన్నిధి అనకండి. ఆయన ఆలోచన గుర్రం కంటే వేగంగా పయనించి అద్భుతమైన కవిత కళాఖండాలను సృష్టించాడు. ఒక స్మశాన వాటికను కవిత వస్తువు కింద ఎన్నుకోవడం ఏమిటి అనే ప్రశ్న అందరిలాగే నాకు అనిపించింది . కానీ ఈయన పద్యాలు చదివినప్పుడు ఆనాటి సమాజంలో ఉన్న అస్పృశ్యతను పారద్రోలడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఈ స్మశాన వాటిక ఒక కవిత వస్తువుగా ఎన్నుకొన్నారు. ఇక్కడ అందరూ సమానులే కులం మతం వర్ణం వర్గం ఏమీ తేడా లేదు ఈ స్థలంలో అంటాడు. అంటే ప్రజల్ని చైతన్య పరచడానికి ఇది ఒక సాధనం. ...

ఆఖరి ఉత్తరం

ఆఖరి ఉత్తరం ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. పది రోజుల నుండి బంధువులతోటి పిల్లలతోటి కర్మకాండలతోటి హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో ఇల్లు బోసిగా ఉంది.  ముప్పై ఐదు సంవత్సరములు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టారు కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరు ఇ ళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఇక మిగిలింది లంక అంత కొంప భార్య పార్వతమ్మ. పిలిస్తే పలికే నాధుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.  కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు గాని కన్నతల్లి ఎలా బ్రతుకుతుందని ఆలోచన ఏ ఒక్కరికి లేదు. అమ్మ వెళ్లి వస్తాo అంటూ పిల్లలు వెళ్లిపోయారు . అంతా కలలా జరిగిపోయింది. భర్తకు భార్య భార్యకు భర్త ఒకరికొకరు తోడు. ఒకరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎవరు తోడు అనుకుంటూ కళ్ళనుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి. ఇంతలో పోస్ట్ అని కేక...