పోస్ట్‌లు

మార్చి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

నా పెళ్ళి నా బాధ్యత

నా పెళ్లి -నా బాధ్యత " ఒరేయ్ రామకృష్ణ ఈ సంబంధమైన ఒప్పుకోరా. అప్పుడే ఉద్యోగంవచ్చి ఐదేళ్లయింది. ఇంకా ఏమిట్రా జుట్టు నె రిసిపోతోంది.గుప్పెడు పొట్ట కూడా వచ్చింది. ఏ పిల్ల నిన్ను చేసుకోవడానికి ముందుకు రాదు అంటూ రామకృష్ణ తల్లి రాజేశ్వరమ్మ గారు చేతిలో ఒక ఫోటో పట్టుకుని రామకృష్ణ కు చూపిస్తూ అడుగుతోంది. లేదమ్మా నా టార్గెట్ ఇంకా పూర్తికా లేదు అంటూ ఏ ఫోటోను చూడడం మానేశాడు. ఆ డబ్బు గొడవ నీకెందుకురా మీ నాన్న చూసుకుంటారు .లేదమ్మా నాన్న రిటైర్ అయిపోయి అంత డబ్బు ఖర్చు పెట్టడం అంటే మాటలు కాదు.  చూడమ్మా ఇదివరలో నేను చాలాసార్లు చెప్పాను. ఈ రోజుల్లో మగపిల్లాడి పెళ్లి చేయడం అంటే చాలా కష్టం. పూర్వకాలంలో అయితే కట్నాలు తీసుకునేవారు. ఆ కట్నాలతో మగ పిల్లల పెళ్లిళ్లు చేసేవారు.ఇప్పుడు అలా కాదు కాలం మారింది. కట్నాల ప్రసక్తి పోయింది. ఆడపిల్లలు కూడా మగ పిల్లలతో సమానంగా ఉద్యోగం చేస్తున్నారు. ఆడపిల్లలు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు. పైగా బాగా చదువుకున్న వాళ్ళు. ఒక రకం పెళ్ళికొడుకుల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇంకా కట్నం ఎవరు ఇస్తారు. మా పిల్ల బోల్డంత సంపాదిస్తోంది . ఇంకా కట్నం ఏమిటి అని అ...

కాలమా నీకు జోహార్లు

కాలమా నీకు జోహార్లు ఏ సమస్య లేకుండా సాఫీగా నడిచిపోతే జీవితం ఎందుకు అవుతుంది? జీవితమంటే సమస్యల పోరాటం. తెల్లారి లేస్తే ఏదో ఒక సమస్య. ఒక సమస్య సాఫీగా తీరిపోయిందనుకుంటే మళ్లీ ఏదో ఒకటి . ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలుసు. ఆ మార్పు మంచిదైతే చెప్పుకోవడానికి ఏముంది. చెడు జరిగింది కాబట్టే ఈ కథ   లంకంత కొంప ,నాలుగు తరాలకు సరిపడే డబ్బు ,భర్త పిల్లల డాక్టర్ , కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి అమెరికాలో స్థిరపడిపోయిన అమ్మాయి రమ , భాగ్యనగరంలో సొంత ఫ్లాట్ లో భార్యతో కాపురం ఉంటున్న కొడుకు అర్జున్. చేతిలో మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు సంగీత శాస్త్రంలో ప్రావీణ్యమే కాక పాక శాస్త్రం లో ప్రావీణ్యం. పేరులక్ష్మి రూపం మహాలక్ష్మి డాక్టర్ రామ శాస్త్రి గారికి ఇంటి ఇల్లాలు.మరి ఇంతకీ సమస్య ఏమిటి ?మూడు సంవత్సరాలుగా అనారోగ్యంగా ఉన్న డాక్టర్ రామశాస్త్రి గారు అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామానికి ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. పది రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఇంటి నిండా జనం ఉంటే కొంత ధైర్యం ఉండేది. పిల్లలు సెలవు లేదంటూ ఎవరు ప్రదేశాలకు వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ లంకoత...

అతిధి మర్యాద

అతిథి మర్యాద. ************ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ   అతిధికి కూడా తల్లి తండ్రి గురువు తర్వాత స్థానం కల్పించి దేవుడితో సమానం అని చెప్పింది వేదం. అతిధి అంటే ఎవరు? ఆకస్మికంగా మన ఇంటికి వచ్చే బంధువు లేదా స్నేహితుడు ఎవరైనా సరే అతిధి అంటారు. తన రాకకు నియమితమైన తిధి లేనివాడు అతిధి. ఒక రాత్రి మాత్రం ఉండిపోవువాడు అని చెప్పింది గూగుల్ తల్లి. పాపం ఎంతో దూరం నుంచి మన మీద ప్రేమతో మనల్ని చూడ్డానికి వచ్చిన వారిని నవ్వుతూ పలకరించి లోపలికి ఆహ్వానించి ఆసనం చూపించి కుశల ప్రశ్నలు వేసి మంచినీళ్లు అందిస్తాం. ఇది ఎవరు నేర్పారు మనకి. ఎవరు నేర్పలేదు. మన పెద్ద వాళ్ళు చేసిన దాన్ని మనం అనుకరించిన విధానం. అంటే నిత్యకృత్యంలో మన పెద్దలు జీవించిన విధానం మనకు ఆదర్శం అన్నమాట. మనం అనుసరించవలసిన విధానం. అంటే మన ఇల్లే మనకి ఒక పాఠశాల. పాఠశాల అంటే పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు నేర్పేది కాదు. సంఘంలో ఒక గౌరవమైన జీవితం గడపడానికి కావలసిన సహాయం అందించే ఆలయం.  మన ఇల్లు. మన ఇంటిలోని ఆ తరం మనుషులు. ఒకసారి మనం కూడా అతిథిగా ఆ కాలానికి వెళ్ళిపోదాం పదండి. ఆ కాలంలో వేళ కాని వేళలో వచ్చిన చుట్టాన...

నిజ స్వరూపం

నిజ స్వరూపం  సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. రామారావు గారు అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి స్నానం చేసి వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో భార్య టీ కప్పు చేత పట్టుకుని భర్తకు ఇచ్చి ఎదురుగుండా కుర్చీలో కూర్చుంది. ఏవండి ఇవాళ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి . మన రాధ ఎవర్నో ఇష్టపడిందట. అబ్బాయి మధు కూడా అదే ఆఫీసులో పని చేస్తున్నాడుట. ఇద్దరికీ మూడు సంవత్సరాల నుంచి పరిచయం. రాధ గురించి పూర్తి వివరాలు అతనికి తెలుసు. మధ్యలో ఆరోగ్యం బాగా లేకపోతే తనే హాస్పిటల్ తీసుకెళ్తుంటాడట. అబ్బాయి ఫోటో కూడా పంపించింది. అబ్బాయి కూడా మాట్లాడాడు. తనకి తండ్రి లేడని తల్లితో కలిసి ఉంటున్నాడని తన చెల్లెలికి పెళ్లి చేసి పంపించేసారని వివరాలు చెప్పాడు. ఇద్దరిదీ సమానమైన ఉద్యోగం. సమానమైన చదువు సమానమైన జీతం. ఈడు జోడు బాగానే ఉంది. కానీ వాళ్లు మన కులం కాదు ధైర్యంగా చెప్పాల్సిన మాటలు చెప్పేసింది రామారావు గారి భార్య లలిత. భార్య మాటలు విన్న తర్వాత రామారావు గారు ఆలోచనలలో పడ్డారు. తర్వాత భార్య చెప్పిన మాటలు తలకెక్కలేదు. రామారావు గారిది శుద్ధ చాందస భావాలు గల బ్రాహ్మణ కుటుంబo. రోజు గాయత్రి మంత్రం జపం చేస్తే గాని రామారావు గారు పచ్చి మంచిన...

గుఱ్ఱం బండి

గుర్రం బండి "అమ్మా రేవు దగ్గరికి బండి వెడుతోంది వస్తారా అంటూ చేతిలో చెర్నాకోలు పట్టుకొని తలకి తలపాగా చుట్టుకుని ఒంటిమీద బనియన్ తొడుక్కుని నిక్కర్ వేసుకుని ఒకమనిషిచాలామందికి తారసపడి ఉంటాడు. దూరంగా ఒక మూల గుర్రపు బండి కళ్ళకి గంతలు కట్టుకుని పచ్చగడ్డి తింటూ నిలబడి ఉన్న నాలుగు కాళ్ల జంతువు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇలాంటి దృశ్యాలు మన చిన్నతనంలో మనం చూసే ఉంటాము. ఆ రోజుల్లో అది అతి ముఖ్యమైన ప్రయాణ సాధనము. మానవుడు ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణించాలంటే ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు తక్కువగా ఉండేవి. ఒకటి సైకిలు ఎడ్ల బండి గుర్రపు బండి రిక్షా. కాలక్రమేణా సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత ఆటోలు బస్సులు కార్లు మోటార్ సైకిల్ వచ్చి ఈ గుర్రపు బండి రిక్షా ఎడ్ల బండి సైకిలు మరుగున పడిపోయాయి. అయితే ఇంకా కొన్ని ఊర్లలో గుర్రపు బండి సామాన్లు ఒకచోట నుండి ఇంకొక చోటకు చేరవేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ గుర్రపు బండిని జట్కా బండి అని కూడా పిలుస్తారు. జట్కా బండి అంటే గుర్రము చేత లాగబడే బండి అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో టాంగా అంటారు. ఈ బండి ఇంధనం అవసరం లేని బండి ఇరుసుతో నడిచే బండి.యజమాని చేతిలో కీలుబొమ్మగ...

పల్లెలు

పల్లెటూరు అందాలకు ఆలయం.  అనుబంధాలకు నిలయం.  రక్తసంబంధం లేకపోయినా ఆప్యాయంగా పిలుచుకునే ఆనంద కుటుంబం. సాయం అంటే ముందుకు అడుగు వేసే జనం సహాయం అంటే అందరికంటే ముందుండే మన ఊరే కరుణాసముద్రం. బాధ్యత అంటే బరువు అని తలచని అనుబంధం. చుట్టూ పరికిస్తే అనుక్షణం బాధ్యత గుర్తు చేయడం  ఓ వరం.  గంప కింద నుంచి కోడి కూతతో ఊరి మత్తు బహుదూరం.  ఇంకా ముసుగు తీయకపోతే జీవన పోరాటంలో తీరం వెతుక్కునే పక్షి వెక్కిరింపుతో పౌరుషం. గుడిలో నుంచి వినపడే సుప్రభాతం తెల్లవారింది అనడానికి సంకేతం. ఎర్రటి చూపులతో చుర్రుమనిపించే సూర్యకిరణం. అంబా అనే మూగజీవి అరుపు తన బిడ్డ ఆకలి తీర్చమని గుర్తు చేయడం పక్కన తడిమి చూస్తే వెక్కిరించిన మంచం.  వాకిట్లోంచి కళ్ళాపి జల్లుతున్న శబ్దం.  కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రహదారిపై సహచరుల జీవన ప్రయాణం.  అరుగు మీద చంటిగాడి చేతిలో పాఠ్యపుస్తకం. ఆ వేపుకు తిరిగి రెండు చేతులు జోడిస్తే బారెడు పొద్దెక్కిందని మనసులో ఓ భయం. పెరటిలోని వేపచెట్టు మూలనున్న దిగుడు బావి ఆరోగ్యానికి అభయం. వాకిట్లో కోడి పిల్లలకి ఆహారం వెతుకుతూ విహారం.  నక్కి నక్కి చూస్తున్న నల్ల పిల...

దసరా

దసరా  ఎప్పుడో మా పిల్లల్ని రోజు స్కూలుకు తీసుకువెళ్లే  రిక్షావాడు పదిహేను రోజుల క్రితం బజార్లో కనబడి నమస్కారం పెట్టి నవ్వుతూ చేతులు నలుపుకుంటూ కనిపించాడు. ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా పలకరించాను. దానికి సమాధానం లేదు. ఏమిటి సంగతి అని అడిగాను దసరా మామూలు అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. సుమారు ఇరవై సంవత్సరాల నుంచి నాకు వాడికి సంబంధం లేదు. దసరా మామూలు కోసం నమస్కారం పెట్టి పలకరించాడు. యాభై రూపాయల నోటు తీసి ఇచ్చి నవ్వుతూ వచ్చేసా. నేను నవ్వుకుంటూ వచ్చేసాను కానీ వాడి మొహం లో ఆనందం లేదు. అన్ని రేట్లు పెరిగిపోయాయి అయ్యగారు అంటూ అసహనంగా యాభై రూపాయల నోటు జేబులో పెట్టుకున్నాడు. సుమారు దసరాకి నెల రోజుల ముందు నుంచి రోజు ఇదే పరిస్థితి. ముఖ పరిచయం ఉన్న ప్రతి వాళ్లు గుడిలో కనబడిన బడిలో కనబడిన షాపింగ్ మాల్ లో కనబడిన హోటల్ లో ఎదురుపడిన చెయ్యి చాచి దసరా మామూలు కోసం నమస్కారం చేసి మామూలు వసూలు చేస్తున్నారు.  ఇంటిదగ్గర రోజు నిత్యం మనకి చాకిరి చేసే పని అమ్మాయి ,చెత్తబుట్ట వాడు మురికి కాలువలు శుభ్రం చేసేవాడు బట్టలు ఉతికే చాకలివాడు పిల్లల బడిలో పనిచేసే పనివారికి ఏడాది కోమారు అడిగితే ఆనందంగా ఇస...

శ్మశానవాటిక

శ్మశాన వాటిక నిత్యజీవితంలో మనం కొన్ని ప్రదేశాల పేర్లు తలచుకోడానికి ఇష్టపడం.ఆ పేరు వింటూనే ఏదో అపశకునంగా భావిస్తాం. ఉదాహరణకు రుద్రభూమి . దాన్నే స్మశానం అంటారు. కానీ ఊపిరి లేని వాళ్ళందరూ చివరికి చేరేది ఆచోటే. ఆ చోటుకు చేరుతామని తెలుసు కానీ మనం చేరే రోజు కానీ మనం చేరిన రోజు కానీమనకు తెలియదు. కానీ ఒక కవికి ఆ స్మశాన వాటిక కవితా వస్తువై అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. కవి ఎక్కడకైనా ప్రయాణిస్తాడు. పరకాయ ప్రవేశం చేసి రావలసిన వస్తువు రాబట్టుకుంటాడు. అటువంటి కవులలో చిరస్మరణీయుడు కీర్తిశేషులు గుర్రం జాషువా ఒకరు ఇంటిపేరు గుర్రం వారు . పేరులో ఏముంది పెన్నిధి అనకండి. ఆయన ఆలోచన గుర్రం కంటే వేగంగా పయనించి అద్భుతమైన కవిత కళాఖండాలను సృష్టించాడు. ఒక స్మశాన వాటికను కవిత వస్తువు కింద ఎన్నుకోవడం ఏమిటి అనే ప్రశ్న అందరిలాగే నాకు అనిపించింది . కానీ ఈయన పద్యాలు చదివినప్పుడు ఆనాటి సమాజంలో ఉన్న అస్పృశ్యతను పారద్రోలడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఈ స్మశాన వాటిక ఒక కవిత వస్తువుగా ఎన్నుకొన్నారు. ఇక్కడ అందరూ సమానులే కులం మతం వర్ణం వర్గం ఏమీ తేడా లేదు ఈ స్థలంలో అంటాడు. అంటే ప్రజల్ని చైతన్య పరచడానికి ఇది ఒక సాధనం. ...

అలంకరణ

అలంకరణ పూర్వకాలంలో శుభకార్యాలు ఆకాశమంత పందిరి వేసి పందిరి నిండా ముగ్గులు పెట్టి ,పచ్చటి తోరణాలు కట్టి పెళ్లిళ్లు చేసేవారు. అలాంటిది కాలం మారిపోయింది. పట్టణాల్లో బహుళ అంతస్తులో భవనంలో నివాసం ఉంటూ ఎవరైనా పది మంది చుట్టాలు వస్తే ఉండడానికి సరిపోక ఇబ్బంది పడుతుంటే అటువంటిది ఇంక శుభకార్యాలు సమయంలో ఎలా సరిపోతాయి .  అందుకే ఈ శుభకార్యాలన్నింటికీ పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కూడా ఆకాశమంత ఎత్తులో అందంగా కల్యాణ మండపాలు కట్టి అద్దెలకు ఇస్తున్నారు. ఈ కళ్యాణ మండపాల్లో అతిథులు కూర్చోవడానికి విశాలమైన హాలు. కుర్చీలు సోఫాలు ఏసీలు డైనింగ్ హాలు అతిధి రూములు కళ్యాణ వేదిక ఒకటేమిటి సకల సౌకర్యాలు ఒకచోటే. అటువంటి కళ్యాణ వేదికలని అందంగా అలంకరించడం ఒక కళ.  ఆ పెళ్లి జరుగుతున్నంతసేపు ఆ వేదిక ఒక ఇంద్ర భవనంలా ఉంటుంది .ఒక గుడిలా ఉంటుంది . ఇదంతా అలంకరణ మహిమ. ఇవాళ రేపు పుట్టినరోజులకి పండగలకి పెళ్లిళ్లకి మరి ఏ ఇతర శుభకార్యానికైనా ఇంటిని అందంగా అలంకరించుకోవడం ఒక అలవాటుగా మారింది.  దీనికి ప్రత్యేకమైన నిపుణత కలిగిన వారు ఉన్నారు. కొంతమంది పూలతో మరి కొంతమంది బుడగలతో మరి కొంతమంది అందమైన అలంకరణ సామగ్రితో ఆ వేదికన...

మాధవుడి కాలచక్రం

మాధవుడి కాలచక్రం రాములోరి కళ్యాణం మనకు ఒక పండగ ముక్కంటి పుట్టినరోజు జన్మానికో శివరాత్రి పగలంతా ఏడు గుర్రాల రథమెక్కి ఊరేగే ఆ సూర్యుడు పుట్టినరోజు కూడా మనకు పండగే మరి ఉగాదికి ఏ దేవుడి ని పూజించాలి? చంటిగాడికి ఓ ప్రశ్న. అప్రయత్నంగా తల పైకెత్తి చూస్తే గోడమీద పాలసముద్రం మీద నిలువ నీడలా చక్రాయుధం ధరించి చిరునవ్వుతో కనబడినాడు పరమాత్మ. అది కాలచక్రం, పరమాత్మ చేతిలో తిరిగే విష్ణు చక్రం! కాదు కాదు... కాల స్వరూపమే పరమాత్మ! ఆరు ఋతువులను బండి చక్రాల్లా నడిపిస్తూ, ఆగకుండా ముందుకు కదిలించే మహానటుడు! మనల్ని మురిపించే ఆ మాధవుడు! శిశిరం వదిలి వెళ్ళిన నిరాశలను, నవ వసంతం తెచ్చి తరిమి కొడతాడు. పచ్చని ఆకులు విప్పిన నవ తరువుగా కొత్త ఆశయాలను మోసుకురావడానికి ఉగాదిగా కొత్త ఊపిరి పోస్తాడు పంచాంగం విప్పి రాబోయే కాలాన్ని తెలుపుతాడు, ఆశలను పెంచి, ఆశయాలను మొలకెత్తిస్తాడు. ఆరు రుచులను తొలిరోజే రుచి చూపించి, "జీవితమంటే ఇంతే!" అని బోధిస్తాడు. వసంతంలో వచ్చే పండుగతో తల రాతలు మారతాయని ఆశిస్తే, "వసంత రుతువు అంటే నేనే!" అంటాడు ఆ సమ్మోహనాకారుడు చంటిగాడు ప్రశ్నకు సమాధానం దొరికింది, పండగ పరమార్ధం తెలిసింది....

మేనమామ

మేనమామ " ఏవండీ మా మేనమామ పోయాడుట. ఫోన్ చేసి చెప్పారు అంటూ చెప్పింది సుమతి భర్త మోహన్ ఆఫీస్ నుండి రాగానే అలాగా! అయ్యో పాపం అన్నాడు. అంతే ఆ తర్వాత ఏ మాట లేదు. ఆ తర్వాత భర్త చెప్పబోయే మాట గురించి ఎదురుచూసింది సుమతి. భర్త నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో చివరికి ధైర్యం చేసి "ఏవండీ మాకు ఉన్న ఒక్క ఒక మేనమామ వాళ్ల కుటుంబాన్ని అత్తయ్యని చూసి రావాలండి అని అడిగింది భర్తని సుమతి.  నాకు ఆఫీసులో బోలెడు పనులు ఉన్నాయి. సెలవు దొరకడం కష్టం. అయినా ముంబై నుంచి ఆ పల్లెటూరు వెళ్లాలంటే ఎంత కష్టం. రిజర్వేషన్లు దొరకవు. ఫ్లైట్ కి వెళ్లాలంటే చాలా ఖర్చు .పైగా చలికాలం. మరి అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు భార్య వైపు. అయినా మనం వెళ్లేసరికి ఆయన శవాన్ని ఇంకెవరిని చూస్తాం. ఏదో వెళ్లేవని పేరు కానీ ! ఇద్దరు పిల్లల్ని తీసుకుని నువ్వు ఒకదానివి వెళ్లడం చాలా కష్టం అని చెప్పి వేరే గదిలోకి వెళ్ళిపోయాడు.  సుమతికి ఒక్కసారి దుఃఖం పొంగుకు వచ్చింది. ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చి తలుచుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది.  సుమతి అమ్మమ్మగారి ఊరు తూర్పుగోదావరి జిల్లాలో పల్లిపాలెం గ్రామం. సుమతి అమ్మమ్మ పేరు సీతమ్మ తాతయ్య పేరు...

సాయం

సాయం  మధ్యాహ్నం రెండు గంటలు అయింది. ఎప్పుడు సాయంత్రం ఐదు గంటలకు కానీ రాని పనిమనిషి రత్తమ్మ రావడం చూసి "ఏమిటి రత్తాలు తొందరగా వచ్చేసావు ఇవాళ అని అడిగింది .సుభద్రమ్మ. రెండు మూడు రోజుల నుంచి వర్షాలు కదా అందుకే తొందరగా వచ్చి ఉంటుంది అనుకుంది సుభద్రమ్మ. గోదావరి మంచి పోటు మీద ఉంది. సాయంకాలానికి మన ఊళ్లో కి రావచ్చని కొంపలన్ని ఖాళీ చేయమని ప్రెసిడెంట్ గారు టముకు వేయించారు కదమ్మా. అందుకనే చీకటి పడకుండా సామాన్లు పిల్లల్ని తీసుకుని పక్కనున్న మా అత్తవారు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా ము. మరి ఎలా వెళ్తారు? అని అడిగింది సుభద్రమ్మ. మన ఊర్లోకి పడవలు వచ్చాయి.వాడు అడిగినంత ఇచ్చి బయటపడదాము అనుకుంటున్నా ము అంటూ చెబుతున్న రత్తమ్మ మాటలకి ఒక్కసారి ఆలోచనలో పడింది సుభద్రమ్మ.  అది గోదావరి పక్కనున్న శుద్ధ పల్లెటూరు. ఊళ్లో అందరూ మోతుబరి రైతులే . పిల్లలంతా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో సెటిల్ అయిపోయారు.తాతల నాటి ఆస్తులు ఇల్లు వదల్లేక ఆ ఊర్లోనే కాలక్షేపం చేస్తున్నారు ఆ తరం వాళ్లు. కోనసీమ గురించి అందంగా చెప్పుకుంటాం గాని పాపం వర్షాకాలం వచ్చిందంటే వాళ్లకి ఎంతో కష్టం. గోదావరి రోజుకు ఒకసారి భ...

కర్తవ్యం

కర్తవ్యం                 " రోజంతా మీకు చాకిరీ చేయలేక చచ్చిపోతున్నాను. ఏమి వినపడదు కనపడదు. చెప్పిన మాట అర్థం చేసుకోరు. నాకు వయసు అయిపోతుంది అంటూ పొద్దున్నే అత్తగారి మీద గట్టి గట్టిగా కేకలు వేస్తున్న పార్వతమ్మ మాటలకి మెలకువ వచ్చింది కోడలు రాజ్యలక్ష్మి కి. పార్వతమ్మ అత్తగారు సుందరమ్మ గారు మంచం పట్టి చాలా రోజులైంది. పాపంఈలోగా పార్వతమ్మ గారి భర్త కూడా చనిపోయాడు. ఉన్న ఒక్క కొడుకు రాజేష్ కి రాజ్యలక్ష్మి ఇచ్చి పెళ్లి చేసి కొత్త కోడల్ని కాపురానికి తీసుకొచ్చి రెండు నెలలు అయింది. ప్రతిరోజు పొద్దున్న ఇదే వరుస. సుందరమ్మ గారిని చూస్తే జాలేస్తోంది రాజ్యలక్ష్మి కి.  ఆ లంక అంత కొంపలో ఆ మూల గదిలో ఒక నులక మంచం. ఆ నులక మంచ o మీద సరి అయిన దుప్పటి ఉండదు. సుందరమ్మ శుభ్రమైన బట్ట కట్టుకుని ఎన్ని రోజులైందో. సుందరమ్మ గారి నీ ఆదరించిఅన్నం పెట్టడం చూడలేదు రాజ్యలక్ష్మి. నిజానికి ఆర్థికంగా సుందరమ్మకి లోటు లేదు. ఇంట్లో అందరూ వెండి కంచాలలో భోజనం చేస్తారు. కానీ ఆ సుందరమ్మ కి సత్తు కంచంలో అన్నం కలిపి పెడుతుంది  పార్వత మ్మ.  ఆ తరం వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉండేవి . ...

స్నేహం👬

స్నేహం చూడగానే ఒక చిరునవ్వు ఆ పైన ఒక ఆత్మీయమైన పలకరింపు  ఇదే కదా స్నేహానికి మొదటి మెట్టు. స్నేహం సాధారణంగా జ్ఞానం  తెలియని వయసులో అమ్మ ఒడి నుంచి బడికి వెళ్లిన తర్వాత  బెంచ్ మీద మీద పక్కన కూర్చున్న వాడితో మొదలవుతుంది  . సాయంకాలం పూట పార్కుల్లో ఎదురింటి కుర్రాళ్ళు   పక్కింటి కుర్రాళ్ళు తో ను బలపడుతుంది స్నేహం.  ఈ జీవనయానంలో ఎంతోమంది స్నేహితులు చేతులు   కలుపుతుంటారు విడిపోతుంటా రు. కొంతమంది   బ్రతుకుదారులు వేరైనా కడదాకా కలిసి ఉంటారు. పెరిగి   పెద్దయిన తర్వాత ఒక ఇంటివాడు అయిన తర్వాత పక్కింటి  వాళ్లతోటి ఎదురింటి వాళ్ళ తోటి స్నేహం మొదలవుతుంది.  అయితే నేను చెప్పబోయే వీళ్ళిద్దరు ఒక స్కూల్లో  చదువుకోలేదు. వయసులో చాలా తేడా వృత్తుల్లో తేడా అయినా ఒకే ఊరిలో కాపురం ఉంటూతెల్లవారి లేస్తే ఎవరు వృత్తిలో వాళ్ళు బిజీగా ఉంటూ రక్తసంబంధం లేకపోయినా బావగారు అని ఆప్యాయంగా పిలుచుకుంటూ కాలక్షేపం చేసే  రామారావు విశ్వనాథ శాస్త్రి ల కథ. రామారావు ఆ ఊర్లో ఒక ఆయుర్వేద వైద్యుడు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అవసరమైనప్పుడు సహాయం చేస్...

అంతరంగ రంగస్థలం

అంతరంగ రంగస్థలం. అది ఒక రంగస్థలం. కాదు కాదు పుణ్యస్థలం. పుణ్యక్షేత్రం సందర్శించాలంటే రాసిపెట్టి ఉండాలి. ఈ రంగస్థలం ఎక్కాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఈ కళమీద విపరీతమైన మక్కువ తో ఇన్నాళ్లు మన మధ్య ఉన్నవాళ్లే ఒక్కసారిగా ఆ రంగస్థలం మీద కాలు పెట్టిన వెంటనే నటులు అయిపోతారు. పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తారు. ఆ నాటకం చూస్తున్నంత సేపు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లి పోతారు.  రంగస్థలం మీద ప్రేక్షకుడికి ఎదురుగుండా నిలబడి తన నటన ప్రదర్శించాలి. ఇది చాలా కష్టమైన పని. రకరకాల పాత్రలు రకరకాల వేషధారణలు ధరించాలి . గొంతెత్తి శ్రావ్యంగా రాగయుక్తంగా పద్యాలు చదివి వినిపించాలి. అవసరమైన చోట నృత్యాలు చేయాలి. భారీ సంభాషణలు తో పాత్రను రక్తి కట్టించాలి. నిజంగా నటుల నటన తెలియాలంటే నాటకాలోనే తెలుస్తుంది. అయితే తెరదించిన తర్వాత ఆ నటులు మామూలు మనుషులు అయిపోతారు. నాటకానికి జీవితానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది అంటారు. కానీ మన నూరేళ్ళ జీవితంలో జీవిత చరమాంకం వరకు నటిస్తూనే ఉంటాం. పాత్రలలో జీవిస్తూనే ఉంటాం. మనం కూడా నటులమే. మానవ జీవితంలో ఉన్న వివిధ దశలలో మనల్ని ఆడించే ఆ పైవాడు మన దర్శకుడు . ఈ దర్శకుడు మనకి కనపడడు. కా...

సహాయం

సహాయం జీవితం క్షణ  భంగురం  అంటారు. ఒక్క క్షణం కాలం నిడివి గల జీవిత సంఘటనలు కొన్ని మనకి కనువిప్పు కలిగిస్తాయి. మనిషి గా ఉండవలసిన బాధ్యత గుర్తు చేస్తాయి. సమాజంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కానీ స్పందించే హృదయాలు కొన్నే ఉంటాయి. అవసరమైనప్పుడు ఆదుకోవడం అనేది అందరికీ  చేతకాదు. ఎంతసేపు డబ్బు చుట్టూ పరిగెత్తే మనిషి తన చుట్టుపక్కల చూడడం మానేశాడు.  చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అని   సిరివెన్నెల వారు అమృతమైన మాటలు చెప్పిన బాలు గారు గొంతులో ఆ పాట ఆనందంగా విని అర్థం మరుగున పడేసారు జనం ఆ పాట సంగతి అలా ఉంచి మనం కథలోకి వెళ్ళిపోదాం. అవి కరోనా దేశాన్ని కుదిపేస్తున్న రోజులు. రోడ్డుమీద ఎక్కడ జనసంచారం కనబడే వారు కాదు కానీ ఆసుపత్రిలోనూ  మందుల షాపుల దగ్గర బాగా రద్దీగా ఉండేది. అన్ని మందుల షాపుల్లాగా ఆ మందుల షాపు దగ్గర కూడా రద్దీ ఎక్కువగా ఉంది. మందుల కోసం వచ్చినవాళ్లలో రకరకాల వయసులో వాళ్ళు ఉన్నారు. అందులో ఒక 10 సంవత్సరాల పాప చేతిలో బ్యాగు, మందుల చీటీతో వచ్చి నిలబడి ఉంది ఇంతలో ఒక వృద్ధుడు చేతిలో కర్ర పట్టుకుని నడుస్తూ ఒక మందుల చీటీ మందుల షాపు యజమాని చేతులో పెట్టాడు. ఆ ముసలాయనకి ...

సీత జీవితం

సీత జీవితం  ఇల్లంతా పెళ్లి సందడితో హడావిడిగా ఉంది. గుమ్మానికి మామిడి తోరణాలు ఆకాశమంత పందిరి హాలంతా డెకరేషన్ చాలా అందంగా ఉంది. అక్కడ హల్దీ కార్యక్రమానికి డ్యాన్సులతో బంధువులంతా బిజీగా ఉన్నారు. పెళ్లికూతురు సీతాదేవి గారిని రెండు చేతులుండా గోరింటాకు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. కొందరు గోరింటాకు పెట్టించుకునే హడావుడిలో కొందరు డాన్స్ లు హడావిడిలో హాలు అంతా ఆనందంగా ఉంది.  పెళ్లి పెద్దలు ఇద్దరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. వథూవరుల వయసు ఎంత ఉంటుందో ఊహించగలరా . ఇద్దరు వృద్ధ దంపతులు . ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు. ఇద్దరు బిడ్డల తల్లి . కడుపున పుట్టిన పిల్లలు తల్లికి పెళ్లి చేయడం మరీ వింతగా ఉంది కదా. వింత కాదండి. ఇంతకీ పెళ్లి వెనుక అసలు కథ ఏమిటి. సీతా దేవి గారు తల్లిదండ్రులకి ఏకైక కుమార్తె. తండ్రి నారాయణ మూర్తి గారు వేద పండితుడు. ఆచార సాంప్రదాయాలకు విలువనిచ్చేవాడు. లేక లేక పుట్టిన ఆడపిల్లని చాలా కట్టుబాట్లుతో పద్ధతిగా పెంచాడు. ఆ ఊర్లో ఉండే ప్రాథమిక విద్య తోటి చదువు ఆపించేసి ఇంటి వద్దనే సంస్కృత పాఠాలు పురాణాలు సంగీతం నేర్పించాడు. సీతా దేవి గారు కూడా చాలా...