పోస్ట్‌లు

మార్పు

మార్పు నాన్న ఈసారి మీరు తప్పకుండా నాతో పాటు రావాలి. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను మీరు దాటేస్తున్నారు. మా కొలీగ్ తల్లిదండ్రులందరూ వచ్చి ఆరేసి నెలలపాటు ఉంటారు. మీరేమో నా మాట వినరాయే. నాకు చాలా బాధగా ఉంది అంటూ అమెరికా కొడుకు సురేష్ మాటలు విని చూద్దాం లేరా అoటు గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్లిపోయారు చిరంజీవి గారు. సురేష్ కిఅమెరికాలో ఉద్యోగం వచ్చి ఆరు సంవత్సరాలు అయింది. సురేష్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి తండ్రి బాధ్యతలు పంచుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చాడు. చిరంజీవి గారికి నలుగురు మగపిల్లలు ఒక అమ్మాయి . చిరంజీవి గారి భార్య నాలుగు సంవత్సరాల క్రితమే చనిపోయింది. ముగ్గురు కొడుకులు భార్యలు మన వళ్ళతో ఆ ఊర్లోనే కాలక్షేపం చేస్తున్నాడు చిరంజీవి గారు. సురేష్ చదువు కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చి అన్నగారి కొడుక్కి గుండె ఆపరేషన్ చేయించి తండ్రి కోరిక ప్రకారం ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు కట్టించాడు. అయితే సురేష్ తనకంటూ ఒక పది పైసలు దాచుకోలేదు. పెళ్లి కూడా అయ్యింది .ఇద్దరు పిల్లలు. పాపం డబ్బంతా మనం వాడేస్తే ఎలాగా అనేది సురేష్ తండ్రి చిరంజీవి గారి ఆలోచన. చిరంజీవి గారు బ్రాహ్మణ కుటుంబానికి చ...

ముందు జాగ్రత్త

ముందు జాగ్రత్త  ఒరేయ్ రెడ్డి ఉదయం లేచి పిఠాపురం పశువుల సంతకు వెళ్లాలి అoటు రామారెడ్డి తన కొడుకు శ్రీనివాసరెడ్డి తోటి మంచం మీద పడుకుంటూ చెప్పాడు. మనకు పశువులు ఎందుకు నాన్న పొలాలన్నీ అమ్మేశాముగా అంటూ కొడుకు ప్రశ్నించాడు. లేదు రేపు ఉదయం తప్పకుండా వెళ్లాలి. బస్సు మీద కాదు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోదాం అంటూ సమాధానం ఇచ్చాడు రామారెడ్డి. తండ్రి మనసులో ఉన్న మాట చెప్పలేదు ఎందుకో తెలియదు అయినా తండ్రి మాటంటే శ్రీనివాస రెడ్డికి చాలా గౌరవం. సరే నాన్న తెల్లవారుజామున బయలుదేరుదాం అంటూ ఇద్దరు మంచం మీద వాలేరు. రామారెడ్డి ఒకప్పుడు బాగా చదువుకున్న మోతుబరి రైతు. కాలక్రమేణా పంటలు సరిగా పండక పిల్లల పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి ఆస్తంతా ఖర్చు అయిపోయింది. రామారెడ్డి దైవభక్తిపరుడు. పూజలు పునస్కారాలు అంటే బాగా ఇష్టం.ఎప్పుడు గుళ్ళుతిరుగుతుంటాడు. ఆ సొంత ఊర్లోనే తన తాతలనాటి కొంపలోకొడుకు కోడలు భార్యతో కాలక్షేపం చేస్తున్నాడు.  పొలాలూ ఉన్న రోజుల్లో ఇంటి వెనక పశువుల పాకలో ఎప్పుడు పది ఆవులు ఉండేవి. ఎద్దుల తోటే వ్యవసాయం చేసేవాడు. ఆ పశువులని నిత్యం దైవంగా పూజించేవాడు. కాలం కలిసి రాక ఆస్తి అంతా పోయింది కానీ భూ...

దేవుడు వేసిన శిక్ష

దేవుడు వేసిన శిక్ష. ఉదయం 5:30 గంటలయింది. శీతాకాలం కావడంతో జన సంచారం పెద్దగా లేదు.ఎప్పుడు డ్యూటీ కరెక్ట్ గా చేసే బాలభానుడు ప్రపంచానికి వెలుగు చూపి ఆ గోదావరి నదిలో తన అందం చూసుకుంటున్నాడు. ఏరా రాజు బారెడు పొద్దెక్కింది ఇంకా మంచం మీద నుంచి లేవలేదా గోదావరిలోకి వెళ్ళవా అంటూ తల్లి కసిరిన కేకతో మంచం మీద నుంచి బద్దకంగా లేచి దుప్పటి మడతపెట్టి గూట్లో ఉన్న వేప పుల్ల తీసుకుని నోట్లో పెట్టుకుని గోదావరి ఒడ్డుకి  పరిగెత్తాడు. ఏదిక్కు లేకపోతే గోదావరే దిక్కు అంటారు కదా. అలాగే అభాగ్యులందరికీ గోదావరి తీరం కడుపు నింపుతుంది  అలా రాజుకి బ్రతకడానికి ఆ గోదావరి ఆధారం. ఆ గోదావరి తీరంలోని చిన్నపాక లో వారి కాపురం. నిండా పదేళ్లు కూడా ఉండవు. కుటుంబానికి ఆధారం వాడే. ఆ చిన్న వయసులో ఏం పని చేయగలడు అనే ఆలోచన అందరికీ వస్తుంది.  ఇంతకీ గోదావరి రాజు కడుపుఎలా నింపుతోంది. రాజమహేంద్రవరానికి ప్రత్యేక ఆకర్షణ ఈ గోదావరి. ఆ గోదావరి నది మీద నిర్మించిన వారధి మీద రోజు ఎన్నో రైళ్లు అటు ఇటు తిరుగుతుంటాయి.  విజయవాడ వైపు వెళ్లే రైళ్లు విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లు తప్పనిసరిగా ఈ వారధి దాటే వెళ్లాలి. అందుకే ఈ బ్రిడ్జి...