పోస్ట్‌లు

మారిన మానవుడు

మారిన మానవుడు అనాదిగా మానవుడు సంఘజీవి. ఒక తీయని పలకరింపుతో పులకరించిపోతాడు. స్నేహం కోసం ప్రాణాలు అర్పిస్తాడు. విద్యార్థి దశలో మొదలైన స్నేహం కడదాకా కొనసాగుతుంది. ఎవరైనా కోరితే సహాయం వెంటనే చేసేవాడు. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడానికి వెనుకాడే వాడు కాదు. మన సంస్కృతి అటువంటిది. మన చరిత్ర అటువంటిది. కర్ణుడు శిబి చక్రవర్తి లాంటి వారు మనకు ఆదర్శం.  సంతర్పణలు పూజలు పునస్కారాలు అంటూ పదిమంది ఒకచోట చేరేవారు. కష్టo సుఖం మాట్లాడుకునేవారు. పుణ్య దినాలలో అరుగుల మీద కూర్చుని భజనలతో కాలక్షేపం చేసేవారు. రచ్చబండల దగ్గర పిచ్చా పాటీ మాట్లాడుకునేవారు. అలా మనిషికి మనిషికి ఒక అనుబంధం ఉండేది. ఆప్యాయంగా పలకరించుకునేవారు. మనసు విప్పి మాట్లాడుకునేవారు. మమతపంచుకునేవారు.బంధుత్వాలుపెంచుకునేవారు కష్టసుఖాల్లోపాలుపంచుకునేవారు కానీకాలంమారిందిమనిషిలోమార్పులుచోటుచేసుకున్నాయి.మనిషి ఒంటరివాడైపోతున్నాడు .మనిషి తన చుట్టూ తాను గిరి గీసుకొని బతుకుతున్నాడు. యువతరం అయితే మరీను. ఎవరైనా పలకరిస్తే తప్ప మాట్లాడరు. పక్కనున్న వ్యక్తి గురించి పట్టించుకోరు. ఎదురింటిలో ఎవరు ఉంటున్నారో తెలియదు. ఎంతసేపు ఒకే లోకం.  ఆ లోకంలోనే మని...

ఉత్తరం

ఉత్తరం  " ఏమిటి ! సాంబయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చి అప్పుడే పదిహేను రోజులు అయింది. ఏమీ తోచట్లేదు .కబుర్లు తెలియట్లేదు . ఎప్పుడూ వారం రోజులకోసారి ఉత్తరం రాసేవాడు అనుకుంటూ పోస్ట్ మాన్ కోసం ఎదురుచూస్తూ మాటిమాటికి గుమ్మం వైపు తొంగి చూస్తోంది కావమ్మ. ఉత్తరం చదివితే సాంబయ్య ను చూసినట్టు ఉంటుంది కావమ్మకి. సాంబయ్య తో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ రోజుల్లో కావమ్మ లాంటి వాళ్ళు ఎందరో! మళ్లీ ఉత్తరం వచ్చేవరకు ఆ ఉత్తరంలోని సంగతులతో మనసు బెంగ పెట్టుకోదు. ఏంటో ఈసారి చాలా లేట్ అయింది అనుకుంటూ గదిలో మూలగా ఉన్నతీగకు తగిలించుకున్న పాత ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించింది. మొదటి వాక్యం లో గౌరవం, ప్రేమ మొదలైంది . ఎడం చేతపక్క తల పైకెత్తి చూస్తే దాని వయసు ఎంతో తెలిసిపోయింది. మీకోసం ఆ ఊరి నుంచి కబురు మోసుకొచ్చాను అని చెప్పింది.   క్షేమమాచారాలతో మనసు కుదురుపరచి అక్కడి నుంచి ఆ ఊరి ఊసులన్నీ చెబుతూ ప్రేమ పొంగిస్తూ బాధలను తెలియ చేస్తూ అమ్మ మీద బెంగ ని ప్రకటించే కబుర్లన్నీ తనలో దాచి తలపై మీద ముద్ర వేయించుకుని వచ్చిన తోకలేని పిట్ట ఈ కార్డు ముక్కని చదివి కన్నీళ్లు కార్చింది కావమ్మ.  ముగింపులో...

మట్టి లో మాణిక్యం

మట్టిలో మాణిక్యం మధ్యాహ్నం మూడు గంటలు అయింది   ఇందిరా గాంధీ లేడీస్ క్లబ్ ఆవరణ అంతా హడావిడిగా ఉంది. కార్యకర్తలంతా అటు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతూ సభా ప్రారంభానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ముఖ్య అతిధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు . "ఆ బ్యానర్ ఎదురుగుండా కట్టండి అని చెప్పి ఒక్కసారి బ్యానర్ కేసి చూసిన లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ అదేమిటి ? ముఖ్యఅతిథి పేరు కింద జిల్లా కలెక్టర్ అని రాయలేదు ఏమిటి? అని అడిగింది. " లేదు మేడం కలెక్టర్ గారు ఒక సాధారణ మహిళ గానే ఈ కార్యక్రమానికి వస్తారట. అందుకని పేరు మాత్రమే రాయమన్నారు అంటూ సమాధానమిచ్చింది లేడీస్ క్లబ్ సెక్రటరీ.  ఆ జిల్లాకి కలెక్టర్ ఆయన శ్రీమతి సుమతి ఆరోజు ముఖ్య అతిథి. ఇంతకీ జరగబోయే ఫంక్షన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.  సరే అనుకున్న సమయానికి కలెక్టర్ గారు రావడం వేదిక మీదకి ఆహ్వానించడం అలాగే ఆరోజు సన్మానితులను కూడా వేదిక మీద కలెక్టర్ గారి పక్క న కూర్చోబెట్టడం జరిగింది.  అతి సామాన్యమైన దుస్తులతో ఏవి అలంకరణలు లేకుండా కనీసం జుట్టు కూడా దువ్వుకోకుండా ఉన్న స్త్రీ ని కలెక్టర్ గారి పక్కన కూర్చోవడం జరిగింది. ఒక్కసారి కలెక్టర్ సుమతి ఆమె కేసి...