పోస్ట్‌లు

తిరుమల బ్రహ్మోత్సవం

భారతదేశంలో అనేక తీర్థక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నా, తిరుమల శ్రీవారి ఆలయం అత్యంత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఇక్కడకు చేరుతారు. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలలో ప్రధానమైనది బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం యొక్క మూలం ఆగమ శాస్త్రాల ప్రకారం, బ్రహ్మదేవుడు స్వయంగా మొదట ఈ ఉత్సవాన్ని నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనికి "బ్రహ్మోత్సవం" అనే పేరు వచ్చింది. ఈ ఉత్సవం ద్వారా జగన్నాథుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు తన మహిమను లోకానికి తెలియజేస్తారని విశ్వాసం ఉత్సవాల కాలం ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ ద్వితీయ నుండి తొమ్మిదవ తిథి వరకు (సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో) ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఉత్సవ ప్రారంభాన్ని సూచించే అనురోధనం, గరుడపతాకాన్ని ఎగరేసే ధ్వజారోహణం, చివరగా చక్రస్నానం ఈ ఉత్సవాలకు ప్రత్యేకత. ఉత్సవాల నిర్వహణ ఉత్సవ కాలంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం శ్రీవారిని విభిన్న వాహనాలపై వేదఘోషల మధ్య, భజనలతో, మంగళవాయిద్యాలతో ఊరేగిస్తారు. భక్తులు వీటిని చూడటమే పుణ్యం అని నమ్ముతారు. రోజు వారీ వాహన సేవలు 1. మొదటి రోజు...

ఆ నాలుగు చుక్కలు

ఇంకా కాంతమ్మ రాలేదు ఏమిటి ? రోజు ఉదయం ఏడు గంటలకు వచ్చేసేదే! ఏమైంది అబ్బా అనుకుంటూ మాటిమాటికీ వీధిలోకి తొంగి చూస్తున్న సుజాతకి వాడిపోయిన మొహంతో దూరం నుంచి వస్తున్న కాంతమ్మ కనబడింది.  సుజాతను చూస్తూనే రాత్రి మా చంటోడు నిద్రపోలేదు తెల్లవార్లు పీకుతూనే ఉన్నాడు. నా దగ్గర పాలు లేవని తెలుసు. పోత పాలు పడుతుంటే విరోచనాలు అవుతున్నాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కాంతమ్మ.  భగవంతుడు సృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది. కాంతమ్మ కొడుకు కంట సుజాత కొడుకు రెండు నెలల పెద్ద. సుజాత కొడుకు రెండు గుక్కలు తాగి పక్కకు తిరిగి పడుకుంటాడు. ఒకపక్క అతివృష్టి మరొకపక్క అనావృష్టి. ఇద్దరినీ సృష్టించింది దేవుడే. అయినా ఎవరి అదృష్టం వారిది. విజ్ఞాన శాస్త్రం ఎంత బాగా అభివృద్ధి చెందిన తల్లిపాలు మించిన బిడ్డకి ఏ ఆహారము లేదంటారు డాక్టర్లు. తల్లిదగ్గర పాలు లేక కొన్ని కుటుంబాలు బాధపడుతుంటే ఉన్న పాలు బిడ్డకు పంచి ఇవ్వడానికి అందం చెడిపోతుందని ఉద్దేశంతో కొంతమంది కావాలని పోత పాలు అలవాటు చేస్తున్నారు కొంతమంది తల్లులు. కాంతమ్మ మాటలు వినేసరికి ఒక బిడ్డకు తల్లిగా సుజాత హృదయం చలించిపోయింది. ఆ చిన్ని బొజ్జ కి తల్లి ఇచ్చే నాలుగు చుక...

శ్మశానం

నిత్యజీవితంలో మనం కొన్ని ప్రదేశాల పేర్లు తలచుకోడానికి ఇష్టపడం.ఆ పేరు వింటూనే ఏదో అపశకునంగా భావిస్తాం. ఉదాహరణకు రుద్రభూమి . దాన్నే స్మశానం అంటారు. కానీ ఊపిరి లేని వాళ్ళందరూ చివరికి చేరేది ఆచోటే. ఆ చోటుకు చేరుతామని తెలుసు కానీ మనం చేరే రోజు కానీ మనం చేరిన రోజు కానీమనకు తెలియదు. కానీ ఒక కవికి ఆ స్మశాన వాటిక కవితా వస్తువై అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. కవి ఎక్కడకైనా ప్రయాణిస్తాడు. పరకాయ ప్రవేశం చేసి రావలసిన వస్తువు రాబట్టుకుంటాడు. అటువంటి కవులలో చిరస్మరణీయుడు కీర్తిశేషులు గుర్రం జాషువా ఒకరు ఇంటిపేరు గుర్రం వారు . పేరులో ఏముంది పెన్నిధి అనకండి. ఆయన ఆలోచన గుర్రం కంటే వేగంగా పయనించి అద్భుతమైన కవిత కళాఖండాలను సృష్టించాడు. ఒక స్మశాన వాటికను కవిత వస్తువు కింద ఎన్నుకోవడం ఏమిటి అనే ప్రశ్న అందరిలాగే నాకు అనిపించింది . కానీ ఈయన పద్యాలు చదివినప్పుడు ఆనాటి సమాజంలో ఉన్న అస్పృశ్యతను పారద్రోలడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఈ స్మశాన వాటిక ఒక కవిత వస్తువుగా ఎన్నుకొన్నారు. ఇక్కడ అందరూ సమానులే కులం మతం వర్ణం వర్గం ఏమీ తేడా లేదు ఈ స్థలంలో అంటాడు. అంటే ప్రజల్ని చైతన్య పరచడానికి ఇది ఒక సాధనం. ఈ స్మశాన స్థల...