పోస్ట్‌లు

రావిచెట్టు

"ఏవండీ అప్పారావు గారు, రేపు ఉదయం ఈ రావి చెట్టు కొట్టడం ప్రారంభించాలి. ఇంత పెద్ద చెట్టు కొట్టాలంటే కనీసం పది మంది కూలీలు, నాలుగు రోజులు సమయం పడుతుంది. దానికి తగిన ఏర్పాట్లు చూడండి" అంటూ ఆ అధికారి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పి కార్ ఎక్కి బయలుదేరి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. "సార్, ఈ చెట్టు కొట్టడం లేబర్ వల్ల సాధ్యం కాదు. పట్నం నుంచి కోత మిషన్ తెప్పించాలి. ముందు కొమ్మలు నరికేసిన తర్వాత చెట్టు మొదలు కోత మిషన్ చేత కోయించాలి. పైగా దీని చుట్టూ సిమెంట్ దిమ్మ కూడా ఉంది. ఈ దిమ్మ పడ కొట్టాలంటే బుల్డోజర్ కూడా కావాలి" అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు మేస్త్రి అప్పారావు. "ఎలాగూ లేదన్న పదిహేను రోజులు టైం పడుతుంది అండి" అంటూ చెట్టు పైకి పరిశీలనగా చూశాడు అప్పారావు. "సరే" అంటూ అధికారి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. అబ్బా! ఎంత పెద్ద చెట్టు! పెద్ద పెద్ద కొమ్మలు, నిండా ఆకులు – ఒక రాక్షసుడు లా ఉంది. ఈ గ్రామానికి సరిపడే ఆక్సిజన్ ఇదే సరఫరా చేస్తుందేమో. గాలికి అటు ఇటు ఊగే ఆకులు ఎప్పుడు పెద్ద శబ్దం చేస్తూ ఉంటాయి. దీని వయసు సుమారు వంద సంవత్సరాలు పైగా ఉంటుంది. ఎవరూ నాటారో మహానుభావ...

మా ఊరి జ్ఞాపకం

చూడ్డానికి క్రికెట్ వీరుడులా, పొట్టిగా గవాస్కర్ లా ఉండేవాడు మా వెంకన్న. ఆ గవాస్కరు ఎప్పుడు చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే, ఈయన నోట్లో పొగాకు చుట్ట, చేతిలో పదమూడు ముక్కల పేక పట్టుకుని ఉండేవాడు. లుంగీ పంచ కట్టుకుని దానిమీద చొక్కా తొడుక్కుని, నోట్లో చుట్ట పెట్టుకుని ఉదయమే లేచి సైకిల్ ఎక్కాడంటే ఏ అరుగుదగ్గర ఆగుతాడో ఎవరికీ తెలిసేది కాదు. అరుగు దగ్గర ఆగాడంటే భాగవతం, భారతం, రామాయణం వినడానికి కాదు. ఈయన పారాయణం వేరే ఉంది. అదే చతుర్ముఖ పారాయణం. అందరూ సంక్రాంతి పండుగకి, పెళ్లిళ్లకి, వేసవి సెలవులకి పేకాట ఆడడం మామూలే ఆ ఊర్లో. కానీ మా వెంకన్న 365 రోజులు అదే ప్రవృత్తి! వృత్తి వ్యవసాయం అంటాడు. ఎప్పుడూ పొలం గట్టు ఎక్కిన పాపాన పోలేదు. తలపాగా చుట్టిన సందర్భం చూడలేదు. “ఏవండీ వెంకన్నగారు ఉన్నారా ఇంట్లో?” అంటూ సంవత్సరంలో ఎప్పుడు ఎవరు అడిగినా, “లేదండి, పేకాటలో ఉన్నారండి” అని ఇంట్లోంచి సమాధానం. అదేదో పెద్ద ఉద్యోగం లాగా చెప్పేవారు. చివరికి ఏ వీధిలో ఉన్నాడు, ఎవరు అరుగు మీద ఉన్నాడు వెతుక్కుని, ఆ వచ్చిన పెద్దమనిషి తన పని పూర్తి చేసుకునేవాడు. ఆ ఊర్లో నాలుగైదు అరుగులు ప్రత్యేకంగా ఈ చతుర్ముఖ పారాయణంకే పెట్టింది ప...

తిరుమల బ్రహ్మోత్సవం

భారతదేశంలో అనేక తీర్థక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నా, తిరుమల శ్రీవారి ఆలయం అత్యంత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఇక్కడకు చేరుతారు. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలలో ప్రధానమైనది బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం యొక్క మూలం ఆగమ శాస్త్రాల ప్రకారం, బ్రహ్మదేవుడు స్వయంగా మొదట ఈ ఉత్సవాన్ని నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనికి "బ్రహ్మోత్సవం" అనే పేరు వచ్చింది. ఈ ఉత్సవం ద్వారా జగన్నాథుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు తన మహిమను లోకానికి తెలియజేస్తారని విశ్వాసం ఉత్సవాల కాలం ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ ద్వితీయ నుండి తొమ్మిదవ తిథి వరకు (సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో) ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఉత్సవ ప్రారంభాన్ని సూచించే అనురోధనం, గరుడపతాకాన్ని ఎగరేసే ధ్వజారోహణం, చివరగా చక్రస్నానం ఈ ఉత్సవాలకు ప్రత్యేకత. ఉత్సవాల నిర్వహణ ఉత్సవ కాలంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం శ్రీవారిని విభిన్న వాహనాలపై వేదఘోషల మధ్య, భజనలతో, మంగళవాయిద్యాలతో ఊరేగిస్తారు. భక్తులు వీటిని చూడటమే పుణ్యం అని నమ్ముతారు. రోజు వారీ వాహన సేవలు 1. మొదటి రోజు...