పోస్ట్‌లు

సత్య

ఉదయం పది గంటలు అయ్యింది. వృద్ధాశ్రమంలో తన గదిలో మంచం మీద పడుకున్న సత్యకి, పక్క మంచం మీద పడుకున్న రాఘవమ్మ దగ్గరకి ఇద్దరు రావడం గమనించింది. ఇద్దరూ కవల పిల్లలు అనుకుంటా — ఒకే పోలిక, ఒడ్డు పొడుగు సమానంగా ఉన్నారు. ఇద్దరికీ పెళ్లి అయిపోయింది అనిపించింది. అంతవరకు మంచం మీద మూలుగుతూ పడుకున్న రాఘవమ్మ, ఆ పిల్లలు రాగానే లేచి కూర్చుని నవ్వుతూ మాట్లాడడం సత్య గమనించింది. రాఘవమ్మ ఆ పిల్లల్ని పరిచయం చేస్తూ — “ఇంతవరకు అమెరికాలో ఉండేవారు, ఇప్పుడు ఇండియా వచ్చేసారు. అందుకే నన్ను తీసుకువెళ్లడానికి వచ్చారు” — అని చెప్పింది. అది విన్న సత్య మనసులో — “నా అదృష్టం ఎప్పుడు వస్తుందో?” — అనిపిస్తూ గతజీవితం గుర్తుకొచ్చింది. --- “కంగ్రాట్యులేషన్స్ పార్వతమ్మ గారు! మీ అమ్మాయి సత్యకి కవల పిల్లలు పుట్టారు. తల్లి పిల్లలు అంతా క్షేమం. కాసేపట్లో రూముకు పంపిస్తాను” అంటూ లేడీ డాక్టర్ సరోజ చెప్పిన మాటలు లీలగా వినబడ్డాయి సత్యకి. ఒక్కసారి ఆనందం ముంచుకొచ్చింది. పిల్లలను చూసి ఎత్తుకుని ముద్దాడాలనిపించింది. కానీ ఒళ్లంతా మత్తుగా ఉంది, కళ్ళు తెరవబుద్ధి కావడం లేదు. చంటి పిల్లల ఏడుపులు లీలగా వినిపిస్తున్నా, ఏమీ చేయలేక పడుకుని ఉండిపోయింద...

మా ఊరి జ్ఞాపకం

చూడ్డానికి క్రికెట్ వీరుడులా, పొట్టిగా గవాస్కర్ లా ఉండేవాడు మా వెంకన్న. ఆ గవాస్కరు ఎప్పుడు చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే, ఈయన నోట్లో పొగాకు చుట్ట — చేతిలో ఎప్పుడు పదమూడు ముక్కల పేక పట్టుకుని ఉండేవాడు. లుంగీ, పంచ కట్టుకుని, దానిమీద చొక్కా తొడుక్కుని, నోట్లో చుట్ట పెట్టుకుని ఉదయమే లేచి సైకిల్ ఎక్కాడంటే — ఏ అరుగుదగ్గర ఆగుతాడో ఎవరికీ తెలిసేది కాదు. అరుగు దగ్గర ఆగాడంటే భాగవతం, భారతం, రామాయణం వినడానికి కాదు. ఈయన పారాయణం వేరే ఉంది. అదే చతుర్ముఖ పారాయణం. --- అందరూ సంక్రాంతి పండుగకి, పెళ్లిళ్లకి, వేసవికాలం సెలవులకి పేకాట ఆడడం మామూలే ఆ ఊర్లో. కానీ మన వెంకన్న 365 రోజులు అదే ప్రవృత్తి. వృత్తి వ్యవసాయం అంటాడు. ఎప్పుడు పొలం గట్టు ఎక్కిన పాపాన పోలేదు. తలపాగా చుట్టిన సందర్భం చూడలేదు. “ఏవండీ వెంకన్న గారు ఉన్నారా ఇంట్లో?” అంటూ మూడు వందల అరవై ఐదు రోజులలో ఎప్పుడు ఎవరు అడిగినా — “లేదండి, పేకాటలో ఉన్నారండి” అని ఇంట్లోంచి అదే సమాధానం. అదేదో పెద్ద ఉద్యోగం లాగా చెప్పేవారు. చివరికి ఏ వీధిలో ఉన్నాడు, ఎవరు అరుగు మీద ఉన్నాడు వెతుక్కుని ఆ వచ్చిన పెద్దమనిషి తన పని పూర్తి చేసుకునేవాడు. ఆ ఊర్లో నాలుగైదు అరుగులు ప్...

సాయి

సాయి ఈ సృష్టి అంతా పరమేశ్వర ప్రసాదమే. అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనది మానవజన్మ. ఎందుకంటే అన్ని జీవులకీ ఇంద్రియాలు ఉంటాయి. కానీ మానవుడు మాత్రమే మాట్లాడగలడు. మాట మనిషికి దేవుడిచ్చిన వరం. నోరు ఆత్మీయంగా పలకరిస్తుంది; అవాకులు చవాకులు పలికిస్తుంది. అలాగే ఇంద్రియములన్నీ కూడా సక్రమంగా నడిస్తే ఏ బాధ ఉండదు. దారి తప్పితే మనిషి అధోగతిపాలవుతాడు. మనిషి తన నడవడికలో ఏది మంచి, ఏది చెడు తెలియజెప్పడానికి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు తోడ్పడతాయి. అలాగే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి భగవంతుడు అనేక అవతారాలు ఎత్తుతూ ప్రజలను రక్షిస్తూ వచ్చాడు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వంటి ఆధ్యాత్మిక గురువులు తమ బోధనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారు. మదర్ తెరిసా వంటి కరుణామూర్తి పేదలకు సేవ చేస్తూ ఆదర్శవంతంగా నిలిచారు. అలాగే హిందూ, ముస్లిం మతాలను రెండింటిని సమన్వయపరుస్తూ “అందరికీ ప్రభువు ఒక్కడే” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ భగవంతునిపై విశ్వాసం ఉంచాలని, శ్రద్ధతో ఏ పనైనా పూర్తి చేయాలని బోధించి ప్రజల చేత ఆరాధించబడుతున్న మహాయోగి, కరుణామూర్తి — షిరిడి సాయి బాబా వారు. --- శ్రద్ధ, సబూరి అనేవి ఆయన బోధనలో ముఖ్యమై...