పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

నిశ్శబ్దమైన ప్రేమ

నిశ్శబ్దమైన ప్రేమ ఏ జన్మలో ని రుణానుబంధమో ఆ స్థావరంలో నాకు ఇంత చోటు కల్పించింది . ఆ స్థావరం నా ఉనికికి ఆధారమైంది. ఆ దుర్భేద్యమైన కోట చుట్టూ తిరుగుతూ చిమ్మ చీకటిలో గర్భస్థ నరకాలన్ని అనుభవిస్తూ ఎవరో తెలియని దాత అందించిన అమృతాన్ని చప్పరిస్తూ, ఎవరో అజ్ఞాత దాత ప్రసాదించిన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నెలకొకటి చొప్పున స్వీకరిస్తూ అలుపెరుగని సైనికుడి లాగా నిత్య సమరం చేస్తుంటే నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు నీ లోకం వేరు అంటూ మాయాలోకం నుండి మన లోకంలోకి తీసుకొచ్చి పడేసి ఇదిగో నా రూపం అంటూ దేవుడు నన్ను చూపించి ఆనందపరిచాడు మా బంధువుల్ని, స్నేహితులని.  నేను కడుపులో పడినప్పుడు నేను ఒక రకంగాను అమ్మ ఒక రకంగానూ బాధ అనుభవించి నరకాలన్నీ చూసాము. నవనాడులు బిగబట్టి పురిటి నొప్పులు భరించి ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ లోకంలోకి నన్ను తీసుకురావడం అమ్మకి నరకమే. అలా భూమి మీద పడ్డ నాకు ఇన్నాళ్లు అమృతo అందించిన అన్నపూర్ణ నాకు అమ్మ అయింది. అమ్మ నుంచి వచ్చినవే నాకు బంధుత్వాలన్నీ. నాకు తొలి బంధువు అమ్మ.   తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగిన నేను అమ్మ ఒకరినొకరు చూసుకోలేదు. నా రూపం తెలియదు నా రంగు తెలియదు...

కైలాస వీచికలు

కైలాస వీచికలు. ఉదయం నుంచి కైలాస పర్వతం అంతా హడావుడిగా ఉంది. ఆరోజు ఏమిటి ప్రత్యేకత . మహా శివుడి పుట్టినరోజు. శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు. లోకానికి మహాశివరాత్రి.  మరి అటువంటి శుభ సమయంలో పార్వతి దేవి హడావుడిగా కైలాస పర్వతం అంతా తిరుగుతూ శివుడు గురించి వెతుకుతోంది.  తన నేత్రాలని పత్తికాయలా చేసుకుని వెతుకుతున్న ఆ త్రినేత్రుడు జాడ ఎక్కడా కనపడలేదు. ఏమిటి స్వామి! ఎ క్కడ కనపడటం లేదు అనుకుంటూ ఆందోళన పడుతుండగా దూరం నుంచి శివుడు వస్తూ కనబడ్డాడు. పార్వతి దేవి : స్వామి ఎక్కడికి వెళ్ళిపోయారు ?మీ గురించి ఏ లోకమని వెతకను ?చాలా ఆందోళన పడ్డాను !అంటూ కోపంగా పలికింది.  శివుడు: పార్వతి ఈరోజు ఏమిటో నీకు గుర్తు లేదా! నా పుట్టినరోజు మన కళ్యాణం జరిగిన రోజు అట్లాంటి పవిత్రమైన రోజున భక్తులందరూ నా గురించి అభిషేకాలు పూజలు ఉపవాసాలు కళ్యాణాలు ఎక్కడ ఖాళీ లేదు భూలోకంలో. ఈరోజుకి అంత పవిత్రత ఉంది.  అందుకే జన్మానికో శివరాత్రి అంటారు. వాళ్లంత భక్తితో నా అర్చనలు చేస్తుంటే నేను ఈ కైలాసంలో ఎలా ఉండగలను. శివాలయంలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో భక్తులు నా దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు శివ...

ప్రణాళిక

ప్రణాళిక ఈ సమస్త జీవకోటిలో ఆలోచించే శక్తి, ఆలోచన ఆచరణలో పెట్టే శక్తి ఒక్క మనుషులకే ఉంది. ప్రతి ఒక్కరికి నిత్యజీవితంలో అనేక రకాలైన లక్ష్యాలు ఉంటాయి. చేయవలసిన పనులు ఉంటాయి. ఈ పనులను లేదా లక్ష్యాలను సాధించడానికి ఒక క్రమబద్ధమైన పద్ధతి అవసరం. ఆ పద్ధతిని ప్రణాళిక అంటారు. ఆంగ్ల భాషలో planning అంటారు. నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఏ పని మొదలుపెట్టిన అది సఫలీకృతం అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రణాళికంటే ఒక వ్యూహం. ఒక ఆలోచన. ఒక నిర్దిష్టమైన ఊహలతో కూడిన కొత్త మార్గం. ఉదాహరణకి ఏదో విమాన ప్రయాణం చేయవలసి వస్తుంది మహానగరాల్లో ఉండేవాళ్లు ఆ విమానాశ్రయం చేరుకోవడానికి ఒక గంట సమయం పడుతుంది అని అనుకుందాం సాధారణంగా అయితే అక్కడున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ వలన ఇంకొక గంట ముందుగా బయలుదేరాలి. అంటే ప్రయాణ సమయం రెండు గంటలుగా ఊహించుకోవాలి . ఆ ఊహ ప్రణాళిక. ఒకవేళ ట్రాఫిక్ జాం వలన కొంచెం ఆలస్యం అయినప్పటికీ నిర్ణీత సమయానికి మనం అక్కడికి చేరుకోగలం.  లేదంటే అనవసరమైన ఒత్తిడి కంగారు అనారోగ్యం కోపాలు తాపాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం ఇవన్నీ జరిగిపోతాయి. ఇదంతా అనవసర రాద్ధాంతం.  దూర ప్రాంతాల్లో ఉండే ...

నగరంలో మా ఊరు

నగరం లో మా ఊరు  ఆదివారం ఉదయం ఎనిమిది గంటలు అయింది. వాలు కుర్చీలో పడుకుని తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నారు రామారావు మాస్టారు. ఇంతలో పక్కన రింగ్ అవుతున్న మొబైల్ ని తీసి ఎవరిదో నెంబర్ అని చూశాడు. అమెరికా నుంచి డాక్టర్ శేఖర్ ఫోన్. రామారావు మాస్టర్ దగ్గర పదవ తరగతి వరకు చదువుకున్నాడు. చిన్నప్పటినుంచి చదువులో బాగా తెలివితేటలు ఉన్న శేఖర్ అంటే రామారావు మాస్టా రు కి చాలా అభిమానం. అందుకే ప్రత్యేక శ్రద్ధతో శేఖర్ కి చదువు చెబుతూ ఉండేవాడు ఒక ట్యూషన్ మాస్టర్ గా. పదవ తరగతి తర్వాత శేఖర్ ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకొని డాక్టర్ కోర్స్ చదివి పై చదువులకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు శేఖర్  శేఖర్ ది రామారావు మాస్టర్ ది ఇద్దరిదీ ఒకటే ఊరు. అది కోనసీమలోని చిన్న పల్లెటూరు. మాస్టారికి ఆ ఊరు అంటే చాలా ఇష్టం. మాస్టర్ కి మొక్కలంటే చాలా ఇష్టం . ఇంటి చుట్టూ పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ ముక్కలు పెంచుతూ ఉండేవారు మాస్టారు. ఎప్పుడూ పిల్లలకి ఆ మొక్కల మధ్య కుర్చీ వేసుకుని చాప మీద పిల్లలను కూర్చోబెట్టుకుని చదువు చెప్తుండేవారు. మాస్టారి ఇల్లు ఒక గురుకులంలా అనిపించేది పిల్లలకి. ఆ తర్వాత వయసు మీద పడడంతో మా...

రమణమ్మ

రమణమ్మ తెల్లవారుజామున 5:00 అయింది  ఆ ఐదుగురు అన్నదమ్ములు గట్టు దిగి వ్యవసాయం చేసే రైతులు కాదు గాని   ఆస్తి ఉండి కూలి వాళ్ళని పెట్టి వ్యవసాయం చేస్తూ పశువులను పెంచుకుంటూ ఉండే  ఊర్లో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబీకులు.    అలాంటి అన్నదమ్ములు ఉదయమే లేచి పొలాలకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం ఒక అలవాటు. ఆరోజు ఎప్పటిలాగే పొలం వెళుతున్న అన్నదమ్ములను చూసి ఆ ఊరి మోతుబరి రైతు వెంకటరెడ్డి ఎదురొచ్చి "ఏవండీ మావయ్య గారు ఈ స్థలం ఇలా వదిలేసారేటండి ?ఇందులో మామిడి మొక్కలు పెంచండి . ఈ మట్టి అందుకు  బాగా పనిచేస్తుంది అని చెప్పి సలహా ఇచ్చేవాడు ప్రతిరోజు.  ఆ అన్నదమ్ములు అందరికీ పొలాన్ని  అనుకుని నాలుగు ఎకరాల మెరక ఉండేది. అందులో పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఎవరు అందులోకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉండేది . ఆ రైతు చెప్పిన మాటలను వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. మాకు ఇప్పటికీ నలభైఏళ్లు దాటిపోయా యిఅందరికీ ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు ఒకవేళ మామిడి మొక్కలు వేసి అవి కాపు కాసే సమయానికి మనం ఉంటామా ఏమిటి? అనుకునేవారు ఆ అన్నదమ్ములు.  ఆ అన్నదమ్ముల్లో అందరికంటే పెద్దవాడు...

ఉయ్యాల

ఉయ్యాల. రాత్రి 8.30 గంటలయింది. కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్లే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్  రాజమండ్రి రైల్వే స్టేషన్ లో వచ్చే ఆగింది. అంతవరకు ఎదుటి సీట్లో కూర్చున్న ఒక యువతి వడిలో నిద్రపోతున్న పసిబిడ్డ లేచి  ఏడవడం మొదలెట్టింది.  ఆకలవుతుందేమోనని అనుకుని ఆ యువతి అందుకు తగిన ప్రయత్నాలు చేసి ఇంకా పిల్ల గుక్క పట్టి ఏడవడం మొదలుపెడితే ఆ పక్కన కూర్చున్న పెద్దావిడ తల్లి అనుకుంటా ఉయ్యాల కోసం ఏడుస్తోందేమో అని అంటూ ఇప్పుడు ఎలాగే బాబు! వీడికి ఉయ్యాల బాగా అలవాటైపోయింది అంటూ భుజం మీద వేసుకుని జో కొట్టడం ప్రారంభించింది. ఆ పసిబిడ్డ రైలు కుదుపులకి అమ్మమ్మ ప్రయత్నాలకి ఏమి మోసపోలేదు. ఏడుపు ఆపలేదు. పాపం ఆ ఇద్దరు ఆడవాళ్లు దిక్కుతోచక ఆ పిల్లవాడిని నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పై బెర్త్ మీద పడుకున్న వ్యక్తి ఆ పెద్దావిడకి భర్తనుకుంటా లేచి తిట్టడం ప్రారంభించాడు. వాడికి ఉయ్యాల అలవాటు చేయొద్దు అంటే వినలేదు మీరు ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నామో అన్నాడు .   దానికి ఆ ముసలాడికి కోపం వచ్చి మీకు నన్ను తిట్టడానికి ఒక సాకు దొరికింది. పసిపిల్లలను ఉయ్యాల్లో కాకుండా మంచం మీద...

జోడెద్దులు

జోడెద్దులు. ఉదయం 5:00 గంటలు అయింది.  హేమంత రుతువు ప్రతాపానికి తట్టుకోలేక దుప్పటి ముసుగు వేసి పడుకోవాలని అనిపించిన ఆ పల్లె బాధ్యతలు గుర్తు చేస్తూ గంప కింద కోడి ఆకాశంలోని పక్షులు పాకలోని పశువులు అరుపులతో తన బాధ్యత గుర్తుకొచ్చింది రామయ్యకి.  తూర్పు వైపు కాస్త వెలుగు కనిపిస్తే చాలు ఆ పాకలోని పశువులు అంబా అంబా అని అరుస్తూనే ఉంటాయి. ఆ అరుపుల సంకేతం యజమాని రామయ్యకు ఒక్కడికే తెలుసు. గబగబా దంత ధావనం కానిచ్చి వాటి ఆకలి తీర్చి ఆ జోడు ఎడ్లను బండి దగ్గరికి తీసుకువెళ్లి కాడి భుజం మీద వేసి వాటిని తమ బాధ్యతలకు సిద్ధం చేశాడు. రామయ్య కూడా బండి ఎక్కి యజమానిగా వాటికి దిశా నిర్దేశం చేసి సత్తు గిన్నెల క్యారేజీ పట్టుకుని సుబ్బి రెడ్డి గారి పొలం వైపు పరుగులు తీయించాడు.  ఆ ఊర్లో సుబ్బిరెడ్డి గారు వంద ఎకరాల భూమికి యజమాని. రామయ్య మాత్రం ఆ జోడి ఎడ్ల బండికి యజమాని. ఆ బండి తోలడం తప్ప వేరే ఏ పని చేతకాదు. ఆధునిక కాలంలో యాంత్రికరణ పెరిగి జోడు ఎడ్ల బండికి గిరాకీ తగ్గిపోయినా రామయ్య ఎడ్ల బండికి మటుకు గిరాకీ తగ్గలేదు. చిన్న చిన్న పొలం పనులకి ట్రాక్టర్ తొట్లు ఉపయోగించడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని....

రాజశేఖర్

రాజశేఖర్. ఉదయం 9.00 అయింది.  కాకినాడలో భానుగుడి సెంటర్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంది. అటు మెయిన్ రోడ్డు వైపుకు వెళ్లే వాహనాలు బస్సు కాంప్లెక్స్ కి వెళ్లే వాహనాలు ఇటు పిఠాపురం వెళ్లే వాహనాలు కాలినడకని వెళ్లేవాళ్లు స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు ఆటోలు మోటార్ సైకిల్ మీద వెళ్లే వాళ్లతో రద్దీగా ఉంది. స్కూలుకు వెళ్లే పిల్లలు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులు తో హడావిడిగా ఉంది రోడ్ అంతా.  అటు జనానికి ,ఇటు వాహనాలకి దిశా నిర్దేశం చేస్తూ ఎండని తట్టుకుంటూ కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిలా తన విధి నిర్వహణ చేస్తున్నాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్. అన్ని రంగాల్లో యాంత్రికరణ పెరిగినట్లు నగరంలోని ప్రధాన కూడలిలో ట్రాఫిక్ లైట్లు పెట్టిన విధి నిర్వహణ మాత్రం కత్తి మీద సాము లాంటిది ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కి. అందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలుసు కానీ పాటించే వాళ్ళు ఎవరూ లేరు. అందరికీ ఒకటే తొందర అందరికంటే ముందు గమ్యం చేరాలని. పోటీ తత్వం పెరిగిపోయి యువతరం, ఆఫీసులకు ఆలస్యం అవుతుందని ఒక తరం ఇలా ఎవరు తొందర వారిది.  ఏదైనా జరగకూడని జరిగితే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ పరిస్థితి ఇంతే. పాపం ఎంకి పెళ్లి సుబ్బి చావు...

మేము పండక్కి వెళ్ళాము!

మేమూ పండక్కి వెళ్ళాము! " ప్రతి సంవత్సరం ఈపాటికి ఎంత హడావిడిగా ఉండేది. ఇల్లంతా పిల్లలతోటి బంధువులతోటి సందడిగా ఉండేది. ఊరంతా సంక్రాంతి సంబరాలతో హడావుడిగా ఉండేది. మరి ఏం కర్మమో నాలుగు సంవత్సరాల నుంచి ఇలా ఈ ఆశ్రమంలో ఒంటరిగా జీవించవలసి వస్తోంది. ప్రతి సంవత్సరం ఎవరైనా పండగలకి పిలుస్తారని ఆశగా ఎదురుచూడడం నిరాశపడడం మామూలు అయిపోయింది. ఆఖరికి ఆశ్రమంలో పనిచేసే పని వాళ్లు కూడా ఒక్క రోజైనా సెలవులు పెట్టి వెళ్ళిపోతారు. కానీ ఆశ్రమంలో మిగిలిపోయేది మనలాంటి వాళ్ళే" అందరూ అనుకుంటూ బాధపడుతున్నారు పార్వతమ్మ పరంధామయ్య దంపతులు.  సంక్రాంతి నెల మొదలుపెట్టిన దగ్గర్నుంచి పిల్లలకు సంక్రాంతి పండుగకి రమ్మని మరీ మరీ చెప్పడం పిల్లలకు బట్టలు కొనడం పిండి వంటలు చేయడం ఇల్లు శుభ్రం చేసుకోవడం వీటితోటి ఎక్కడ ఖాళీ ఉండేది కాదు పాపం పార్వతమ్మకి. ఒక పిల్లలేమిటి ఇంట్లో పనిచేసే పనిమనిషి చాకలి దొడ్లో పాలేరు కి కూడా పండగ బహుమానాలు ఇవ్వడంతో పాటు బట్టలు పెట్టి సంతోష పెట్టడం ప్రతి ఏటా మామూలే. అలాంటిది గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి పండగకి ఇలా ఆశ్రమంలో ఒంటరిగానే గడపడం నిజంగా బాధగా ఉంది అనుకుంది పార్వతమ్మ. వయసులో ఉన్న ర...

పండుగలో పల్లె_టూరు

పండగలో పల్లె _టూరు "ఊరూ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు "అంటూ మనవాళ్లు ఈ మధ్యన నా గురించి అందమైన పాట ఒక చలనచిత్రంలో చాలా గొప్పగా వ్రాశారు. అప్పటినుంచి పల్లె టూరు మొదలైంది. పల్లెటూరు అంటే చుట్టూ అందమైన చెట్లు గలగల పారే సెలయేళ్లు పిల్ల కాలువలు చెరువులు పంట చేలు పాడి పశువులు అందమైన పెంకుటిల్లు విశాలమైన మనసులు ఆత్మీయమైన పలకరింపులు ఇవి నా గుర్తులు  మామూలుగానే నేను చాలా అందంగా ఉంటాను. అందులో సంక్రాంతి పండుగ. పండగ అందం పల్లెటూర్లోనే కనబడుతుంది. నా వీధుల్లో ఉండే ఇళ్ళు తోరణాలతోటి, రంగుల తోటి ,వాకిళ్లు ముగ్గుల తోటి అందంగా మెరిసిపోతూ వంటగదిలన్నీ పిండి వంటల వాసనలతో నిండిపోతూ వచ్చే అతిధుల కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి ఏదో వాహనం ఆగిన శబ్దం వినబడింది . డోర్ తీసి కళ్ళకు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని నలుగురు కుర్రాళ్ళు అందంగా బ్యాగులు భుజాన్ని తగిలించుకుని కారు దిగుతూ కనబడ్డారు. వీళ్ళు ఎవరబ్బా ఆనమాలు తెలియడం లేదు ఆ ఇంటికి వచ్చేవాళ్ళు నాకు తెలియని వాళ్ళు ఎవరుంటారు. ఇంట్లో తరాలు మారిన నేను మాత్రం మారలేదు కదా.  ఎవరి పిల్లలు వీళ్ళు అని నాలో నేను అనుకుంటూ ఉంటే మన "ఊరంతా మారిపోయింది అమ్మ ...

భజన

భజన " శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనo   అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం "  ఇవి వ్యాస మహర్షి చెప్పిన నవవిధ భక్తి మార్గాలు. భగవంతుని చరిత్ర వినడం, భగవంతుని లీలలను కీర్తించడం ఇవన్నీ భగవంతుని చేరుకునే మార్గాలు. ఈ నవవిధ భక్తి మార్గముల ద్వారా భగవంతుని ఆరాధించి ముక్తి పొందిన అనేకమంది చరిత్రలు మనకి పురాణ గాథలు చెబుతున్నాయి.  అలాంటి నవవిధభక్తి మార్గాలలో భగవంతుని లీలలు కీర్తించడం ఒకటి. అనేకమంది భక్తులు రామదాసు అన్నమయ్య త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితులు వంటి వారు తమ కీర్తనల ద్వారానే భగవంతుని ఆరాధించి ముక్తి పొందారని మనకి చరిత్ర చెబుతోంది. ఈనాటికీ మనం అనేక గ్రామాల్లోనూ పట్టణాలలోనూ దేవాలయాల్లో భజనలు చేయడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పర్వదినాల్లోనూ పండుగలలోనూ ఈ భజన కార్యక్రమాలు జరుగుతూ ఉండడం అనాది నుంచి వచ్చే సాంప్రదాయం. మా చిన్నతనాల్లో మా గ్రామంలో మా ఇంటిలో కూడా ప్రతి శనివారం భజనలు చేసేవారు.  అసలు భజన అంటే ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తుంది. పదిమంది ఒకచోట కూర్చుని చేసే భగవన్నామస్మరణ "భజన. భగవంతుని లీలలు తలుచుకుంటూ ప్రార్థించడం భజన. ఇది కూడా భగవంతుని చేరుకునే ...

ఆశయం

ఆశయం. అందాల రంగురంగుల బల్బుల వెలుగులో ఆ బహుళ అంతస్తుల భవనం మీద అందంగా మెరిసిపోతున్న" పరంధామయ్య నిలయం "అనే పేరు చూసి ఆనందపడిపోయాడు రఘురామయ్య.  ఎన్నో ఏళ్ల కలల ఫలితం. ఎన్నో సంవత్సరాలు వంటరితనంతో బాధపడిన రఘురామయ్య తొమ్మిది కుటుంబాలతో కాపురం ఉంటున్నాడు. వాళ్లు రక్త సంబంధీకులు కాదు. దూరపు బంధువులు మరియు స్నేహితులు. అయినా కావాలని అందర్నీ ఒక చోటుకు చేర్చాడు. పదిమందితో కలిసి ఉండాలని జీవితాశయం. తనకంటూ ఎవరూ తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా కట్టుకున్న భార్య లేకపోయినా ఇవాళ నా వెనుక తొమ్మిదికుటుంబాలు వాళ్ళు ఉన్నారని ఆనందం రఘురామయ్య కళ్ళల్లో కనబడుతోంది ఆ అపార్ట్మెంట్ చూసి. పిల్లలు సందడితో అపార్ట్మెంట్ అంతా కళకళలాడి పోతోంది.   ఒంటరితనం నిజంగా అంత భయంకరమైనది. డబ్బు ఒంటరితన్నాన్ని దూరం చేయలేదు. వ్యసనాలు ఒంటరితనాన్ని దూరం చేస్తాయని చాలామంది దానికి అలవాటు పడతారు. కానీ ఆ కొద్ది సేపే అది తోడు ఇస్తుంది కానీ ఆ తర్వాత మామూలే. ఎవరు ఒంటరితనాన్ని కోరుకోరు.  జీవితంలో ఎవరికి ఏది వ్రాసిపెట్టి ఉంటే అదెలా జరిగిపోతుంది. దాన్ని ఆపే శక్తి ఎవరికీ ఉంటుంది. ఏది మన ప్రయోజకత్వం కాదు. ఏదో తెలియని శక్తి మనల్ని...

స్వర్గం

స్వర్గం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అందులో ఉండే వాళ్లు కష్టాలు అనుభవించినప్పటికీ అది వాళ్ళకి స్వర్గసీమే. స్వర్గంలో ఏముంటుందో మనకు తెలియదు. కానీ ఆ ఇల్లు ఆప్యాయత అనురాగం అనుబంధం ప్రేమ కొంచెం కోపం అన్ని రుచి చూపించిన ప్రదేశం. రుచి చూపించడం ఏమిటి సంపూర్ణంగా అనుభవించిన ప్రదేశం. అందుకే ఆ ఊరు వదిలేసి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మా ఇంటి మీద మమకారం తలుచుకున్నప్పుడల్లా ఉత్సాహం ఈనాటికి ఇంకా అలాగే కొనసాగుతూ ఉన్నాయి.. అది ఆ ఇంటి మహత్యం. ఆ ఇల్లు కట్టిన వాళ్ళ మనసు అటువంటిది. అది ఇటుకలతో కట్టిన ఇల్లు కాదు. ప్రేమ ఆప్యాయత అనుబంధం అనురాగం వీటితో కట్టిన ఇల్లు. ఆకాశ వీధిలో ఆహారం వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు ఎగురుకుంటూ వెళ్లే పక్షి సాయంకాలానికి ఆ చెట్టు కొమ్మకు చేరినట్లే ప్రతివాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తమ గూటికి చేరవలసిందే. ఎక్కడా పట్టుమని పది రోజులు ఇల్లు విడిచి ఉండడం అంటే చాలామందికి బెంగ. అది రెండు గదులు ఇల్లు అయినా మైసూర్ ప్యాలెస్ అయిన ఒకటే విధంగా ఉంటుంది మమకారం. ఎందుకంటే అది అలవాటైన ప్రదేశం. ఇంటితో అంత అనుబంధం ఉంటుంది ప్రతి ఒక్కరికి. సుమారు రెండు పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు ఆనందంగా కాపురం ...