పోస్ట్‌లు

మందు పొట్లం

 మందు పొట్లం మా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ఈనాటికి మమ్మల్ని నవ్విస్తూ ఉంటుంది. మాది కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని పల్లిపాలెం గ్రామం . మా చింతాతయ్య గారు మా నాన్నగారు కూడా ఆయుర్వేద వైద్యం చేసేవారు. మా ఊర్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు మిగతా సామాజిక వర్గాలు కూడా ఉండేవి. ప్రధానమైన కులం రెడ్డి కులం .  అయితే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే ఆ రోజుల్లో ఒక ముప్పై ఐదు సంవత్సరంలో వయసు ఉండే ఒక  వ్యక్తి ఏదో అనారోగ్యం కోసం ఆయుర్వేదం మందు కోసం మా తాతయ్య గారి దగ్గరికి వచ్చాడు. రోగి లక్షణాలన్నీ తెలుసుకున్న తర్వాత   ఆయుర్వేద మందుని కాగితంతో పొట్లాలు కింద కట్టి రోజుకు ఒక పొట్లం  తేనెతో వేసుకో వారం రోజుల తర్వాత మళ్లీ కనబడని చెప్పాడు తాతయ్య. నాలుగు రోజుల తర్వాత ఆ వ్యక్తి పరుగు పరుగున తాత గారి దగ్గరకు వచ్చి ఆ ఆ పొట్లం వేసుకున్నప్పటి నుంచి నాకు కడుపు నొప్పి మొదలైంది అండి అంటూ చెప్పుకొచ్చాడు. తాతయ్య  "ఆ మందుకి కడుపునొప్పి రాద య్య!  మరి నువ్వు ఆ మందు ఎలా వేసుకున్నావు? అని అడిగాడు.   ఆ పొట్లం తేనె తోటి వేసుకున్నానండి అన్నాడు. అప్పుడు అసలు పరిస్థితి ...

ఏలూరు జిల్లా యాత్ర

ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండే ఏలూరు 2022 సంవత్సరం నుంచి జిల్లాగా మార్పు  చెందింది .  కొల్లేరు సరస్సు:   ఈ జిల్లాలో చూడదగిన ప్రదేశాల్లో కొల్లేరు  సరస్సు ఒకటి. ఇది కొంత భాగం పశ్చిమగోదావరి జిల్లాలో కూడా వ్యాపించి ఉంది. ఇక్కడ రకరకాల చేపలు లభ్యమవుతాయి. అంతేకాకుండా అనేక పక్షులు విదేశాల నుండి సైతం ఇక్కడికి వలస వస్తాయి.  ద్వారకాతిరుమల: దీనినే చిన్న తిరుపతి అంటారు.  కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇక్కడ ద్వారకా కొండపై కొలువై ఉన్నారు. దీనిని చిన్న తిరుపతి అంటారు. ఇక్కడ స్వామి అత్యంత మహిమాన్వితుడు.  పట్టిసీమ: గోదావరి నది మధ్యభాగంలో ఉండే వీరభద్ర స్వామి దేవాలయం అత్యంత మనోహరంగా ఉంటుంది . మహాశివరాత్రి  ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

చిలిపి పనులు

 చిలిపి పనులు అర్ధరాత్రి 12 గంటలు అయింది.  వీధి తలుపు ఎవరో కొడుతుండడంతో గాఢ నిద్రలో ఉన్న గోవిందరావుకి మెలకువ వచ్చింది. ఎవరబ్బా ఇంత అర్ధరాత్రి వేళ అనుకుంటూ తలుపు సందులో నుంచి బయటకు తొంగి చూసాడు. వీధిలో ఒక పదిమంది యువకులు  నిలబడి ఉన్నారు. "ఎవరండీ ఏం కావాలి అంటూ ప్రశ్నించాడు గోవిందరావు . 'చలపతి రావు గారు పంపించారండి ఎవరికో పురుడు వచ్చిందిట. ఇంగువ తీసుకురమ్మని పంపించారంటూ చెప్పారా యువకులు. వస్తున్నాను ఉండండి. కొట్టు తీస్తాను అంటూ పక్కనే ఉన్న కిరాణా కొట్టు గదిలోకి వచ్చి లైట్ వేసి డబ్బా గురించి వెతకడం మొదలెట్టాడు గోవిందరావు.  గోవిందరావు అంటే ఆ ఊర్లో ఉన్న ఏకైక కోమటి .కిరాణా కొట్టు వ్యాపారం అక్కడ లేని సరుకుంటూ ఉండదు. కానీ అన్ని హై రేట్లు. ఏ వేళ లేపిన సరుకు అప్పిస్తాడు. లేదు లేదంటూనే కిరాణా కొట్టు మీద ఆ ఊర్లో పది ఎకరాలు భూమి సంపాదించాడు. దానికి తోడు తాకట్టువాకట్టు వ్యాపారం కూడా ఉంది. అంతా వ్యవసాయదారులు. ఇంకేముంది వ్యవసాయం పనులు కోసం అప్పు తీసుకుని పంటలు రాగానే తీర్చేస్తుంటారు. పైగా ధాన్యo కొనుగోలు కూడా ఆయనే. మా ఊరుకి బ్యాంక్ లాంటివాడని చెప్పొచ్చు.  ఆయుర్వేదిక్ డా...