పోస్ట్‌లు

పుల్లయ్య బజ్జి

ఉదయం ఐదు గంటలు అయింది. ఎప్పటిలాగే ఆ పల్లెకి తెల్లారింది. అగ్రహారంలోని సందు చివరన ఉన్న కాఫీ హోటల్‌ వైపు అరుపులు, చప్పుళ్లు వినిపిస్తున్నాయి. అదేమీ పెద్ద హోటల్ కాదు. చిన్న పాక హోటల్. మధ్యాహ్నం వరకే తెరిచి ఉంటుంది. హోటల్ లోపల కర్రబల్లల మీద పొలాలకు వెళ్లే రైతులు కూర్చుని ప్రతిరోజూ ఒక్క కప్పు టీ తాగి, అప్పుడు పొలాలకు వెళ్లడం వారికి నిత్యకృత్యం. ఉదయాన్నే రైతులతో, కాస్త ఆలస్యంగా వ్యాపారులతో, టిఫిన్ సమయానికి అగ్రహారంలోని ప్రతి ఇంటి వాళ్లతో – ఆ హోటల్‌లో ఖాళీ అనే మాటకే చోటుండదు. ఒకప్పుడు పల్లెల్లో ఉదయాన్నే చద్దన్నం తినేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు అందరూ పుల్లయ్య హోటల్‌లో టిఫిన్ కోసం ఎగబడుతున్నారు. అతడే ఆ పాక హోటల్ యజమాని – పుల్లయ్య. హోటల్ ఎప్పుడు పెట్టాడో ఎవరికీ తెలియదు. కానీ అప్పటి నుంచి అదే పాకలో, అదే ధోరణిలో కొనసాగుతోంది. పాకా మారలేదు – పుల్లయ్య మారలేదు. వయసు పెరుగుతున్నా టిఫిన్ల రుచి మాత్రం తగ్గడంలేదు. ప్రతి తెల్లవారుజామున మూడు గంటలకు లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, కట్టెల పొయ్యి వెలిగించి పని మొదలుపెడతాడు. సహాయులు ఎవరూ ఉండరు – అంతా తన సొంతంగా. "ఏమయ్యా పుల్లయ్య, ఎవ్వరినైనా పనికి పెట్ట...

వీధి కుక్కలు

"ఎందుకు మావయ్య గారు, ఆ వీధి కుక్కలకి రోజు అనవసరంగా పనిగట్టుకుని బిస్కెట్లు పెడుతుంటారు? అవి మీద పడి ఎక్కడ కరుస్తాయని భయం మాకు. మీరేమో ప్రతిరోజూ ఇదే పని!" అంటూ కోడలు భారతి కోపంగా అడిగింది మామగారు రాజారావుని. "ఎన్నోసార్లు వద్దని చెప్పాం! అయినా కానీ మీరు మానట్లేరు. రేపటి నుంచి మీరు ఆ తూముల వైపు వెళ్ళకండి. మిమ్మల్ని చూడగానే అవి తోక ఊపుకుంటూ దగ్గరకు వస్తాయి. మీరేమో జాలిపడి బిస్కెట్లు కొనిపెడుతుంటారు. చంటి పిల్లలకు పెట్టినట్లు ఏమిటో ఈ అలవాటు!" అని విసుక్కుంది రాజారావు కోడలు భారతి. "పైగా ఇది అనవసరం ఖర్చు. నెలాఖరికి ఎంత ఖర్చవుతుందో, మీరైనా లెక్క చూసుకున్నారా!" అని అడిగేసరికి, ఒక్కసారిగా మనసు చివుక్కుమంది రాజారావుకి. అయినా భారతి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా చెప్పులు వేసుకుని వాకింగ్‌కి వెళ్ళిపోయాడు రాజారావు.  అలా రోడ్డు మీద నడుస్తూ ప్రతిరోజూ వెళ్లే లాల్‌బహుదూర్‌నగర్ రోడ్ నెంబర్ రెండు లో ఉన్న తూముల దగ్గర కూర్చున్నాడు. రాజారావు అలా కూర్చోగానే ఎక్కడి నుంచి వచ్చాయో తోకలు ఊపుకుంటూ పది కుక్కలు రాజారావు చుట్టూ చేరేయి. వచ్చే ముందు భారతి మాట్లాడిన మాటలకి మనసు బాధపడి,...

నలుపు నాణ్యమే

నలుపు – నాణ్యమే మనిషి నయనాలు పసిగట్టి చూసేది రంగుల ప్రపంచం. ఆ రంగుల్లో నలుపు అంటే చాలామందికి భయం, తిరస్కార భావన కలిగించే ఒక నీడలా అనిపిస్తుంది. కానీ ఆ నలుపు అంత తేలికైనది కాదు. అది ఒక జీవిత దర్శనం, ఒక గంభీరమైన సందేశం. సప్తవర్ణాలు దేవుని సృష్టి. అందులో నలుపు కూడా ఒకటి. కానీ మిగిలిన రంగులకంటే నల్ల రంగుపై వ్యతిరేక భావన ఎక్కువ. ఎందుకంటే అది చీకటిని గుర్తు చేస్తుంది. కానీ అదే నలుపు చల్లని మేఘంగా మారి చినుకులుగా జలధారలు కురిపించగలదు. భూమిని పచ్చగా మార్చే మొదటి అంకురం నలుపే. విద్యా బోర్డు - నలుపే; జ్ఞానం - వెలుగు పాఠశాల బోర్డు నలుపే. కానీ దానిపై రాసే తెలుపు అక్షరాలే విద్యార్థుల జీవితానికి దారిదీపాలు. నల్ల బోర్డుపై తెల్ల అక్షరాలు స్పష్టంగా కనిపించడమే కాదు, వాటి ప్రాముఖ్యతను కూడా నలుపే అందిస్తుంది. అది శిక్షణకు మార్గదర్శి. ఆరోగ్యానికి, అందానికి కూడా నలుపు అవసరం నల్ల నేరేడు, నల్ల ముళ్లి వంటి పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తహీనతను నివారించడంలో వీటి పాత్ర ఎంతో గొప్పది. కళ్లకు మెరుపు ఇచ్చే నల్లటి కాటుక ఆత్మవిశ్వాసానికి చిహ్నం. బొట్టు, చుక్కలుగా పెళ్లికూతురి ముస్తాబులోనూ నలుపు కీలకం. భ...