పోస్ట్‌లు

చినుకులో సాయం

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలన్నిటికీ సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి తిరగవద్దు అనే వార్తలు విని పిల్లలు ఎగిరి గంతేశారు. వాళ్లకేం తెలుసు పాపం! నగరంలోని పరిస్థితి. గుమ్మం బయట కాలు పెట్టకపోతే ఎవరికీ బ్రతుకు జీవనం గడవదు. అందులో ఈ ఏడాది మరీ ఎక్కువగా కురుస్తున్నాయి వర్షాలు. దానికి తోడు ట్రాఫిక్ జాము, వర్షపు నీరు ఎక్కడికి కదులకుండా ఉండిపోవడం. రోడ్డుమీద ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియట్లేదు. ఆఫీసుకి వెళ్లి రావడం అంటే తల ప్రాణం తోక వచ్చినట్టే ఉంది. “ఎలాగురా బాబు, ఈ వర్షంలో సెలవు పెట్టమంటే బాసు ఊరుకోడు” అనుకుని బాధపడుతూ, రైన్‌కోట్ వేసుకుని బయలుదేరబోతుంటే, గుమ్మం దగ్గర ఆటో ఆగిన శబ్ధం వినిపించింది. “ఎవరబ్బా ఈ వర్షంలో?” అనుకుంటూ బయటికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ రాజు నమస్కారం చేసి, “ఇవాళ సెలవు కదా సార్?” అని అడిగాడు. “సెలవే రాజూ, మరి బేరాలు ఏమీ లేవా?” అని రామారావు. “లేదు సార్… ఇంటిదగ్గర కష్టంగా ఉంది,” అంటూ చేతులు నులిపాడు రాజు. రామారావుకి విషయం అర్థమైంది. ప్రతినెల ఒకటో తారీకు రాకుండానే జీతం మధ్యలో పట్టుకెళ్తుంటాడు. అలాంటిది, ఈ వర...

లక్ష్మి దేవి పుట్టుక

అది త్రేతాయుగ కాలం. స్వర్గలోకం సంతోషాల తోటలా మెరిసిపోతూ ఉండేది. కానీ ఒక్కరోజు, ఋషుల శాపంతో దేవతల శక్తి క్షీణించింది. ఇంద్రుని వజ్రాయుధం బలహీనమైంది, వరుణుని జలప్రవాహం మందగించింది, వాయువుని వేగం తగ్గిపోయింది. ఇదే సమయం చూసుకుని అసురులు, దైత్యులు, లోకాలను కబళించడం మొదలుపెట్టారు. దేవతలు భయంతో విష్ణుమూర్తిని ఆశ్రయించారు. "ప్రభూ! మా శక్తి తగ్గిపోయింది, దైత్యులు మమ్మల్ని జయిస్తున్నారు. మాకు రక్షణ కల్పించండి" అని ప్రార్థించారు. విష్ణువు చిరునవ్వుతో అన్నాడు – "క్షీరసాగరంలో దాగి ఉన్న అమృతమే మీ శక్తిని తిరిగి ఇస్తుంది. దానిని సముద్ర మథనం చేసి తీసుకురండి. కానీ దైత్యుల సహాయం అవసరం ఉంటుంది. మీరు వారితో ఒప్పందం చేసుకోండి. మిగతా యోచన నేను చేస్తాను." క్షీరసాగర మథనం  దేవతలు, దైత్యులు కలసి మందరపర్వతాన్ని మథనదండంగా ఎత్తుకొచ్చారు. కానీ సముద్ర మధ్యలో ఉంచగానే అది మునుగుతూనే ఉంది. అప్పుడు విష్ణువు కూర్మావతారం తీసుకొని పర్వతాన్ని తన వెన్నుపైన మోశాడు. వాసుకి నాగరాజు మథనతాడుగా ముందుకొచ్చాడు. దైత్యులు వాసుకి తలవైపున, దేవతలు వాలువైపున పట్టుకున్నారు. మథనం మొదలయ్యింది. మొదటి ఫలితం – హలాహల విషం వాస...

శ్రీకృష్ణ నిర్యాణం

కౌరవులకి పాండవులకి మధ్య కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు రాజ్యపాలన సాగించడం మొదలుపెట్టాడు. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం అవతారం ఎత్తిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్నతనం నుండి అనేక మంది రాక్షసులని సంహరించాడు. ఆ దుష్ట శిక్షణ చూసి అనేకమంది మునీశ్వరులు సంతోషించారు. కంసుడు వంటి రాక్షసులను సంహరించి భూభారం తగ్గించి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసిద్ధుడయ్యాడు.  అదే సమయంలో యాదవ సైన్యం విజృంభించి భూమి మోయలేని స్థితికి వచ్చింది. శ్రీకృష్ణ భక్తులైన యాదవులకు బుద్ధి చెప్పడానికి పరమాత్మ ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ చూడ్డానికి విశ్వామిత్రుడు దూర్వాసుడు మొదలగు ఋషులు ద్వారకా నగరానికి వస్తారు. అలా వచ్చిన మునులకు సకల మర్యాదలు చేసి బంగారు ఆసనం పై కూర్చోబెడతాడు. తర్వాత పరమాత్ముని అనేక విధాలుగా స్తుతిస్తూ కొనియాడతారు.అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తాడు. మీ పాదపద్మ సందర్శనార్థం వచ్చాం మా కోరిక తీరింది ఇక సెలవు అంటూ ద్వారక సమీపంలోని పిండారకతీర్థం సందర్శించడానికి బయలుదేరుతారు. అక్కడ కొంతమంది యాదవ బాలురు మదమెక్కి శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడైన సాంబుడికి అ...