పోస్ట్‌లు

సతులాల చూడరే

 సతులారా చూడరే   సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమిl   సకలాయ నడిరేయ కలిగే శ్రీకృష్ణుడు  అంటూ అన్నమయ్య తన కీర్తనల్లో శ్రీకృష్ణుడి పుట్టుక గురించి స్తుతించారు. శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి పరమాత్మ జన్మించాడు. అదే మనకి శ్రీ కృష్ణాష్టమి. చెరసాలలో దేవకి వసుదేవుల కుమారుడుగా జన్మించి రేపల్లెలో నందుని ఇంటిలో యశోదమ్మ ఒడిలో పెరిగి నంద కుమారుడుగా చలామణి అయ్యాడు ఈ కీర్తనలో పసిపాపగా ఉన్న పరమాత్ముడు ఏ రకంగా ఉన్నాడో మనకి కళ్ళకు కట్టినట్టు చెబుతాడు అన్నమయ్య. సాధారణంగా పసిపిల్లలు పుట్టినప్పుడు కళ్ళు మూసుకుని గుప్పెట్లు మూసుకుని నిద్రలో గడుపుతారు. అయితే ఇక్కడ పుట్టింది సాక్షాత్తు పరమాత్మ.  ఆయన చతుర్భుజాలు శంకు చక్రాలు ఒంటినిండా సకల ఆభరణాలు ,తల మీద కిరీటం ధరించి పుట్టాడుట మహానుభావుడు. వాగ్గేయ కారులంతా కారణజన్ములు. లేదంటే పసిపాపడగా ఉన్న పరమాత్మ ని ఇలా వర్ణించడం సాధ్యం కాదు. ఆదిశేషుడు అవతారమైన బలరాముడు రోహిణి దేవి కడుపున పుట్టిన తర్వాత బ్రహ్మదేవుడు శివుడు నారదుడి లాంటి మునులు దేవతలు దేవకీదేవి బంధించబడిన కారాగారం వద్దకు వచ్చి పరమాత్మా!దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అనేక అవతా...

చినుకులో సాయం

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలన్నిటికీ సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి తిరగవద్దు అనే వార్తలు విని పిల్లలు ఎగిరి గంతేశారు. వాళ్లకేం తెలుసు పాపం! నగరంలోని పరిస్థితి. గుమ్మం బయట కాలు పెట్టకపోతే ఎవరికీ బ్రతుకు జీవనం గడవదు. అందులో ఈ ఏడాది మరీ ఎక్కువగా కురుస్తున్నాయి వర్షాలు. దానికి తోడు ట్రాఫిక్ జాము, వర్షపు నీరు ఎక్కడికి కదులకుండా ఉండిపోవడం. రోడ్డుమీద ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియట్లేదు. ఆఫీసుకి వెళ్లి రావడం అంటే తల ప్రాణం తోక వచ్చినట్టే ఉంది. “ఎలాగురా బాబు, ఈ వర్షంలో సెలవు పెట్టమంటే బాసు ఊరుకోడు” అనుకుని బాధపడుతూ, రైన్‌కోట్ వేసుకుని బయలుదేరబోతుంటే, గుమ్మం దగ్గర ఆటో ఆగిన శబ్ధం వినిపించింది. “ఎవరబ్బా ఈ వర్షంలో?” అనుకుంటూ బయటికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ రాజు నమస్కారం చేసి, “ఇవాళ సెలవు కదా సార్?” అని అడిగాడు. “సెలవే రాజూ, మరి బేరాలు ఏమీ లేవా?” అని రామారావు. “లేదు సార్… ఇంటిదగ్గర కష్టంగా ఉంది,” అంటూ చేతులు నులిపాడు రాజు. రామారావుకి విషయం అర్థమైంది. ప్రతినెల ఒకటో తారీకు రాకుండానే జీతం మధ్యలో పట్టుకెళ్తుంటాడు. అలాంటిది, ఈ వర...

లక్ష్మి దేవి పుట్టుక

అది త్రేతాయుగ కాలం. స్వర్గలోకం సంతోషాల తోటలా మెరిసిపోతూ ఉండేది. కానీ ఒక్కరోజు, ఋషుల శాపంతో దేవతల శక్తి క్షీణించింది. ఇంద్రుని వజ్రాయుధం బలహీనమైంది, వరుణుని జలప్రవాహం మందగించింది, వాయువుని వేగం తగ్గిపోయింది. ఇదే సమయం చూసుకుని అసురులు, దైత్యులు, లోకాలను కబళించడం మొదలుపెట్టారు. దేవతలు భయంతో విష్ణుమూర్తిని ఆశ్రయించారు. "ప్రభూ! మా శక్తి తగ్గిపోయింది, దైత్యులు మమ్మల్ని జయిస్తున్నారు. మాకు రక్షణ కల్పించండి" అని ప్రార్థించారు. విష్ణువు చిరునవ్వుతో అన్నాడు – "క్షీరసాగరంలో దాగి ఉన్న అమృతమే మీ శక్తిని తిరిగి ఇస్తుంది. దానిని సముద్ర మథనం చేసి తీసుకురండి. కానీ దైత్యుల సహాయం అవసరం ఉంటుంది. మీరు వారితో ఒప్పందం చేసుకోండి. మిగతా యోచన నేను చేస్తాను." క్షీరసాగర మథనం  దేవతలు, దైత్యులు కలసి మందరపర్వతాన్ని మథనదండంగా ఎత్తుకొచ్చారు. కానీ సముద్ర మధ్యలో ఉంచగానే అది మునుగుతూనే ఉంది. అప్పుడు విష్ణువు కూర్మావతారం తీసుకొని పర్వతాన్ని తన వెన్నుపైన మోశాడు. వాసుకి నాగరాజు మథనతాడుగా ముందుకొచ్చాడు. దైత్యులు వాసుకి తలవైపున, దేవతలు వాలువైపున పట్టుకున్నారు. మథనం మొదలయ్యింది. మొదటి ఫలితం – హలాహల విషం వాస...