పోస్ట్‌లు

ఏప్రిల్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

గమ్యం తెలియని ప్రయాణం

గమ్యం తెలియని ప్రయాణం ఉదయం 5:10 అయింది  కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అంత ప్రయాణికులతో హడావుడి గా ఉంది. ఇంతలో కాకినాడ నుంచి షిరిడి వెళ్లే ఎక్స్ప్రెస్ స్టేషన్లో వచ్చి ఆగింది. ప్రయాణికుల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. అంతవరకు బెంచీల మీద కూర్చున్న జనం ఒక్కసారిగా లేచి సామాన్లు తీసుకుని బోగిల్లోకెక్కి సామాన్లు సర్దుకుంటున్నారు. అందరితోపాటు అక్కడ బెంచ్ మీద కూర్చున్న చిన్ని గాడు కుడి చేతి భుజానికి జోలి సంచి తగిలించుకుని జనరల్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కాడు. ఆ బోగి ఎక్కడా ఖాళీ లేదు . విపరీతమైన జనం. అలాగే బాత్రూం దగ్గర ప్రయాణికులను గమనిస్తూ కూర్చున్నాడు. చిన్ని గాడికి వయసు ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది కానీ రైలు ప్రయాణం ఏమీ కొత్త కాదు.  చిన్ని గాడిది గమ్యం తెలియని ప్రయాణం. బతుకుదెరువు కోసమే రైలు ఎక్కుతాడు. అంతెందుకు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న గుడిసెలోనే పుట్టాడు. పుట్టగానే వాడి ఏడుపు రైలు కూతలతో కలిసిపోయింది. ఆడుకోడానికి ఆటస్థలం అదే. పొట్ట నింపే స్థలం కూడా అదే. వర్షం వస్తే తలదాచుకోవడానికి చిన్ని గాడికి తెలిసిన స్థలము అదే.  నాన్న అనే పదం తెలియదు. అన్నీ తానై పెంచింది తల్లి. ...

పిచిక గూడు

పిచిక గూడు ఈ లోకంలో ఏ ప్రాణి కూడా తన గూడు తానే సొంతంగా నిర్మించుకోలే దు. మాట తెలిసిన మానవుడు కూడా అన్నీ ఉండి నిపుణులైన వారి మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఒక్క పక్షి జాతి మాత్రం తన గూడు తానే నిర్మించుకుంటుంది. గూడు ఈ విధంగా ఉండాలని, నిర్మించాలని ఎవరు నేర్పారు ఈ మాటలు రాని పక్షికి. ఒక్క భగవంతుడు తప్పితే ఇంకెవరు చెప్తారు.  ఒక మనిషి ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం వారి అనుమతితో పాటు, శాస్త్ర సమ్మతము కూడా అయి ఉండాలి. ప్రతి మనిషికి కొన్ని కలలు ఉంటాయి. ఆ కలల ప్రకారం తన స్వర్గం నిర్మించుకోవాలని తాపత్రయ పడిపోతుంటాడు. మనిషికి ఆశకి అంతులేకుండా పోయింది. మూడు గదులలో సంసారం చేసే కుటుంబాలు రెండు పడకగదులతో ఇల్లు ఉండాలని అది కాకుండా ఎవరు పడకగది వాళ్ళకు ఉండాలని అది కాకుండా ఆధునిక కాలంలో జనం మెచ్చే విధంగా డూప్లెక్స్ కట్టుకోవాలని ఇలా రోజురోజుకీ మనిషి కోరికల సముద్రంలో కొట్టుకుపోతూ ఉన్నాడు. చివరికి మిగిలేది ఇద్దరే ఆ ఇంట్లో. చివరికి తన స్వర్గాన్ని శుభ్రం చేసుకునే ఓపిక కూడా ఆ మనిషికి ఉండదు.  ఆ పక్షికేముంది చెట్టు కొమ్మ ఉంటే చాలు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా గూడు నిర్మించేసుకుంటుంది. ఆ పక్షి జాతి తరతర...

మరిచిపోలేని మా ఊరి పోస్ట్ మెన్

మరిచిపోలేని మా ఊరి పోస్ట్ మాన్. "న వాబు గారు మాకు ఏమైనా ఉన్నాయా! అంటూఎదురపడిన సైకిల్ మీద తిరిగే ఆ ఆరడుగుల మనిషిని ప్రతిరోజు ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ అదే పలకరింపు. "ఏమీ రాలేదండి అంటూ ఆ వ్యక్తి నవ్వుతూ సమాధానం. రావాల్సింది అందించినప్పుడు తమ ఆనందం కళ్ళల్లో వ్యక్తం చేసేవారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు. అందమైన పంచ కట్టు దానిపైన ఆ కాలంనాటి చొక్కా ,కాళ్లకు చెప్పులు ,చేతిలో ఉత్తరాల కట్ట, సైకిల్ మీద ఊరంతా ఉత్తరాల బట్వాడా. ఎండైనా వానైనా క్రమం తప్పకుండా తన వృత్తి ధర్మం నిర్వర్తించే మా ఊరి తపాలా ఉద్యోగి షేక్ లాల్ సాహెబ్.  మాటవరసకి కాకి చేత కబురు పంపితే చాలు వచ్చి వాలిపోతాం అంటారు. పూర్వకాలంలో ఆ ఊరి నుంచి ఈ ఊరికి సమాచారం పంపించాలంటే రాజుల కాలంలో అయితే వేగుల ద్వారా, పావురాలు ద్వారా కూడా పంపించేవారుట. కాలక్రమేణా బ్రిటిష్ వారి పుణ్యమా అని తంతి తపాలా వ్యవస్థ ఏర్పడింది.  ఒకప్పుడు ఆ ఊరికి పోస్ట్ ఆఫీస్ ఉండేది కాదుట. ఇంతకీ ఆ ఊరి పేరు ఏమిటి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకా వయా యానం పల్లిపాలెం గ్రామం ఆ ఊరి అడ్రస్.ప్రక్కనే ఉన్న ఊరి నుంచి ఉత్తరాలు బట్వాడా చేసేవారుట. ఆ ఊరికి రోడ్డు సౌకర్యం సర...

పగటి వేష గాళ్ళు

పగటి వేషగాళ్ళు.  " ఏరా పోచయ్య దసరా దగ్గరికి వచ్చేస్తోంది. ఎప్పటిలాగా నువ్వు పులి వేషం వెయ్యాలి. నువ్వు చేసినట్లుగా పులి డాన్స్ ఎవరు చేయలేరు. రోజుకి ఎంత ఇమ్మంటావు?. కచ్చితంగా చెప్పు మనం రేపే బయలుదేరాలి !అంటూ చెప్పిన కాంట్రాక్టర్ రంగయ్య మాటలకి " రోజుకు ఐదు వందలు ఇప్పించండి. రెండు పూటలా భోజనం. సాయంకాలం కాస్త ఒక గ్లాసు మందు. ఖరీదైంది అక్కర్లేదు లెండి. ఎప్పటిలాగా సత్రంలోనే కదా పడుకోవడం అంటూ సమాధానం ఇచ్చిన పోచయ్య మాటలకి రంగయ్య చాలా ఎక్కువ చెబుతున్నావు. ఇదివరకు ఇచ్చినట్లుగా ఇస్తాను అన్నాడు రంగయ్య.  " అయ్యగారు కిట్టటం లేదు. కూలి పనికి వెళ్తే రోజుకి ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నారు. దానికి తోడు వయస్సు పెరిగిపోతుంది కదా కాళ్ల నొప్పులు మొదలయ్యే యి. దానికి తోడు ఆ ఊరి జనం నేను పులి వేషంలో కనబడితే ఊరికే ఉండనీరు. డాన్స్ చేయమంటారు. అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా కాళీ ఉండదు అంటూ చెప్పాడు పోచయ్య.  సరే రా రేపు రెడీగా ఉండు . ఉదయం బస్సు కే బయలుదేరాలి.  అంటూ చెప్పిన రంగయ్య మాటలకి తల ఊపేడు పోచయ్య. రంగయ్య రాజమండ్రిలో చిన్న చిన్న నటులను సప్లై చేసే కాంట్రాక్టర్ . అలాగే ఒక షాప్ యజమాని కూడ...

అమ్మ మారిపోయింది

అమ్మ మారిపోయింది రాత్రి 9:00 అయింది  డిసెంబర్ నెల కావడం వల్ల చలి వణికించేస్తోంది. టేబుల్ మీద ఉన్న సెల్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే వంటింట్లోంచి పరుగు పరుగున వచ్చి ఫోన్ తీసింది రాజ్యలక్ష్మి. హలో అనగానే" అమ్మ ఎలా ఉన్నావ్ అని కొడుకు రంగనాథ్ అడుగుతూ నేను ఎల్లుండి బయలుదేరుతున్నాను సంక్రాంతి పండక్కి.. నెలరోజుల పాటు అక్కడే ఉంటాను. పండగ స్పెషల్ తయారు చేసి రెడీగా పెట్టు. ఇక్కడ పిజ్జాలు బర్గర్లు తిని నోరు చచ్చిపోయింది. వెళ్లేటప్పుడు గోంగూర పచ్చడి స్వీట్లు పట్టుకెళ్తాను అంటూ తన కావాల్సిన లిస్ట్ అంత చిన్నపిల్లల్లో చెప్పడం ప్రారంభించాడు. నాన్న ఎలా ఉన్నారు ?ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి.?పిల్లలు రావటం లేదు. మీ కోడలు కూడా రావట్లేదు. నేనొక్కడినే వస్తున్నా అంటూ కొడుకు చెప్పిన మాటలకి సరేరా జాగ్రత్తగా బయలుదేరిరా అంటూ పిల్లల గురించి కోడలు గురించి కుశల ప్రశ్నలు వేసి ఫోన్ పెట్టేసింది రాజలక్ష్మి. ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి సొంత ఊరు కొచ్చి నెలరోజుల పాటు పిల్లలతో భార్యతో ఉంటాడు. అలా ప్రతిఏటా వచ్చినప్పుడల్లా తన కావలసిన పచ్చళ్ళు స్వీట్లు, పొడులు ఆవకాయలు అన్ని తయారు చేయించుకుని పట్టుకెళ్తుంటాడు. పిల్లలకిష్టమని తన భ...

ఇది మోసమా

 ఇది మోసమా  ఉదయం 5 గంటలు అయింది. కార్తీక మాసం కావడంతో ఆలయం ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయి ఉంది. ఏడుకొండలవాడా వెంకటేశా గోవిందా గోవిందా అంటూ గోవింద నామాలతో భక్తులు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ స్వామి దర్శనం కోసం కొంతమంది క్యూలో నిలిచి ఉన్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి దైవ దర్శనం పూర్తి చేసుకుని తమ తమ ప్రదేశాలకు వెళ్లే హడావిడిలో ఉన్నారు. భక్తుల అరుపులతో కేకలతో ఆ ప్రాంగణం అంతా హడావుడిగా ఉంది. నిజమే అక్కడ ఎవరి హడావుడి వారిది. ఆలయం లోపలికి వెళ్లే వాళ్ళు వచ్చే వాళ్ళతో ముఖ మండపం రద్దీగా ఉంది. ఈ ముఖం మండపం సుమారు 20 అడుగుల వెడల్పు ఉంటుంది పొడవు సుమారు 100 మీటర్లు ఉంటుంది . ముఖమండపం పై కప్పు పైన అందమైన అష్టదళ పద్మాలు చెక్కి ఉన్నాయి. ముఖమండపం గుండా లోపలికి ప్రవేశించినప్పుడు కుడిపక్క ఎడంపక్క అందమైన నల్ల రాతి అరుగులు వాటిపైన గుర్రాలు ఏనుగులు అందమైన దేవత మూర్తులు విగ్రహాలు తో చూడడానికి చాలా అందంగా ఉంది. అవును అది ఎవరి దేవాలయం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల ఆలయం. ద్వారకుడు అనే మహామునికి చీమల పుట్టలో వెంకటేశ్వర స్...

ఇద్దరు ఇద్దరే

ఇద్దరు ఇద్దరే  " అమ్మ వచ్చే నెలలోనే నీ పుట్టినరోజు కనీసం ఈ పుట్టినరోజుకి అయినా ఒక చీర కొనుక్కో అంటూ కూతురు రమ్య చెప్పిన మాటలకి మౌనంగా ఉండిపోయింది వసంత. వసంత మౌనానికి అర్థం రమ్యకు తెలుసు అందుకే మళ్లీ ఆ విషయం రెట్టించకుండా ఉండిపోయింది .అయినా అమ్మ కష్టం ఇంకెన్నాళ్లు అన్నయ్య చదువు అయిపోతో oది. క్యాంపస్ లో ఎక్కడో అక్కడ ఉద్యోగం వస్తుంది. అన్నయ్య అంది వచ్చాడంటే అమ్మ సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబం ఒక దారిలో పడుతుంది . పాపం నాన్న అకస్మాత్తుగా చనిపోవడంతో అమ్మ మీద ఈ కుటుంబ బాధ్యత పడి కుటుంబాన్ని ఇలా గుట్టుగా నెట్టుకొస్తోంది అనుకుంటూ చదువులో మునిగిపోయింది రమ్య. వసంత భర్త రాజారావు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగి. అనుకూలవతి అయిన భార్య తో ఇద్దరు పిల్లలతో మంచి ఇంట్లో ఆనందంగా కాలక్షేపం చేసేవారు. రాజారావు పెద్ద జీతగాడు కాకపోయినా ఉన్నదాంట్లోనే తృప్తిగా జీవించేవారు. అలాంటి కుటుంబానికి దిష్టి తగిలింది ఏమో హఠాత్తుగా రాజారావు గుండెపోటుతో చనిపోయాడు. రాజారావు భార్య వసంత పెద్దగా చదువుకోలేదు. అయినా గవర్నమెంట్ వారు దయ తలచి రికార్డ్ కీపర్ గా ఉద్యోగం ఇచ్చారు. రాజారావు బతికున్న రోజుల్లో బాగా బతికినా అంత పెద్ద...

మాతృ దినోత్సవం

మాతృ దినోత్సవం. " దేవుడు అమ్మని ఎందుకు పుట్టించాడో తెలుసా. అన్నిచోట్ల దేవుడు ఉండలేక. అంటే అమ్మ దేవుడికి ప్రతిరూపం. అమ్మకి మనకి సంబంధం ఎవరు నిర్వచించలేనిది. 9 నెలలు కడుపులోనూ భూమి మీద పడిన తర్వాత అమ్మ కనుమూసే వరకు ఆ బంధం కొనసాగుతూనే ఉంటుంది. బొడ్డు కోసి వేరు చేసినంత మాత్రాన మనకి అమ్మకి ఉన్న సంబంధం తెగిపోదు. అమ్మ మన ఇంట్లో ఉన్న దేవుడు. బాల్యంలో అమ్మానాన్న మనం ఒకటే. రూపాలే వేరు. మనం గట్టిగా ఏడిస్తే అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు. బోసి నవ్వులు నవ్వుతుంటే ఆ నవ్వులు చూసి అమ్మ కళ్ళల్లో వెలుగు. బాల్యంలో మన లాలన పాలన అంతా అమ్మే. నిప్పుకి ,ఉప్పుకి తేడా తెలియదు వాటిని బూచిలా చూపించి దూరంగా ఉంచేది. ఏది తప్పు ఏది ఒప్పు ఉగ్గుపాలతో నేర్పించేది అమ్మ. బంధాలు బంధుత్వాలు మనకు తెలియవు. చూపుడు వేలుతో నాన్నని చూపించేది అమ్మ. నాన్నకు రికమండేషన్ చేసి నాన్నకు తాహతకు మించిన స్కూల్లో చేర్పించేది అమ్మ. నాన్నకి మనకి మధ్య వారధి అమ్మ. తను కొవ్వొత్తి లా కరిగిపోతూ మన బ్రతుకులో వెలుగులు పంచేది అమ్మ . అందుకే అమ్మంటే కనిపించే దైవం అంటూ విద్యార్థులను ఉద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసమిచ్చి తన సీట్ లో కూర్చున్నాడు ప్రిన్సిపాల్...

ఎండలు

బాబోయ్ ఎండలు ఎండలు బాబోయ్ ఎండలు. ఎవరి నోటి విన్నా ఇదే మాట. ఎండాకాలంలో ఎండలు కాయక వానలు కురుస్తాయా అని కొందరు అంటారు. కాదు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగేయి అంటూ ప్రతి సంవత్సరం ఒకటే గోల. ప్రతి ఏటా సూర్యుడు కిందకి దిగిపోతున్నాడు. భూలోకం మీద అంత మమకారం ఎందుకో.ఏ నోట చూసినా అదే మాట. ఏ పని చేయబుద్ధి కాదు. తీక్షణమైన ఎండ చూస్తే వికారం. ఇంట్లో కూర్చున్న చెమటలు. గాలి లేదు. ఫ్యాన్ గాలి తప్పితే. ఏసీ గది వదిలి రా బుద్ధి కావడం లేదు.  అలా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే జీవితం ఎలా నడుస్తుంది. మూడు చక్రాల బండి స్టీరింగ్ తిప్పితే గాని తన బతుకు గడవదు ఒకరికి. నడి నెత్తి మీదకి సూర్యుడు వచ్చినా పొలం గట్ల మీద కలుపు మొక్కలు పీకక పోతే డొక్క నిండదు ఒకరికి. సర్కారు నౌకరు అయిన ఊరికే కూర్చోబెట్టి జీతం ఇవ్వరు కదా. పగలంతా ఏదో ఒక పని చేయవలసిందే. పిల్లలకి స్కూలు సెలవిచ్చిన అమ్మకి వంట పని తప్పుతుందా. ఏ జీవన చక్రాన్ని ఆపలేం. అలా నడుస్తుంటేనే నాలుగు వేళ్ళు లోపలికి పోతాయి ఎవరికైనా సరే. ఏ స్థాయి వాళ్ళకైనా సరే. మరి ఇంత ఎండలో ఆ ఊరు నుంచి ఈ ఊరికి జనాలను మోసుకుపోయే, సరుకులు తీసుకుపోయే లారీలు బస్సులు రైళ్లు విమానాలు నడిప...

ముందు జాగ్రత్త

ముందు జాగ్రత్త  "ఒరేయ్ రెడ్డి ఉదయం లేచి పిఠాపురం పశువుల సంతకు వెళ్లాలి అoటు రామారెడ్డి తన కొడుకు శ్రీనివాసరెడ్డి తోటి మంచం మీద పడుకుంటూ చెప్పాడు. మనకు పశువులు ఎందుకు ?నాన్న పొలాలన్నీ అమ్మేశాముగా అంటూ కొడుకు ప్రశ్నించాడు. లేదు రేపు ఉదయం తప్పకుండా వెళ్లాలి. బస్సు మీద కాదు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోదాం అంటూ సమాధానం ఇచ్చాడు రామారెడ్డి. తండ్రి మనసులో ఉన్న మాట చెప్పలేదు ఎందుకో తెలియదు అయినా తండ్రి మాటంటే శ్రీనివాస రెడ్డికి చాలా గౌరవం. సరే నాన్న తెల్లవారుజామున బయలుదేరుదాం అంటూ ఇద్దరు మంచం మీద వాలేరు. రామారెడ్డి ఒకప్పుడు బాగా చదువుకున్న మోతుబరి రైతు. కాలక్రమేణా పంటలు సరిగా పండక పిల్లల పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి ఆస్తంతా ఖర్చు అయిపోయింది. రామారెడ్డి దైవభక్తిపరుడు. పూజలు పునస్కారాలు అంటే బాగా ఇష్టం.ఎప్పుడు గుళ్ళుతిరుగుతుంటాడు. ఆ సొంత ఊర్లోనే తన తాతలనాటి కొంపలోకొడుకు కోడలు భార్యతో కాలక్షేపం చేస్తున్నాడు.  పొలాలూ ఉన్న రోజుల్లో ఇంటి వెనక పశువుల పాకలో ఎప్పుడు పది ఆవులు ఉండేవి. ఎద్దుల తోటే వ్యవసాయం చేసేవాడు. ఆ పశువులని నిత్యం దైవంగా పూజించేవాడు. కాలం కలిసి రాక ఆస్తి అంతా పోయింది కానీ ...

భాధ్యత

భాద్యత అర్ధరాత్రి 12 గంటలు అయింది. అందరూ ఆదమర్చి నిద్రపోతున్న వేళ" అమ్మా రమ్య బాత్రూం కి వెళ్ళాలి అంటూ పక్క గదిలోంచి తల్లి పిలుపు వినబడింది. అప్పుడే కునుకు పట్టిన రమ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ లేచి గబగబా పక్క రూములోకి పరిగెత్తింది. చేయవలసిన సహాయం సక్రమంగా చేసి మళ్లీ తన పడక గదిలోకి తిరిగి వస్తుంటే మూడేళ్ల చంటిది ఏడుస్తూ వచ్చింది. దాన్ని ఎత్తుకుని సముదాయించి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది రమ్య. ఇవేమీ పట్టనట్లు భర్త సురేష్ గురక పెట్టినట్టు నిద్ర పోతున్నాడు. ఈ లోకంలో తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేది అలారం గడియారం ఒకటే. మనం అనుకున్న సమయానికి మనల్ని నిద్ర లేపడం దాని భాధ్యత .మనం లేచే వరకు అది అలా హోరు పెడుతూనే ఉంటుంది. రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు మంటలు పెడుతున్న తన భుజస్కందాలపై ఉన్న బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలంటే ప్రతి గృహిణి కాలాన్ని చూసుకుని పరిగెట్టాలి. మూడేళ్ల చంటిపిల్ల , ఉదయం టిఫిన్ చేసి క్యారేజీ పట్టుకుని రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే భర్త బాగోగులు, లేవలేని స్థితిలో మంచం మీద ఉన్న కన్నతల్లి. ఏ బాధ్యత అలక్ష్యం చేసేది కాదు. అన్ని బాధ్యతలు రమ్య వైపు చూపులు...

పండుగ

పండుగ  అబ్బా మాకు మనుమలు పుట్టిన తర్వాత కూడా ఇంకా పండగలు ఏమిటి? మేము సంక్రాంతి పండుగకు రాము అంటూ జానకమ్మ గారి పెద్ద కూతురు చిన్న కూతురు చెప్పిన సమాధానం విని వీడియో కాల్ లో జానకమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ చూడండి నేను నాన్న ఉన్నంతవరకు ఈ పండుగలు ఆ తర్వాత ఎవరికి ఎవరో అంటూ జాలిగా పిల్లల వైపు చూసింది. జానకమ్మ గారి పెద్దమ్మాయి రెండో అమ్మాయి పక్కనే ఉన్న భర్తల కేసి చూశారు. ఏం సమాధానం చెప్పాలని.  ఆడపిల్లలు మనవలని ఎత్తిన భర్తల అనుమతి లేకుండా ఏదీ చేయరు. భర్తలు మౌనంగా ఉండడం చూసి సరేనమ్మా వస్తామంటూ పెద్దమ్మాయి చిన్నది ఫోన్లు పెట్టేసారు.జానకమ్మ గారి పెద్దమ్మాయి రాగిణి రెండో అమ్మాయి రమ ఇద్దరు కూడా హైదరాబాదులోనే ఉంటున్నారు. ఇద్దరికీ ఇద్దరేసి ఆడపిల్లలు మనవరాళ్ళకి పెళ్లిళ్లు అయిపోయి ఇద్దరేసి పిల్లలు పుట్టారు.  ఆఖరి అమ్మాయి రజిని అమెరికాలో ఉంటుంది. అమ్మ నేను తప్పకుండా వస్తాను అంటూ అమ్మకు సమాధానం చెప్పి సంతృప్తి పరిచింది. ఆ అమ్మాయికి పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది ఆ పిల్ల పాపం ఏడాదికోసారి వస్తుంది. అది కూడా సంక్రాంతి పండక్కి. ఇంకా పిల్లలు పుట్టలేదు. పిల్లలందరూ పండగలకు వస్తారుట అ...

స్పూర్తి

స్ఫూర్తి ఏ క్షణం ఈ భూమి మీద పడ్డానో అప్పటి నుంచి నడకవచ్చి నాలుగు వీధులు తిరిగే వరకు అమ్మ తిన్నా తినకపోయినా ఒడిలో పడుకోబెట్టుకుని జుట్టు నిమురుతూ నా ఆకలి తీర్చేది. నడకవచ్చి నాలుగు వీధులు తిరిగే వయసు వచ్చిన తర్వాత కుండలో వండిన నాలుగు మెతుకులు నాకూ వాటా పెట్టి అమ్మ పస్తులు ఉండేది. ఎందుకంటే నాతో పాటు నాలుగు మెతుకులు పంచుకునేందుకు మరో ఇద్దరు మొత్తం ముగ్గురం. మాతో పాటు అమ్మానాన్న.   ఎన్నోసార్లు అమ్మానాన్న కుండలోని మంచినీళ్ళతో కాలం గడిపేవారో. ఆకలి గురించి ఆలోచించే సమయం కానీ తీరిక గాని ఆ దంపతులకు లేవు. తెల్లవారి లేస్తే తట్టబట్ట సర్దుకుని పొలం గట్టుకు చేరకపోతే మర్నాడు మా ఇంట్లో పొయ్యిలోంచి పిల్లి లేచేది కాదు. కాలచక్రాన్ని ఎవరు ఆపలేం. తిరిగే కాలం నాకు 10 సంవత్సరాల వయసుని మా ఇంటి పరిస్థితిని అదే సమయంలో మా ఊరిలో ఉండే పెద్ద మేడలో ఉన్న నా వయసు వాళ్ల నిత్య కృత్యాన్ని గమనించుకునే జ్ఞానం కలిగించింది. కాలం అంటే అందరూ భయపడతారు. కానీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా కున్న పరిస్థితిని దాటడానికి నా బాధ్యతను గుర్తుచేసింది. అంటే ఒకటి మా పేదరికం రెండోది నా చదువు .  చదువు నాకు అందని ద్రాక్ష...

అడవి తల్లి మనసు

అడవి తల్లి మనసు " ఒరేయ్ సుధాకర్ ఈ వీకెండ్ కి మనం మారేడుమిల్లి అడవులకు పెడదాం రా! అది మా ఊరికి చాలా దగ్గర. కార్లో వెళ్ళిపోదాం. చూడ్డానికి చాలా బాగుంటుంది రా! చుట్టూ అందమైన పచ్చటి చెట్లు లోయలు అవి చూస్తుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా అక్కడ దొరికే బొంగు చికెన్ మరి ఎక్కడ దొరకదు. అంత రుచికరంగా ఉంటుంది అంటూ చెప్పుకుపోతున్న మహేష్ మాటలకి అడ్డు తగులుతూ అది అడవి అంటున్నావు మరి అడవుల్లో కారు ఎలా వెళుతుంది పైగా క్రూర జంతువులు ఉంటాయేమో! అని సందేహంగా అడిగాడు మహేష్.  "ఊరుకోరా అది అడవి ఏమిటి ? చూడడానికి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పెద్ద క్రూర మృగాలు అక్కడ ఏం కనిపించవు . అవి ఎప్పుడు ఎవరికంట పడలేదు. అడవి మధ్యలో అందమైన తారు రోడ్లు వేసి విహార స్థలాల కింద ఎప్పుడో మార్చేశారు అంటూ చెప్పుకొస్తున్న మహేష్ మాటలకి సుధాకర్ కి చాలా బాధనిపించింది. మనిషి ఎంత స్వార్ధపరుడు. తన ఆహారం కోసం జంతువులను వేటాడి చంపేస్తున్నాడు. అపురూపమైన వృక్ష సంపదని అక్రమంగా రవాణా చేసి కోట్లు ఆర్జిస్తున్నాడు.  ఆ అడవిలో దొరికినది తింటూ కాలక్షేపం చేసే పులులు ,ఏనుగుల బలవంతంగా చంపేసి వాటి దంతాల్ని చర్మాల్ని విదేశాలకు ఎగుమత...