పోస్ట్‌లు

ఏప్రిల్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆర్థిక శాస్త్రవేత్త

ఆర్థిక శాస్త్రవేత్త ఇల్లంతా ఎంత సందడిగా ఉండేది. అమ్మమ్మ ఎప్పుడూ ఎవరో ఒకరి మీద కేకలు వేస్తూనే ఉండేది ఆ హాల్లో మంచం మీద కూర్చుని. గేటు తలుపు తీసిన చప్పుడైతే ఎవరు అంటూ గట్టిగా అరిచేది. ఆ హాల్ అంతా చిన్న పోయింది. ఇప్పుడేమో ఇలా! వీధిలో చాప మీద పడుకుంటే ఏదోలా ఉంది.అప్పుడే ఆఖరి శ్వాస విడిచి మూడు గంటలు అయింది .  నిన్నటి వరకు మన మధ్య ఉన్న ఈమె ఇవాళ శవమై వాకిట్లో పడుకుంది అనుకుని బాధపడుతూ కూర్చున్నాడు చనిపోయిన సీతమ్మ గారి మనవడు రఘురాం. సీతమ్మ గారికి నలుగురు ఆడపిల్లలే. మగ పిల్లలు లేరు. అందుకే పెద్ద కూతురు కొడుకుని దత్తత చేసుకుని బంధువుల అమ్మాయిని సరళని ఇచ్చి పెళ్లి చేసింది. రఘురాం ఆ ఊర్లోనే టీచరుగా పనిచేస్తుంటాడు. తాతగారు ఇంట్లోనే కాపురం ఉంటాడు. మళ్లీ రఘురాం కూడా అందరూ నలుగురు ఆడపిల్లలే.  సీతమ్మ గారు ఆడపిల్లలు భర్తలు పిల్లలతో కలిసి వచ్చారు. బంధువులు స్నేహితులు ఒక్కొక్కళ్ళే రావడం ప్రారంభించారు . ఒకపక్క అంతిమ సంస్కారానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇంతలో సీతమ్మ గారి బంధువు ఒకరు రఘును పిలిచి ఇంకా ఎంతసేపు ! దూరం తీసుకెళ్లాలి కదా! ఆలస్యం అయిపోతుంది రఘుని తొందర పెట్టాడు. రఘు స్...

కమనీయ నగరం కాకినాడ

కమనీయ నగరం కాకినాడ. అసలు పేరు కోకనాడ. కోకనాడ పేరు రైల్ బండికి ఇచ్చి  కాకినాడ గా రూపాoతరం. తూర్పుగోదావరి జిల్లా కే తలమానికం. విశ్రాంతి ఉద్యోగుల భూతల స్వర్గం.       మన కాకినాడ నగరం. నాయకర్ గారి విద్యా భిక్షే M S N చారిటీస్. సాంకేతిక విద్యకు ఆలవాలం ఆంధ్ర పాలిటెక్నిక్. అదే సామాన్య విద్యార్థుల పాలిట వరం. ప్రాంగణం చుట్టూ క్షార మడుగులు. లోపల అన్నీ విద్యాలయాలు. తరతరాలుగా ఉప్పుటేరు మీద నిలుచున్న వారధి. జగన్నాధపురం వారధి. తరాలు మారినా పెరగని వారథి. నిత్యం పెరుగుతోంది రద్దీ.  చిరు వ్యాపారుల బ్రతుకు రథ జీవన సారధి.    అతి పెద్ద బోధన ఆసుపత్రి G G H. అధునాతన టెక్నాలజీతో సామాన్యుడి వైద్యం.     పనితీరు మొత్తం దేశానికే తలమానికం.     వైద్యో నారాయణో హరి పేరు సార్ధకం .     చెరువులన్నీ చరిత్ర లో మునిగి పోయిన.     బాలాజీ మటుకు T TD వారి మండపంలో.          అదే బాలాజీ చెఱువు.   విత్తనాల నుండి విందుల వరకు     దొరికే జంక్షన్. బ్రిటిష్ వారి కట్టడాలకు మచ్చు తునక కలెక్టర్ బంగ్లా. తరాలు మారి రంగ...

ఎవరి జీవితం ఎలా ముగుస్తుందో!

ఎవరి జీవితం ఎలా ముగుస్తుందో! సాయంకాలం ఐదు గంటలు అయింది. ఆ పల్లెటూర్లో ఉండే సోమయాజులు గారి ఇల్లంతా హడావిడిగా ఉంది. నడవలో వేసిన కుర్చీల్లో సోమయాజులు గారు కుటుంబం ఒకవైపు పెళ్ళికొడుకు రమేష్ కుటుంబం ఒకవైపు కూర్చుని మాట్లాడుకుంటున్నా రు. అమ్మాయికి అబ్బాయికి  అబ్బాయికి అమ్మాయి నచ్చారు. కట్న కానుకలు వద్దని ముందుగానే చెప్పారు మగ పెళ్లి వారు.ఇంక పెళ్లికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడమే తరువాయి. సోమయాజులు గారు తూర్పుగోదావరి జిల్లాలో కాజులూరు మండలంలో ని పల్లిపాలెం స్కూలు హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు ఒకర్తే అమ్మాయి. అమ్మాయి పేరు వైదేహి . అచ్చు తెలుగు వారి పిల్లలా ఉంటుంది. డిగ్రీ చేసిన తర్వాత బీఈడీ కంప్లీట్ చేసి టీచర్ గా అక్కడ దగ్గరగా ఉన్న స్కూల్లోనే పనిచేస్తోంది. సోమయాజులు గారికి ఇంకా 5 సంవత్సరాలు సర్వీసు ఉంది. ఈలోగా పిల్లకు పెళ్లి చేస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత బాధ్యతలు ఉండవని ఆయన ఆలోచన. అయితే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఈడు జోడు చూడాలంటారు. అందుకే టీచర్ ఉద్యోగం చేసే వరుడు కోసం వెతుకుతూ చివరికి కాకినాడలో టీచరుగా పనిచేస్తున్న రమేష్ తో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. చివరికి పిల్...

ప్రశ్నలు

*7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన దత్తాత్రేయ స్వామి* 1వ ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది? జ: చాలా మంది కత్తి అని చెప్పారు. గురువు: కాదు, మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుకతో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు. 2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ? జ: చాలా మంది చంద్రుడు, సూర్యుడు, గ్రహాలూ గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం. ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము, ఆ కాలంలోకి వెళ్లలేము. అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము. 3వ ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది? జ: చాలా మంది పర్వతం, సూర్యుడు, భూమి ఇలా ఎన్నో అంటారు. గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే. 4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా, బరువుగా ఉండేది ఏది? జ: చాలామంది, వజ్రము, ఇనుము, ఏనుగు అని చెప్పారు. గురువు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం". మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం. 5వ ప్రశ్న: ప్రపంచంలో తేలికైనది ఏది? జ: దూది, గాలి, ఆకులు అని చెప్పారు. గురువు: ప్రపంచంలో తేలికైనది అ...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏమిటి? పరిచయం 21వ శతాబ్దపు సాంకేతిక ప్రపంచంలో "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" (AI) అనేది మార్గదర్శక శక్తిగా నిలుస్తోంది. ఇది మానవ మేధస్సును అనుకరించే కంప్యూటర్లను, యంత్రాలను అభివృద్ధి చేసే శాస్త్రం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది: • కంప్యూటర్లు మానవుల మాదిరిగా ఆలోచించే, నేర్చుకునే, నిర్ణయాలు తీసుకునే విధంగా అభివృద్ధి చేయడం. • అనుభవాల నుంచి నేర్చుకొని, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం. AI పనిచేసే విధానం • మెషిన్ లెర్నింగ్ (Machine Learning): డేటా ఆధారంగా స్వయంగా నేర్చుకోవడం. • న్యూరల్ నెట్‌వర్క్స్ (Neural Networks): మానవ మెదడును అనుకరించే లాజికల్ మోడల్స్ రూపకల్పన. • డీప్ లెర్నింగ్ (Deep Learning): క్లిష్టమైన డేటాను లోతుగా విశ్లేషించడం. • నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP): మానవ భాషను యంత్రాలు అర్థం చేసుకోవడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఉపయోగాలు 1. వైద్య రంగంలో • రోగ నిర్ధారణను త్వరగా మరియు ఖచ్చితంగా చేయడం. • వ్యక్తిగత వైద్య చికిత్సల మార్గదర్శనం. 2. వాణిజ్య రంగంలో ...

జై జవాన్

జై జవాన్. ఉద్యోగం పురుషలక్షణం అంటారు. కొన్ని ఉద్యోగాలు అందమైన కార్యాలయాల్లో చల్లని రాతి గదులలో కూర్చుని బుద్ధి బలంతో చేసేవి. మరికొన్ని శారీరిక శ్రమతో చేసేవి. మరికొన్ని కొలువులకి దేశ సరిహద్దులే కార్యాలయాలు . కొండ కోనల్లో ఎండ వానల్లో మంచు తుఫానులో ఇరవై నాలుగు గంటలు దేశ రక్షణ ప్రధాన కర్తవ్యం.  ఆ విధంగా పనిచేసే వారికి జీతభత్యాలు ఇచ్చినప్పటికీ వారిని ఎప్పటికీ మనం త్యాగమూర్తులుగానే గుర్తించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీరిది దేశ రక్షణ ప్రధాన కర్తవ్యం. ప్రాణాలను పణంగా పెట్టి ఎప్పుడు దేశ రక్షణ చేస్తూ ఉండాలి. కన్నతల్లిని ఉన్న ఊరుని మరిచిపోయి దేశ రక్షణ ప్రధాన కర్తవ్యం గా పనిచేసే ఈ సైనికులు నిజంగా చిరస్మరణీయులు. దేశ ప్రజల ఆకలి తీరాలంటే రైతు పంట పండించాలి. దేశ పౌరుడు నిశ్చింతగా నిర్భయంగా తిరగాలంటే సైనికుడు తుపాకీ గురి పెట్టుకుని ఉండాలి ఎప్పుడు. దేశంలో అనేక రకాల ఉపాధిలు ఉన్నప్పటికీ అందుకే ఈ వృత్తులకి అంత గౌరవం. జై జవాన్ జై కిసాన్ అంటారు. దేశ రక్షణే కాకుండా ప్రకృతి విపత్తులు లో ఆదుకునే పరమాత్ముడు సైనికుడు.యుద్ధమంటే ఎప్పుడు ముందుకు దూసుకు పోయేది సైనికులు.ఆర్మీ అంటే అన్నదమ్ముల్లా ఆదుకునేది.అంద...

జీవిత భద్రత

జీవితభద్రత. కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జననం అని చావు పుట్టుకల గురించి ఒక కవి నిర్వచనం ఇచ్చాడు. జీవితం చాలా అనిశ్చితమైనది. ఎప్పుడు ఏది ముంచుకొస్తుందో మనకు తెలియదు. రోజు మనంచూస్తున్న మనుషులు సడన్ గా మాయం అయిపోతూ ఉంటారు.కారణాలు అనేకం హార్ట్ ఎటాక్ కావచ్చు మరి ఇతర అనారోగ్యం యాక్సిడెంట్ కావచ్చు కరోనా లాంటి వ్యాధులు కావచ్చు. ఈరోజుల్లో నడి వయసు ఉన్న వ్యక్తులకు నూటికి 90 మందికి ఆర్థిక భారాలు ఎక్కువగా ఉంటున్నాయి. రుణాలు ఇచ్చే బ్యాంకులు విపరీతంగా పెరిగాయి. అలాగే రుణం తీసుకుని వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అన్ని సౌకర్యాల కోసంబ్యాంకుల దగ్గర అప్పు చేసి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. అయితే అనుకోకుండా వచ్చిన ఆ వ్యక్తి మరణం వల్ల ఆ భారం అంతా భార్య మీద పిల్లల మీద పడుతుంది. ఇటువంటి సమయంలో ఆర్థిక భారాలన్నిటిని కుటుంబానికి భారం కాకుండా కాపాడేది టర్మ్ ఇన్సూరెన్స్. అయితే ఇంటి రుణాలు ఇచ్చే ప్రతి జాతీయ బ్యాంకు గాని ఫైనాన్స్ సంస్థలు గాని ఇంటి రుణం భద్రత కోసం భీమా కవరేజ్ తీసుకోవడం తప్పనిసరి చేశాయి. ఇది ఆ ఇంటి రుణం వరకే వస్తుంది. మిగిలిన దేనికి వర్తించదు. దీనితోపాటు ప్రతి వ్యక్తి టర్మ్ ఇ...

బాపనమ్మ

బాపనమ్మ      బాపనమ్మ అదేమీ అందమైన పేరు కాదు. ఒక సినీనటి పేరు అసలే కాదు. గ్రామ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న రాజకీయ నాయకురాలు కాదు. కానీ ఆ ఊరిలో ఈనాటికీ ఆ పేరు ప్రజలందరినోళ్ళల్లో నానుతూ ఉంటుంది. నాకు తెలుసు ఉన్నంతవరకు ఆమెకు అమ్మవారి పేరు పెట్టి ఉంటారు.  మా ఊరి బడినీ అంటే మేము రాజులు బడి అని పిలుచుకునే వాళ్ళం . ఆ బడిలో చదువుకున్న వారు బాపనమ్మ పేరు, ఆ రూపం మర్చిపోయిన విద్యార్థులు గాని గ్రామస్తులు కానీ ఎవరూ ఉండరు. మా ఊరు పాఠశాల ని రాజులు బడి అని ఎందుకంటారు అని అందరికీ సందేహం కలగొచ్చు. కారణం ఏమిటంటే మా పాఠశాలకి సొంత భవనం లేదు. ఆ గ్రామం అప్పట్లో అది కాకినాడ తాలూకా లోని పల్లిపాలెం ఒక కుగ్రామం. ఇప్పుడు కాజులూరు మండలంలోని ఒక అభివృద్ధి చెందిన గ్రామం.ఆ గ్రామానికి అప్పట్లో సరైన రోడ్లు కానీ పాఠశాల భవనం గాని లేదు. ఆ ఊరిలో క్షత్రియ వంశానికి చెందిన సుబ్బరాజు గారు మరియు నారాయణ రాజు గారు అని ఇద్దరు అన్నదమ్ముల వసతి గృహం వెరసి మా ఊరి విద్యార్థులకు సరస్వతి నిలయం అయ్యింది.  ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆ బడి వెనుక కాపురం ఉండేవారు. అప్పట్లో ఆ బడికి అద్దె ఉందో లేదో నాకు తెలియదు. ...

అంతిమ యాత్ర

అంతిమ యాత్ర హలో ప్రసాద్ గారు నేను ప్లాట్ నెంబర్ 425నుంచి  మాట్లాడుతున్నాను . ఉదయం నుంచి మా ఇంట్లో కరెంట్ లేదు. కాస్త ఎలక్ట్రీషియన్ ని పంపించండి.సరే అండి రామారావు గారు ఎలక్ట్రీషియన్ 9 గంటలకు వస్తాడు .థాంక్స్ అండి అంటూ ఫోన్ పెట్టేసాడు రామారావు గారు.  వివరాలన్నీ నోట్ చేసుకుని ఎలక్ట్రీషియన్ కి ఫోన్ చేసే అంతలో మళ్లీ మొబైల్ రింగ్ అయ్యింది. నేనండి ప్రశాంత్ ని ప్లాట్ నెంబర్ 530 నుంచి మాట్లాడుతున్నాను. మా బాత్రూంలో నల్లాలు లీక్  అవుతున్నాయి కాస్త రిపేర్ చేయించి పెట్టండి సార్.  అలాగేనండి అంటూ ఫోన్ పెట్టేసారు ప్రసాద్ గారు.  ప్రశాంత్ గారితో మాట్లాడుతుండగానే ఫ్లాట్ నెంబర్ 525లో కాపురం ఉంటున్న రాఘవయ్య గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ప్రశాంత్ గారు ఫోన్ పెట్టేసిన తర్వాత రాఘవయ్య గారి కి మళ్ళీ కాల్ చేశాడు ప్రసాద్. రాఘవయ్య గారు ఫోన్ ఎత్తి నాయనా ప్రసాదు కాస్త నా మందులు అయిపోయాయి తెప్పించ పెడుదూ అంటూ నెమ్మదిగా మాట్లాడాడు. సరేనండి ఇప్పుడే పంపిస్తాను ఫోన్ పెట్టేసాడు ప్రసాద్. ఇలా ఉదయం నుంచి సాయంకాలం వరకు అందరి సమస్యలు తీర్చేఆపద్బాంధవుడు సదరు ప్రసాద్ గారు కూడా ప్లాట్ నెంబర్...

ఇంటి స్థలం కొనుగోలులో జాగ్రత్తలు మెలుకువలు

ప్లాట్ కొనుగోలులో మెలకువలు మరియు జాగ్రత్తలు పొదుపు చేసిన డబ్బుతో గృహ నిర్మాణం కోసం ప్లాట్ కొనడం జీవితంలో ఒక గొప్ప నిర్ణయం. కానీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నో చిక్కుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కనుక, ప్లాట్ కొనుగోలులో కొన్ని ముఖ్యమైన మెలకువలు, జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. 1. టైటిల్ డీడ్ పరిశీలన ప్లాట్ యజమానుడికి సరైన హక్కులు ఉన్నాయా తెలుసుకోవాలి. పాత హక్కు పత్రాలు (Link Documents) పూర్తి స్థాయిలో పరిశీలించాలి. 2. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (EC) తీసుకోవడం గడిచిన కనీసం 15-30 సంవత్సరాల వరకు Encumbrance Certificate తీసుకొని, భూమిపై ఏమైనా బాకీలు లేదా కేసులు ఉన్నాయా తెలుసుకోవాలి. 3. లేఅవుట్ అప్రూవల్స్ ప్లాట్ ఉన్న లేఅవుట్‌కు DTCP లేదా సంబంధిత Municipality నుంచి అధికార అనుమతి ఉందా లేదా అనే విషయం నిర్ధారించుకోవాలి. 4. రెవెన్యూ రికార్డుల పరిశీలన Adangal, 1B, FMB Sketch వంటి ప్రభుత్వ పత్రాలు సరిగా ఉన్నాయా చూడాలి. రెవెన్యూ శాఖలో ప్లాట్ వివరాలు ఎవరి పేరుతో ఉన్నాయో తెలుసుకోవాలి. 5. సర్వే మరియు బౌండరీ వెరిఫికేషన్ ప్లాట్ పరిమితులు సరిగా ఉన్నాయా పక్క ప్లాట్ల వారితో కలిసి సరిచూడటం మంచిది. 6. రహ...

అపార్ట్మెంట్ కొనుగోలు_ మెలుకువలు మరియు జాగ్రత్తలు.

అపార్ట్‌మెంట్ కొనుగోలు - మెలుకువలు మరియు జాగ్రత్తలు ప్రతి మానవుడికి సొంత ఇల్లు కావాలనే కోరిక ఉంటుంది. అయితే ఆధునిక కాలంలో ఇంటి స్థలముల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో స్థలముకొని ఇల్లు కట్టుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దానికి తోడు ప్రముఖ ప్రదేశాల్లో స్థలాలు కొనడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది . అందుకే సామాన్య మానవుడు అపార్ట్మెంట్ల మీద ఆధారపడుతున్నారు.  ఈ అపార్ట్మెంట్లు నగరాలలో ప్రధాన కూడలిలో ఉండటమే కాకుండా రవాణా సౌకర్యములు అందుబాటులో ఉండడం ఒక కారణం వలన ఈ అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు సామాన్య ప్రజలు. అయితే ఇవి కొంతవరకు తలకు మించిన భారమైన కొన్ని లోటుపాట్లు ఉన్న ప్రస్తుత కాలంలో సామాన్య మానవుడు, మధ్యతరగతి మానవుడు వేరే దారి లేక వీటి మీద ఆధారపడుతున్నారు  ఏదైనా ఆస్తి కొనడం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఆ ఆస్తి ఒక భారం అవుతుంది. కనుక, మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉండాలంటే ఈ కింది అంశాలను ఖచ్చితంగా పరిశీలించాలి. ఇక ఈ అపార్ట్మెంట్లు కొనేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి అనే విషయం చాలామందికి తెలియదు. నాకున్న అనుభవంతో ఈ వ్యాసం మీ అం...

రుచులు వెనుక జీవితం

రుచులు వెనుక జీవితం " సాయంకాలం వచ్చేటప్పుడు ఉగాది పచ్చడి సరుకులు తీసుకురండి. పొద్దున్నే నేను లేచి పచ్చడి చేసుకోవాలి. రేపు ఉదయం మళ్ళీ సంచి వేసుకుని బజార్ కి వెళ్లి సరుకులు తీసుకొస్తానంటే బాగుండదు అంటూ చెబుతున్న భార్య సుజాత మాటకి ఆఫీసుకు బయలుదేరి పోతున్న రామారావు "సరే తప్పకుండా తీసుకొస్తా! అని గత సంవత్సరం వేప పువ్వు కొనలేదు కదా అన్నాడు. అవును కానీ ఈ ఏడాది ఆ చెట్టు కొట్టేసి ఆ స్థలంలో ఇల్లు కట్టేశారు అoది సుజాత. ఆఫీస్ నుండి తిరిగి వస్తూ బజారు లోకి వెళ్లిన రామారావుకి మార్కెట్ అంతా సందడిగా కనిపించింది. ఒకపక్క తట్టలో వేప పువ్వు మరొక పక్క కొత్త బెల్లం కొత్త చింతపండు ఇలా ఉగాది పచ్చడి సరుకులు అన్ని వరుసగా పెట్టుకుని అమ్ముతున్నారు. ఎన్ని షాపులు తిరిగిన వేప పువ్వు అంతా వాడిపోయినట్టుగా ఉంది. అన్ని సరుకులు హై రేట్లు. డిమాండ్ అలా ఉంది. ఏమిటో రాను రాను పండగలకు కూడా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. సరుకుల రేట్లు మండిపోతున్నాయి అనుకుని సరుకులు అన్నీ తీసుకుని ఇంటికి బయలుదేరాడు రామారావు  ఇంటికి వచ్చి భార్యకు సరుకులు సంచి అందించి పిల్లలు ఎవరూ లేకపోతే పండగలా లేదు అన్నాడు భార్యతో రామారావు. ఒకరోజు సెలవ...

బాపట్ల జిల్లా విహారయాత్ర

బాపట్ల జిల్లా విహారయాత్ర |  బాపట్ల — ప్రకృతి ప్రేమికులకు, ఆధ్యాత్మికత కోరుకునే వారికి, చారిత్రక ప్రదేశాలను చుట్టే వారికి ఒక అద్భుత గమ్యం! సముద్రతీరపు అందాలు సూర్యలంక బీచ్ బాపట్ల నుంచి కొద్దిపాటి ప్రయాణమే. స్వచ్ఛమైన తీరప్రాంతం, మృదువైన అలలు, ప్రశాంత వాతావరణం... ఒకరోజు విహారానికి సరైన ప్రదేశం. హరిథా రిసార్ట్ లాంటి మంచి వసతులు కూడా ఉన్నాయి. వోడరేవు బీచ్ చిన్న కిరణాలాంటి పల్లటూరి వాతావరణం, తక్కువ జనసంచారం, నిసర్గంతో మమేకమయ్యే అందమైన బీచ్. రామాపురం బీచ్ శుభ్రమైన బీచ్, ప్రశాంతత కోరుకునే వారికి పరిపూర్ణ గమ్యం. ఆధ్యాత్మికత & చరిత్ర పయనం భావనారాయణ స్వామి ఆలయం చోళ రాజుల చరిత్రను మోసుకుంటూ వచ్చేది. ఆలయం శాంతియుతంగా, భక్తి పరవశాన్ని కలిగించేలా ఉంటుంది. మొటుపల్లి పురాతన పోర్టు ప్రాచీన మత్స్యకార గ్రామం. బౌద్ధ స్థలాలు, పురాతన ఆలయాల మధ్య మునిగిపోయే అనుభూతి. జిల్లెల్లమూడి అమ్మ ఆలయం "అమ్మ" అనే పేరుతో ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ పసందైన మౌనం, ఆత్మశాంతిని ఆస్వాదించవచ్చు. ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేకం ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం వలస పక్షుల సందడి మధ్య ప్రకృతితో మమేకం కావాలని ఉందా...

గుంటూరు జిల్లా యాత్ర

గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ యాత్రా క్షేత్రాల సమాహారం. ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాలకు చెందిన అనేక పవిత్ర స్థలాలు ఉన్నాయి. 🛕 హిందూ యాత్రా క్షేత్రాలు 1. అమరావతి కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ ప్రాచీన నగరం, అమరేశ్వర స్వామి ఆలయం మరియు బౌద్ధ స్థూపంతో ప్రసిద్ధి చెందింది. ఇది శైవ, బౌద్ధ సంప్రదాయాలకు ముఖ్య కేంద్రం. 2. మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడినది మరియు దాని 11 అంతస్తుల గాలిగోపురం ప్రసిద్ధి చెందింది. ఇది నరసింహ స్వామికి అంకితమైన మూడు ఆలయాలలో ఒకటి. 3. కోటప్పకొండ త్రికూట పర్వతం మీద ఉన్న ఈ శివాలయం మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. 4. పొన్నూరు భవానారాయణ స్వామి ఆలయం ఈ ఆలయం తన భారీ హనుమాన్ మరియు గరుడ విగ్రహాలతో ప్రసిద్ధి చెందింది. 5. చే బ్రోలు ఈ గ్రామం అనేక పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న చతుర్ముఖ బ్రహ్మాలయం భారతదేశంలో అరుదైన బ్రహ్మ దేవాలయాలలో ఒకటి. 🪷 బౌద్ధ యాత్రా క్షేత్రాలు 1. అమరావతి బౌద్ధ స్థూపం ఈ స్థూపం 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది మరియు బౌద్ధ కళా సంపదకు ప్రసిద్ధి. 2. నాగార్జునకొండ నల్లమల పర్వత శ...

ఎవరు మార్చగలరు

ఎవరు మార్చగలరు. కథ కోసం ఆలోచిస్తూ కూర్చున్నా చుట్టూ ఉండే ప్రకృతి పరికించి చూసా కుటుంబ వ్యవస్థలోకి తొంగి చూసా సమాజాన్ని పలకరించా అవి అప్పటికే పేజీలకు కథలన్నీ చెప్పేసాయి. మంచి మూడ్ కోసం లొకేషన్ వెతికా అది ఊటీ యో కొడైకెనాల్లో కాదు  అది కర్మ కాలితే చేరే ప్రదేశం నేను కధ ల కోసం వెళ్ళా అది దుర్భేద్యమైన కోట కోటలో రాజులు రాణులు ఉండరు. అందరూ దొరల బిడ్డల్లా ఉన్నారు ఆవేశంలోనూ ,ఆలోచన లేకుండా బ్రతికేందుకు వేరే మార్గం లేక చేసిన పనికి చట్టం వారికి ఓ గుర్తింపు ఇచ్చింది. ఇనప చువ్వల గదిలో బందీ చేసింది ఏ ఇనప చువ్వను లాఠీ తో కొట్టిన ఒక కథకు జన్మనిస్తోంది. రాయితో కట్టిన గదులన్నీ కన్నీటితో చమరుస్తున్నాయి. ఎన్ని వేల కథల విందో ఆ గది ఎప్పుడు ఆ గది గుండెలో తడి ఆరదు. రో జు కన్నీళ్ళ కథలు విని విని అలవాటైపోయిన చట్టం గుండె ఎన్నో ఏళ్లు బందీలుగానే ఉంచేసి చట్టం తను కల్పించిన అవకాశాన్ని మరచిపోతే  బందీల బ్రతుకులన్నీ ఆ ఇనుప చువ్వల గదిలోనే గాంధీ జయంతి ఎప్పుడు వస్తుందని ఆ శుభవార్త కోసం ఎదురు చూసే ఆ కళ్ళు మధ్యలోనే మూసుకుపోయిన వైనo బిగుసుపోయిన ఆ చేతులు ములాఖత్ గది వైపు  చూపించిన దృశ్యం చూస్తూ ఉంట...

మగువ

మగువేకద మగనకి అండ దండ ఆమెతో జీవితం మగనికి వెండికొండ. వెండికొండ అంతా శివుని పరం పార్వతి మనసంతా శివ మయం. అందుకే జగము మెచ్చే జంట పార్వతీ పరమేశ్వరo. పులి తోలు తప్ప పండుగలకు కూడా పంచ కట్టడు. భస్మం పుట్టిన చోటే భయం లేకుండా ఉంటాడు. నయా పైసా ఖర్చు లేకుండా నందీశ్వరుడే వాహనం. అయినా ఆ మగనిని మెచ్చిందిఈ మగువ. లోకానికే ఆదర్శం అయ్యిందిఈ జంట.  శివుడు విల్లునే క్షణంలో విరిచాడు   అందాల జానకిని చేపట్టాడు మా సుకుమారుడు అందాల రాముడు. అయినా ఏం లాభం కాపురం అంతా అడవిపాలు.     అశోకవనమే ఆమెకు గతి. పతి మాట జవదాటని సుదతి. పుడమి నుంచి పుట్టింది ఈ అయోనిజ. పుట్టింటి నుంచి తెచ్చుకుంది సహనం. సీతమ్మ అంటే మాకు ఆదర్శo. రామనామమే ఆమెకు రమ్యం. కురు వంశం అంతా ఉండే గౌరవ సభ. పతివ్రత కే జరిగింది పరాభవం. ఆమెకు దైవమే చేసింది సహాయం. పంచ భర్తృక అయినా పతివ్రత అయ్యింది. పరమాత్మ మెచ్చిన పడతి. ఇంకేం చెప్పాలి ఈ అమ్మ ఔనత్యం. తొలి సంగ్రామం లోనే ఆంగ్లేయులను తరిమికొట్టింది ఆమె ధీరత్వం. వీరత్వానికి మారుపేరు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆడ జన్మకు కరుణ జన్మహక్కు. నవమాసాలు మోయకపోయినా అనాధలందరికీ ఆశ్రయo. ప్రపంచ చరిత్ర లోన...

పెళ్లి

ఒకరి కోసం ఒకరు ఒకరి తలపుల్లో ఒకరు. ఒక మంత్రం పెనవేసిన బంధం. ధర్మబద్ధంగా చేసే కాపురం దాంపత్యం. దాంపత్యానికి పునాది పాణిగ్రహణం. కన్యను చేపట్టడం పాణిగ్రహణం. పరమాత్ముడే వరుడు పరమాత్మిక వధువు జరిగేది జగత్ kalyanyam. మామిడిఆకుల తోరణo పందిరికీ అందం వాయు శుద్ధి సైన్స్ చెప్పిన అంతరార్థం. ఫోటోగ్రాఫర్ ఫోకస్ లో గోరింటాకు ప్రథమం  సౌభాగ్య ప్రదమే గోరింటాకు అలంకరణం . నరదృష్టి కి నల్ల రాయి పగులు. పర దృష్టి మరల్చడం భాషికముతో అలంకారం. బుగ్గన చుక్కతో మా చుక్కకి మరింత అందం. అగరు చుక్కతో దిష్టి ఆమడ దూరం. అంకురార్పణ వివాహ ఘట్టం లో తొలిమెట్టు. కళ్యాణానికి ఇది శుభమస్తు శ్రీకారం. నవధాన్యాపు మొలకలా పచ్చగా ఉండాలని పరమార్థం. వర శుద్ది కోసం చేసేది స్నాతకం. ప్రాయశ్చిత్తమే పరమార్థం. గోత్ర ప్రవరలు వల్లించడమే అంతరార్థం. వరుడి కాశీ ప్రయాణం  బావమరిది వాగ్దానం ఆహ్వానితులకు కుఆనందం. తియ్యటి పానకం తో పరిచయాలు , పలకరింపులు ఎదురుసన్నాహం. ఆడబిడ్డ అంటే అర్ధ మొగుడు.  ఆడబిడ్డలకు ఆత్మీయ సత్కారం  పానకం బిందెలతో బిడ్డ పరమానందం. సంప్రదాయము ఇంత సుందరం.  మంగళములు కలుగజేయునది మాంగల్యం. మాంగల్య మునకు అధి...

సాగరం

సముద్రపు నీళ్లన్నీ ఉప్పుమయం గొంతు దింపాలి అంటే భయం. భూభాగంలో మూడొంతులు జలభాగం. అయినా మనిషికి తీరటం లేదు దాహం. ఉప్పు నీళ్ళు అయినా అది జలమే పంచ భూతం లో అది లెక్క లోనే పంచభూత పరమార్ధం పరోపకారార్ధం ఇదం శరీరం చేపల పులుసు అంటే లొట్టలేసుకుని తింటాం. జలధి నుంచి పుట్టిందే కదా ఆ ఆణిముత్యం. నీళ్ల మీదే కదా బెస్త వారి బతుకు పోరాటం. జలరాసులే కదా వారి కాసుల పంట. కెరటాలే కదా సాగరానికి అందం వచ్చే కెరటం పోయే కెరటం మన జీవితంలో కష్టం సుఖం తో సరి సమానం అయినాతరతరాలుగా సాగుతూనే ఉంది సాగరం. మనిషి నేర్చుకోవాలి మరింతగా ముందుకు సాగడం.  సాగరఘోష బూడిదలో పోసిన పన్నీరు. ఆర్చే వారు ఉండరు తీర్చే వారు ఉండరు. అయినా సాగరం ప్రయత్నం ఆపదు.  అదే కదా మనిషికి స్ఫూర్తి. సాగరానికి ఏమి తెలుసు తన ఘోష   ఒక స్వరకారుడి స్వరమై నంది పతకాలు అలంకరించుకుందని. ఒక కవికి మహాకావ్యమై పద్మశ్రీలను అందుకుoదని. అవార్డులు తెచ్చిపెట్టిన ఒక సినిమాకు పేరు సముద్రం. బండి నడవాలంటే ఇంధనం కావాలి. ఇంధనంతోటే మరింత ధనం దేశానికి. అగాధం నుంచి ఇంధనం మనకందరికీ వరం. మన చమురు వాయువుల సంస్థ దేశానికే గర్వకారణం. నిత్యంమన సముద్రుడికి చెయ్యాలి ...

కన్నీరు

గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖం జల జలమంటూ కళ్ళు వెంట కన్నీరు మనిషి కళ్ళవెంట చెప్పే తన భావం కన్నీళ్లు. ఆనందంతో వచ్చే కన్నీళ్లు ఆనంద భాష్పాలు. ప్రతి జీవికి కన్నీళ్లు దేవుడిచ్చిన వరం కన్నీళ్లే రాకపోతే కఠినాత్ముడు అని నామకరణం. మనసులో భావం చెప్పే గొప్ప సంకేతం. బిడ్డ కంట కన్నీరు అమ్మకే తెలుసు. పసివాడి భావం కన్నీటితోనే తెలుపు. మాట వచ్చేవరకూ అమ్మకి కన్నీటి తోనే సంకేతం ఇచ్చు. మనసులోని భావo చెప్పడానికే భాష పసివాడి భాషే కంట వెంట కారే నీరు బిడ్డకు అమ్మకి మధ్య వారధి కన్నీళ్లు. బట్ట తడిసింది ఏమో అని అమ్మ గుడ్డలకోసం వెతుకు. డొక్క చూసి బిడ్డను గుండెలకు హత్తుకొను. చుక్క గొంతు దిగగానే అమ్మను చూసి బిడ్డ నవ్వు. ఆ బొమ్మకి తెలుసున్న భాష కన్నీళ్లే కదా. మూగ జీవి కన్నీళ్లు ఆదరించే రైతుకే తెలుసు లేగదూడ అంబా అనే అరుపుతో పాలికాపు దాని కట్లు విప్పు. దూడ పొదుగు వెతుకు అమ్మ ఆత్రంగా నాలికతో నాకు. మూగజీవుల బాధ బ్లూక్రాస్ వారికే తెలుసు. ప్రియుడి వెతలు ప్రియురాలికే తెలుసు. ఎదురుచూపులన్ని కళ్ళ వెంట కన్నీరుగా కారు. ప్రతి జీవికి కన్నీళ్ల రుచి తెలుసు. ఉప్పు నీళ్లు అయితేనేం గుండె బరువు దించు. మబ్బు పట్టిన మేఘం వర్షమై కురి...

ఆసుపత్రి

ఆసుపత్రి  ఆపదలో ఆతిథ్యం ఇచ్చి ఆరోగ్యం పెంచి ఆనందం పంచి ఆదుకునే ఆరోగ్య ఆలయం. అపర ధన్వంతరి నిలయం గుడిలో ఉండేది దేవుడు అమ్మ ఒడిలోని దేవుడు పసిపాప  బడిలోని దేవుడు గురువు నడిచే దేవుడు ఉండేది ఈ ఆలయం. ఆ గుడిలోని మూల విరాట్ కు గుండె నిండా భక్తి నింపుకొని పూజా పునస్కారం. ఈ గుడిలోని దేవుళ్ళు కలకాలం కాపురం ఉండేది రోగి గుండెలో. గుండెలో చోటు ఇచ్చేది కొంతమందికే. ప్రాణానికి ప్రాణమైతే తప్ప గుండె చోటు ఇవ్వదు. నొప్పి వచ్చి నోరు తెరిచి అడిగితే సూ ది మందు ఇచ్చి సేద తీర్చి అందమైన పానుపు ఇచ్చి ఆశ్రయం ఇచ్చే ఆలయం పాన్పు మీదకి కొత్తగా చేరి అందమైన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా ఒక సంకేతం. పాన్పు వీడి పరలోకానికి ఎరిగినట్లుగా మరొక వైపు నుండి కన్నీళ్ళ ప్రవాహం. నిత్యం జనన మరణాల రణరంగం. ఇవేవీ పట్టనట్లు కర్మయోగిలా నిలబడు తుంది ఆ చికిత్సలాయం. నిత్యం ఇక్కడ కత్తులతో యుద్ధమే జయాపజయాలు ఆయుర్దాయమనే  ముసుగులో నిత్యం దోబూచులాడతాయి. అయినా ఆఖరికి నిమిషం వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అపర ధన్వంతరీ నిలయం. రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

NTR జిల్లా విహార యాత్ర

ప్రముఖ చలనచిత్ర నటుడు , దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామరావు పేరు మీదుగా ఏర్పడిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా. విజయవాడ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ జిల్లాలో ప్రధానంగా చూడవలసినవి  కొండపల్లి: ఇది ఇబ్రహీంపట్నం మండలంలో ఉంది. ఈ ఊరు బొమ్మలకు ప్రసిద్ధి. అంతేకాకుండా ఇక్కడ కొండపల్లి కోట కూడా చూడదగినది. కనకదుర్గ గుడి: ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయం మహా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం.  బాపు మ్యూజియం: ప్రముఖ చిత్రకారుడు బాపు జ్ఞాపకంగా ఈ మ్యూజియానికి ఈ పేరు పెట్టడం జరిగింది. విజయవాడలోని మహాత్మా గాంధీ రోడ్ లో ఉంది. ఇక్కడ హిందూ బౌద్ధ మతాలకు చెందిన అనేక కళాఖండాలు ఈ ప్రదర్శనశాలలో ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్: విజయవాడలోని కృష్ణా నది నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ వలన ఎన్నో లక్షల ఎకరాలకి సాగు నీరు లభిస్తోంది.  ఇంకా విజయవాడలో అనేక ప్రాంతాలు గాంధీ కొండ, భవాని ద్వీపం  ఇవన్నీ కూడా చూడదగిన ప్రదేశాలు.  అమరావతి: విజయవాడకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాతవాహనుల కాలంలో నిర్మించిన  అమరావతి స్తూపం అమరేశ్వర స్వామి ఆలయం చూడదగింది. ...

సామర్లకోట

కోట లేకపోయినా మాది సామర్లకోటే. ఆదిలో అది శ్యామలాదేవి కోట. శ్యామలాoబ గుడి లేని మా కోట సామర్ల కోట.      ఊరే పంచారామం,చాళుక్య భీమేశ్వర ఆలయం.            భక్తకోటికి అదే యాత్రావిహారం.              కార్తీకమాసం జనసందోహం.              కరోనా కాలమంతా నిశ్శబ్దం. పవిత్రతకు ప్రశాంతతకు మాండవ్య  నారాయణ ఆలయం.        ఆదిలోనే శంకరుల కొలువు     మధ్యలోని అమ్మ నూకాలమ్మ.        పక్కనే సాయి మకాం    అంత్యం అంతా ప్రసన్నాంజనేయం.         అదే మా గ్రామం భీమారామo     ఆది, అంతం అంతా భగవదత్తం. తరాలతో పాటు ఆధునికంగా మారిన రైల్వే జంక్షన్.    హౌరా చెన్నై మార్గం లో ప్రధాన జంక్షన్.        రైలు ఎదురుగా బస్సుల స్టాపు. ప్రధాన నగరాలు అన్నిటికీ బస్సు సౌకర్యం. మా కోట వాసులందరికి గమ్యం గగనం కాదు. తరతరాలుగా యువతకు ఉపాధి ఇస్తున్న   ఆయిల్ పరిశ్రమలు . అంబటి సుబ్బన్న అండ్ కో పప్ప...

మందు పొట్లం

 మందు పొట్లం మా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ఈనాటికి మమ్మల్ని నవ్విస్తూ ఉంటుంది. మాది కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని పల్లిపాలెం గ్రామం . మా చింతాతయ్య గారు మా నాన్నగారు కూడా ఆయుర్వేద వైద్యం చేసేవారు. మా ఊర్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు మిగతా సామాజిక వర్గాలు కూడా ఉండేవి. ప్రధానమైన కులం రెడ్డి కులం .  అయితే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే ఆ రోజుల్లో ఒక ముప్పై ఐదు సంవత్సరంలో వయసు ఉండే ఒక  వ్యక్తి ఏదో అనారోగ్యం కోసం ఆయుర్వేదం మందు కోసం మా తాతయ్య గారి దగ్గరికి వచ్చాడు. రోగి లక్షణాలన్నీ తెలుసుకున్న తర్వాత   ఆయుర్వేద మందుని కాగితంతో పొట్లాలు కింద కట్టి రోజుకు ఒక పొట్లం  తేనెతో వేసుకో వారం రోజుల తర్వాత మళ్లీ కనబడని చెప్పాడు తాతయ్య. నాలుగు రోజుల తర్వాత ఆ వ్యక్తి పరుగు పరుగున తాత గారి దగ్గరకు వచ్చి ఆ ఆ పొట్లం వేసుకున్నప్పటి నుంచి నాకు కడుపు నొప్పి మొదలైంది అండి అంటూ చెప్పుకొచ్చాడు. తాతయ్య  "ఆ మందుకి కడుపునొప్పి రాద య్య!  మరి నువ్వు ఆ మందు ఎలా వేసుకున్నావు? అని అడిగాడు.   ఆ పొట్లం తేనె తోటి వేసుకున్నానండి అన్నాడు. అప్పుడు అసలు పరిస్థితి ...

ఏలూరు జిల్లా యాత్ర

ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండే ఏలూరు 2022 సంవత్సరం నుంచి జిల్లాగా మార్పు  చెందింది .  కొల్లేరు సరస్సు:   ఈ జిల్లాలో చూడదగిన ప్రదేశాల్లో కొల్లేరు  సరస్సు ఒకటి. ఇది కొంత భాగం పశ్చిమగోదావరి జిల్లాలో కూడా వ్యాపించి ఉంది. ఇక్కడ రకరకాల చేపలు లభ్యమవుతాయి. అంతేకాకుండా అనేక పక్షులు విదేశాల నుండి సైతం ఇక్కడికి వలస వస్తాయి.  ద్వారకాతిరుమల: దీనినే చిన్న తిరుపతి అంటారు.  కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇక్కడ ద్వారకా కొండపై కొలువై ఉన్నారు. దీనిని చిన్న తిరుపతి అంటారు. ఇక్కడ స్వామి అత్యంత మహిమాన్వితుడు.  పట్టిసీమ: గోదావరి నది మధ్యభాగంలో ఉండే వీరభద్ర స్వామి దేవాలయం అత్యంత మనోహరంగా ఉంటుంది . మహాశివరాత్రి  ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

అరిటాకు భోజనం

అరిటాకు భోజనం . విందు భోజనానికి ముఖ్య అతిథి అరిటాకు.ఆకుపచ్చటి అరిటాకు ఆంధ్రుల భోజనానికి అది ట్రేడ్ మార్క్. ఆకాశంలోని హరివిల్లు వలె మెరిసిపోతుంది  అరిటాకులోని ఆతిథ్యం. ఆకులోని పదార్థాలు చూడగానే ఆత్మా రాముడికి రెక్కలు వస్తాయి. ఆకుపచ్చటి అరిటాకులో కుడివైపు చివర పసుపు పచ్చటి ముద్దపప్పు మెరిసిపోతూ ఉంటుంది. దాని పక్కనే చెరువులోని కలువ పువ్వుల మెరిసిపోతూ నూనెలో తేలియాడుతున్న ఆవకాయ. ఇంకా కోనసీమ భోజనం అంటే పనసపొట్టు లేకుండా ఎలా ఉంటుంది. మంచి సువాసనలు వెదజల్లుతూ ఆకులో అందంగా కుదురుగా ఉంటుంది . మాకు విందు భోజనంలో కంద బచ్చలి తప్పనిసరి అది లేకపోతే విందు ఏమిటి నా బొంద అంటుంది ఓ ఇల్లాలు.  కూరలు దాటికి ముందుకు చెయ్యి చాపితే  మచ్చు కోసం వేసిన దప్పలం ,దాని పక్కనే తెల్లగా మెరిసిపోతూ అప్పడం, బాగా వేగిపోయిన గుమ్మిడి వడియం అలా ఎడం పక్కకి ప్రయాణం సాగిస్తే పండు వెన్నెల లాంటి అన్నం, అన్నం దాటుకుని చేయి చాపితే పులిహార పక్కనే పూర్ణం బూర్లు ఇవన్నీ ఆకుని ఆక్రమించుకుని మనల్ని రెచ్చగొడుతూ ఉంటాయి .  అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆంధ్రుల అభిమాని గోంగూర పచ్చడి అడవులో  దున్నపోతులా మెరిసి...