కోరంగి మడ అడవులు
కోరంగి అభయారణ్యo.
పూర్వకాలం నుండి మానవుడు తన ఆహారం కోసం, వినోదం కోసం జంతువులను వేటాడి చంపడం అనేది ఉందని మనకు తెలుసు. పైగా అడవులలో స్వేచ్ఛగా జరిగే జంతువులకు అప్పట్లో రక్షణ లేదు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జంతువులను వేటాడి చంపే వాళ్ళు. ఈ జంతువుల వేట అనేది రకరకాలు గా ఉంటుంది.
ఆహారపు వేట, క్రీడా వేట, వాణిజ్యపు వేట. ఆహారపు వేట అంటే తెలుసు, తమ వినోదం కోసం జంతువులను చంపడం క్రీడా వేట, జంతువుల చర్మం దంతాలు మొదలు వాటిని తమ వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం వాణిజ్యపు వేట. ఇలా ఎవరు మటుకు వాళ్ళు అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే జంతువులు వేటాడుతూ పోతుంటే చాలా జంతువుల రకాలు మనకి కనుమరుగైపోయేయి.
వన్యప్రాణులను సంరక్షించాలని ఉద్దేశంతో ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 లో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం జంతువులు వేట నిషేధించబడింది. అందులో భాగంగానే అభయారణ్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.
వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యాటక ,విద్య ,పరిశోధన మొదలైనవి ఈ అభయారణ్యములు ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం.
మన దేశంలో చాలా చోట్ల అభయారణ్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో కోరంగి గ్రామంలో ఏర్పాటు చేయబడిన మడ అడవుల వన్యప్రాణుల అభయారణ్యం. ఇది ప్రకృతి ప్రేమికులకు చాలా ఇష్టమైన ప్రదేశం.
ఇక్కడ మడ అడవులు, రకరకాల వన్యప్రాణులు రకరకాల పక్షులు సంరక్షించబడుతున్నాయి.
ఈ మడ చెట్లు సముద్ర తీర ప్రాంతాల నుండి తుఫాన్ నుండి సముద్రపు అలలు నుండి రక్షించడమే కాకుండా, సముద్రపు అలల ప్రభావాన్ని తగ్గిస్తూ సునామీనుల నుండి కాపాడతాయి. జలచరాలకు ఆశ్రయమిస్తాయి. చేపల పెంపకానికి, గాలి యొక్క నాణ్యత పెంచడానికి అంటే కార్బన్డయాక్సైడ్ తగ్గించడానికి, గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి సహాయ పడతాయి.
ఈ కోరంగి అభయారణ్యానికి దగ్గర్లో రాజమండ్రి విమానాశ్రయం ఉంది. అలాగే కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు ఆటో టాక్సీ సౌకర్యాలు కలవు.
ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5:00 వరకు ఈ ప్రదేశంలో విహరించడానికి అనుమతిస్తారు. అభయారణ్యం చూడడానికి మే నుండి అక్టోబర్ నెల ఉత్తమమైన సమయం.
ఈ అభయారణ్యంలో నడవడానికి చెక్కలతో తయారు చేసిన రోడ్డు లాంటిది కలదు. లోపలికి వాహనాలు వెళ్ళవు. పడవ ప్రయాణానికి అనుమతిస్తారు. ఈ కోరంగిలోనే వసతి చేయడానిక గెస్ట్ హౌస్ సౌకర్యం కూడా ఉంది. ఇది తప్పక చూడవలసిన అభయారణ్యం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి