పోస్ట్‌లు

ఏప్రిల్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

కాలక్షేపం

కాలక్షేపం " రేపే రిటైర్మెంట్ కాగితాలు సబ్మిట్ చేయడానికి ఆఖరి రోజు.  హెడ్మాస్టర్ దగ్గర సంతకాలు తీసుకోవాలి సాయంకాలం లేటుగా వస్తాను .కంగారు పడకంటూ కాగితాలు తీసుకుని క్యారేజీ తీసుకుని స్కూల్ కి వెళ్ళిపోయారు రామశాస్త్రి మాస్టారు. రామశాస్త్రి గారిది చాలా అదృష్టవంతమైన జీవితం. విద్యార్థిగా విద్య నేర్పిన పాఠశాల ఉపాధ్యాయుడిగా జీతమిచ్చి ఇన్నాళ్ళు ఆదరించింది.  అటువంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. రామ శాస్త్రి గారు లెక్కల మాస్టారే కాకుండా అన్నింటికీ లెక్కలు వేసుకుని, ప్రణాళికలు వేసుకుని, జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాడు. సొంత ఊరుకి స్కూలు దగ్గరైన పిల్లలు చదువులు కోసం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న  నగరంలో కాపురం పెట్టి రోజు బస్సు మీద స్కూల్ కి వెళ్లి వస్తుండేవాడు. అలా ముప్పై అయిదు సంవత్సరాలు గడిచిపోయే యి. పిల్లలందరికీ సర్వీస్ లో ఉండగానే పెళ్లిళ్లు చేయాలని తాపత్రయపడి కింద మీద పడి కడుపున పుట్టిన ఆడపిల్లలందరికీ పెళ్లిళ్లు చేసేసాడు. ఆయనకు మగ సంతానం లేదు.  హమ్మయ్య ఇవాళ్ళతోటి రిటైర్మెంట్ కాగితాల పని అంతా అయిపోయింది అనుకుంటూ రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చి కుర్చీలోకూల పడ్డాడు రామ...

ప్రసాదం

ప్రసాదం. " అయ్యా నేను రేపటి నుంచి ఐదు రోజులపాటు మన రాములోరి గుడి దగ్గరే ఉంటాను అంటూ తండ్రితో చెప్పాడు  పది సంవత్సరముల వయసున్న రాముడు . "ఏరా ఎందుకు నువ్వు గుడి దగ్గర కూర్చుంటే మనకు బువ్వ ఎవరు పెడతారు అంటూ ప్రశ్నించాడు తండ్రి పిచ్చయ్య. మర్చిపోయా వా ఏమిటి? మన రాములు వారి గుడిలో ఎల్లుండి శ్రీరామనవమి కదా సీతారాముల కళ్యాణం చేస్తారుగా. ఆ రోజు నుంచి ఐదు రోజులు పాటు రోజు ఊరందరికీ సంతర్పణ చేస్తారు కదా. ప్రతి ఏటా చేస్తారుగా. మర్చిపోయావా ఏమిటి అంటూ చెప్పుకొచ్చాడు రాము. మరి ఆ సందర్భంగా మనకి ఆకు వేసి భోజనం పెడతారా ఏమిటి? అంటూ సందేహం వెలిబుచ్చాడు పిచ్చయ్య. అవును నాన్న ఇక్కడ కులమత భేదం లేకుండా వచ్చిన వాడిని తిరిగి పొమ్మనకుండా అందరికీ చక్కగా భోజనాలు పెడతారు. ప్రతి ఏట జరుగుతోంది కదా. అయినా నువ్వు ఎప్పుడూ చూడలేదా అంటూ నేనే నీకు భోజనం అడిగి తెచ్చి పెడతాను ప్రతి ఏడాదిలాగే అంటూ తుర్రుమని వీధిలోకి పారిపోయాడు రాము.  రాము పిచ్చయ్యకి ఒక్కగానొక్క కొడుకు. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం రిక్షా లాగి పక్షవాతం వచ్చి ఈ మధ్యనే మంచం మీద పడ్డాడు పిచ్చయ్య. రాముని చదివించే స్తోమత లేదు. ఆ వయసులో కూలి పని చేయలేడు రామ...

శ్రీరామ పట్టాభిషేకం

శ్రీరామ పట్టాభిషేకం. అసుర సంహారం చేయడానికి దేవతల కోరిక మేరకు శ్రీమహావిష్ణువు దశరధ మహారాజుకు కొడుకుగా పుట్టి సకల శాస్త్రాలు విద్యలు నేర్చుకుని విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ చేసి జనక మహారాజు కొలువులో శివధనుర్భంగం చేసి సీతాదేవిని భార్యగా చేపట్టి అయోధ్య నగరానికి పట్టాభిషిక్తుడయ్యే సమయంలో పినతల్లి కోరిక మేరకు తండ్రి ఆజ్ఞ మేరకు నార చీరలు ధరించి అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు. అరణ్యంలో ఉండగా మాయావి రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొని వెళ్ళిపోతాడు. వానర వీరుడు సుగ్రీవుడు సైన్యం సహాయంతో సముద్రాన్ని దాటి లంక నగరాన్ని చేరుకుని రావణ సేనతోయుద్ధం చేస్తూ అనేకమంది రాక్షసులను సంహరిస్తాడు. చివరిగా రావణాసురుడు తోటి తలపడతాడు. ఇలా భీకరంగా జరిగిన రామ రావణ యుద్ధంలో దశకంఠుడు శ్రీరామచంద్రమూర్తి చేతులో ప్రాణాలు కోల్పోతాడు. సమస్త దేవతలు ఆనంద ఉత్సాహాలతో పుష్ప వర్షం కురిపించారు. రామచంద్ర మూర్తికి అభినందనలు ఆశీస్సులు అందజేశారు విభీషణుడిని లంకా రాజ్యానికి అధిపతిగా చేసి రామచంద్రుడు అయోధ్య నగరానికి బయలుదేరుతానని తగిన ఏర్పాట్లు చేయమని కోరుతాడు .   కాలినడకన అయోధ్యకు బయలుదేరడం చాలా శ్రమతో కూడుకున్న పని ...

ఇంతే కదా జీవితం

ఇంతే కదా జీవితం. " పరంధామయ్య గారు రాత్రి కాలం చేశారట పొద్దున్నే పనిమనిషి చెప్పింది అంటూ భార్య శాంతి చెప్పిన మాటకి కాసేపు నోటి వెంట మాట రాకుండా ఉండిపోయాడు రాజారావు. రాజారావు గారికి పరంధామయ్య గారు గురువుగారు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉన్నా రోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి పరంధామయ్య గారి దగ్గర కాసేపు గడిపి వచ్చేవాడు రాజారావు. అయ్యో పాపం అలాగా నిన్న సాయంకాలం కూడా బాగానే ఉన్నాడే నాతో ఎప్పటివో విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు అంటూ కాసేపు బాధపడి ఇప్పుడే చూసి వస్తానంటూ బయలుదేరాడు రాజారావు.  రాజారావు పరంధామయ్య ఇంటికి వెళ్లేటప్పటికి ఇంటి నిండా బంధువులు స్నేహితులు పరంధామయ్య గారి ఎనిమిది మంది పిల్లలు అల్లుళ్లు మనవలుతో ఇల్లు నిండిపోయి ఉంది. రాజారావు గారిని చూడగానే పరంధామయ్య గారి పెద్దబ్బాయి కళ్ళు తుడుచుకుంటూ ఎదురు వచ్చాడు. చూడండి నాన్నగారు మమ్మల్ని అందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయారు అంటూ గట్టిగా ఏడుస్తూ వచ్చాడు. మిగతా పిల్లలందరూ ఆయనని అనుసరించారు. మా నాన్న మమ్మల్ని అందరినీ చాలా కష్టపడి పెంచారు. ఎప్పుడూ సైకిల్ తొక్కుకుంటూ ఉద్యోగం చేసి వచ్చేవారు గానీ రిక్షా కూడా ఎప్పుడు ఎక్కలేదు. ఇంత పెద్ద ఇల్లు ఇం...