పోస్ట్‌లు

వీలునామా

వీలునామా  " నాన్న ఇంకా నాలుగు ముద్దలే ఉన్నాయి ఇది మీ తాత ముద్ద అంటూ కంచంలోని పెరుగన్నం ముద్ద ని రాఘవయ్య గారి  నోటికి అందించాడు రాజేష్. అన్నం ఇంక తిననని తల అటు ఇటు తిప్పేస్తూ పక్కకు తిరిగి పడుకున్నాడు రాఘవయ్య గారు. ఇదిగో ఇది మీ నాన్న ముద్ద ఇది తినకపోతే మీ నాన్నకు కోపం వస్తుంది ఇది కూడా తినంటూ బలవంతంగా రాఘవయ్య గారినోట్లో పెట్టాడు. రాఘవయ్య గారు కోపంగా కొడుకు రాజేష్వై  పు చూశాడు . నువ్వు రాత్రి ఏమి తినడం లేదు నీకు ఆకలేస్తుందో లేదో నాకు తెలియదు నీరసం వస్తుందని నాకు భయం.   మరి అమ్మంటే నీకు ఇష్టం కదా ఇది అమ్మ ముద్ద  చూడు మిఠాయి నంచి పెడతాను తిను అంటూ పక్కనే  డబ్బాలో ఉన్న మిఠాయి అన్నoముద్దతో కలిపి పెట్టాడు. రాఘవయ్య గారు గబగబా నోరు తెరిచి ఆ ముద్ద తినేసారు.  రాఘవయ్య గారికి స్వీట్ అంటే ఇష్టం. భార్య అంటే  అమితమైన ప్రేమ. మావయ్య గారికి స్వీట్ పెట్టకండి షుగర్ పెరిగిపోతుంది అంటూ వంటింట్లోంచి భార్య శాంత గట్టిగా కేకేసింది. షుగర్ తగ్గించడమే కదా రోజు నా పని దాని సంగతి  నేను చూసుకుంటాలే అంటూ డాక్టర్ రాజేషు భార్యకు సమాధానం చెప్పి రాఘవయ్య గారి మూతి తుడ...

రిటైర్మెంట్ జీవితం

రిటైర్మెంట్ జీవితం. ఇటువంటివి బయటికి తెలిసిస్తే నలుగురిలోను తలెత్తుకొని తిరగలేము ఆడపిల్లలు కలవాళ్ళం. ఈ వయసులో ఆ బుద్ధులు ఏంటి ?అంటూ డైనింగ్ టేబుల్ వరకు వచ్చిన అత్తగారు వైపు తిరిగి పెద్ద కోడలు శాంత గట్టిగా అరుస్తోంది. నానమ్మ నువ్వేనా చెప్పు ఇది తప్ప కాదా !పెద్దవాళ్ళు పుస్తకం చదువుకో వాలి లేదంటే టీవీ చూడాలి. ఆస్తమాను ఆ మొబైల్ లో చాటింగ్ ఏమిటి నేను చూసాను కాబట్టి సరిపోయింది. నాన్న చూస్తే ఇంకా ఏమైనా ఉందా ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది అంటూ పెద్ద మనవడు రఘు అచ్యుత రామయ్య గారి భార్య కామేశ్వరమ్మ గారితో చెపుతున్నాడు. నన్ను స్కూల్లో ఏడిపిస్తారు నానమ్మ అందరూ వేలెత్తి చూపిస్తారు తాతయ్య చేస్తున్న పనికి ఇప్పుడు మనవరాలు రమ్య ఒకటే గోల ఏమైందిరా అందరూ ఒకటే అలా గొడవ పెడుతున్నారు విషయం తెలియకుండా నా మీద అరిస్తే ఏమిటి ఉపయోగం. విషయం చెప్పండి నేను పరిష్కారం ఆలోచిస్తాను అంటూ చెప్తున్న కామేశ్వరమ్మ గారి మాటలు విని మనవడు రఘు అచ్యుతరామయ్యగారి రూమ్ లో నుంచి మొబైల్ ఫోన్ పట్టుకుని వచ్చి వాట్సప్ ఓపెన్ చేసి వాట్సప్ సందేశాలు చదవడం ప్రారంభించాడు. గుడ్ మార్నింగ్ తో ప్రారంభ మయ్యాయి సందేశాలు. ఇలాగా ఉదయం ప్రారంభమైన సందే...

పశ్చిమగోదావరి జిల్లా విహారయాత్ర

పశ్చిమగోదావరి జిల్లా విహారయాత్ర  ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాకు ప్రధాని కేంద్రం భీమవరం. ఈ జిల్లాకు తూర్పున కోనసీమ, పడమరన ఏలూరు జిల్లా, కృష్ణాజిల్లా దక్షిణ దిక్కులో బంగాళాఖాతం, ఉత్తరాన ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి.  కొల్లేరు సరస్సు. : ఈ జిల్లాలో ప్రధానంగా చూడవలసిన వాటిలో కొల్లేరు సరస్సు ఒకటి. ఎన్నో రకాల చేపలు ఇక్కడ లభ్యమవుతాయి . రకరకాల పక్షులు విదేశాల నుండి సైతం విచిత్రంగా ఇక్కడికి వలసకు వస్తాయి. చూడడానికి ఆనందకరంగా ఉంటుంది.  పాలకొల్లు: క్షీరా రామలింగేశ్వర స్వామి గుడి. పంచారామ క్షేత్రంలో ఒకటి.  భీమవరం: మావుళ్ళమ్మ దేవస్థానం. అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు. ఈ ఊర్లో సంక్రాంతికి పండుగకు జరిగే కోడిపందాలు చూడ్డానికి చాలామంది వస్తుంటారు. అలాగే సోమేశ్వర జనార్ధన స్వామి గుడి కూడా పంచారామ క్షేత్రంలో ఒకటి  పెనుగొండ: వాసవి కన్యక  పరమేశ్వరి గుడి చూడదగిన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ ఉండే గాలిగోపురo ఏడంతస్తులు ఉంటుంది.  పేరుపాలెం బీచ్: పశ్చిమగోదావరి జిల్లాలో ఉండే నరసాపురం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరుపాలెం  సముద్ర తీర ప్రాంతం విహారయాత్రకు అన...