పోస్ట్‌లు

ఆఖరి మాట

ఆఖరి మాట  ప్రపంచంలో ఏ ప్రాణికోటికి లేని అత్యంత అమూల్యమైన వరం మానవ జన్మకి దేవుడిచ్చాడు. తన మనసులోని భావాన్ని ఇతరులకు తెలియజేయడానికి అవకాశం కల్పించాడు. దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా పంచుకోవడానికి మాట అనే ఆయుధాన్ని ఇచ్చాడు.  మానవ శరీరంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నోరు అనే అవయవం ద్వారా వచ్చే మాటకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మాట ఇద్దరు మనుషుల మనసులను కలుపుతుంది. అలాగే బంధాలను విడదీస్తుంది. రోజు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. అన్నిటికీ వెనుక బలమైన ఆధారం ఉంటే అది నిజం అంటారు. కాకపోతే అబద్ధమే కదా మరి. మనిషి శాశ్వతం కాదు కానీ మాట మటుకు ఎప్పటికీ గుర్తుంటుంది. రోజు అనేక మందితో అనేక మాటలు మాట్లాడుతుంటాము. అది ఆ వ్యక్తితో అదే ఆఖరి మాటని మనకు తెలీదు. ఆఖరి మాట అనేది ఎప్పుడవుతుంది. ఆ వ్యక్తి ఈ లోకo నుండి శాశ్వతంగా వెళ్ళిపోయినప్పుడు వారితో ఆఖరిసారిగా మాట్లాడినదే ఆఖరి మాటవుతుంది. కానీ మనకు అది తెలియదు. చుట్టూ ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. కానీ ఒక వ్యక్తి తోటే తన మనసులోని భావాన్ని పంచుకోవడం ఆ సమయంలో ఆ వ్యక్తి మీద ప్రత్యేక అభిమానమే అని చెప్పొచ్చు. అప్పుడే ఏడు సంవత్సరాలు పూర్తయింది. కానీ ఆ వ్యక్తి ఆఖరి ...

అలసిన అరుగులు

పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అరుగులు ఉండేవి ఈ ఆధునిక యుగంలో అరుగులు కనుమరుగైపోయాయి కానీ మా తరం వారికి అవి మాత్రం హంస తూలికా తల్పాలు.   తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం లో గల మా నాన్న గారి ఇంట్లో మెట్లుకి ఇరుపక్కల ద్వారపాలకులులా రెండు అరుగులు దానిని ఆనుకుని ఒక మెట్టు ఎత్తులో ఎర్ర గచ్చు తో చేసిన వసారా ఉంది. సుమారు 70సంవత్సరాల క్రితం మా నాన్నగారు శ్రీ మధునాపంతుల వెంకట చలపతి రావు గారి చేత నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం. చారిత్రాత్మక కట్టడం అని ఎందుకు అంటున్నాను అంటే ఎంతో మంది ఈ అరుగుమీద పుట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉన్నత స్థాయికి తమ తమ రంగాల్లో చేరుకోవడం జరిగి . తొలి రోజుల్లో మా ఇంటి మెట్లకిఎడమ పక్కన ఉండే గదిలో దాన్ని కొట్టు గది అంటాం పంచాయతీ బోర్డు వారి ఆఫీస్ ఉండేది. మా పిన తాతగారు శ్రీ మధునాపంతుల కామ రాజు గారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా పని చేసేవారు. నిత్యం ఎంతో మంది ప్రజలు పంచాయతీ బోర్డు ఆఫీస్ కి వచ్చి అరుగు మీద కూర్చునే వారు . ఎప్పుడు రెండు అరుగులమీద తాటాకులతో చేసిన చాపలు ఉండేవి. మా తాతగారు కి సంఘ సేవ మీద ఎక్కువ మక్కువ ఉండడం మూలంగా ప్రజల సమస్యల్ని అ...

ఊరి ముచ్చట్లు

ఊరి ముచ్చట్లు  సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత పిల్లలందరూ రాబోయే వేసవికాలం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతి పండక్కైతే పది రోజులు సెలవులు కానీ వేసవికాలం వచ్చిందంటే ఇంకేముంది రెండు మూడు నెలల పాటు పిల్లలకి ఆటవిడుపే. పెద్ద పరీక్షలు అయిపోతే అమ్మమ్మ గారి ఊరికి పరుగులు తీస్తుంటారు.  అసలు రుతువు మారుతోందని మనకి ఎలా తెలుస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులే మనకి రుతువు మారిపోతోందని తెలుస్తుంది.  మహాకవి పోతన గారు భాగవత గ్రంథంలో గ్రీష్మ రుతువు గురించి చెబుతూ పగటి సమయాలు అంతకంతకు పెరుగుతున్నాయని సూర్యుడు ఉత్తర దిక్కు వైపుకు సంచరిస్తున్నాడని ఎండ తీక్షణ రోజురోజుకీ పెరుగుతుందని భూమి నుండి లేచిన దుమ్ము రేణువులు ఆకాశమంతటా వ్యాపించి ఉన్నాయని సెలయేళ్లు కొలనులు ఎండిపోయాయి బాటసారులు చలివేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారని పాములు ఎండలు భరించలేక పొదల్లో చేరిపోతున్నాయని చెట్లు పూలు వాడిపోయాయని అగ్నిదేవుడు అడవులతో ఆడుకుంటున్నాడని అద్భుతమైన వర్ణన చేశారు. అలాంటి వాతావరణంలోని మార్పులతో ఆ ఊరికి అంటే మా స్వగ్రామం కాకినాడ తాలూకా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామoలో కూడా వేసవికాలం అడుగుపెట్టేసింది....