పోస్ట్‌లు

మా ఊరి జ్ఞాపకం

చూడ్డానికి క్రికెట్ వీరుడులా, పొట్టిగా గవాస్కర్ లా ఉండేవాడు మా వెంకన్న. ఆ గవాస్కరు ఎప్పుడు చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే, ఈయన నోట్లో పొగాకు చుట్ట — చేతిలో ఎప్పుడు పదమూడు ముక్కల పేక పట్టుకుని ఉండేవాడు. లుంగీ, పంచ కట్టుకుని, దానిమీద చొక్కా తొడుక్కుని, నోట్లో చుట్ట పెట్టుకుని ఉదయమే లేచి సైకిల్ ఎక్కాడంటే — ఏ అరుగుదగ్గర ఆగుతాడో ఎవరికీ తెలిసేది కాదు. అరుగు దగ్గర ఆగాడంటే భాగవతం, భారతం, రామాయణం వినడానికి కాదు. ఈయన పారాయణం వేరే ఉంది. అదే చతుర్ముఖ పారాయణం. --- అందరూ సంక్రాంతి పండుగకి, పెళ్లిళ్లకి, వేసవికాలం సెలవులకి పేకాట ఆడడం మామూలే ఆ ఊర్లో. కానీ మన వెంకన్న 365 రోజులు అదే ప్రవృత్తి. వృత్తి వ్యవసాయం అంటాడు. ఎప్పుడు పొలం గట్టు ఎక్కిన పాపాన పోలేదు. తలపాగా చుట్టిన సందర్భం చూడలేదు. “ఏవండీ వెంకన్న గారు ఉన్నారా ఇంట్లో?” అంటూ మూడు వందల అరవై ఐదు రోజులలో ఎప్పుడు ఎవరు అడిగినా — “లేదండి, పేకాటలో ఉన్నారండి” అని ఇంట్లోంచి అదే సమాధానం. అదేదో పెద్ద ఉద్యోగం లాగా చెప్పేవారు. చివరికి ఏ వీధిలో ఉన్నాడు, ఎవరు అరుగు మీద ఉన్నాడు వెతుక్కుని ఆ వచ్చిన పెద్దమనిషి తన పని పూర్తి చేసుకునేవాడు. ఆ ఊర్లో నాలుగైదు అరుగులు ప్...

సాయి

సాయి ఈ సృష్టి అంతా పరమేశ్వర ప్రసాదమే. అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనది మానవజన్మ. ఎందుకంటే అన్ని జీవులకీ ఇంద్రియాలు ఉంటాయి. కానీ మానవుడు మాత్రమే మాట్లాడగలడు. మాట మనిషికి దేవుడిచ్చిన వరం. నోరు ఆత్మీయంగా పలకరిస్తుంది; అవాకులు చవాకులు పలికిస్తుంది. అలాగే ఇంద్రియములన్నీ కూడా సక్రమంగా నడిస్తే ఏ బాధ ఉండదు. దారి తప్పితే మనిషి అధోగతిపాలవుతాడు. మనిషి తన నడవడికలో ఏది మంచి, ఏది చెడు తెలియజెప్పడానికి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు తోడ్పడతాయి. అలాగే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి భగవంతుడు అనేక అవతారాలు ఎత్తుతూ ప్రజలను రక్షిస్తూ వచ్చాడు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వంటి ఆధ్యాత్మిక గురువులు తమ బోధనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారు. మదర్ తెరిసా వంటి కరుణామూర్తి పేదలకు సేవ చేస్తూ ఆదర్శవంతంగా నిలిచారు. అలాగే హిందూ, ముస్లిం మతాలను రెండింటిని సమన్వయపరుస్తూ “అందరికీ ప్రభువు ఒక్కడే” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ భగవంతునిపై విశ్వాసం ఉంచాలని, శ్రద్ధతో ఏ పనైనా పూర్తి చేయాలని బోధించి ప్రజల చేత ఆరాధించబడుతున్న మహాయోగి, కరుణామూర్తి — షిరిడి సాయి బాబా వారు. --- శ్రద్ధ, సబూరి అనేవి ఆయన బోధనలో ముఖ్యమై...

ప్రసాదం

"అయ్యా, నేను రేపటి నుంచి ఐదు రోజులపాటు మన రాములోరి గుడి దగ్గరే ఉంటాను" అంటూ తండ్రితో చెప్పాడు పది సంవత్సరముల వయసున్న రాముడు. "ఏరా! ఎందుకు? నువ్వు గుడి దగ్గర కూర్చుంటే మనకు బువ్వ ఎవరు పెడతారు?" అంటూ ప్రశ్నించాడు తండ్రి పిచ్చయ్య. "మర్చిపోయావా ఏమిటి నాన్నా? మన రాములు వారి గుడిలో ఎల్లుండి శ్రీరామనవమి కదా! సీతారాముల కళ్యాణం చేస్తారుగా. ఆ రోజు నుంచి ఐదు రోజులు పాటు ఊరందరికీ సంతర్పణ చేస్తారు కదా. ప్రతి ఏటా చేస్తారుగా. మర్చిపోయావా ఏమిటి?" అంటూ చెప్పుకొచ్చాడు రాము. "మరి ఆ సందర్భంగా మనకి ఆకు వేసి భోజనం పెడతారా ఏమిటి?" అంటూ సందేహం వెలిబుచ్చాడు పిచ్చయ్య. "అవును నాన్న! ఇక్కడ కులమతభేదం లేకుండా వచ్చిన వాడిని తిరిగి పొమ్మనకుండా అందరికీ చక్కగా భోజనాలు పెడతారు. ప్రతి ఏట జరుగుతోంది కదా. అయినా నువ్వు ఎప్పుడూ చూడలేదా? నేనే నీకు భోజనం అడిగి తెచ్చి పెడతాను ప్రతి ఏడాదిలాగే," అంటూ తుర్రుమని వీధిలోకి పారిపోయాడు రాము. --- రాము పిచ్చయ్యకి ఒక్కగానొక్క కొడుకు. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం రిక్షా లాగి, పక్షవాతం వచ్చి ఈ మధ్యనే మంచం మీద పడ్డాడు పిచ్చయ్య. రాముని చదివించే స్తో...