పోస్ట్‌లు

రాజమహేంద్రవరం_ గోదావరి తీరాన శ్వాసించే చరిత్ర

గోదావరి తీరాన విరాజిల్లే రాజమహేంద్రవరం ఒక పట్టణం కాదు, అది పౌరాణిక ప్రాణం. ఎన్నిసార్లు పేర్లు మారినా, చరిత్ర తన మూలాలను చెరపనీయలేదు. రాజరాజ నరేంద్రుని రాజధాని అన్న గౌరవం ఈ నేలకే లభించింది. ప్రతీ వీధి వెనుక ఒక వ్యక్తిత్వం, ప్రతీ చెరువు వెనుక ఒక జ్ఞాపకం, ప్రతీ గుట్ట వెనుక ఒక పురాణం నిద్రిస్తున్నాయి. ఆంధ్ర మహాభారతo పుట్టిన ప్రదేశం.. ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి నడయాడిన ప్రదేశం . ఎంతోమంది దేశభక్తులు కళాకారులు పండితులు నివసించిన పుణ్యభూమిది. ఈ నగరం కేవలం ఇటుకలతో కట్టబడిన వీధుల సమాహారం కాదు. ఇది కవుల కలల సౌధం, సంఘసంస్కర్తల పోరాటాల వేదిక, కళాకారుల ప్రేరణ స్థలం.   ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రయాణికులను ఇక్కడ నుంచి వారి గమ్యస్థానాలకు చేర్చే బస్సులు ఆగే స్థలం . అది ఒక పుణ్యక్షేత్రం పేరు పెట్టుకుంది. అదేనండి కోటిపల్లి బస్టాండ్. కానీ దాని వెనక చరిత్ర ఎంతో ఉంది . బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ ఈ ప్రదేశంలో పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చారట.   బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ ప్రాంతం వారికి స్థావరంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లిపోయ...

శమంతక మణి

 శమంతక మణి  పూర్వకాలంలో సత్రాజిత్తు , ప్రసేనుడు అనే ఇద్దరు యదు వంశ రాజులు ఉండేవారు. సత్త్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు . అయితే ఈ సత్రాజిత్తు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు భక్తుడు. ఈ సూర్య భగవానుడు ఎల్లప్పుడూ మెడలో శమంతకమణిని ధరించి ఉండేవాడు. ఈ శమంతకమణి కెంపు రంగులో ఉండేది. ఈ శమంతకమణి ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా ఉంటుందట. అయితే ఈ సూర్య భగవానుడు సత్రాజిత్తు కోరిక మేరకు తన మెడలోని శమంతకమణిని ఇచ్చి వేస్తాడు.  ఆ మణిని ధరించి సత్రాజిత్తు ద్వారకా నగరానికి వస్తుంటాడు. అలా వస్తున్న సత్రాజిత్తుని చూసి సూర్యుడు వస్తున్నాడని భ్రమించి ద్వారకవాసులు పరమాత్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి విషయం విన్నవిస్తారు. అది విన్న శ్రీకృష్ణ పరమాత్మ దివ్యదృష్టితో చూసి వస్తున్నవాడు పంచముఖ బ్రహ్మ కానీ, సూర్యదేవుడు కాదని చెబుతాడు.  ఆ తర్వాత సత్రాజిత్తు బ్రాహ్మణుల వేదమంత్రాలు చదువుతుండగా ఆ శమంతకమణిని తన పూజ మందిరంలో ఉంచుతాడు. అది సామాన్యమైన వస్తువు కాదు. ఒక రోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ శమంతకమణిని యాదవుల రాజైన ఉగ్రసేన మహారాజ...

పుట్టిన ఊరు _ మధురస్మృతులు

పుట్టిన ఊరు అంటే అందరికీ ఇష్టమే. ఏ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, బాల్యంలో మధురమైన అనుభూతులు మిగిల్చిన ఆ గ్రామం మాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం. గ్రామం గురించి చెప్పుకోవాలంటే చుట్టూ అందమైన పొలాలు, మామిడి తోటలు, పిల్ల కాలువలు, పెద్ద కాలువలు. ఊరి మొదట్లో అమ్మవారి గుడి, అగ్రహారంలో వ్యాసేశ్వర స్వామి గుడి, గోపాల స్వామి గుడి. ఊరి లోపలికి వెళ్తే రామాలయాలు—ఇవన్నీ చల్లగా దర్శించగలిగే దేవాలయాలు. మా పల్లిపాలెం గ్రామంలో ఒక పంచాయతీ కార్యాలయం, అప్పర్ ప్రైమరీ స్కూలు, కచేరి సావిడి ఇవి ముఖ్యమైన ప్రదేశాలు. కొన్నిచోట్ల కంకర రోడ్లు, మరికొన్ని చోట్ల అవి కూడా లేవు. వర్షాకాలం వస్తే పరిస్థితి చెప్పక్కర్లేదు. చిన్ననాటి వినోదం అప్పట్లో రేడియో ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్. అది కొద్దిమంది ఇళ్లల్లో మాత్రమే ఉండేది. మరి మిగిలిన వాళ్లు రెండు కిలోమీటర్లు నడిచి టూరింగ్ టాకీస్‌కి వెళ్లి సినిమా చూసి ముచ్చట తీర్చుకునేవారు. అలాంటి ఊర్లో ఏడాదికోసారి జరిగే తొమ్మిది రోజుల గణపతి నవరాత్రి ఉత్సవాలు మాత్రం అందరికీ పెద్ద వినోదం. రెండు రోజులు ముందుగా పెద్ద పందిరి కట్టి, గ్రామఫోన్ రికార్డులు, మైక్ సెట్ పెట్టేవారు తొలిరోజు సాయంకాలం ఘంటసాల గారి “నమో ...