పోస్ట్‌లు

ఆ అరుగు _ ఆత్మీయ నిలయం

పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అరుగులు ఉండేవి. ఈ ఆధునిక యుగంలో అరుగులు కనుమరుగైపోయాయి. కానీ మా తరం వారికి అవి మాత్రం హంసతూలికా తల్పాలు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెంలో గల మా నాన్నగారి ఇంట్లో మెట్లుకి ఇరుపక్కల ద్వారపాలకులులా రెండు అరుగులు ఉండేవి. దానిని ఆనుకుని ఒక మెట్టు ఎత్తులో ఎర్రగచ్చుతో చేసిన వసార ఉంది. సుమారు 70 సంవత్సరాల క్రితం మా నాన్నగారు శ్రీ మధునాపంతుల వెంకట చలపతిరావుగారి చేత నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం అది. చారిత్రాత్మక కట్టడం అని ఎందుకు అంటున్నానంటే—ఎంతో మంది ఈ అరుగుమీద పుట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టి తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. మొదటి రోజుల్లో మా ఇంటి మెట్లకిఎడమ పక్కన ఉండే గదిలో (దాన్ని కొట్టు గది అంటాం) పంచాయతీ బోర్డు వారి ఆఫీస్ ఉండేది. మా పినతాతగారు శ్రీ మధునాపంతుల కామరాజుగారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్‌గా పని చేసేవారు. నిత్యం ఎంతో మంది ప్రజలు ఆ ఆఫీస్‌కి వచ్చి అరుగు మీద కూర్చునేవారు. ఎప్పుడూ రెండు అరుగులమీద తాటాకులతో చేసిన చాపలు ఉండేవి. మా తాతగారికి సంఘసేవ మీద ఎక్కువ మక్కువ ఉండేది. ప్రజల సమస్యలను అలవోకగా తీర్చేవారు. అందుచేత ఆయన హయాంలో ...

కెమెరా వెలుగులో పెళ్లి

మగ పెళ్లి వారి కారులు అందమైన అలంకరణతో కళ్యాణమండపం ముందు ఆగాయి. ముందు సీట్లో కూర్చున్న పెళ్ళికొడుకు, వెనకాల సీట్లో తల్లి తండ్రి, ఇలా మిగతా కార్లలో మిగిలిన పెళ్లి వారు దిగారు. ఆడపిల్ల వారు స్వాగతం పలకడానికి మేళతాళాలతో ముందుకు కదలి వచ్చారు. అందరికంటే ముందుగా నలుగురు వీడియో వాళ్ళు, కెమెరా వాళ్ళు అక్కడికి చేరుకుని పెళ్ళికొడుకు దగ్గరికి పరిగెత్తారు. "సార్ రవి గారు కార్ డోర్ పట్టుకుని ఫోజు ఇవ్వండి" అంటూ పెళ్లి కూతురు తండ్రి రవికి సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. డోర్ పట్టుకుని ఒకటి, పెళ్ళికొడుకు చేతులు పట్టుకుని ఒకటి – రెండు స్నాప్స్ అయిపోయాయి. ఇంక కాళ్లు కడిగే కార్యక్రమం. సూటు బూటు వేసుకున్న పెళ్ళికొడుకు బూటు విప్పకుండా, కాలికి వేసుకున్న బూట్లను తడిచేత్తోటి తుడిపించారు పెళ్లికూతురు తండ్రి చేత. "రవి గారు ఆ బూట్ల మీద చేయి వేయండి" – ఒక కెమెరా క్లిక్ మంది. "రెడీ వన్ టూ త్రీ... రవి గారు దండ పట్టుకుని ఇలా చూడండి. పెళ్ళికొడుకు గారు మీరు క్రాస్ గా నిలబడండి" అంటూ సూచనలిస్తూ హడావుడిగా ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి వీడియో-ఫోటో వాళ్ళు పరిగెత్తుతున్నారు. అసలే ...

సతులాల చూడరే

 సతులారా చూడరే   సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమిl   సకలాయ నడిరేయ కలిగే శ్రీకృష్ణుడు  అంటూ అన్నమయ్య తన కీర్తనల్లో శ్రీకృష్ణుడి పుట్టుక గురించి స్తుతించారు. శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి పరమాత్మ జన్మించాడు. అదే మనకి శ్రీ కృష్ణాష్టమి. చెరసాలలో దేవకి వసుదేవుల కుమారుడుగా జన్మించి రేపల్లెలో నందుని ఇంటిలో యశోదమ్మ ఒడిలో పెరిగి నంద కుమారుడుగా చలామణి అయ్యాడు ఈ కీర్తనలో పసిపాపగా ఉన్న పరమాత్ముడు ఏ రకంగా ఉన్నాడో మనకి కళ్ళకు కట్టినట్టు చెబుతాడు అన్నమయ్య. సాధారణంగా పసిపిల్లలు పుట్టినప్పుడు కళ్ళు మూసుకుని గుప్పెట్లు మూసుకుని నిద్రలో గడుపుతారు. అయితే ఇక్కడ పుట్టింది సాక్షాత్తు పరమాత్మ.  ఆయన చతుర్భుజాలు శంకు చక్రాలు ఒంటినిండా సకల ఆభరణాలు ,తల మీద కిరీటం ధరించి పుట్టాడుట మహానుభావుడు. వాగ్గేయ కారులంతా కారణజన్ములు. లేదంటే పసిపాపడగా ఉన్న పరమాత్మ ని ఇలా వర్ణించడం సాధ్యం కాదు. ఆదిశేషుడు అవతారమైన బలరాముడు రోహిణి దేవి కడుపున పుట్టిన తర్వాత బ్రహ్మదేవుడు శివుడు నారదుడి లాంటి మునులు దేవతలు దేవకీదేవి బంధించబడిన కారాగారం వద్దకు వచ్చి పరమాత్మా!దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అనేక అవతా...