దేవుడు వేసిన శిక్ష
దేవుడు వేసిన శిక్ష. ఉదయం 5:30 గంటలయింది. శీతాకాలం కావడంతో జన సంచారం పెద్దగా లేదు.ఎప్పుడు డ్యూటీ కరెక్ట్ గా చేసే బాలభానుడు ప్రపంచానికి వెలుగు చూపి ఆ గోదావరి నదిలో తన అందం చూసుకుంటున్నాడు. ఏరా రాజు బారెడు పొద్దెక్కింది ఇంకా మంచం మీద నుంచి లేవలేదా గోదావరిలోకి వెళ్ళవా అంటూ తల్లి కసిరిన కేకతో మంచం మీద నుంచి బద్దకంగా లేచి దుప్పటి మడతపెట్టి గూట్లో ఉన్న వేప పుల్ల తీసుకుని నోట్లో పెట్టుకుని గోదావరి ఒడ్డుకి పరిగెత్తాడు. ఏదిక్కు లేకపోతే గోదావరే దిక్కు అంటారు కదా. అలాగే అభాగ్యులందరికీ గోదావరి తీరం కడుపు నింపుతుంది అలా రాజుకి బ్రతకడానికి ఆ గోదావరి ఆధారం. ఆ గోదావరి తీరంలోని చిన్నపాక లో వారి కాపురం. నిండా పదేళ్లు కూడా ఉండవు. కుటుంబానికి ఆధారం వాడే. ఆ చిన్న వయసులో ఏం పని చేయగలడు అనే ఆలోచన అందరికీ వస్తుంది. ఇంతకీ గోదావరి రాజు కడుపుఎలా నింపుతోంది. రాజమహేంద్రవరానికి ప్రత్యేక ఆకర్షణ ఈ గోదావరి. ఆ గోదావరి నది మీద నిర్మించిన వారధి మీద రోజు ఎన్నో రైళ్లు అటు ఇటు తిరుగుతుంటాయి. విజయవాడ వైపు వెళ్లే రైళ్లు విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లు తప్పనిసరిగా ఈ వారధి దాటే వెళ్లాలి. అందుకే ఈ బ్రిడ్జి...