పోస్ట్‌లు

మారిన పల్లె

మారిన పల్లె   పల్లెటూరు అనగానే చుట్టూ పచ్చని పొలాలు ,పిల్ల కాలువలు పెద్ద కాలువలు ,కాలువగట్లు ,కొబ్బరి తోటలు, అరటి తోటలు మామిడి తోటలు ,చల్లటి పైరగాలి,పెద్ద పెద్ద పెంకుటి ళ్లు ఇలా బాపూగారి బొమ్మలా ఉంటాయి .సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. మనుషుల మధ్య బంధాలు అనుబంధాలు కృత్రిమత్వం ఎక్కడ ఉండదు. సాయం అంటే ఒక అడుగు ముందు సహాయం అంటే అందరికంటే ముందు ఉండే జనంతో నిండుగా ఉండేది పల్లెటూరు. చేతిలో చెర్నాకోలు పట్టుకుని నాగలి కి రెండు ఎడ్లు కట్టుకుని వాటిని అదిలిస్తూ బురద తొక్కుకుంటూ పొలం దున్నుతూ చేతులు బొబ్బలెక్కిన కర్తవ్య నిర్వహణ ఆపకుండా ఆ పొలంలో బంగారం పండించడానికి కృషి చేసే రైతన్నల అడ్డా మన పల్లెటూరు. పల్లె పదాలు పాడుకుంటూ ఊడ్పు చేలో మొక్కలు నాటే పల్లె పడుచులు ఉండే ఊరు పల్లెటూరు. పైరు ఎదిగి పూతపూసి గింజ కాసి గింజల బరువుకి నడువొంగి న పైరు తల్లిని కోత కోసి జోడెడ్లతో నూర్పించి దూళి వేరుచేసి బంగారు రాశులు ఇంటికి చేర్చే రైతన్నల సంతోషం ప్రతి సంక్రాంతి పండుగ కి వాకిళ్లలో చుక్కల ముగ్గు గా వెలుగుతున్న ఊరు పల్లెటూరు.   మా అమ్మ అన్నపూర్ణ. మేము రైతన్నలము. మేము చేసేది వ్యవసాయం. గాల్లో ఎగిరే పక్షికి ,...

పార్టీ

పార్టీ  రంగ మ్మా ఈరోజు రాత్రి మన ఇంట్లో పార్టీ ఉంది. అయ్యగారి బంధువులు స్నేహితులు చాలా మంది వస్తారు. గుమ్మానికి బంతిపూల దండలు కట్టు. కర్టెన్ లన్ని మార్చెయ్యి. ఇల్లంతా తడి గుడ్డు పెట్టు . డైనింగ్ టేబుల్ మీద పింగాణీ సామానంతా పెట్టు. వాటర్ బాటిల్స్ తెప్పించు.భోజనంలోకి ఒక స్వీట్ హాట్ బిర్యాని సాంబార్ అన్నం ఒక వేపుడు అప్పడాలు వడియాలు రెడీ చెయ్యి అంటూ గబగబా చేయవలసిన పనులు లిస్టు చెప్పేసింది ఆ లంకంత కొంపకి యజమానురాలు సుమిత్ర. సుమిత్ర భర్త సుధాకర్ గారు పెద్ద సివిల్ కాంట్రాక్టర్. చాలా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు. బాగా సంపాదించాడు. సుమిత్ర గారికి ఇద్దరు మగపిల్లలు. సిటీలో బాగా పేరు మోసిన స్కూల్లో చదువుకుంటున్నారు. రంగమ్మ కూడా అదే కాలనీలో గెడ్డ పక్కన రేకుల షెడ్డులో కాపురం ఉండి ఆ చుట్టుపక్కల పది ఇ ళ్లలో పాచి పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కాలక్షేపం చేస్తోంది. భర్త ఆటో నడుపుకుంటూ ఉంటాడు. సుమిత్ర గారికి పిల్లల్ని బయటకు పంపించడం భయమేసి రంగమ్మ పిల్లల్ని క్రికెట్ ఆడుకోవడానికి రమ్మంటారు ప్రతి ఆదివారం .సుమిత్ర గారి పిల్లలతో రంగమ్మ పిల్లలు రాజు ,రవి క్రికెట్ ఆడుకుంటూరు. క్రమేపి వాళ్...

కుటుంబం

కుటుంబం ఉదయం ఆరు గంటలు అయింది.  ఆ వృద్ధుల ఆలయంలో మైకు నుంచి విష్ణు సహస్రనామం శ్రావ్యంగా వినపడుతోంది.  ఒంటిమీద తెల్లటి బట్టలు వేసుకుని కాళ్లకు నల్లటి షూ తొడుక్కుని నుదుటన ఎర్రటి బొట్టు పెట్టుకుని సగం సగం నెరిసిన జుట్టుతోసుమారు యాభై ఏళ్ళ వయసు ఉన్న ఒక వ్యక్తి  ప్రతి గది లోకి తొంగిచూస్తూ అక్కడున్న వృద్ధులను ఆప్యాయంగా వరుసలు కలిపి పలకరిస్తున్నాడు.  "పెద్దమ్మ కాఫీ తాగావా! పెద్దనాన్న లేచావా! ఆరోగ్యం బాగుందా! మందులు వేసుకున్నావా! రాత్రి నిద్ర పట్టిందా! ఇలాంటి ప్రశ్నలతో ఆ వృద్ధులందరినీ పలకరించడం ఆయన దినచర్య. ఆ వృద్ధుల ఆలయంలో సుమారు యాభై గదులు ఉంటాయి. ప్రతిరోజు ప్రతి గదిని నిశితంగా పరిశీలించి బాగోగులు కనుక్కోవడం ఆయనకి ఇష్టం. తనకంటూ ఎవరు అయినవాళ్లు లేకపోయినా , అయినవాళ్లు ఉండి కొందరు, ఎవరూ లేకుండా ఆ వృద్ధుల ఆలయంలో చేరిన ప్రతి ఒక్కరిని తన బంధువు లాగే చూసుకుంటాడు . మర్యాదలు చేస్తాడు. కష్టం వస్తే తల్లడిల్లిపోతాడు. ఎవరికైనా అనారోగ్యం వస్తే రాత్రి పగలు తేడా లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలా ప్రతి గదిలోకి తిరిగి భోజనాశాలలోకి వెళ్లి అందరూ పలహారం తీసుకునే వరకు అక్కడే కూర్చ...