పోస్ట్‌లు

చద్దన్నం

చద్దన్నం – పల్లె జీవన శైలిలో ఒక పోషక సంపద అవును, అది కేవలం అల్పాహారం కాదు. అది ఒక జీవనశైలి. ఒక సంప్రదాయం. ఒక ఆరోగ్య రహస్యం కూడా! ఒకప్పుడు గ్రామీణ జీవన శైలిలో ఉదయాన్నే అందరూ తీసుకునే ఆహారం చద్దన్నం. అప్పటి రోజుల్లో కాఫీలు టీలు టిఫిన్లు ఉండేవి కాదు. ఇవి ఉన్నప్పటికీ కొంతమందికి చద్దన్నం తింటే కానీ ఆకలికి ఆగలేకపోయేవారు. ముఖ్యంగా ప్రతి రైతు వంటింట్లో ఒక గిన్నెలో చద్దన్నం, దాని పక్కనే ఉల్లిపాయ ముక్కలు, నంచుకోవడానికి మెంతికాయి లేదా మాగాయి లేదంటే ఏదో ఒక ఊరగాయ తప్పనిసరిగా ఉండి నోరూరించేవి. చద్దన్నం అంటే నిన్నటి ఉడికిన అన్నాన్ని నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన చల్లగా తీసుకునే ఆహారం. వేసవి మండుటెండలో పొలంలో పని చేసి వచ్చే రైతుకి ఇది ప్రాణదాయకం. శరీరాన్ని చల్లబరుస్తుంది. అలసటను తగ్గిస్తుంది. ఆకలి తీర్చడమే కాదు, శక్తిని కూడా ఇస్తుంది. ఇది పేదల ఆహారంగా పరిగణించబడినప్పటికీ, చద్దన్నంలో దాగిన ఆరోగ్య విలువలు అనేకం. నానబెట్టిన అన్నంలో ఫెర్మెంటేషన్ వల్ల బీ-విటమిన్లు (B vitamins), ముఖ్యంగా బీ-12 అభివృద్ధి అవుతాయి.  ఇవి జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. అంతేగాక, ప్రోబయోటిక్స్‌ ద్వారా పేగులకు అవసరమైన ...

ఫాస్ట్ ఫుడ్స్

ఫాస్ట్ ఫుడ్ – రుచికి ఋజువు, ఆరోగ్యానికి ప్రమాదం! ఇవాళ చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఫాస్ట్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. బయటకు వెళ్ళిన వెంటనే బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడుల్స్ లాంటి తిండి తినాలని చాలామందికి తహతహలే. అయితే ఈ రుచికి పెట్టిన ధర మన ఆరోగ్యానికి హాని చేస్తుందని అందరికీ తెలుసు . అయినా ఇంటి భోజనం అంటే ఎవరికి ఇష్టం ఉండక, ముఖ్యంగా చేసుకుని ఓపిక లేక, భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉండడంతో ఫాస్ట్ ఫుడ్ ల మీద ఆధారపడిపోతున్నారు. విచిత్రం ఏమిటంటే చిన్నపిల్లలకు కూడా ఈ హోటల్ కి తీసుకెళ్లడం అలవాటు చేస్తున్నారు. ఇంక పెద్దయిన తర్వాత వాళ్లకు అదే అలవాటైపోయి హోటల్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు.  ఒకపక్క అనారోగ్యాలు వస్తున్నాయని చెప్తున్నా ఎవరు వినిపించుకునే స్థితిలో లేరు. బజారులోనూ బేకరీలోనూ హోటల్లోనూ దొరికే ఆకర్షణీయమైన ఈ ఫాస్ట్ ఫుడ్ లు జొమాటో స్విగ్గిల ద్వారా తెప్పించుకుని తిని ఆనంద పడిపోతున్నారు. అసలు ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏమిటి? దాని మూలాన శరీరానికి ఏ విధమైన నష్టం జరుగుతుంది అనే విషయం మళ్లీ పునఃశ్చరణ చేసుకుందాం. ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏమిటి? ఫాస్ట్ ఫుడ్స్ అనేవి త్వరగా తయారయ్యే, తక్కువ సమయం...

ఇన్కమ్ టాక్స్

 2025–26 ఆర్థిక సంవత్సరానికి మారిన ఆదాయపన్ను విధానం: కీలక మార్పులు 2025 ఏప్రిల్ 1 నుంచి ఆదాయపన్ను విధానం లో కొన్ని కీలకమైన మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఈ మార్పులు ప్రత్యేకంగా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ మార్పులు, పన్ను మినహాయింపులు, మరియు కొత్త స్లాబ్‌లు ఏమిటి అన్న విషయాలను ఈ బ్లాగులో వివరించాం. 1. కొత్త పన్ను విధానం: 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను విధానం లో ₹12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ మినహాయింపు Section 87A rebate ద్వారా అమలవుతుంది. ఇది పాత విధానం కంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే పన్ను చెల్లించాల్సిన బాధ్యతను తగ్గిస్తుంది. 2. పన్ను మినహాయింపు: 2025–26 ఆర్థిక సంవత్సరం నుండి ₹5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు లభిస్తుంది. Section 87A ద్వారా ₹12,500 వరకు మినహాయింపు లభించవచ్చు, దీనివల్ల వారు ఏ రకమైన పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉంటారు. 3. కొత్త పన్ను స్లాబ్‌లు: కొత్త పన్ను విధానం ప్రకారం, పన్ను స్లాబ్‌లు క్రింద ప్రస్తావించిన విధంగా ఉంటాయి: ఆదాయం శ్రేణి (₹) పన్ను రేటు (%) ...