పోస్ట్‌లు

దీపావళి సంబరాలు

సాయంకాలం ఆరు గంటలు అయింది. ఎక్కడి నుంచో బాణసంచా చప్పుడు వినబడు తోంది. అప్పుడే దీపావళి ప్రారంభమైపోయింది అనుకుంటూ ఇత్తడి పళ్లెంలో వెలిగించిన ప్రమిదలని ఒక్కొక్కటి ఆరుగు మీద పెడుతోంది రమ్య. దీపావళి నాడు అరుగులకు ప్రత్యేక అతిధులు ఈ దీపాలు.  ఈ దీపాలతోటే ఎంత కళ వచ్చింది ఇంటికి అనుకుంటూ గాలికి రెపరెపలాడుతున్న దీపాలను చూసి మనసు ఎక్కడకో పోయింది రమ్యకి. పక్క ఇంటి నుంచి పిల్లల దివిటీలు కొడుతున్న హడావుడి వినపడుతోంది. పిల్లలు చేతులు కాల్చుకుంటారని ఆ తల్లి నానా హైరానా పడిపోతో oది. ఎన్నో జాగ్రత్తలు చెబుతోంది. ఒక్కసారి అవన్నీ చూసి రమ్య మనసు చిన్నతనంలోకి పరుగులెట్టింది. " అమ్మా రమ్య పరికిణి కుచ్చిళ్ళు కొంచెం దగ్గరగా పెట్టుకో. దూరంగా ఉండి ప్రమిదల్లో నూనె పొయ్యి. నువ్వు మతాబులు కాల్చుకో. అన్నయ్య తారాజువ్వలు కాల్చుకుంటాడు. నీకు గె డ కర్రకి మతాబులు కట్టిస్తాను. కాకరపువ్వొత్తులు కూడా నువ్వే కాల్చుకో. ఇలా ఎన్నో జాగ్రత్తలు ప్రతి దీపావళికి అమ్మ చెబుతూనే ఉండే ది. ప్రతి దీపావళికి కొత్త బట్టలు కాకరపువ్వొత్తులు విష్ణు చక్రాలు భూచక్రాలు పాము బిళ్ళలు మతాబులు ఇవన్నీ నా వాటా.  అన్నయ్య కి తారాజువ్వలు టప...

పెళ్లి కాజా

"అయ్యా గోపాలకృష్ణ గారు పెళ్లి వారిని భోజనానికి పిలవవచ్చునా! వంట సంగతి ఏమిటి? అంటూ అడిగిన కన్యాదాత చలపతిరావుకి నిరభ్యంతరంగా పిలవచ్చు. మీరు చెప్పిన వంటలన్నీ రెడీగా ఉన్నాయి అన్నాడు గోపాలకృష్ణ. బంగాళదుంప కూర, వంకాయ జీడిపప్పు సాంబారు అప్పడాలు వడియాలు కంది పొడి ఆవకాయ వీటన్నిటితో పాటు కాజాలు, జిలేబి వడ్డించండి. పిండి వంటలన్నీ ఆ మూల గదిలో పెట్టించాను. వడ్డనకి ఊరి వారు సరిపోతారా! మా కుర్రాళ్లను కూడా పంపించినా అవసరమైతే నేను కూడా వస్తాను. మీరు బంతి వేసే లోపు నేను అన్నం వార్చుతాను అంటూ గాడి పొయ్యి దగ్గర స్టూల్ మీద కూర్చున్న వంట బ్రాహ్మణుడు గోపాలకృష్ణ చెప్పాడు చలపతిరావు తో. సదరు గోపాలకృష్ణ వంటలు వండడంలో పిండి వంటలు చేయడంలో ఆరితేరిన వ్యక్తి. నల్లగా పెద్ద బొజ్జతో పొట్టిగా ఉండి ఎర్రటి అంగవస్త్రం కట్టుకుని నలుగురు కుర్రాళ్లను వెంటబెట్టుకుని ఎంతటి పెళ్లి వంట అయిన రుచికరంగా శుభ్రంగా తయారుచేసే ఆ గోపాలకృష్ణ కాకినాడ నివాసి.  ఆ ఊర్లో చిన్న తోరణం కడితే చాలు వంటకి గోపాలకృష్ణ నే పిలిచేవారు.అంత అలవాటు పడిపోయారుఆ ఊరి జనం గోపాలకృష్ణ వంటకి.  గోపాలకృష్ణ వంటలో ఉన్నాడంటే నిశ్చింతగా ఉంటాడు యజమాని. కావలసిన ...

వేద వ్యాసుడు

వేదవ్యాసుడు హిందూ ధర్మంలో అత్యంత మహత్తరమైన ఋషులలో ఒకడు. ఇతడి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. ఇతడు వేదాలను పునఃసంఖ్యాన చేసి నాలుగు వేదాలుగా విభజించాడని చెప్పబడుతుంది. అందువల్ల ఇతడిని వేదవ్యాసుడు అని పిలుస్తారు – అంటే "వేదాలను విభజించినవాడు" 🌼 జననం మరియు పరిచయం వేదవ్యాసుడు పరాశర మహర్షి మరియు సత్యవతిదేవి పుత్రుడు. అతను కృష్ణవర్ణుడు కావడంతో “కృష్ణ ద్వైపాయనుడు” అన్న పేరుపడింది. ద్వైపాయన అనే పేరు అతను ద్వీపంలో (నదిదీవిలో) జన్మించిన కారణంగా వచ్చింది. 🌿 వేదవ్యాసుడి ముఖ్యమైన కర్తవ్యాలు 1. వేద విభజన: అప్పటివరకు ఒక్కటిగా ఉన్న వేద జ్ఞానాన్ని నాలుగు వేదాలుగా – రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం – విభజించి, వాటిని విశిష్ట శిష్యులకు ఉపదేశించాడు. తద్వారా సాధారణ ప్రజలకు వేదజ్ఞానం అందుబాటులోకి వచ్చింది 2. మహాభారత రచన: అతనే మహాభారత రచయిత. ఇది జ్ఞాన సాంప్రదాయానికి మహత్తర గ్రంథం. "ఇది పురాణసారమయం", అందుకే దీనిని "పంచమ వేదం" అని కూడా అంటారు. ఇతడు వేదవ్యాసుడు గానీ, రచనను వినిపించినవాడు గణపతిదేవుడు. వ్యాసుడు పారాయణ చేస్తూ, గణపతి గమనించేవాడు. 3. పురాణాల రచన: వేదవ్యాసుడు 18 మహా...