పోస్ట్‌లు

రమణమ్మ

రమణమ్మ తెల్లవారుజామున 5:00 అయింది  ఆ ఐదుగురు అన్నదమ్ములు గట్టు దిగి వ్యవసాయం చేసే రైతులు కాదు గాని   ఆస్తి ఉండి కూలి వాళ్ళని పెట్టి వ్యవసాయం చేస్తూ పశువులను పెంచుకుంటూ ఉండే  ఊర్లో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబీకులు.    అలాంటి అన్నదమ్ములు ఉదయమే లేచి పొలాలకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం ఒక అలవాటు. ఆరోజు ఎప్పటిలాగే పొలం వెళుతున్న అన్నదమ్ములను చూసి ఆ ఊరి మోతుబరి రైతు వెంకటరెడ్డి ఎదురొచ్చి "ఏవండీ మావయ్య గారు ఈ స్థలం ఇలా వదిలేసారేటండి ?ఇందులో మామిడి మొక్కలు పెంచండి . ఈ మట్టి అందుకు  బాగా పనిచేస్తుంది అని చెప్పి సలహా ఇచ్చేవాడు ప్రతిరోజు.  ఆ అన్నదమ్ములు అందరికీ పొలాన్ని  అనుకుని నాలుగు ఎకరాల మెరక ఉండేది. అందులో పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఎవరు అందులోకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉండేది . ఆ రైతు చెప్పిన మాటలను వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. మాకు ఇప్పటికీ నలభైఏళ్లు దాటిపోయా యిఅందరికీ ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు ఒకవేళ మామిడి మొక్కలు వేసి అవి కాపు కాసే సమయానికి మనం ఉంటామా ఏమిటి? అనుకునేవారు ఆ అన్నదమ్ములు.  ఆ అన్నదమ్ముల్లో అందరికంటే పెద్దవాడు...

ఉయ్యాల

ఉయ్యాల. రాత్రి 8.30 గంటలయింది. కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్లే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్  రాజమండ్రి రైల్వే స్టేషన్ లో వచ్చే ఆగింది. అంతవరకు ఎదుటి సీట్లో కూర్చున్న ఒక యువతి వడిలో నిద్రపోతున్న పసిబిడ్డ లేచి  ఏడవడం మొదలెట్టింది.  ఆకలవుతుందేమోనని అనుకుని ఆ యువతి అందుకు తగిన ప్రయత్నాలు చేసి ఇంకా పిల్ల గుక్క పట్టి ఏడవడం మొదలుపెడితే ఆ పక్కన కూర్చున్న పెద్దావిడ తల్లి అనుకుంటా ఉయ్యాల కోసం ఏడుస్తోందేమో అని అంటూ ఇప్పుడు ఎలాగే బాబు! వీడికి ఉయ్యాల బాగా అలవాటైపోయింది అంటూ భుజం మీద వేసుకుని జో కొట్టడం ప్రారంభించింది. ఆ పసిబిడ్డ రైలు కుదుపులకి అమ్మమ్మ ప్రయత్నాలకి ఏమి మోసపోలేదు. ఏడుపు ఆపలేదు. పాపం ఆ ఇద్దరు ఆడవాళ్లు దిక్కుతోచక ఆ పిల్లవాడిని నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పై బెర్త్ మీద పడుకున్న వ్యక్తి ఆ పెద్దావిడకి భర్తనుకుంటా లేచి తిట్టడం ప్రారంభించాడు. వాడికి ఉయ్యాల అలవాటు చేయొద్దు అంటే వినలేదు మీరు ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నామో అన్నాడు .   దానికి ఆ ముసలాడికి కోపం వచ్చి మీకు నన్ను తిట్టడానికి ఒక సాకు దొరికింది. పసిపిల్లలను ఉయ్యాల్లో కాకుండా మంచం మీద...

జోడెద్దులు

జోడెద్దులు. ఉదయం 5:00 గంటలు అయింది.  హేమంత రుతువు ప్రతాపానికి తట్టుకోలేక దుప్పటి ముసుగు వేసి పడుకోవాలని అనిపించిన ఆ పల్లె బాధ్యతలు గుర్తు చేస్తూ గంప కింద కోడి ఆకాశంలోని పక్షులు పాకలోని పశువులు అరుపులతో తన బాధ్యత గుర్తుకొచ్చింది రామయ్యకి.  తూర్పు వైపు కాస్త వెలుగు కనిపిస్తే చాలు ఆ పాకలోని పశువులు అంబా అంబా అని అరుస్తూనే ఉంటాయి. ఆ అరుపుల సంకేతం యజమాని రామయ్యకు ఒక్కడికే తెలుసు. గబగబా దంత ధావనం కానిచ్చి వాటి ఆకలి తీర్చి ఆ జోడు ఎడ్లను బండి దగ్గరికి తీసుకువెళ్లి కాడి భుజం మీద వేసి వాటిని తమ బాధ్యతలకు సిద్ధం చేశాడు. రామయ్య కూడా బండి ఎక్కి యజమానిగా వాటికి దిశా నిర్దేశం చేసి సత్తు గిన్నెల క్యారేజీ పట్టుకుని సుబ్బి రెడ్డి గారి పొలం వైపు పరుగులు తీయించాడు.  ఆ ఊర్లో సుబ్బిరెడ్డి గారు వంద ఎకరాల భూమికి యజమాని. రామయ్య మాత్రం ఆ జోడి ఎడ్ల బండికి యజమాని. ఆ బండి తోలడం తప్ప వేరే ఏ పని చేతకాదు. ఆధునిక కాలంలో యాంత్రికరణ పెరిగి జోడు ఎడ్ల బండికి గిరాకీ తగ్గిపోయినా రామయ్య ఎడ్ల బండికి మటుకు గిరాకీ తగ్గలేదు. చిన్న చిన్న పొలం పనులకి ట్రాక్టర్ తొట్లు ఉపయోగించడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని....