పోస్ట్‌లు

నగరంలో మా ఊరు

నగరం లో మా ఊరు  ఆదివారం ఉదయం ఎనిమిది గంటలు అయింది. వాలు కుర్చీలో పడుకుని తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నారు రామారావు మాస్టారు. ఇంతలో పక్కన రింగ్ అవుతున్న మొబైల్ ని తీసి ఎవరిదో నెంబర్ అని చూశాడు. అమెరికా నుంచి డాక్టర్ శేఖర్ ఫోన్. రామారావు మాస్టర్ దగ్గర పదవ తరగతి వరకు చదువుకున్నాడు. చిన్నప్పటినుంచి చదువులో బాగా తెలివితేటలు ఉన్న శేఖర్ అంటే రామారావు మాస్టా రు కి చాలా అభిమానం. అందుకే ప్రత్యేక శ్రద్ధతో శేఖర్ కి చదువు చెబుతూ ఉండేవాడు ఒక ట్యూషన్ మాస్టర్ గా. పదవ తరగతి తర్వాత శేఖర్ ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకొని డాక్టర్ కోర్స్ చదివి పై చదువులకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు శేఖర్  శేఖర్ ది రామారావు మాస్టర్ ది ఇద్దరిదీ ఒకటే ఊరు. అది కోనసీమలోని చిన్న పల్లెటూరు. మాస్టారికి ఆ ఊరు అంటే చాలా ఇష్టం. మాస్టర్ కి మొక్కలంటే చాలా ఇష్టం . ఇంటి చుట్టూ పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ ముక్కలు పెంచుతూ ఉండేవారు మాస్టారు. ఎప్పుడూ పిల్లలకి ఆ మొక్కల మధ్య కుర్చీ వేసుకుని చాప మీద పిల్లలను కూర్చోబెట్టుకుని చదువు చెప్తుండేవారు. మాస్టారి ఇల్లు ఒక గురుకులంలా అనిపించేది పిల్లలకి. ఆ తర్వాత వయసు మీద పడడంతో మా...

రమణమ్మ

రమణమ్మ తెల్లవారుజామున 5:00 అయింది  ఆ ఐదుగురు అన్నదమ్ములు గట్టు దిగి వ్యవసాయం చేసే రైతులు కాదు గాని   ఆస్తి ఉండి కూలి వాళ్ళని పెట్టి వ్యవసాయం చేస్తూ పశువులను పెంచుకుంటూ ఉండే  ఊర్లో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబీకులు.    అలాంటి అన్నదమ్ములు ఉదయమే లేచి పొలాలకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం ఒక అలవాటు. ఆరోజు ఎప్పటిలాగే పొలం వెళుతున్న అన్నదమ్ములను చూసి ఆ ఊరి మోతుబరి రైతు వెంకటరెడ్డి ఎదురొచ్చి "ఏవండీ మావయ్య గారు ఈ స్థలం ఇలా వదిలేసారేటండి ?ఇందులో మామిడి మొక్కలు పెంచండి . ఈ మట్టి అందుకు  బాగా పనిచేస్తుంది అని చెప్పి సలహా ఇచ్చేవాడు ప్రతిరోజు.  ఆ అన్నదమ్ములు అందరికీ పొలాన్ని  అనుకుని నాలుగు ఎకరాల మెరక ఉండేది. అందులో పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఎవరు అందులోకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉండేది . ఆ రైతు చెప్పిన మాటలను వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. మాకు ఇప్పటికీ నలభైఏళ్లు దాటిపోయా యిఅందరికీ ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు ఒకవేళ మామిడి మొక్కలు వేసి అవి కాపు కాసే సమయానికి మనం ఉంటామా ఏమిటి? అనుకునేవారు ఆ అన్నదమ్ములు.  ఆ అన్నదమ్ముల్లో అందరికంటే పెద్దవాడు...

ఉయ్యాల

ఉయ్యాల. రాత్రి 8.30 గంటలయింది. కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్లే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్  రాజమండ్రి రైల్వే స్టేషన్ లో వచ్చే ఆగింది. అంతవరకు ఎదుటి సీట్లో కూర్చున్న ఒక యువతి వడిలో నిద్రపోతున్న పసిబిడ్డ లేచి  ఏడవడం మొదలెట్టింది.  ఆకలవుతుందేమోనని అనుకుని ఆ యువతి అందుకు తగిన ప్రయత్నాలు చేసి ఇంకా పిల్ల గుక్క పట్టి ఏడవడం మొదలుపెడితే ఆ పక్కన కూర్చున్న పెద్దావిడ తల్లి అనుకుంటా ఉయ్యాల కోసం ఏడుస్తోందేమో అని అంటూ ఇప్పుడు ఎలాగే బాబు! వీడికి ఉయ్యాల బాగా అలవాటైపోయింది అంటూ భుజం మీద వేసుకుని జో కొట్టడం ప్రారంభించింది. ఆ పసిబిడ్డ రైలు కుదుపులకి అమ్మమ్మ ప్రయత్నాలకి ఏమి మోసపోలేదు. ఏడుపు ఆపలేదు. పాపం ఆ ఇద్దరు ఆడవాళ్లు దిక్కుతోచక ఆ పిల్లవాడిని నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పై బెర్త్ మీద పడుకున్న వ్యక్తి ఆ పెద్దావిడకి భర్తనుకుంటా లేచి తిట్టడం ప్రారంభించాడు. వాడికి ఉయ్యాల అలవాటు చేయొద్దు అంటే వినలేదు మీరు ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నామో అన్నాడు .   దానికి ఆ ముసలాడికి కోపం వచ్చి మీకు నన్ను తిట్టడానికి ఒక సాకు దొరికింది. పసిపిల్లలను ఉయ్యాల్లో కాకుండా మంచం మీద...