గోదావరి డెల్టా పితామహుడు
గోదావరి డెల్టా పితామహుడు. మహారాష్ట్రలోని నాసిక త్రయంబకం వద్ద పుట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన గోదావరి నదిని జీవనది అంటారు. జీవనది అంటే ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అవి భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించే రోజులు . ఆర్థర్ కాటన్ అనే బ్రిటిష్ దొర వృత్తి రీత్యా ఇంజనీర్ ఇక్కడ పని చేస్తూ ఉండేవాడు. నిరంతరము ప్రవహిస్తూ ఒక పుణ్య నదిగా పేరు తెచ్చుకున్న గోదావరి నది జలాలు వృధాగా ఉండిపోవడం, అంతేకాకుండా ఆ ప్రాంతంలో తాగునీరు పంట నీరు సమస్యలు ఏర్పడడంతో ఇంజనీర్ దొరగారికి అద్భుతమైన ఆలోచన తట్టింది. అలా గలగల పా రుతున్న గోదావరి తల్లికి అడ్డుకట్ట అంటే ఆనకట్ట కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆనకట్టవలన ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవ్వడమే కాకుండా తాగునీటి సమస్య కూడా తీరుతుందని ఆలోచించి అప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ధవలేశ్వరం వద్ద గోదావరి నది మీద ఆనకట్ట నిర్మాణం చేశాడు. ఎక్కడో పుట్టాడు పరాయి దేశంలో అద్భుతమైన కార్యానికి పునాది వేశాడు భారతదేశంలో.పరాయి దేశస్తుడు అయితే నేమి పది కాలాల పాటు నిలిచే పని. చేశాడు.ఆనకట్ట కార్యరూపంలో ,అనారోగ్యం పాలు అయినా లెక్క చేయకుండా ప్రజల...