పోస్ట్‌లు

వేసవి

 బాల్యంలో వేసవి_ మధురస్మృతుల సందడి భాగం 1 పరీక్షల తర్వాత మొదలయ్యే పండగ వేసవికాలం… ఈ మాట వినగానే ప్రతి ఒక్కరి బాల్యం మనసులో తీయని జ్ఞాపకాలుగా మెదులుతుంది. ముఖ్యంగా పిల్లలకు అయితే వేసవి అనేది ఒక పండుగే. సంవత్సరమంతా ఎదురుచూసే ఆ స్వేచ్ఛ, ఆ ఆనందం దొరికేది వేసవిలోనే. ప్రతి సంవత్సరం ఆఖరి పరీక్షలతో ఒక పెద్ద బాధ్యత పూర్తవుతుంది. చివరి రోజు పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు కలిగే ఆ హాయిని మాటల్లో చెప్పడం కష్టం. ఇక పుస్తకాలు, బడులు అన్నీ కొంతకాలం దూరం. పేపర్లు దిద్దడంలో మాస్టారు గారు బిజీ అయిపోతారు; బడి తాళాలు ఆయన జేబులోనే విశ్రాంతి తీసుకుంటాయి. అదే సమయంలో పిల్లల మనసుల్లో మాత్రం కొత్త ఉత్సాహం మొదలవుతుంది — “అమ్మమ్మ ఊరికి ఎప్పుడు వెళ్దాం?” అనే ఆత్రుత. బస్తాలు సర్దుకోవడం, అమ్మ చెప్పే సూచనలు వినడం, రైలు లేదా బస్సు ప్రయాణానికి సిద్ధమవడం… ఇవన్నీ ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తాయి. అమ్మమ్మ ఊరికి చేరుకున్న క్షణం నుంచి నిజమైన వేసవి మొదలవుతుంది. మనవళ్లు వచ్చారంటే అమ్మమ్మ, తాతయ్యల ఆనందానికి అవధులు ఉండవు. వారి కళ్లల్లో మెరుస్తున్న ఆ ప్రేమ, ఆ ఆప్యాయత — అది ఎక్కడా దొరకని సంపద. వాకిట్లోకి అడుగుపెట్టగానే అమ్మమ్మ...

కావమ్మ కథ

  రాత్రి 8:00 అయింది. ఆకాశంలో పూర్ణచంద్రబింబం ముద్దుగా మెరిసిపోతోంది. ఆ పున్నమి వెలుగులో పుడమి అంతా పులకించిపోతోంది. చెరువు నీరు నిశ్శబ్దంగా ఉండి, ఆ వెన్నెల వెలుగులో పున్నమి చంద్రుడి ప్రతిబింబాన్ని ముద్దాడుతోంది. చెట్ల నీడలు పొడవుగా పడుతూ ఒక రహస్య కథ చెబుతున్నట్టుగా ఉన్నాయి. . ఒక స్త్రీ—నలభై సంవత్సరాలు వయసుంటుందేమో—ఆ చంద్రుడిని చూస్తూ, ఆ వెన్నెల రాత్రి తనకు తోచని రీతిలో అడుగులు వేస్తూ, నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ నృత్యం చేస్తోంది. బొట్టు లేని నుదురు, తల మీద వేసుకున్న ముసుగు, బోసిపోయిన చేతులు ఇష్టం వచ్చినట్లు గట్టి గట్టిగా మాట్లాడుతున్న మాటలు విని  వీధి అరుగు మీద కూర్చున్న ఆమె ఇద్దరు తమ్ముళ్లు అది చూసి నిట్టూర్చారు. “మా అక్క ఏమైనా తిందా?” అని పెద్ద తమ్ముడు రామారావు తన భార్య సీతమ్మని అడిగాడు. “లేదండి, నోరు అసలు విప్పడం లేదు. దానికి తోడు ఇవాళ ఉదయం నుంచి అలా వాగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇలా ఎంత ప్రయత్నం చేసినా లోపలికి రావడం లేదు,” అంటూ బాధపడుతూ చెప్పింది. మామూలు మనుషుల్లో ఉన్నప్పుడు అందరితో మంచిగా మాట్లాడుతుంది కావమ్మ. ఆ లోకంలోకి మారిపోయినప్పుడు తనలో తాను మాట్లాడుకుంటూ, గంటల తరబ...

వసంతం చెప్పే జీవన సత్యం

ఆంగ్ల సంవత్సరాది, తెలుగు సంవత్సరాది—రెండూ కాలానికి కొలమానాలే. కానీ వాటి స్వభావం మాత్రం వేరు. ఆంగ్ల సంవత్సరాది గడియారం లాంటిది—సూచీలు తిరుగుతాయి, తేదీలు మారతాయి, కానీ అది యాంత్రికం. మన జీవనంతో, మనసుతో, ప్రకృతితో పెద్దగా సంబంధం లేకుండా కాలాన్ని కొలుస్తుంది. తెలుగు సంవత్సరాది మాత్రం జీవంతో నిండినది. అది గడియారం కాదు… అది ఒక జీవన చక్రం. ప్రకృతి శ్వాసించే ప్రతి క్షణానికీ అది ప్రతిబింబం. శిశిరం తన చివరి ఊపిరి తీసుకుంటున్న వేళ, చెట్లు ఆకులు రాల్చి నిశ్శబ్దంగా నిలబడినప్పుడు, ఒక ముగింపు కనిపిస్తుంది. అయితే అదే ముగింపులో కొత్త ఆరంభం దాగి ఉంటుంది. వసంతం అడుగుపెట్టినప్పుడు, చిగుర్లు మొలుస్తాయి… పూలు వికసిస్తాయి… ప్రకృతి తన నవ్వును తిరిగి పొందుతుంది. ఆ ఆకురాల్చే దశ నుండి మొగ్గ తొడిగే దశకు మారడమే వసంతం. అదే నిజమైన “యుగాది”—యుగానికి ఆది. అందుకే తెలుగు సంవత్సరాది ఒక తేదీ మాత్రమే కాదు, ప్రకృతితో మమేకమై, జీవితం కొత్తగా మొదలయ్యే క్షణం. అదే మనకు  ఉగాది పండుగ.  ఈ పండగ కేవలం ప్రకృతిలో మార్పు తో  నిశ్శబ్దంగా మన ఇంటిలోనికి వస్తుంది.  హోరెత్తించే మైకులు, అర్ధరాత్రి వరకు బిర్యానీ వాసనలు, బాణస...