పోస్ట్‌లు

2025లోని పోస్ట్‌లను చూపుతోంది

రాజు గారి కోట

 రాజరికం చరిత్రలో కలిసిపోయింది రాజ్యాలు దేశంలో కలిసిపోయే యి గతించిన చరిత్రకు సాక్షిగా రాజులు కట్టిన కోటలు మిగిలిపోయాయి. రాజుల జ్ఞాపకాలు, రాజ్యాల వైభవాలకు గుర్తుగా మిగిలిపోయిన కోటలు ఎప్పటికీ మనకి అపురూపమే. అవి ఈనాడు శిధిలమై ఉండొచ్చు, దుమ్ము పేరుకుపోయి ఉండొచ్చు అవి మన చారిత్రక సంపద అనడంలో సందేహమే లేదు.  ఆ కాలపు వైభవాన్ని తనివి తీరా అనుభవించిన అది భవనం  కాదు రాజుల గత వైభవం తనివి తీరా దర్శించి ప్రశ్నిద్దాం. అది మాటలు వచ్చిన మనిషి కాదు సమాధానాలు ఎలా చెబుతుందని అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. ఆ కోటలో ప్రతి గదికి ఒక చరిత్ర. ప్రతి గది ఒక ప్రయోజనం కోసం నిర్మించబడింది. ఇది ఒక రాజ్యానికి సంబంధించిన కోట కాదు . రాజు గారి కోట అంటే రాళ్లతో కట్టిన భవనం కాదు. అది ఒక యుగపు గౌరవం, జీవన విధానం, కళాత్మకత, అన్నీ అందులో కనిపిస్తాయి. ఆ కోట దగ్గరికి వెళ్లి ప్రాకారాలు నిమిరి ఎలా ఉన్నావ్ అని ఆప్యాయంగా పలకరిస్తే ఇదిగో ఇలా ఉన్నానని దుమ్ము కొట్టుకుపోయిన గదిని చూపిస్తూ కథ చెప్పడం ప్రారంభించింది. నేను — ఒక కోటను. రాళ్లతో, సున్నంతో, చెమటతో, శౌర్యంతో పుట్టిన జీవిని.శతాబ్దాల క్రితం, ఒక గర్విత రాజు నన...

ఆనాటి అతిధి

ఆ జీవన విధానం వేరు. ఆ తరం పద్ధతులు వేరు. ఆ ఆప్యాయతలు వేరు. అనుబంధాలు వేరు. తరం మారుతున్న కొద్దీ ఆ అతిధి మర్యాదలు మరుగున పడిపోతున్నాయి. ఒకప్పుడు ఇంటి ముందు రిక్షా ఆగిందంటే, రిక్షాలోంచి దిగుతున్న అతిధిని చూసి ఎదురు వెళ్లి స్వాగతం చెప్పేవారు. “రండి రండి” అంటూ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. అప్పట్లో సాంకేతికంగా అభివృద్ధి చెందిన రోజులు కావు. సమాచారం కొరకు ఉత్తరాల మీద ఆధారపడి ఉండేవారు. మరీ ముఖ్య అవసరాల కోసం టెలిగ్రామ్. ఉత్తరం రాస్తే నాలుగు రోజులు కానీ వచ్చేది కాదు. అతిధి చెప్పా పెట్టకుండా వచ్చిన — “ఏదో పని ఉండి ఊర్లోకి వచ్చాను, మిమ్మల్ని చూసి పోదామని రావడం జరిగిందంటూ” — తన ముందస్తు కబురు చెప్పకుండా వచ్చినందుకు సంజాయిషీ చెప్పుకునేవాడు అతిధి. అతిధి తన దగ్గర బంధువు కావచ్చు, లేదంటే దూరపు బంధువు, లేదంటే స్నేహితుడు అయినా ఒకే రకమైన ఆహ్వానం. అతిధి మర్యాదలో భాగంగా ముందుగా గుమ్మo ల్లోనే ఒక బకెట్‌తో నీళ్లు, చెంబు రెడీగా ఉండేవి. పల్లెటూర్లో అప్పటి జీవన విధానానికి అనుకూలంగా ఇళ్లు ఉండేవి కాబట్టి ఆ రకమైన సౌకర్యం కల్పించగలిగేవారు. వచ్చిన అతిధి సరాసరి ఇంట్లోకి వచ్చేయకుండా, కాళ్లు కడుక్కుని రావడం ఒక ఆరోగ్యకరమైన అలవా...

రీల్స్

 “ప్రపంచం ఇప్పుడు చేతి అంచున ఉంది” అని వింటే అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ ఈరోజుల్లో అది వాస్తవం. ఒక చిన్న మొబైల్ ఫోన్ స్క్రీన్‌లో ప్రపంచం మొత్తం సజీవంగా ఉంటుంది. అందులోనూ, కేవలం పదిహేను సెకండ్ల వీడియోలు — రీల్స్ — ఇప్పుడు కోట్లమందిని ఆకర్షిస్తున్నాయి. చిన్న వీడియోలు, పెద్ద ప్రభావం — ఇదే రీల్‌ ప్రపంచం యొక్క ప్రత్యేకత. ఒక చూపు, ఒక మాట, ఒక స్వరమాత్రమే చాలు… మన మనసు దాని వశం అవుతుంది. 🎬 క్షణాల వినోదం, కొత్త సంభాషణ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ అన్నీ రీల్స్‌కు వేదికలే. చిన్న వీడియోల్లో నవ్వులు, నృత్యాలు, ప్రేరణ, వ్యాపారం, ఫ్యాషన్ — అన్నీ కలగలిసి ఉంటాయి. ఇది ఒక కొత్త భాష, కొత్త తరహా కవిత్వం. మాటలకన్నా చూపులు ఎక్కువ చెప్పే యుగంలో ఇది సహజమైన పరిణామం. 🌿 ప్రతిభకు కొత్త దారులు రీల్స్ వల్ల ఎన్నో కొత్త ప్రతిభలు వెలుగుచూశాయి. ఒక పల్లెటూరి బాలిక నృత్య వీడియో ప్రపంచం నలుమూలలకూ చేరుతోంది. ఒక రైతు తన పంటను చూపిస్తున్నాడు. ఒక ఉపాధ్యాయుడు తన పాఠాన్ని సరదాగా బోధిస్తున్నాడు. ఇవి అన్నీ ఒక కొత్త సృజనాత్మక విప్లవానికి నాంది. మన తెలుగు గేయాలు, పద్యాలు, పల్లెలు, వంటలు — ఇవన్నీ మళ్లీ పునర్జీవం పొంద...

దొంగలు

ఒకప్పుడు దొంగతనం అంటే రాత్రి చీకట్లో జరిగే పని అర్థం   ఇప్పుడు పగలు రాత్రి తేడా లేదు— కానీ కనపడదు! మన చేతిలోని ఫోన్‌ద్వారా, మన కళ్ల ముందే, మన ఖాతాలోని సొమ్ము జారిపోతుంది. మొబైల్ లేకపోతే నిమిషం గడవదు. ఆదమరిస్తే దానంత కష్టం లేదు. మన సొమ్ము పరాయి సొత్తు అయిపోతుంది. మన సమాచారం పరుల పాలైపోతుంది. మునుపు దొంగతనాలు రాత్రిపూట జరిగేవి. దొంగల భయంతో తాళాలు వేసుకుని నిద్రపోయేవాళ్లం. కానీ ఈ కొత్త దొంగకి తాళాలతో పనిలేదు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు జోలికి రాడు. దర్జాగా ఏసీ గదిలో, లేదంటే పొలం గట్ల మీద కూర్చుని — పార్ట్‌టైం జాబ్‌లా దొంగతనం చేస్తాడు. తాళాలు వేసినవే ఉంటాయి, కానీ బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయలు గోడలు దాటి పారిపోతాయి. మనం చేయగలిగేది గగ్గోలు పెట్టడమే తప్ప, వాటిని ఆపడం కష్టమే. తాళం లేకుండా సొమ్ము ఎలా తీస్తున్నాడు? అదే — సాంకేతికత! ఒకప్పుడు బ్యాంకులో ఉన్న సొమ్ము మన చేతికి రావాలంటే బ్యాంకుకి వెళ్లాలి. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ సొమ్ము ఇచ్చే యంత్రాలు, మొబైల్‌లో ఉన్న చిన్న చిన్న యాప్‌లు — ఇవన్నీ సౌకర్యం కోసం. కానీ ఈ సౌకర్యం మధ్యలో మాయగాళ్లు దూరి ఖాతాదారులకి అన్యాయం...

సత్య

ఉదయం పది గంటలు అయ్యింది. వృద్ధాశ్రమంలో తన గదిలో మంచం మీద పడుకున్న సత్యకి, పక్క మంచం మీద పడుకున్న రాఘవమ్మ దగ్గరకి ఇద్దరు రావడం గమనించింది. ఇద్దరూ కవల పిల్లలు అనుకుంటా — ఒకే పోలిక, ఒడ్డు పొడుగు సమానంగా ఉన్నారు. ఇద్దరికీ పెళ్లి అయిపోయింది అనిపించింది. అంతవరకు మంచం మీద మూలుగుతూ పడుకున్న రాఘవమ్మ, ఆ పిల్లలు రాగానే లేచి కూర్చుని నవ్వుతూ మాట్లాడడం సత్య గమనించింది. రాఘవమ్మ ఆ పిల్లల్ని పరిచయం చేస్తూ — “ఇంతవరకు అమెరికాలో ఉండేవారు, ఇప్పుడు ఇండియా వచ్చేసారు. అందుకే నన్ను తీసుకువెళ్లడానికి వచ్చారు” — అని చెప్పింది. అది విన్న సత్య మనసులో — “నా అదృష్టం ఎప్పుడు వస్తుందో?” — అనిపిస్తూ గతజీవితం గుర్తుకొచ్చింది. --- “కంగ్రాట్యులేషన్స్ పార్వతమ్మ గారు! మీ అమ్మాయి సత్యకి కవల పిల్లలు పుట్టారు. తల్లి పిల్లలు అంతా క్షేమం. కాసేపట్లో రూముకు పంపిస్తాను” అంటూ లేడీ డాక్టర్ సరోజ చెప్పిన మాటలు లీలగా వినబడ్డాయి సత్యకి. ఒక్కసారి ఆనందం ముంచుకొచ్చింది. పిల్లలను చూసి ఎత్తుకుని ముద్దాడాలనిపించింది. కానీ ఒళ్లంతా మత్తుగా ఉంది, కళ్ళు తెరవబుద్ధి కావడం లేదు. చంటి పిల్లల ఏడుపులు లీలగా వినిపిస్తున్నా, ఏమీ చేయలేక పడుకుని ఉండిపోయింద...

మా ఊరి జ్ఞాపకం

చూడ్డానికి క్రికెట్ వీరుడులా, పొట్టిగా గవాస్కర్ లా ఉండేవాడు మా వెంకన్న. ఆ గవాస్కరు ఎప్పుడు చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే, ఈయన నోట్లో పొగాకు చుట్ట — చేతిలో ఎప్పుడు పదమూడు ముక్కల పేక పట్టుకుని ఉండేవాడు. లుంగీ, పంచ కట్టుకుని, దానిమీద చొక్కా తొడుక్కుని, నోట్లో చుట్ట పెట్టుకుని ఉదయమే లేచి సైకిల్ ఎక్కాడంటే — ఏ అరుగుదగ్గర ఆగుతాడో ఎవరికీ తెలిసేది కాదు. అరుగు దగ్గర ఆగాడంటే భాగవతం, భారతం, రామాయణం వినడానికి కాదు. ఈయన పారాయణం వేరే ఉంది. అదే చతుర్ముఖ పారాయణం. --- అందరూ సంక్రాంతి పండుగకి, పెళ్లిళ్లకి, వేసవికాలం సెలవులకి పేకాట ఆడడం మామూలే ఆ ఊర్లో. కానీ మన వెంకన్న 365 రోజులు అదే ప్రవృత్తి. వృత్తి వ్యవసాయం అంటాడు. ఎప్పుడు పొలం గట్టు ఎక్కిన పాపాన పోలేదు. తలపాగా చుట్టిన సందర్భం చూడలేదు. “ఏవండీ వెంకన్న గారు ఉన్నారా ఇంట్లో?” అంటూ మూడు వందల అరవై ఐదు రోజులలో ఎప్పుడు ఎవరు అడిగినా — “లేదండి, పేకాటలో ఉన్నారండి” అని ఇంట్లోంచి అదే సమాధానం. అదేదో పెద్ద ఉద్యోగం లాగా చెప్పేవారు. చివరికి ఏ వీధిలో ఉన్నాడు, ఎవరు అరుగు మీద ఉన్నాడు వెతుక్కుని ఆ వచ్చిన పెద్దమనిషి తన పని పూర్తి చేసుకునేవాడు. ఆ ఊర్లో నాలుగైదు అరుగులు ప్...

సాయి

సాయి ఈ సృష్టి అంతా పరమేశ్వర ప్రసాదమే. అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనది మానవజన్మ. ఎందుకంటే అన్ని జీవులకీ ఇంద్రియాలు ఉంటాయి. కానీ మానవుడు మాత్రమే మాట్లాడగలడు. మాట మనిషికి దేవుడిచ్చిన వరం. నోరు ఆత్మీయంగా పలకరిస్తుంది; అవాకులు చవాకులు పలికిస్తుంది. అలాగే ఇంద్రియములన్నీ కూడా సక్రమంగా నడిస్తే ఏ బాధ ఉండదు. దారి తప్పితే మనిషి అధోగతిపాలవుతాడు. మనిషి తన నడవడికలో ఏది మంచి, ఏది చెడు తెలియజెప్పడానికి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు తోడ్పడతాయి. అలాగే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి భగవంతుడు అనేక అవతారాలు ఎత్తుతూ ప్రజలను రక్షిస్తూ వచ్చాడు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వంటి ఆధ్యాత్మిక గురువులు తమ బోధనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారు. మదర్ తెరిసా వంటి కరుణామూర్తి పేదలకు సేవ చేస్తూ ఆదర్శవంతంగా నిలిచారు. అలాగే హిందూ, ముస్లిం మతాలను రెండింటిని సమన్వయపరుస్తూ “అందరికీ ప్రభువు ఒక్కడే” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ భగవంతునిపై విశ్వాసం ఉంచాలని, శ్రద్ధతో ఏ పనైనా పూర్తి చేయాలని బోధించి ప్రజల చేత ఆరాధించబడుతున్న మహాయోగి, కరుణామూర్తి — షిరిడి సాయి బాబా వారు. --- శ్రద్ధ, సబూరి అనేవి ఆయన బోధనలో ముఖ్యమై...

ప్రసాదం

"అయ్యా, నేను రేపటి నుంచి ఐదు రోజులపాటు మన రాములోరి గుడి దగ్గరే ఉంటాను" అంటూ తండ్రితో చెప్పాడు పది సంవత్సరముల వయసున్న రాముడు. "ఏరా! ఎందుకు? నువ్వు గుడి దగ్గర కూర్చుంటే మనకు బువ్వ ఎవరు పెడతారు?" అంటూ ప్రశ్నించాడు తండ్రి పిచ్చయ్య. "మర్చిపోయావా ఏమిటి నాన్నా? మన రాములు వారి గుడిలో ఎల్లుండి శ్రీరామనవమి కదా! సీతారాముల కళ్యాణం చేస్తారుగా. ఆ రోజు నుంచి ఐదు రోజులు పాటు ఊరందరికీ సంతర్పణ చేస్తారు కదా. ప్రతి ఏటా చేస్తారుగా. మర్చిపోయావా ఏమిటి?" అంటూ చెప్పుకొచ్చాడు రాము. "మరి ఆ సందర్భంగా మనకి ఆకు వేసి భోజనం పెడతారా ఏమిటి?" అంటూ సందేహం వెలిబుచ్చాడు పిచ్చయ్య. "అవును నాన్న! ఇక్కడ కులమతభేదం లేకుండా వచ్చిన వాడిని తిరిగి పొమ్మనకుండా అందరికీ చక్కగా భోజనాలు పెడతారు. ప్రతి ఏట జరుగుతోంది కదా. అయినా నువ్వు ఎప్పుడూ చూడలేదా? నేనే నీకు భోజనం అడిగి తెచ్చి పెడతాను ప్రతి ఏడాదిలాగే," అంటూ తుర్రుమని వీధిలోకి పారిపోయాడు రాము. --- రాము పిచ్చయ్యకి ఒక్కగానొక్క కొడుకు. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం రిక్షా లాగి, పక్షవాతం వచ్చి ఈ మధ్యనే మంచం మీద పడ్డాడు పిచ్చయ్య. రాముని చదివించే స్తో...

భగినీ హస్త భోజనం

“తమ్ముడు, ఎల్లుండి తప్పకుండా భోజనానికి రా” అంటూ ఫోన్ చేసింది — ప్రతి సంవత్సరం లాగానే దీపావళి నాడు పక్క ఊర్లో ఉన్న మా అక్క. ఆరోజు భగినీ హస్త భోజనం. అందుకే మా అక్క ఆహ్వానం. ఉదయం లేచి ఫస్ట్ బస్సులో ఆ ఊరు బయలుదేరాను. మేమిద్దరం పుట్టి పెరిగింది అదే ఊరు. అక్క నా కంటే రెండేళ్లు పెద్దది. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుతూ, ఆడుతూ, పాడుతూ, కలిసిమెలిసి పదో తరగతి వరకు పెరిగాము. నేను ఇంటర్మీడియట్ చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్క పదవ తరగతి తోటే చదువు ఆపేసింది. మేనమామకు ఇచ్చి పెళ్లి చేసేశారు. ఆ ఊర్లోనే కాపురం. బావగారు ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి అయింది. అయినా ప్రతి ఏటా నన్ను భగినీ హస్త భోజనానికి పిలుస్తూనే ఉంటుంది. దాని పరిస్థితి చూసి ఏదైనా సహాయం చేద్దాం అంటే ఎంతో మొహమాటం. ఒక చిన్న మాట కూడా తన సంసారం గురించి చెప్పదు. తన లేనితనం గురించి అసలు చెప్పదు. బావగారు బాగా చూసుకుంటున్నారని అంటుంది. ఎప్పుడూ ఆ మూడు గదుల కొంపలోనే కాపురం. ఇంట్లో కుర్చీ కూడా ఉండదు కూర్చోడానికి. ఇద్దరు పిల్లలు చదువులు. ఎలా నెట్టుకొస్తుందో ఏమిటో! పెద్దయ్యాక ఎవరి జీవితాలు వాళ్ళవే. చిన్నప్పుడు ఎంత ...

తస్మాత్! ఆరోగ్యం జాగ్రత్త

ప్రతి జీవికి నిత్యవసరాలలో ముఖ్యమైనది ఆహారం. బ్రతుకు బండి సాగాలంటే శక్తి కావాలి. మనిషికి ఆ శక్తి తినే ఆహారం నుంచి పుడుతుంది. మనిషి శరీరము ఒక నడిచే కారు లాంటిది. కారు నడవాలంటే పెట్రోల్ పోయాలి. అలాగే మనిషి శరీరానికి కూడా సమతుల ఆహారం అందించాలి. విటమిన్లు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు — ఇవన్నీ శరీరానికి కావలసిన రక్షణను, శక్తిని ఇస్తాయి. శాఖాహారులు బియ్యం, ఆకులు, పండ్లు, కాయలు, గింజలు ఆహారంగా స్వీకరిస్తారు. మాంసాహారులు వీటితో పాటు జంతువుల మాంసాన్ని కూడా ఆహారంగా తీసుకుంటారు. అయితే తీసుకునే ఆహారాన్ని పరిమితంగా తినడం, పరిశుభ్రమైన వాతావరణంలో వండిన పదార్థం తినడం, వేళకు తినడం వంటి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిలో ఏ నియమం తప్పినా ఆహారం విషతుల్యమవుతుంది. అది మన శరీరానికి మంచి బదులు చెడు చేస్తుంది. పూర్వకాలంలో తొలి రోజున వండిన ఆహార పదార్థాలను ముట్టుకునేవారు కాదు. అది మడి కాదు, ఆచారం కాదు — ఆరోగ్యం కోసం తీసుకున్న జాగ్రత్త. ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్లలో వండిన ఆహార పదార్థాలు దాచుకుని రెండు మూడు రోజుల వరకు ఉంచి తింటున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదో వారికే వదిలేయాలి....

జీవితం

 నీటి బుడగ జీవితం. ఎప్పుడు చితికి పోతుందో ఎవరికి తెలుసు. చావు బతుకుల మధ్య కాలమే జీవితం. పగలు రాత్రి ప్రతిమనిషికీ సమానం. సగ భాగం అంతా తిండి నిద్రకి సరిపోతుంది. బాల్యమంతా నీ జీవితం గురించి నీకు అవగాహన ఉండదు. యవ్వనం నుండి నీ అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఇంకో జీవి కూడా నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ జీవి కూడా జీవితం అంటే అంత వరకు తెలియదు. అమ్మా,నాన్న ,పుస్తకాలు ,కాలేజీ, హాస్టల్ జీవితం బాధ్యతలు లేని బతుకు ఇంతవరకు అనుభవించిన తీపి గుర్తులు. ఇంకొకరి తో జీవితం ఒక ఫ్రేమ్ లో ఉంటుంది.  ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకోవడం. ఒకరి కోసం ఒకరు బతకడం. తన ఇష్టాలను త్యాగం చేయడం కూడా తప్పదు. సర్దుబాటే జీవితం. సరే జీవితంలోకి అడుగు పెట్టాం. జీవిత సాఫల్యo ఏమిటి. డబ్బు పిల్లలు వృద్ధాప్యం ఈ మూడింటి తోటి మనకు చిక్కులు వస్తాయి. మన ఆనందంగా జీవించడానికి డబ్బు కావాలి.  డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. చేసిన పనికి ప్రతిఫలమే జీతం. జీతం తో జీవితం ఆనందంగా గడపడమే . అప్పనంగా వచ్చేది లంచం. లంచం పంచ రంగుల జీవితం చూపిస్తుంది. కానీ దైవం ఎప్పుడూ మనం గమనిస్తూనే ఉంటుంది. పరుల సొమ్ము ఆశించక పోవడమే పరమార్ధం. గౌతమ్ ...

ఆడపిల్ల

అమ్మను మించిన అమ్మ యుగానికో రాక్షసుడిని చంపడానికి అవతారం ఎత్తినా , ఇంకా నరరూప రాక్షసులు కళ్లు నిన్ను వెతుకుతూనే ఉన్నాయి. ఎంతమంది సజ్జనారులు వలయాలు గీసినా, అవి నీకు రక్షిత వలయాలు మాత్రం కాలేకపోయాయి. అమ్మ రక్షరేకులు కట్టించిన నీ మీద రాక్షస దృష్టి పడుతూనే ఉంది.నువ్వు జంతువు కాదు, జూలో ఉంచలేను. నువ్వు లక్ష్మణరేఖలు దాటకపోయినా, రాక్షసులే నీ తలుపు తడుతూనే ఉంటే — కాపాడవలసిన కాళిక కళ్లు తెరవకపోతే — నీకు ఎవరు రక్ష? ప్రభుత్వ చట్టాలు అందరికీ చుట్టాలే. సమాజమే నీకు శత్రువు. నీ మానాన నిన్ను బ్రతకనివ్వడం లేదు. సైన్స్, టెక్నాలజీ రెండూ నీకు శత్రువులే. గర్భస్థ పిండంలోనే నీ పీక పిసికితున్నారు. సృష్టి ఆపే శక్తి ఆ పరమేశ్వరుడికి తప్ప ఎవరికీ లేదు. అమ్మ నాన్న నిత్యం జాగ్రత్తల దండకం చదువుతూ, డ్రెస్సింగ్ రిహార్సల్ వందసార్లు చేస్తూ, బడికి పంపుతూ — నువ్వు తిరిగి వచ్చేవరకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ — నిత్యం దేవుడిని ప్రార్థిస్తూ భయంగా బ్రతుకుతున్నారు. చదువు కంప్లీట్ చేయించి, క్యాంపస్ నుండి ఆఫీస్ మెట్లెక్కించి, ఒక అయ్య చేతిలో పెట్టి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. పెళ్లి లాటరీ లాంటిది. ఏ నంబరు లక్కీ నంబరో ముందే తెలి...

బొమ్మ చెప్పిన కథ

చిత్రం
గతం తలుచుకుంటే నాకెంతో గర్వం.భవిష్యత్తు నాకు ఆశాజనకం.వర్తమానం మీకు కళ్ళ ముందు కనిపించే చిత్రం. ఇది నా బ్రతుకు బతుకు అంతా నిత్యం సమరాలే పంచకల్యాణిలా పరుగులే. రాజు బంటు తేడాయే తెలియదు. దేవుడు దేవత దెయ్యం అందరూ నా యజమానులే కొండలెక్కాను గుట్టల మీద నడిచాను .నదులు దాటాను నడక తక్కువే. పరుగు కోరుకునే వారు ఎక్కువ.నా కళ్ళెం పట్టిన రాజుగారి రాచరికం చరిత్రలో కలిసిపోయింది.రాజు లేకపోతే బంటు కూడా మాయం. కళ్లకు గంతలు కట్టుకుని బండికి సేవకుడి ని అయిపోయా.మారిన కాలం నాలుగు చక్రాల బండి తో నా పొట్ట కొట్టేస్తే నేను సముద్రం ఒడ్డుకు వచ్చి ఇసుకలో పడిపోయా.ఇసుకలో నేను నడక నేర్చుకుంటున్నా. ఇప్పుడు నా కళ్లెం పట్టుకున్న వారికి అది గుర్రపు స్వారీ.సెల్ఫీలు చూసుకుని మురిసిపోతున్నారు.సరదాలు తీర్చుకుంటున్నారు.  ఆ ఉప్పు గాలిలో ఆ ఇసుకలో ఆ కెరటాల హోరులో నన్ను పెంచి పోషిస్తున్నారు. ఒకప్పుడు నేను పంచ కళ్యాణిని ,రాజు గారితో పాటు రాజభోగాలు అనుభవించిన దాన్ని ఇప్పుడు నేను బక్క చిక్కిన గుర్రం @ సముద్రం. గుడ్డ ముక్కల గుర్రాన్ని కేరాఫ్ నచ్చిన వారి ఇంట్లో గూట్లో బొమ్మని. తల పైకెత్తి చూస్తే ఆకాశంలో కనబడే తారని మెరి...

చిలక జోస్యం

మన భారతీయ సాంప్రదాయంలో జ్యోతిష్యం, శకునాలు, జంతువుల ప్రవర్తన వంటి అంశాలకు ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో “చిలక జోస్యం” అనేది ఒక విశిష్టమైన, మనసుకు ఆసక్తిని కలిగించే సంప్రదాయం.చిలక నోట జోస్యం వినడం అనేది ఒక విశ్వాసం మాత్రమే కాదు — అది మన మనోవ్యవహారాలకు అద్దం పట్టే ఒక సాంస్కృతిక ఆచారం  చిలక జోస్యం ఆచారం దక్షిణ భారతదేశంలో — ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో విస్తరించింది. చిలకను "శకునపక్షి"గా పరిగణిస్తారు. పురాణాల్లో శుక మహర్షి అనే ఋషి “భాగవతం”ను పరమాత్ముడి ప్రసాదంగా స్వీకరించినట్లు చెప్పబడుతుంది. అందుకే చిలకను "శుక పక్షి" అని గౌరవిస్తారు. కాలక్రమంలో, చిలక మనిషి భవిష్యత్తును చెప్పగలదనే విశ్వాసం ఏర్పడి, జోస్యకారులు చిలకలతో జోస్య పద్ధతిని రూపొందించారు. చిలక చేత ఎంచబడే కార్డు లేదా పత్రం మన భవిష్యత్తును సూచిస్తుందని నమ్మకం ఏర్పడింది  చిలక జోస్యం సాధారణంగా ఇలా జరుగుతుంది — ఒక చిన్న గేజ్‌లో చిలకను పెట్టి, జోస్యకారుడు తన దగ్గర రామాయణం, మహాభారతం, భాగవతం లేదా దేవతల చిత్రాలతో కూడిన కార్డులు ఉంచుతాడు. జోస్యకారుడు కస్టమర్ పేరు, గోత్రం, రాశి వంటి వివరాలు అడిగి, ఆ చ...

ఓహో పావురమా

అది నిజంగా భాగ్యనగరమే. ఆ రాజ్యానికి పట్టపురాణి మీద ప్రేమతో అందంగా నిర్మించబడిన ఆ నగరం, నాలుగు దిక్కులలో ఉన్న పల్లెలను కలుపుకుని సువిశాల నగరంగా మారింది.  పరిశ్రమలకు, కర్మాగారాలకు ఆశ్రయమిచ్చి కాలుష్యం మాట దేవుడెరుగు. పొట్టచేత పట్టుకుని, పట్టాపుచ్చుకుని పట్నం చేరిన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు కార్పొరేట్ ఆఫీసుల్లో ఆశ్రయం ఇచ్చి కడుపు నింపే ఆ నగరం నిజంగా అక్షయపాత్ర. రోజురోజుకీ నగరం పెరిగిపోతోంది. ఎర్రబస్సు ఎక్కి పట్నం చేరే జనాల సంగతి చెప్పక్కర్లేదు. “కనీస అవసరాలు నేను కల్పించలేను బాబోయ్, అయినా సరే కర్మాగారం పక్కనైనా ఉంటాం” అని బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలు, డూప్లెక్స్ హౌసులు కట్టుకుని కాలక్షేపం చేసే జనమెంతో. “మాకు గుండెల్లో ధైర్యం ఉంది, జేబులో డబ్బుంది, ఒంట్లో ఓపిక ఉంది. కూతవేటు దూరంలో కూత వేసే మెట్రోరైలు ఉంది” అంటూ, ఇంటి దగ్గరనుండి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకైనా వెళ్లి వస్తామని దూరదూరంగా వెళ్లిపోయి, చెయ్యి చాస్తే ఆకాశం అందే బహుళ అంతస్తుల భవనాల్లో కాపురం చేస్తున్నారు. మీట నొక్కితే పైకి మోసుకుపోయే యంత్రం ఉంది. “మాకు ఏమి భయం!” అంటూ ఆ అంతస్తుల్లో కాపురం చేస్తున్నారు. “కోటి రూపాయలైనా పర...

పూర్వాశ్రమ తల్లి

 పూర్వాశ్రమ తల్లి "ఏమండీ! మన కోడలు సీతమ్మ ప్రతిరోజు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటోంది. రెండు మూడు సార్లు పిలిస్తే గాని పలకటం లేదు. అలా వెర్రిదాని లాగా ఆలోచిస్తూ ఉండిపోతోంది. ఏమిటో దాన్ని చూస్తే భయంగా ఉంది," అంది కామాక్షమ్మ తన భర్త రామారావుతో కోడలు గురించి చెబుతూ. "ఎలా ఉంటుంది చెట్టంత కొడుకు విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకుడై పిల్లాపాపలతో సంతోషంగా ఉంటాడు అనుకున్నాం. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఎంతమందికి వస్తుంది అంతటి అదృష్టం! ఇంజనీరు కానీ డాక్టర్ కానీ చదివిద్దాం అనుకున్నాం, కానీ వాడు వేద విద్య నేర్చుకుంటానన్నాడు. సరే అన్నాము. వేద పండితుడై మనకు దగ్గరగా ఉంటాడు అనుకున్నాం. కానీ దైవానుగ్రహం వేరే విధంగా ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడే సంస్థకి అధిపతిగా నిలబెడుతోంది. వచ్చే నెలలోనే సన్యాసాశ్రమ దీక్ష ప్రారంభానికి ముహూర్తం పెట్టారు. అదే సీతమ్మ దిగులు," అన్నాడు సీతమ్మ మావగారు రామారావు. అనంతశర్మ తండ్రి చిన్నప్పుడే చనిపోతే, కోడల్ని మనవడిని తన దగ్గరే ఉంచుకుని చూస్తుంటాడు రామారావు. ఇదంతా దూరం నుంచి వింటున్న సీతమ్మకి ఒక్కసారి గత సంవత్సరం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఉన్నట్టుండి ఆ...

రెక్కల అతిథులు

ఉదయం లేస్తూనే చెప్పాడు మా అబ్బాయి అవినాష్ — ఇవాళ అతిధులను తీసుకురాడానికి వెళ్లాలని. “ఎవర్రా?” అని అడిగితే “సస్పెన్స్” అంటూ మాట దాటేశాడు. “రైల్వే స్టేషన్? బస్టాండ్?” కా అని అడిగితే మౌనంగా ఉండిపోయాడు, నవ్వుతూ. వీడి సస్పెన్స్ బంగారం గాను! అయినా ఈరోజుల్లో ఫోన్ చేయకుండా ఇంటికి వచ్చే అతిధులు ఎవరు అబ్బా అనుకుంటూ ఎదురు చూడడం మొదలుపెట్టాం. “వాళ్లు భోజనానికి వస్తారా? టిఫిన్లు పెట్టాలా? ఏంట్రా విషయం?” అంటూ వాళ్ళ అమ్మ పదేపదే అడగడం మొదలెట్టింది. మా అబ్బాయి మొహంలో చిరునవ్వు తప్ప సమాధానం లేదు. “పోనీలే, వాడు చెప్పకపోతే చెప్పకపోయాడు, నేను ఇల్లు సర్దుకుని రెడీగా ఉంటాను,” అంటూ చిందరవందరగా ఉన్న సామాన్లన్నీ సరిగ్గా సెట్ చేసి, స్నానం చేసి, బట్టలు మార్చుకుని రెడీగా కూర్చుంది వాళ్ళ అమ్మ.  మా అబ్బాయి మటుకు ఏమి కంగారు పడకుండా — చుట్టాలే ఎన్ని గంటలకు వస్తారో చెప్పడు, తాను ఎప్పుడు తీసుకువస్తాడో కూడా చెప్పడు. ఏమి చెప్పకుండా మామూలుగా పని చేసుకుంటూ కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ వరుసగా పూర్తి చేసి, నిదానంగా సాయంకాలం ఐదు గంటలకి బండి తీసుకుని బయటికి వెళ్లిపోయాడు. రాబోయే చుట్టాల కోసం మళ్లీ రెండోసారి ఇల్లు సర్ది, డైనింగ్...

వైకల్యం

చిత్రం
1 బ్రతుకుకి భయంకరమైన గ్రహపాటు సాపాటు కోసం తప్పదు ఈ పాట్లు. సంకల్పం గట్టిదైతే వైకల్యం వెన్ను తడుతుంది. 2 జరిగిన దానికి చింతిస్తే కాలమే కాళ్లకు సంకెలవుతుంది. భవిష్యత్తు వైపు అడుగేస్తే విజయమే మన గమ్యమవుతుంది. 3 దారిలో తుఫాను ఎదురైతే దిగులుపడక ముందుకు సాగాలి. మనసులో ధైర్యం పెరిగితే గెలుపు మనదే అవుతుంది. 4 అవరోధం వచ్చినా ఆగిపోకు దాన్ని అవకాశముగా మార్చు. సాధనలో నిబద్ధత పెంచితే శిఖరాలు చేరుకోవచ్చు. 5 విఫలమే పాఠమని గ్రహిస్తే విజయమూ సులభం అవుతుంది. సహనం తోడైతే సఫలమై ప్రతిబంధం దాటవచ్చు. 6 అడుగు వెనక్కు వేయక ముందుకు ఆశను తోడుగా ఉంచాలి. దారిలో వెలుతురు తక్కువైనా మనసులో జ్యోతి వెలిగించాలి. 7 కష్టమే కిరీటాన్ని అలంకరిస్తోంది పట్టుదలే సింహాసనం ఇస్తుంది. ఆత్మవిశ్వాసమే ఆయుధమైతే అడ్డంకులు కూలిపోతాయి. 8 భయమే శత్రువు అని మరిచిపోకు నమ్మకమే గెలుపు రహస్యం. కృషిని నిత్యం కొనసాగిస్తే సాఫల్యం సొంతం అవుతుంది. 9 జీవితమే యుద్ధభూమి అయితే ధైర్యమే కవచమై నిలుస్తుంది. ఆశలే అశ్వమై నడిపిస్తే విజయం వైపు పరిగెడుతుంది. 10 గతం ఒక పాఠమై నిలిచిపోతుంది భవిష్యత్తు కలలతో అలరిస్తుంది. వర్తమానమే వేదిక కాబట్టి ఇప్పుడే కృషి ప్రారంభించ...

ఉత్తరం

" ఏమిటి ! సాంబయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చి అప్పుడే పదిహేను రోజులు అయింది. ఏమీ తోచట్లేదు .కబుర్లు తెలియట్లేదు . ఎప్పుడూ వారం రోజులకోసారి ఉత్తరం రాసేవాడు అనుకుంటూ పోస్ట్ మాన్ కోసం ఎదురుచూస్తూ మాటిమాటికి గుమ్మం వైపు తొంగి చూస్తోంది కావమ్మ. ఉత్తరం చదివితే సాంబయ్య ను చూసినట్టు ఉంటుంది కావమ్మకి. సాంబయ్య తో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ రోజుల్లో కావమ్మ లాంటి వాళ్ళు ఎందరో! మళ్లీ ఉత్తరం వచ్చేవరకు ఆ ఉత్తరంలోని సంగతులతో మనసు బెంగ పెట్టుకోదు. ఏంటో ఈసారి చాలా లేట్ అయింది అనుకుంటూ గదిలో మూలగా ఉన్నతీగకు తగిలించుకున్న పాత ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించింది. మొదటి వాక్యం లో గౌరవం, ప్రేమ మొదలైంది . ఎడం చేతి పక్క తల పైకెత్తి చూస్తే దాని వయసు ఎంతో తెలిసిపోయింది. మీకోసం ఆ ఊరి నుంచి కబురు మోసుకొచ్చాను అని చెప్పింది.   క్షేమమాచారాలతో మనసు కుదురుపరచి అక్కడి నుంచి ఆ ఊరి ఊసులన్నీ చెబుతూ ప్రేమ పొంగిస్తూ బాధలను తెలియ చేస్తూ అమ్మ మీద బెంగ ని ప్రకటించే కబుర్లన్నీ తనలో దాచి తలపై మీద ముద్ర వేయించుకుని వచ్చిన తోకలేని పిట్ట ఈ కార్డు ముక్కని చదివి కన్నీళ్లు కార్చింది కావమ్మ.  ముగింపులో కూడా మదిని...

సోడా

చిత్రం
 సోడా  గరళాన్ని గొంతులో దాచి గరళకంఠుడయ్యాడు శివుడు. రంగురంగుల గోళాన్ని గొంతుకి అడ్డుగా పెట్టుకుని గోలి సోడా నయ్యాను. శివుడు గరళాన్ని వదిలేస్తే జగమంతటికి ప్రమాదం. నా గొంతుకు అడ్డం పడిన గోళీ నా ప్రాణం. నా ఉనికికి అదే ఆధారం. మాది విడదీయలేని బంధం. ఒకప్పుడు సర్వకాల సర్వావస్థల యందు మీకు ప్రాణ స్నేహితుడునీ. విందులో ,మందులో తప్పకుండా హాజరయ్యే అతిధిని. పీకలు దాకా తిన్నవాడికి కడుపు బరువుని డొక్కమాడుతున్న వాడికి దాహం తీర్చే చౌక రకం పానీయాన్ని. ఎంతోమందికి ఉపాధినిచ్చేదాన్ని. సోడా కొట్టులు షోకు మార్చుకుని షోకేసుల్లో మెరిసిపోయే సీసాలు పెట్టుకుని నా పొట్ట కొట్టేసారు. పట్టణాలలో పల్లెల్లో నాలుగు మూలలా దొరికే బంగారాన్ని. ఇప్పుడు కాదు. ఇది ఒకప్పటి మాట. రంగునీళ్ళ సీసాలు వచ్చి  మ్యూజియంలో బొమ్మనైపోయా. కనుమరుగైపోయా. కార్పొరేట్ కల్చర్ వచ్చి కలర్ నీళ్లు తీసుకువచ్చి నా కడుపు కొట్టేసింది. మొదట్లో మామూలు సోడాని. కాలం మారి చలువరాతి గదుల్లో దూరి కూలింగ్ సోడా అయిపోయా. చలవ చేసే నిమ్మ జాతి పండ్లతో చేరి నిమ్మ సోడా అయిపోయా. ఆ తరం అల్లరి మూక చేతిలో ఆయుధం అయిపోయా.  చివరికి ఈ తరం వాళ్లకి అపురూపమైన ...

జ్ఞాపకం

సాయంకాలం ఆరు గంటలు అయింది. ఎక్కడి నుంచో బాణసంచా చప్పుడు వినబడు తోంది. అప్పుడే దీపావళి ప్రారంభమైపోయింది అనుకుంటూ ఇత్తడి పళ్లెంలో వెలిగించిన ప్రమిదలని ఒక్కొక్కటి ఆరుగు మీద పెడుతోంది రమ్య. దీపావళి నాడు అరుగులకు ప్రత్యేక అతిధులు ఈ దీపాలు.  ఈ దీపాలతోటే ఎంత కళ వచ్చింది ఇంటికి అనుకుంటూ గాలికి రెపరెపలాడుతున్న దీపాలను చూసి మనసు ఎక్కడకో పోయింది రమ్యకి. పక్క ఇంటి నుంచి పిల్లల దివిటీలు కొడుతున్న హడావుడి వినపడుతోంది. పిల్లలు చేతులు కాల్చుకుంటారని ఆ తల్లి నానా హైరానా పడిపోతో oది. ఎన్నో జాగ్రత్తలు చెబుతోంది. ఒక్కసారి అవన్నీ చూసి రమ్య మనసు చిన్నతనంలోకి పరుగులెట్టింది. " అమ్మా రమ్య పరికిణి కుచ్చిళ్ళు కొంచెం దగ్గరగా పెట్టుకో. దూరంగా ఉండి ప్రమిదల్లో నూనె పొయ్యి. నువ్వు మతాబులు కాల్చుకో. అన్నయ్య తారాజువ్వలు కాల్చుకుంటాడు. నీకు గె డ కర్రకి మతాబులు కట్టిస్తాను. కాకరపువ్వొత్తులు కూడా నువ్వే కాల్చుకో. ఇలా ఎన్నో జాగ్రత్తలు ప్రతి దీపావళికి అమ్మ చెబుతూనే ఉండే ది. ప్రతి దీపావళికి కొత్త బట్టలు కాకరపువ్వొత్తులు విష్ణు చక్రాలు భూచక్రాలు పాము బిళ్ళలు మతాబులు ఇవన్నీ నా వాటా.  అన్నయ్య కి తారాజువ్వలు టప...