పోస్ట్‌లు

2025లోని పోస్ట్‌లను చూపుతోంది

వనభోజనం

ఆదివారం ఉదయం ఆరు గంటలు అయింది. నగరం ఇంకా నిద్ర లేవలేదు. నగర సరిహద్దుల్లో అందమైన తారు రోడ్డు మీద బస్సు దూసుకుపోతోంది. బస్సు అంతా కోలాహలంగా ఉంది. మంచం మీదనుంచి లేవగానే కాఫీ కప్పు పట్టుకునే నరసింహ శాస్త్రి కాలు గాలిని పిల్లిలా బస్సు అంతా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా గంటకు గాని కాఫీ కప్పు చేతిలోకి రాదు. పోనీ ఎక్కడైనా ఆగి కాఫీ తాగుదామంటే నిన్న సాయంకాలం కమ్యూనిటీ మీటింగ్లో రామశాస్త్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేయ్. “రేపు ఉదయం ఏమీ బయట వస్తువులు తినడానికి వీల్లేదు. అన్నీ మనం స్వయంగా తయారు చేసుకునే ఉదయం కాఫీ దగ్గర నుంచి మధ్యాహ్నం ఫలహారం వరకు. లేదంటే వనభోజనాలనే మాటకు అర్థం లేదు. సాధారణంగా వనభోజనాలంటే బయట హోటల్ కి ఆర్డర్లు ఇచ్చేసి ఎంజాయ్ చేయడం కాదు. మనకు మనమే స్వయంగా తోటలో వండుకుని పదిమందితో హాయిగా చెట్లు కింద అరిటాకులు వేసుకుని తింటే ఆ ఆనందమే వేరు. ఏడాదికి ఒకసారి కదా! అలా చేస్తే ఎంతో తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది,” అన్నాడు రామశాస్త్రి. అనుకున్న విధంగా ఉదయం ఐదు గంటలకి పెద్ద బస్సు మా కాలనీ పార్కు దగ్గరికి వచ్చి ఆగింది. మగవాళ్లంతా వంట సామాన్లు, ఆట సామాన్లు, స్పీకర్లు, తాటాకు చాపలు,...

కార్తీక్

"చూడండి, ఈ బాబు మానసికంగా ఎదుగుదల చాలా తక్కువగా ఉంది. దీనికి ఏమి వైద్యం లేదు. అందుకే ఈ వయసులో రావలసిన ఆటపాట ఆలస్యంగా వస్తున్నాయి. కానీ శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నాడు" అంటూ పిల్లల వైద్యుడు చెప్పిన మాటలకి పిల్లవాడు కార్తీక్ తల్లి రాధ బుర్ర తిరిగిపోయింది. తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఏమి వినపడలేదు. ఆటోలో ఇంటికి వచ్చేసి మంచం మీద పడుకుని ఆలోచనలలో మునిగిపోయింది. పుట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నాడు! అందాల చందమామలా ఉన్నాడు. కార్తీక పౌర్ణమి నాడు పుట్టాడు. అందుకే పున్నమి చంద్రుడిలా ఉండేవాడు. గిరజాల జుట్టు, తెల్లటి రంగు, పొడవైన వేళ్లు, కాళ్లు, చేతులు – అబ్బా! తలుచుకుంటేనే ముద్దొచ్చేలా ఉండేవాడు. పుట్టి ఏడాది పైగా అయినా ఆ వయసు వాళ్లకు ఉండవలసిన లక్షణాలు లేకపోవడంతో డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్లింది రాధ. అప్పుడు తెలిసిన నిజం! రాధ అత్తగారు రోజు సాధిస్తూనే ఉంది. “పిల్లవాడు ఏమిటి ఇలా ఉన్నాడు? ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పిల్లలు మా ఇంట్లో పుట్టలేదు” అంటూ గోల చేసేది. పాపం రాధ ఏమి కనిపెట్టుకోలేకపోయింది. కానీ అనుభవంతో అత్తగారు కనిపెట్టింది. “ఇప్పుడు ఏమంటుందో ఏమో... భర్త ఈ విషయం ఏ విధంగా తీసుకుంటాడో?”...

రావిచెట్టు

"ఏవండీ అప్పారావు గారు, రేపు ఉదయం ఈ రావి చెట్టు కొట్టడం ప్రారంభించాలి. ఇంత పెద్ద చెట్టు కొట్టాలంటే కనీసం పది మంది కూలీలు, నాలుగు రోజులు సమయం పడుతుంది. దానికి తగిన ఏర్పాట్లు చూడండి" అంటూ ఆ అధికారి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పి కార్ ఎక్కి బయలుదేరి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. "సార్, ఈ చెట్టు కొట్టడం లేబర్ వల్ల సాధ్యం కాదు. పట్నం నుంచి కోత మిషన్ తెప్పించాలి. ముందు కొమ్మలు నరికేసిన తర్వాత చెట్టు మొదలు కోత మిషన్ చేత కోయించాలి. పైగా దీని చుట్టూ సిమెంట్ దిమ్మ కూడా ఉంది. ఈ దిమ్మ పడ కొట్టాలంటే బుల్డోజర్ కూడా కావాలి" అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు మేస్త్రి అప్పారావు. "ఎలాగూ లేదన్న పదిహేను రోజులు టైం పడుతుంది అండి" అంటూ చెట్టు పైకి పరిశీలనగా చూశాడు అప్పారావు. "సరే" అంటూ అధికారి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. అబ్బా! ఎంత పెద్ద చెట్టు! పెద్ద పెద్ద కొమ్మలు, నిండా ఆకులు – ఒక రాక్షసుడు లా ఉంది. ఈ గ్రామానికి సరిపడే ఆక్సిజన్ ఇదే సరఫరా చేస్తుందేమో. గాలికి అటు ఇటు ఊగే ఆకులు ఎప్పుడు పెద్ద శబ్దం చేస్తూ ఉంటాయి. దీని వయసు సుమారు వంద సంవత్సరాలు పైగా ఉంటుంది. ఎవరూ నాటారో మహానుభావ...

మా ఊరి జ్ఞాపకం

చూడ్డానికి క్రికెట్ వీరుడులా, పొట్టిగా గవాస్కర్ లా ఉండేవాడు మా వెంకన్న. ఆ గవాస్కరు ఎప్పుడు చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే, ఈయన నోట్లో పొగాకు చుట్ట, చేతిలో పదమూడు ముక్కల పేక పట్టుకుని ఉండేవాడు. లుంగీ పంచ కట్టుకుని దానిమీద చొక్కా తొడుక్కుని, నోట్లో చుట్ట పెట్టుకుని ఉదయమే లేచి సైకిల్ ఎక్కాడంటే ఏ అరుగుదగ్గర ఆగుతాడో ఎవరికీ తెలిసేది కాదు. అరుగు దగ్గర ఆగాడంటే భాగవతం, భారతం, రామాయణం వినడానికి కాదు. ఈయన పారాయణం వేరే ఉంది. అదే చతుర్ముఖ పారాయణం. అందరూ సంక్రాంతి పండుగకి, పెళ్లిళ్లకి, వేసవి సెలవులకి పేకాట ఆడడం మామూలే ఆ ఊర్లో. కానీ మా వెంకన్న 365 రోజులు అదే ప్రవృత్తి! వృత్తి వ్యవసాయం అంటాడు. ఎప్పుడూ పొలం గట్టు ఎక్కిన పాపాన పోలేదు. తలపాగా చుట్టిన సందర్భం చూడలేదు. “ఏవండీ వెంకన్నగారు ఉన్నారా ఇంట్లో?” అంటూ సంవత్సరంలో ఎప్పుడు ఎవరు అడిగినా, “లేదండి, పేకాటలో ఉన్నారండి” అని ఇంట్లోంచి సమాధానం. అదేదో పెద్ద ఉద్యోగం లాగా చెప్పేవారు. చివరికి ఏ వీధిలో ఉన్నాడు, ఎవరు అరుగు మీద ఉన్నాడు వెతుక్కుని, ఆ వచ్చిన పెద్దమనిషి తన పని పూర్తి చేసుకునేవాడు. ఆ ఊర్లో నాలుగైదు అరుగులు ప్రత్యేకంగా ఈ చతుర్ముఖ పారాయణంకే పెట్టింది ప...

తిరుమల బ్రహ్మోత్సవం

భారతదేశంలో అనేక తీర్థక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నా, తిరుమల శ్రీవారి ఆలయం అత్యంత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఇక్కడకు చేరుతారు. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలలో ప్రధానమైనది బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం యొక్క మూలం ఆగమ శాస్త్రాల ప్రకారం, బ్రహ్మదేవుడు స్వయంగా మొదట ఈ ఉత్సవాన్ని నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనికి "బ్రహ్మోత్సవం" అనే పేరు వచ్చింది. ఈ ఉత్సవం ద్వారా జగన్నాథుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు తన మహిమను లోకానికి తెలియజేస్తారని విశ్వాసం ఉత్సవాల కాలం ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ ద్వితీయ నుండి తొమ్మిదవ తిథి వరకు (సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో) ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఉత్సవ ప్రారంభాన్ని సూచించే అనురోధనం, గరుడపతాకాన్ని ఎగరేసే ధ్వజారోహణం, చివరగా చక్రస్నానం ఈ ఉత్సవాలకు ప్రత్యేకత. ఉత్సవాల నిర్వహణ ఉత్సవ కాలంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం శ్రీవారిని విభిన్న వాహనాలపై వేదఘోషల మధ్య, భజనలతో, మంగళవాయిద్యాలతో ఊరేగిస్తారు. భక్తులు వీటిని చూడటమే పుణ్యం అని నమ్ముతారు. రోజు వారీ వాహన సేవలు 1. మొదటి రోజు...

ఆ నాలుగు చుక్కలు

ఇంకా కాంతమ్మ రాలేదు ఏమిటి ? రోజు ఉదయం ఏడు గంటలకు వచ్చేసేదే! ఏమైంది అబ్బా అనుకుంటూ మాటిమాటికీ వీధిలోకి తొంగి చూస్తున్న సుజాతకి వాడిపోయిన మొహంతో దూరం నుంచి వస్తున్న కాంతమ్మ కనబడింది.  సుజాతను చూస్తూనే రాత్రి మా చంటోడు నిద్రపోలేదు తెల్లవార్లు పీకుతూనే ఉన్నాడు. నా దగ్గర పాలు లేవని తెలుసు. పోత పాలు పడుతుంటే విరోచనాలు అవుతున్నాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కాంతమ్మ.  భగవంతుడు సృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది. కాంతమ్మ కొడుకు కంట సుజాత కొడుకు రెండు నెలల పెద్ద. సుజాత కొడుకు రెండు గుక్కలు తాగి పక్కకు తిరిగి పడుకుంటాడు. ఒకపక్క అతివృష్టి మరొకపక్క అనావృష్టి. ఇద్దరినీ సృష్టించింది దేవుడే. అయినా ఎవరి అదృష్టం వారిది. విజ్ఞాన శాస్త్రం ఎంత బాగా అభివృద్ధి చెందిన తల్లిపాలు మించిన బిడ్డకి ఏ ఆహారము లేదంటారు డాక్టర్లు. తల్లిదగ్గర పాలు లేక కొన్ని కుటుంబాలు బాధపడుతుంటే ఉన్న పాలు బిడ్డకు పంచి ఇవ్వడానికి అందం చెడిపోతుందని ఉద్దేశంతో కొంతమంది కావాలని పోత పాలు అలవాటు చేస్తున్నారు కొంతమంది తల్లులు. కాంతమ్మ మాటలు వినేసరికి ఒక బిడ్డకు తల్లిగా సుజాత హృదయం చలించిపోయింది. ఆ చిన్ని బొజ్జ కి తల్లి ఇచ్చే నాలుగు చుక...

శ్మశానం

నిత్యజీవితంలో మనం కొన్ని ప్రదేశాల పేర్లు తలచుకోడానికి ఇష్టపడం.ఆ పేరు వింటూనే ఏదో అపశకునంగా భావిస్తాం. ఉదాహరణకు రుద్రభూమి . దాన్నే స్మశానం అంటారు. కానీ ఊపిరి లేని వాళ్ళందరూ చివరికి చేరేది ఆచోటే. ఆ చోటుకు చేరుతామని తెలుసు కానీ మనం చేరే రోజు కానీ మనం చేరిన రోజు కానీమనకు తెలియదు. కానీ ఒక కవికి ఆ స్మశాన వాటిక కవితా వస్తువై అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. కవి ఎక్కడకైనా ప్రయాణిస్తాడు. పరకాయ ప్రవేశం చేసి రావలసిన వస్తువు రాబట్టుకుంటాడు. అటువంటి కవులలో చిరస్మరణీయుడు కీర్తిశేషులు గుర్రం జాషువా ఒకరు ఇంటిపేరు గుర్రం వారు . పేరులో ఏముంది పెన్నిధి అనకండి. ఆయన ఆలోచన గుర్రం కంటే వేగంగా పయనించి అద్భుతమైన కవిత కళాఖండాలను సృష్టించాడు. ఒక స్మశాన వాటికను కవిత వస్తువు కింద ఎన్నుకోవడం ఏమిటి అనే ప్రశ్న అందరిలాగే నాకు అనిపించింది . కానీ ఈయన పద్యాలు చదివినప్పుడు ఆనాటి సమాజంలో ఉన్న అస్పృశ్యతను పారద్రోలడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఈ స్మశాన వాటిక ఒక కవిత వస్తువుగా ఎన్నుకొన్నారు. ఇక్కడ అందరూ సమానులే కులం మతం వర్ణం వర్గం ఏమీ తేడా లేదు ఈ స్థలంలో అంటాడు. అంటే ప్రజల్ని చైతన్య పరచడానికి ఇది ఒక సాధనం. ఈ స్మశాన స్థల...

దసరా

మానవ జీవితానికి పండుగలు అంటే ఒక వరం. స్నేహితులు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండే రోజు పండుగ రోజు. ఒత్తిడితో నలిగిపోతున్న మానవ జీవితం ఆ ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలుగుతుంది. అన్ని మతాల వారు ఈ పండుగలు జరుపుకుంటారు. ఎవరి మతానుసారం వారికి ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. ముస్లిం మతస్తులకి రంజాన్ ప్రత్యేకమైన పండగ. అలాగే క్రైస్తవ సోదరులకు క్రీస్తు జన్మదినం అయిన క్రిస్మస్ ఒక పండుగ. హిందూమతస్తులకి ఉగాది మొదలు ప్రతినెలా ఏదో ఒక పండగ జరుపుకుంటారు. ఇది కాకుండా అమ్మవారి జాతరలు కూడా ఒక పండగలా చేసుకుంటారు. మొన్నటి వరకు గణేష్ నిమజ్జోత్సవాలు ఆనందంగా జరుపుకున్నాము. ఇక దసరా ఉత్సవాల సందడి మొదలైంది. మార్కెట్లో దసరా తగ్గింపు ధరల హోరు ప్రారంభమైంది. ప్రయాణాల సందడి మొదలైంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. దీన్నే దసరా పండుగ అంటారు. శరన్నవరాత్రులు అని కూడా అంటారు. శరదృతువులో వచ్చే పండుగ దసరా. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి భగవంతుడు వివిధ రూపాల్లో అవతారాలు ఎత్తేవాడు. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి త్రిమూర్తులు సృష్టించిన శక్తి స్వరూపం దుర్గామాత. శివుడు ను...

చిలిపి పనులు

అర్ధరాత్రి 12 గంటలు అయింది. వీధి తలుపు ఎవరో కొడుతుండడంతో గాఢ నిద్రలో ఉన్న గోవిందరావుకి మెలకువ వచ్చింది. "ఎవరబ్బా ఇంత అర్ధరాత్రి వేళ!" అనుకుంటూ తలుపు సందులో నుంచి బయటకు తొంగి చూసాడు. వీధిలో పదిమంది యువకులు నిలబడి ఉన్నారు. "ఎవరండీ? ఏం కావాలి?" అంటూ ప్రశ్నించాడు గోవిందరావు. "చలపతిరావు గారు పంపించారండి. ఎవరికో పురుడు వచ్చిందిట. ఇంగువ తీసుకురమ్మని పంపించారంటూ చెప్పారా" అని యువకులు. "వస్తున్నాను, ఉండండి. కొట్టు తీస్తాను," అంటూ పక్కనే ఉన్న కిరాణా కొట్టు గదిలోకి వెళ్లి లైట్ వేసి డబ్బా గురించి వెతకడం మొదలెట్టాడు గోవిందరావు గోవిందరావు అంటే ఆ ఊర్లో ఉన్న ఏకైక కోమటి. కిరాణా కొట్టు వ్యాపారం – అక్కడ లేని సరుకు ఉండదు. కానీ అన్ని హై రేట్లు. ఏ వేళ లేపినా సరుకు అప్పిస్తాడు. 'లేదు' అనకుండా కిరాణా కొట్టు మీద ఆ ఊర్లో పది ఎకరాలు భూమి సంపాదించాడు. దానికి తోడు తాకట్టు–వాకట్టు వ్యాపారం కూడా ఉంది. అంతా వ్యవసాయదారులు. ఇంకేముంది! వ్యవసాయం పనుల కోసం అప్పు తీసుకుని, పంటలు రాగానే తీర్చేస్తుంటారు. పైగా ధాన్యం కొనుగోలు కూడా ఆయనే. "మా ఊరుకి బ్యాంక్ లాంటివాడు" అని...

అచ్చులు

అచ్చులు అంటే ఇవి బెల్లపు అచ్చులు కావు. బెల్లపు అచ్చులంత తీయగా ఉండే తెలుగు భాషకు గుండెకాయ లాంటి తెలుగు అక్షరాలు. తెలుగు భాషలో 56 అక్షరాలు. వీటిలో అచ్చులు హల్లులు రెండు విభాగాలు.  ఈ అక్షరాలనుంచి వచ్చే అమృత తుల్యమైన పదాలు మన జీవితంతో చాలా ముడిపడి ఉంటాయి. తెలుగు భాషలోని మొదటి* అ * అనే అక్షరంతో ప్రారంభం అయ్యే అమ్మ అనే పదం ప్రతి మానవుడి జీవితానికి చాలా ముఖ్యమైంది. అమ్మ లేకపోతే మనం బొమ్మే. అమ్మ అంటే ప్రేమకు ప్రతిరూపం జీవనానికి ఆరంభం.  ఏదైనా అందమైన దృశ్యం చూసినప్పుడు గానీ పుష్పం చూసినప్పుడు గానీ ఆకాశంలో హరివిల్లు ని చూసినప్పుడు కానీ మనసు తెలియని భావం కళ్ళ ద్వారా వ్యక్తపరుస్తుంది. మొహం వెలిగిపోతుంది.  కష్టసుఖాలు పంచుకునే నిలయం ఇల్లు. ఆ ఇల్లు అనే పదంఇ అనే అక్షరంతో మొదలైంది సృష్టి స్థితి లయకారకుడు ఈశ్వరుడు. ఈ అనే అక్షరం నాకు అందుకే చాలా గర్వం అంటుంది.  మన జీవితంలో ఆశ్రయం ఇచ్చే వాడు ఉపాధ్యాయుడు.జ్ఞానంతో మనసును వెలిగించే దీపమయ్యే ఆచార్యుడు లేకపోతే, మన జీవితం చీకటిలోనే మిగిలిపోతుంది.అందుకే ఉ అక్షరం జ్ఞానానికి ప్రతీక. అమ్మతనం అంటే ఊయల.శిశువు ఊయలలో తల్లి పాటలు విని పెరుగుతుంద...

రమణమ్మ మామిడి తోట

తెల్లవారుజామున 5:00 అయింది. ఆ ఐదుగురు అన్నదమ్ములు గట్టు దిగి వ్యవసాయం చేసే రైతులు కాదు గాని, ఆస్తి ఉండి కూలివాళ్లని పెట్టి వ్యవసాయం చేస్తూ, పశువులను పెంచుకుంటూ ఉండే ఊర్లో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబీకులు. అలాంటి అన్నదమ్ములు ఉదయమే లేచి పొలాలకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం ఒక అలవాటు. ఆరోజు ఎప్పటిలాగే పొలం వెళుతున్న అన్నదమ్ములను చూసి ఆ ఊరి మోతుబరి రైతు వెంకటరెడ్డి ఎదురొచ్చి – "ఏవండీ మావయ్య గారు, ఈ స్థలం ఇలా వదిలేసారేటండి? ఇందులో మామిడి మొక్కలు పెంచండి. ఈ మట్టి అందుకు బాగా పనిచేస్తుంది" – అని ప్రతిరోజు సలహా ఇచ్చేవాడు. ఆ అన్నదమ్ములకు అందరికీ పొలం అనుకుని నాలుగు ఎకరాల మెరక ఉండేది. అందులో పిచ్చి మొక్కలు మొలిచిపోయి, ఎవరు అందులోకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉండేది. ఆ రైతు చెప్పిన మాటలను వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. "మాకు ఇప్పటికీ నలభై ఏళ్లు దాటిపోయాయి. ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. ఒకవేళ మామిడి మొక్కలు వేసి అవి కాపు కాసే సమయానికి మనం ఉంటామా ఏమిటి?" – అనుకునేవారు. అన్నదమ్ముల పరిచయం ఆ అన్నదమ్ముల్లో పెద్దవాడు పెద్ద సుబ్బారావు. ఆయన యానంలో మన్యం మహాలక్ష్మి వారి సంస్థ...

భూమాత కన్నీరు

"అమ్మా పద్మ! నా బంగారు తల్లి కదా, రెండు మాత్రలు వేసుకో. పొద్దున్న టిఫిన్ మాత్రలు కూడా వేసుకోలేదు. ఈ లంచ్ మాత్ర వేసుకో అమ్మా. నీరసం వస్తుంది" అంటూ పద్మ తల్లి నీరజ కూతుర్ని బతిమాలుతోంది. "లేదమ్మా! నాకు ఆకలిగా లేదు. ఆ మాత్రలు వేసుకుంటే కడుపులో ఏదోలా ఉంటోంది. ఆ మాత్రలు చేదుగా ఉంటున్నాయి. వికారంగా ఉంటుంది. నాకు వద్దు" అంటూ ఏమి తినకుండానే స్కూల్‌కి వెళ్ళిపోయింది పద్మ. "ఆకలి చంపుకోడానికి మాత్రలు వేసుకుంటున్నాను కానీ నిత్యం నా పరిస్థితి కూడా ఇదే" అని తనలోతాను అనుకుంది పద్మ తల్లి నీరజ. "అయినా శరీరానికి ఈ మాత్రలు అలవాటు పడటానికి కొద్ది రోజులు పడుతుంది అని డాక్టర్ గారు చెప్పారు కదా. ఈ పిల్ల అర్థం చేసుకోవడం లేదు" అని అనుకుంది నీరజ. "ఒసేయ్ నీరజా! నాకు ఆ దిక్కుమాలిన మాత్రలు వద్దు. నాకు రెండు ముద్దల మజ్జిగ అన్నం పెట్టు. అసలే నేను రోగానికి మందులు మింగుతున్నాను. దానికి తోడు మళ్ళీ ఈ దిక్కుమాలిన బాధ ఒకటీ! అలవాటైన ప్రాణం... వేళకి రెండు ముద్దలు తినకుండా ఉండలేము. ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏమిటి దేవుడా! కడుపులోని ఆకలిని చంపడానికి మందులు మింగే స్థితికి వచ్చేసాము...

హల్లులు

1. క క నుంచి పూసె కరుణ, హృదయ తోటలో పరిమళ గంధం॥ కరుణ లేనిదే మానవత్వం శూన్యం ప్రేమలేని మనసు రాయి అవుతుంది॥ 2. ఖ ఖ నుంచి వెలసె ఖ్యాతి, కష్టపడి సాధించిన ఫలం॥ కృషి లేని ఖ్యాతి శూన్యం, నిజమైన మహిమ కృషిలోనే॥ 3. గ గ నుంచి పూసె గుణం, మనిషి గౌరవానికి పునాది॥ గుణములేని విద్య వృథా, గుణమున్నవాడే నిజమైన రత్నం॥ 4. ఘ ఘ నుంచి వినిపించె ఘనత, ధర్మం నిలబెట్టిన గౌరవం॥ అన్యాయం గెలిచిన చోట ఘనత లేదు, ధర్మమే ఇచ్చేది నిజమైన కీర్తి॥ 5. ఙ ఙ నుంచి వెలసె ఙ్ఞానం, చీకటిని పారద్రోలి వెలుగు॥ జ్ఞానం లేని జీవితం అంధకారం, జ్ఞానమే మానవుని నిజమైన బలం॥ 6. చ చ నుంచి మెరిసె చందమామ, బాల్యంలో కలల సఖి॥ చందమామ లేని చిన్నారి గీతం, అనిపించదు తీపి తీయనిదిగా॥ 7. ఛ ఛ నుంచి లభ్యమైందీ ఛత్రం, వానలో ఎండలో రక్షణ॥ ఛత్రం లేనిదే జీవితం కష్టమే, రక్షణతోనే సౌఖ్యం సాధ్యం॥ 8. జ జ నుంచి వెలసె జీవితం, ప్రేమ దయల పరిమళ తోట॥ జీవితం అనేది పంచుకోవడమే, స్వార్థమే అయితే జీవం వెలితి॥ 9. ఝ ఝ నుంచి పారె ఝరులు, గానమై ప్రవహించే నదులు॥ ప్రకృతి గీతం వినిపించే చోట, మనసు మధురంగా మారిపోతుంది॥ 10.  11. ట ట నుంచి మ్రోగె టపాసులు, ఉత్సవ రాగాల మేళం॥ రంగుల కాంతుల సంబరమే...

అచ్చులు

అ అ నుంచి పుట్టిన పదం అమ్మ, అమ్మలేని మన జీవితం బొమ్మ॥ (అమ్మ అంటే ప్రేమకు రూపం, జీవానికి ఆరంభం) ఆ ఆ నుంచి వెలసినది ఆనందం, ఆనందమంటే మన జీవన ప్రాణం॥ (ఆనందం అంటే మనసుకు ఊపిరి, జీవితం తీపి) ఇ ఇ నుంచి వెలసినది ఇల్లు, కష్టాలు–సుఖాలు పంచుకునే నిలయం॥ (ఇల్లు అంటే గోడలు కాదు, హృదయాల గూటి) ఈ ఈ నుంచి పలికె ఈశ్వరుడు, ఆయన లేని జీవితం వెలితి॥ (దైవం అంటే మనసుకు ఆశ్రయం, ఆత్మకు శాంతి) ఉ ఉ నుంచి ఊగె ఉయ్యాల, చిన్ననాటి కలల లాలిపాట॥ (బాల్యం అంటే అమాయకపు పరిమళం) ఊ ఊ నుంచి పుట్టె ఊరు, జ్ఞాపకాల తోట, మూలాల నిలయం॥ (ఊరు అంటే మూలాలు, మమకారం, మట్టి వాసన) ఋ ఋ నుంచి వెలసె ఋషులు, వారి జ్ఞానం లేక మార్గం లేదు॥ (ఋషులు అంటే సత్యాన్వేషణకు దీపస్తంభాలు) ఎ ఎ నుంచి మెరిసె ఎదురుచూపు, ఆశలే మనిషి ప్రాణశక్తి॥ (ఆశ లేకపోతే అడుగు ముందుకే వేయలేం) ఒ ఓ ఓ నుంచి మ్రోగె ఓంకారం, ప్రాణమంతా నింపే నాదం॥ (ఓంకారం అంటే సృష్టి, స్థితి, లయమనే త్రిస్వరూపం) ఔ ఔ నుంచి వెలసె ఔదార్యం, దానం లేనిది జీవితం వెలితి॥ (ఔదార్యం అంటే పంచుకోవడమే పరమధర్మము

రాజమహేంద్రవరం_ గోదావరి తీరాన శ్వాసించే చరిత్ర

గోదావరి తీరాన విరాజిల్లే రాజమహేంద్రవరం ఒక పట్టణం కాదు, అది పౌరాణిక ప్రాణం. ఎన్నిసార్లు పేర్లు మారినా, చరిత్ర తన మూలాలను చెరపనీయలేదు. రాజరాజ నరేంద్రుని రాజధాని అన్న గౌరవం ఈ నేలకే లభించింది. ప్రతీ వీధి వెనుక ఒక వ్యక్తిత్వం, ప్రతీ చెరువు వెనుక ఒక జ్ఞాపకం, ప్రతీ గుట్ట వెనుక ఒక పురాణం నిద్రిస్తున్నాయి. ఆంధ్ర మహాభారతo పుట్టిన ప్రదేశం.. ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి నడయాడిన ప్రదేశం . ఎంతోమంది దేశభక్తులు కళాకారులు పండితులు నివసించిన పుణ్యభూమిది. ఈ నగరం కేవలం ఇటుకలతో కట్టబడిన వీధుల సమాహారం కాదు. ఇది కవుల కలల సౌధం, సంఘసంస్కర్తల పోరాటాల వేదిక, కళాకారుల ప్రేరణ స్థలం.   ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రయాణికులను ఇక్కడ నుంచి వారి గమ్యస్థానాలకు చేర్చే బస్సులు ఆగే స్థలం . అది ఒక పుణ్యక్షేత్రం పేరు పెట్టుకుంది. అదేనండి కోటిపల్లి బస్టాండ్. కానీ దాని వెనక చరిత్ర ఎంతో ఉంది . బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ ఈ ప్రదేశంలో పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చారట.   బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ ప్రాంతం వారికి స్థావరంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లిపోయ...

శమంతక మణి

 శమంతక మణి  పూర్వకాలంలో సత్రాజిత్తు , ప్రసేనుడు అనే ఇద్దరు యదు వంశ రాజులు ఉండేవారు. సత్త్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు . అయితే ఈ సత్రాజిత్తు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు భక్తుడు. ఈ సూర్య భగవానుడు ఎల్లప్పుడూ మెడలో శమంతకమణిని ధరించి ఉండేవాడు. ఈ శమంతకమణి కెంపు రంగులో ఉండేది. ఈ శమంతకమణి ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా ఉంటుందట. అయితే ఈ సూర్య భగవానుడు సత్రాజిత్తు కోరిక మేరకు తన మెడలోని శమంతకమణిని ఇచ్చి వేస్తాడు.  ఆ మణిని ధరించి సత్రాజిత్తు ద్వారకా నగరానికి వస్తుంటాడు. అలా వస్తున్న సత్రాజిత్తుని చూసి సూర్యుడు వస్తున్నాడని భ్రమించి ద్వారకవాసులు పరమాత్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి విషయం విన్నవిస్తారు. అది విన్న శ్రీకృష్ణ పరమాత్మ దివ్యదృష్టితో చూసి వస్తున్నవాడు పంచముఖ బ్రహ్మ కానీ, సూర్యదేవుడు కాదని చెబుతాడు.  ఆ తర్వాత సత్రాజిత్తు బ్రాహ్మణుల వేదమంత్రాలు చదువుతుండగా ఆ శమంతకమణిని తన పూజ మందిరంలో ఉంచుతాడు. అది సామాన్యమైన వస్తువు కాదు. ఒక రోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ శమంతకమణిని యాదవుల రాజైన ఉగ్రసేన మహారాజ...