రేపు అన్న రోజు ఒక భ్రమ మాత్రమే!

పూర్వకాలం లో రేపు అనే రోజు మీద ఎన్నో ఆశలు ఉండేవి. భవిష్యత్తు బంగారంలా ఉండాలని ఎన్నో ప్రణాళికలు . వేసుకుంటాం. కడుపు కట్టుకొని ప్రస్తుతం జీవితం అనుభవించకుండా సొమ్ములు మదుపు చేస్తాం. చేతికి అంటిన మెతుకు కూడా విదల్చకుండా పక్కవాడు పడుతున్న బాధలు పట్టించుకోకుండా మనం స్వార్థంతో జీవితం గడుపుతాము. పక్కవారితో మనస్ఫూర్తిగా మాట్లాడం. నవ్వుతూ పలకరించo. మనం అందర కంటే తెలివైన వాళ్ళమని మనల్ని మించిన వాళ్లు లేరని బరువుగా ఉన్న జేబు మన చేత అలా ప్రవర్తింపజేస్తుంది. మన పిల్లలు మన సంసారం అని గిరి గిసుకుని బతుకుతాం. 
 కానీ రేపు అనేది ఒక భ్రమ మాత్రమే. ఒక నమ్మకం లేని రోజు. మనం ఇన్నాళ్ళు ఒక మాయా ప్రపంచంలో బ్రతుకుతున్నాము. ఒక్కసారి వాస్తవంలోకి తొంగి చూస్తే మనల్ని మనం గట్టిగా గిల్లుకుంటే అసలు నిజం మనకే తెలుస్తుంది.
ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అనిశ్చితమైన జీవితo లో రేపనే రోజు మీద ఆశ పెట్టుకోవడం ఎంతవరకు నిజం అనేది అనిపిస్తుంది. వాస్తవంలో ఏది జరిగితే అదే. 
భవిష్యత్తు గురించి ఎవరు ఇవ్వగలరు హామీ. ఏది మన చేతుల్లో ఉండదు. ఏ సమయానికి ఏది జరగాలి అది జరిగిపోతూ ఉంటుంది. దీని కోసం ఇన్ని ప్రయాసల అవసరమా అనిపిస్తుంది. అంతా కర్మ సిద్ధాంతానికి వదిలేసి హాయిగా కూర్చుంటే చెడు జరిగినా మంచి జరిగినా పెద్దగా బాధపడవలసిన అవసరం ఉండదు. 
 ప్రతి ఒక్కరికి ఏదో సరదాలు కోరికలు ఉంటాయి .కొంతమందికి విహారయాత్రలు సరదా. దూర ప్రదేశాలకు వెళ్లాలని. వెళితే ఏముంది ఇదిగో నిండు కుటుంబాలు ఉగ్రవాదుల తుపాకీ గుళ్ళకి బలి అయిపోయాయి. విహారయాత్ర విషాదంగా మారింది. కాశ్మీర్ జలపాతం లోని నీరు ఎర్రగా మారింది. ఇది ఎవరు ఊహించగలరు. ఒక సామాజిక సమస్య సరదా కోసం వెళ్ళిన కుటుంబాల్ని బలితీసుకుంది.
సినిమాని ఎప్పుడు చూసినా ఒకటే. రిలీజ్ అయిన రోజునే చూడాలని కోరిక ఎంతోమందికి ఉంటుంది. అందులో అభిమాన నాయకుడిని ప్రత్యక్షంగా చూడవచ్చునని ఆశతో ఉత్సాహంతో అభిమానంతో వెళ్లిన అభిమానులకి అభిమానం పెల్లుబుకి ఒక్కసారిగా విరుచుకు పడడంతో జన సముద్రాన్ని అదుపు చేయలేకపోవడంతో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. సినిమా నాయకుడు మీద అభిమానం ప్రాణం మీదకు వచ్చింది మరొకరికి. 
ముక్కుపచ్చలారని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా అభిమాన బ్యాట్స్మెన్ చూడాలని విజయోత్సపు వేడుకలను చూడాలని ఉత్సాహంతో ముందుకు అడుగు వేస్తే ఒక క్షణంలో అభిమానుల జీవితం మారిపోయింది. ప్రాణాలు బంతిలా గాల్లోకి ఎగిరిపోయేయి. మృత్యువుఅనేది ఎప్పుడూ ఎలా కటేస్తుందో ఎవరికి తెలియదు. మృత్యువు మనం పుట్టినప్పుడే మనతో పాటు పుడుతుంది. శివుడు ఆజ్ఞాపించిన రోజు మనల్ని వెంట పట్టుకుని పోతుంది. 
సప్త సముద్రాలు దాటాలంటే గాల్లో ఎగిరే విమానం ఒక్కటే దారి. విహారయాత్రకి లేదంటే ఉద్యోగానికి లేదంటే విదేశాలలో ఉన్న పిల్లలను చూడడానికి లేదంటే వ్యాపారం కోసం మనం విదేశాలకి విమానాల్లో ప్రయాణాలు చేస్తుంటాం. గాల్లోకి లేచిన విమానం ఆకాశంలో ప్రయాణం చేయడం మానేసి మెడికల్ కాలేజీ మీద వాలిపోయింది. విమానాల్లోని ప్రాణాలు అన్ని మంటలకి ఆహుతి అయిపోయాయి. బ్లాక్ బాక్స్ దొరికింది. నిజాలేవో చెప్పింది. జరిగిన ఘోరానికి కారణాలు చెప్పింది. అయినా ఏమి ఉపయోగం. తప్పు ఎవరిదో ఫలితం అనుభవించేది మనం. జీవితాంతం 
వాళ్లలో ఎవ్వరూ ఆ రోజు చివరిదని ఊహించలేదు.
ఆ ఉదయం వారెవరూ "ఇది నా చివరి రోజు" అని అనుకోలేదు
వారు కేవలం... జీవిస్తూ ఉన్నారు.
ప్రతి మనిషి చేసే పని చేస్తున్నారు.
రేపటిని నమ్ముతూ, ఈ క్షణాన్ని బతుకుతున్నారు.
ఇదే జీవితం గురించి చెప్పాల్సిన చేదు నిజం:
మరణం తలుపు తట్టదు. అది లోపలికి ప్రవేశిస్తుంది.
నిశ్శబ్దంగా. తక్షణంగా. అనుమతి లేకుండానే.
మరి చాలా సందర్భాల్లో, మనం సిద్ధంగా ఉండేలా కూడా రాదు.
కాబట్టి మీరు ఎవరికి భయపడకుండా మీరు చేయవలసిన బాధ్యతలు సక్రమంగా పూర్తిచేసి భవిష్యత్ మీద ఆశలు పెంచుకోకుండా ముందుకు సాగిపోవడమే.
మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వారితో మీ చుట్టుపక్కల ఉన్న వారితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడండి. ధర్మంగా సంపాదన, సక్రమమైన జీవితం, కోపాలు, తాపాలు పట్టుదలలు ఇవన్నీ వదిలేయండి .ఉపయోగం లేని విషయాలను వదిలేయండి. వీలైతే క్షమించండి.
ఉద్దేశపూర్వకంగా బతకండి. నిజం మాట్లాడండి. గాఢంగా ప్రేమించండి.
ఎందుకంటే ప్రతి రోజు మనం మెలకువ తీసుకునే రోజు, మనకు హామీ ఇవ్వలేదు.అందుకే అది విలువైనది.
ఇది ఒక మౌనంగా ఆలోచింపజేసే సందేశం. జీవితం అశాశ్వతమే కానీ ఎంత విలువైనదో గుర్తుచేస్తుంది.
x

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట