పోస్ట్‌లు

కోరిక

కోరిక అది రద్దీ ఎక్కువగా ఉండే రాజధానినగరంలోని ఒక వీధి లో  ఉండే హోటల్ ప్రాంగణం. సుమారుగా 80 సంవత్సరాల నుండి ఆ హోటల్ అదే వీధిలో ఉంది. భోజనం హోటల్స్ చాలా  ఉంటాయి. కానీ కస్టమర్ల్ని ఆదరించి ఆప్యాయంగా కొసరి  కొసరి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టే ఆ హోటల్ ఒక్కటే. అందుకే దూరప్రాంతాల నుండి వచ్చినవారు తప్పనిసరిగా ఈ  హోటల్ లో భోజనం చేసి వె డతారు. చక్కగా అరిటాకు వేసి వడ్డించి తెలుగువారి భోజనం పెట్టె ఏకై క భోజనశాల. కమ్మగా వేయించిన కందిపప్పు పప్పులోకి ఒక చిన్న పాత్రలో వేడివేడి నెయ్యి పనసపొట్టు కూర గుత్తి వంకాయ మజ్జిగ పులుసు గోంగూర పచ్చడి గడ్డ పెరుగు  ఆవకాయ దప్పుళo ఆకులో మెరిసిపోతూ ఆకాశంలోని హరి విల్లులా ఉంటాయి. ఆకు చూడగానే నోరూరిపోతుంది. నోట్లో పెట్టుకోగానే చేతులెత్తి మొక్కాకనిపిస్తుంది. అందుకే ఎక్కడ లేని రద్దీ. ఎప్పటిలాగే ఆరోజు కూడా హోటల్ ప్రాంగణం చాలా రద్దీగా  ఉంది. లంచ్ సమయం కావడంతో సీట్లు ఖాళీ లేక కస్టమర్లు  వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. వెయిటర్లు అటు ఇటు  బిజీబిజీగా తిరుగుతూ వచ్చిన కస్టమర్లకు ఏం కావాలో   చూస్తున్నారు. ఆ హోటల్ యజమాని ప్రతి...

ఎవరికి రుణం

ఎవరికి ఋణo ఉదయం పది గంటలు అయింది. తెల్లటి కారు ఆ వృద్ధుల ఆలయం ముందు ఆగింది. కారులోంచి  బ్యాగ్ పట్టుకుని ఒక యువకుడు ఒక వృద్ధురాలు దిగి తిన్నంగా రిసెప్షనిస్ట్ గదిలోకి తొంగి చూసారు. అప్పటికే రిసెప్షనిస్ట్ చుట్టూ చాలామంది గుమిగూడి ఉన్నారు. అమ్మా ఇక్కడ కూర్చుoదాము ఖాళీ అయ్యాక వెళ్ళవచ్చు అంటూ గది బయట ఉన్నబల్ల మీద కూర్చున్నారు తల్లి కొడుకు. కొంతసేపటికి జనమంతా బయటకు వచ్చేసారు. అమ్మ నేను వెళ్లి మాట్లాడ వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు అన్నాడుకొడుకు రఘు.ఆ తల్లి నుండి ఏమి స్పందన లేదు. ఎటో చూస్తూ ఉండిపోయింది. మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగపీలుస్తోంది.మొహం అంతా కందగడ్డలా ఉంది.  నాన్నగారి పోయిన తర్వాత అమ్మ బాగా బెంగపెట్టుకుంది ఆరోగ్యం కూడా సరిగా లేనట్టుగా ఉంది. నాన్న బతికున్న  ఉన్నన్నాళ్ళు ఆమెకు ఏ దిగులు లేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ఒంటరి అయిపోయింది. అమెరికా తీసుకెళ్దామంటే ఇద్దరు ఉద్యోగస్తులo. పిల్లలంతా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పెద్దవాళ్లకు అక్కడ తోచదు. ఒంటరిగా ఇంట్లో ఉండవలసి వస్తుంది.  చాలామంది భార్యలు లాగే తన భార్య కూడా అమ్మ చేత పనులు చేయిస్తుంది. అమ్మ నాన...

త్యాగమూర్తులు

త్యాగమూర్తులు వీరికి గుడులు గోపురాలు ఉండవు ఎగిరే మువ్వన్నెల జెండాలో అందరికీ మూడు రంగులే కనిపిస్తాయి. మనసుపెట్టి చూస్తే అమరవీరుల ఆశయాలు కనిపిస్తాయి. అసువులు బాసిన అమరవీరులందరి ఆశయాలకు గుర్తులుగా  ఎర్రకోట పై రెపరెపలాడుతోంది మూడు రంగుల జెండా . ఆ మహనీయుల అందరి ఆశయం ఒక్కటే. దేశాన్ని విదేశీ సంకెళ్ల నుండి విడిపించడమే. ఎవరికి నచ్చిన మార్గం వారు ఎంచుకొని పరాయి పాలన ఎదిరించి స్వాతంత్ర సమరయోధులుగా చరిత్రలో మిగిలిపోయారు.  ఈనాడు ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే ఆనాడు ఎందరో వీరుల ఊపిరి ఆగిపోయిమట్టిలో కలిసిపోయి మహనీయులుగా మిగిలిపోయారు. వారు స్వాతంత్ర ఫలముఅనుభవించలేదు. పదవుల కోసం ఆశపడలేదు. బ్రతికున్న రోజుల్లో కారాగార శిక్ష అనుభవించి ఉరికంబo ఎక్కి అసువులు బాసిన మహాత్ములు.  అహింసావాదంతో గాంధీజీ బ్రిటిష్ వారిని గడగడలాడిస్తే బంకించంద్ర చటర్జీ వందేమాతర గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతం రచించి జాతిని ఉత్తేజపరిచారు. దేశభక్తి ఉప్పొంగించారు. మరికొందరు ఆనాడు సమాజంలో ఉన్న సతీసహమగమనాన్ని బహు భార్యత్వాన్ని ఎదిరించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి రాజా రామ్మోహన్ రాయ్ గా ప్రజల గుండెల్లో...