పోస్ట్‌లు

నాకంటే ముందుగా

నాకంటే ముందుగా! సాయంకాలం నాలుగు గంటలు అయింది.  కాకినాడ నగరంలోని జన్మభూమి పార్క్ సందర్శకులతో హడావిడిగా ఉంది. ఒక మూలగా ఉన్న బెంచి మీద వయసు మళ్లి న భార్య భర్త కూర్చుని ఏదో సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు.  చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఆ వయసులో పార్కుకి కొచ్చి కూర్చునిఅంత ప్రేమగా కబుర్లు చెప్పుకోవడం నిజంగా ఒక అదృష్టం అనిపిస్తుంది.  నాకే కాదు ఎవరికైనా అదే మాట అనిపిస్తుంది. సుదీర్ఘమైన దాంపత్య జీవితం. సహకరించే ఆరోగ్యం చూసేవాళ్ళందరికీ ముచ్చటేస్తుంది.  ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడకునే వాళ్లు ఈరోజు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు.   ఆయన పేరు రామారావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. రామారావు గారి భార్య పేరు సీతమ్మ.  ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేసి బాధ్యతలు అన్నీ తీరిపోయి ఆ భార్యాభర్త ఇద్దరూ తన సొంత ఇంట్లో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు.  రామారావు గారు మహా ఘటికుడు. సీతమ్మ గారి మాటల్లో కొంచెం అమాయకత్వం అలా అని తెలివి తక్కువ ఏమి కాదు.  అందరికీ మంచి చేయాలని అందరూ మంచివాళ్ళని అనుకుంటుంద...

బహుమానం

బహుమానo ఉదయం ఐదు గంటలు అయింది. బాలభానుడి దినచర్య మొదలైంది. మా ఇంట్లో కూడా మా ఔషధ సేవ ప్రారంభమైంది.  " వసంత బిపి మందు వేసుకున్నావా! ఆ మాటతో ప్రారంభమైంది మా దినచర్య. " మీరు కూడా వేసుకోండి రోజు మర్చిపోతున్నారు ఈ మధ్య మీకు మతిమరుపు ఎక్కువైంది ఎప్పటిలాగే శ్రీమతి ఆందోళన నా ఆరోగ్యం గురించి.  " ఇదిగోండి మీ షుగర్ మందు. అంటూ మందు చేతులో పెట్టి తను కూడా ఒక టాబ్లెట్ నోట్లో వేసుకుంది. అరగంట పోయిన తర్వాత రెండు గ్లాసులతో రాగి జావా రెండు ప్లేట్లలో రెండేసి ఇడ్లీలు పెట్టి ఎదురుగుండా కూర్చుని టిఫిన్ అయింది అనిపించాము. ఉప్పు పులుపు లేని చట్నీ. చప్పగా ఉంది. అయినా ఇది రుచులు కోరుకునే వయసు కాదు. కడుపు నింపుకునే వయసు.  ఆ తర్వాత ఆవిడ వంటింట్లోకి నేను రీడింగ్ రూమ్ లోకి. నచ్చిన పుస్తకం తీసుకుని వాలు కుర్చీలో కూర్చుని చదువుతూ అలా నిద్రలోకి జారిపోయా. రాత్రి ఎక్కువగా నిద్ర పట్టదు. నాకేం బాధ్యతలు లేవు. ఆలోచనలు లేవు. కడుపుని పుట్టిన పిల్లలు తాతలు కూడా అయిపోయారు.  ఇప్పుడు నాకున్న బెంగ ఒకటే కాలం ఎలా గడుస్తుంది అని. ఎంతసేపు టీవీ చూసినా అవే ఇంటర్వ్యూలు. వృద్ధుల ఆలయాలు ఎంత అందంగా ఉన్నాయో ఎంత సౌకర్యంగ...

సాఫ్ట్వేర్ వ్యవసాయం

 సాప్ట్ వేర్ వ్యవసాయం. " ఏరా నీకు ఇంకా ఎన్ని రోజులు సెలవు ఉంది? అంటూ ప్రశ్నించాడు రామయ్య దసరా పండక్కి ఇంటికి వచ్చిన తన కొడుకు రమేష్ నీ. దసరా పండగ వెళ్లిపోయి అప్పుడే నాలుగు రోజులు అవుతుంది అయినా రమేషు ఊర్లోనే ఉండిపోవడం చూసి. ఎప్పుడు పండగ మర్నాడు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయేవాడు సెలవు లేదంటూ! మరి ఈసారి ఏమైంది? ఉద్యోగంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా! అనుకుని ఆలోచనలో పడ్డాడు రామయ్య.  " లేదు నాన్న ఉద్యోగానికి రిజైన్ చేసేసా ను. మన సొంత ఊళ్లోనే ఉండి నీతో పాటుగా వ్యవసాయం చేసుకుంటారు ను అంటూ సమాధానం చెప్పిన కొడుకుని అయోమయంగా చూశాడు రామయ్య. అదేమిటి రా బంగారు లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేసుకోవడం ఏమిటి? నీకు గాని మతి పోయిందా! వ్యవసాయం అంటే మాటలా! చిన్నప్పటినుంచి నా బాధలు చూస్తున్నావు కదా! అంటూ చెప్తున్న తండ్రి మాటలు వినిపించుకోకుండా లేదు నేను ఇంకా ఉద్యోగం చేయలేను. నావల్ల కావడం లేదు. షిఫ్ట్ డ్యూటీ ఉద్యోగాలు చేయలేను. రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు బాగా ఆలస్యం అయిపో తోంది. దానికి తోడు కుర్చీలో కదలకుండా కూర్చుని ఆ కంప్యూటర్ వైపు చూస్తూ పనిచేయడంతో కళ్ళు కాళ్ళు కూడా వాచిపోతున్నాయి. ఏదో ఆకల...