పోస్ట్‌లు

శాస్త్రి గారి పాట

శాస్త్రి గారి పాట తెలుగు పదాల మూట. అనకాపల్లి ఒకప్పటి విశాఖ జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణం  ఆ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది తీయటి బెల్లం. బంగారపు రంగులో మెరిసిపోయే బెల్లపు అచ్చులు కానీ . బెల్లపు వ్యాపారానికి ప్రసిద్ధ స్థలం. బెల్లపు పానకం లాంటి తెలుగు పదాలతో సినీ కళామతల్లిని  ఆరాధించే పాటల బ్రహ్మ అక్కడ పుడతాడని ఎవరికి తెలుసు.  అంతా విధాత తలపు. మెడలో శ తస్కోప్ వేసుకుని మన రోగాలను నయం చేస్తాడు అనుకుంటే పాటలతో ధైర్యాన్ని ఇచ్చి పదాలతో మెదడుకు పదును పెట్టి మన ఆరోగ్యాలను బాగుచేసే పాటలకు జన్మనిచ్చాడు మన సీతారామశాస్త్రి. ఏది మన చేతుల్లో ఉండదు కాలం చేసే మార్పులకి మనం తలవగ్గి నడవ వలసిందే. కాలానికి నాయకుడు ఈశ్వరుడు. కళలకు అధిపతి కూడా ఆ నటరాజే. ఆయన అందుకునే మార్గం మళ్లించి తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డగా విశ్వనాథుడి దరి చేర్చాడు . ఈయన సీతారాముడు. ఆయన విశ్వనాధుడు. ఇంకేముంది సీతారాముడి కలo నుంచి పుట్టిన పాట తెలుగుజాతి కీర్తి కిరీటాలను ఎక్కడకో తీసుకుని పోయేలా చేసింది. ఒకపక్క పాట మరొక పక్క విశ్వనాథుడు దర్శకత్వం ఇంకేముంది సినిమాలన్నీ శతదినోత్సవ చిత్రాలే. ఇంటి పేరు అసలు ఎవరికీ తెల...

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

ఆరోగ్యం వెర్సెస్ ఆహారపు అలవాట్లు. ప్రతి జీవికి నిత్యవసరాలలో ముఖ్యమైనది ఆహారం. బ్రతుకు బండి సాగాలంటే శక్తి కావాలి. మనిషికి శక్తి తినే ఆహారo నుంచి  పుడుతుంది. మనిషి శరీరము ఒక నడిచే కారు లాంటిది. కారు నడవాలంటే పెట్రోల్ పోయాలి. అలాగే మనిషి శరీరానికి కూడా సమతుల ఆహారం అందించాలి. విటమిన్లు పిండి పదార్థాలు ఖనిజ లవణాలు పీచు పదార్థాలు శరీరానికి కావలసిన రక్షణను శక్తిని ఇస్తాయి. శాఖాహారులందరూ బియ్యం ఆకులు పండ్లు కాయలు గింజలు ఆహారంగా స్వీకరిస్తారు. మాంసాహారులు వీటితో పాటు జంతువుల మాంసం ఆహారంగా తీసుకుంటారు. అయితే తీసుకునే ఆహారాన్ని పరిమితంగా తినడం, పరిశుభ్ర వాతావరణంలో వండిన పదార్థం తినడo,వేళకు తినడం లాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిలో ఏ నియమం తప్పిన ఆహారం విషతుల్యమవుతుంది. అది మన శరీరానికి మంచి బదులు చెడు చేస్తుంది.  పూర్వకాలంలో తొలి రోజున వండిన ఆహార పదార్థాలను ముట్టుకునేవారు కాదు . అది మడి కాదు ఆచారంకాదు. ఆరోగ్యం కోసం తీసుకున్న జాగ్రత్త.ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్లులలో వండిన ఆహార పదార్థాలు దాచుకుని రెండు మూడు రోజుల వరకు ఉంచుకుని తింటున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతవరక...

జంతువు అయితేనేమి

జంతువు అయితేనేమి ప్రతి మానవుడు గుడిలో విగ్రహాన్ని ఇంటిలో దేవుడి పటములను పూజించడం , గణపతి నవరాత్రులలో గణపతిని పూజించడం దేవీ నవరాత్రులలో దేవిని పూజించడం సర్వ సాధారణమైన విషయం. అయితే మానవుడు దేవుళ్ళతో పాటు ఆవు వంటి సాధు జంతువులను పాములను కప్పలను కూడా పూజించడం మనం ఎరుగున్న విషయమే. అయితే మనం హిందువులు జరుపుకునే పండుగలు అన్ని దేవతామూర్తులకు సంబంధించినవే కాకుండా జంతువులు కూడా ఆ పండుగలలో ప్రధానంగా పూజించబడతాయి. ఉదాహరణకి కనుమ పండుగ రోజున ఎద్దులను అలాగే నాగుల చవితి రోజున పుట్టలో ఉన్న పాములను పూజించడం జరుగుతుంది. ఏ కాలంలో చూసిన పశుపక్ష్యాదులు జంతువులు కూడా మానవునికి సహాయ సహకారాలు అందిస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నాయి. ప్రతిఫలంగా మానవుడు వాటికి పూజలు చేసి ప్రసాదాలు పెట్టి రుణం తీర్చుకుంటున్నాడు. హిందువులందరికీ ఆవు పవిత్రమైన జంతువు. శుభ అశుభ కార్యక్రమాలకు కూడా ఆవును పూజించడం మన సాంప్రదాయం. గృహప్రవేశం వంటి శుభకార్యాలకు ముందుగా ఆవును దూడను  కొత్త ఇంటిలోకి ప్రవేశపెడతారు. మనం ఆవుని గోమాత అంటాం ఇక చనిపోయిన వారు ఆవు తోక ద్వారానే పుణ్య లోకం చేరుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే గోదానం ఇవ్వడం జరు...