పోస్ట్‌లు

నాన్న నాకంటే ఎప్పుడు అదృష్టవంతుడే

నాన్న నాకంటే ఎప్పుడు అదృష్టవంతుడే! ఉదయం 9.00 అయింది. ఆ ఊర్లో రమేష్ బస్సు దిగి సరాసరి ఇంటికి నడుచుకుంటూ వచ్చి గుమ్మoల్లోకి అడుగు పెట్టేసరికి అరుగు మీద రమేష్ తండ్రి చలపతిరావు వాలుకుర్చీలో పడుకుని పక్కనే కూర్చున్న ఊరి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా నవ్వుకుంటున్నారు.  " నాన్న ఎలా ఉన్నారని పలకరించే సరికి మీ నాన్నగారికి ఏవండీ చాలా మంచి వ్యక్తి ఉన్న రోజు ఒకలాగే ఉన్నాడు లేని రోజు ఒకలాగే ఉన్నాడు అందరూ కావాలనుకునే వ్యక్తి. అందరి క్షేమం కోరే వ్యక్తి అంటూ అక్కడ కూర్చున్న జనం అంటుంటే ఒక్కసారి గర్వంగా అనిపించింది రమేష్ కి " నువ్వేమిటిరా అలా చిక్కిపోయావ్ ! ఆఫీసులో అంతా బాగానే ఉందా! పిల్లలు కోడలు అంతా క్షేమమేనా అంటూ ప్రశ్నలు కురిపించే నాన్నకు సమాధానం చెప్పి ఎదురుపడిన అమ్మ సీతమ్మని పలకరించి ఇంటి లోపలికి అడుగు పెట్టాడు రమేష్. రమేషు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా హైదరాబాదులో పనిచేస్తుంటాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక ఇల్లు కొనుక్కుని భార్య ఇద్దరు పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఉదయం 9 గంటలకు ఆఫీసుకు బయలుదేరి రాత్రి మళ్ళీ 10 గంటలకి ఇంటికి చేరుతాడు. రమేష్ కి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు...

మినప గారి

మినప గారె. కారు మబ్బు లాంటి దేహం గల ఇనప గుండు ని  కాదు కాదు మినప గుండు ని.  వినండి నా గాధ  నా హృదయంలోని వ్యధ.  అతిధి గుమ్మం లోకి అడుగుపెడితే మర్యాద కోసం  నా గుండె రెండుగా చీల్చి పీకల లోతు నీళ్లలో ముంచేసి  కసికొద్ది నా పీక పిసికి పిసికి తోలు వలిచి  పాలి పోయిన నా మొహాన్ని రో లు లో వేసి  లేని ఓపిక అంతా తెచ్చుకుని నా రూపం మార్చి పాల నురుగులా తయారుచేసి అరచేతిలో చందమామలా చేసి  మధ్యలో చూపుడువేలుతో నా గుండెకు చిల్లు పెట్టి  సలసల మరిగే తైలంలో నా తనువు రంగు మార్చేసి చిల్లు గారి అని పేరు పెట్టి  వచ్చిన అతిధి చిల్ అయిపోయేలా  ప్లేటు నిండా పేర్చి టేబుల్ మీద పెట్టి  అతిధి వద్దండి బాబు అని చేతులు అడ్డం పెట్టే వరకు వడ్డిస్తూనే ఉండడం మా గోదారోళ్ల పద్ధతి ఇది నా గుండెల్లోనీ వ్యధ  అయినా నా జన్మ అంటే నాకెంతో గర్వం.  అకస్మాత్తుగా వచ్చిన అతిధికి  ఏడాదికోమారు పై లోకం నుంచి వచ్చే ఆ దేవతలకి  నేనంటే ఎంతో ఇష్టం.  అందుకే నా జన్మ సార్థకం.  అల్లం చట్నీతో నాది తరతరాల అనుబంధం.  బెల్లం పాకంతో విడదీయలేని బంధం....

జీవితం

జీవితం  సాయంకాలం ఐదు గంటలు అయింది. ఆ పల్లెటూర్లో ఉండే సోమయాజులు గారి ఇల్లంతా హడావిడిగా ఉంది. నడవలో వేసిన కుర్చీల్లో సోమయాజులు గారు కుటుంబం ఒకవైపు పెళ్ళికొడుకు రమేష్ కుటుంబం ఒకవైపు కూర్చుని మాట్లాడుకుంటున్నా రు. అమ్మాయికి అబ్బాయికి  అబ్బాయికి అమ్మాయి నచ్చారు. కట్న కానుకలు వద్దని ముందుగానే చెప్పారు మగ పెళ్లి వారు.ఇంక పెళ్లికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడమే తరువాయి. సోమయాజులు గారు తూర్పుగోదావరి జిల్లాలో కాజులూరు మండలంలో ని పల్లిపాలెం స్కూలు హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు ఒకర్తే అమ్మాయి. అమ్మాయి పేరు వైదేహి . అచ్చు తెలుగు వారి పిల్లలా ఉంటుంది. డిగ్రీ చేసిన తర్వాత బీఈడీ కంప్లీట్ చేసి టీచర్ గా అక్కడ దగ్గరగా ఉన్న స్కూల్లోనే పనిచేస్తోంది. సోమయాజులు గారికి ఇంకా 5 సంవత్సరాలు సర్వీసు ఉంది. ఈలోగా పిల్లకు పెళ్లి చేస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత బాధ్యతలు ఉండవని ఆయన ఆలోచన. అయితే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఈడు జోడు చూడాలంటారు. అందుకే టీచర్ ఉద్యోగం చేసే వరుడు కోసం వెతుకుతూ చివరికి కాకినాడలో టీచరుగా పనిచేస్తున్న రమేష్ తో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. చివరికి పిల్లలిద్దరికీ ఒకరిక...